అన్వేషించండి

అటవీ భూముల్లో సాగు చేసే పేదవారికి ఆర్.ఓ.ఎఫ్.ఆర్ పట్టాలు: మంత్రి ప్రశాంత్ రెడ్డి

భవిష్యత్తులో అడవుల నరికివేత ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదనేదే సీఎం కేసీఆర్ అభిప్రాయమని మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. అడవుల పరిరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యతగా భావించాలన్నారు.

Minister Prashanth Reddy: భవిష్యత్తులో అడువుల నరికివేత ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదనేదే సీఎం కేసీఆర్ ఉద్దేశం అని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. భవిష్యత్తులో తమ తమ గ్రామాల్లోని అడవిని, అటవీ భూముల్ని కాపాడుకోవడానికి పూర్తి బాధ్యత గ్రామాల్లోని అన్ని రాజకీయ పార్టీలు తీసుకోవాలని సూచించారు. అడవుల పరిరక్షణను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించాలని సూచించారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల ఉన్నతాధికారులతో మంత్రి ప్రశాంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. పర్యావరణ సమతుల్యతను కాపాడుకునేందుకు వీలుగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఇకపై భవిష్యత్తులో అడవుల నరికివేత ఎట్టి పరిస్థితుల్లో జరుగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులకు సూచించారు. అలాగే పోడు భూముల సమస్యలపై మంత్రి వేముల.. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల ఉన్నతాధికారులతో వేర్వేరుగా బుధవారం సమీక్షా సమావేశాలు నిర్వహించారు. పోడు భూముల సమస్యల పరిష్కారానికి నిబంధనలను అనుసరిస్తూ చేపట్టాల్సిన చర్యల గురించి, అటవీ విస్తీర్ణం పెంపొందించాల్సిన ఆవశ్యకత గురించి మంత్రి ఈ సందర్భంగా అధికారులకు వివరించారు. 

డేగ కన్నుతో నిఘా కొనసాగించాలి..

ప్రస్తుతం ఉన్న చట్టాలకు లోబడి అటవీ భూముల్లో వ్యవసాయం చేసుకొని బతుకుతున్న పేదవారికి  ఆఖరి అవకాశంగా ఆర్.ఓ.ఎఫ్.ఆర్ పట్టాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని అన్నారు. అయితే, ఈ ప్రక్రియ జరుగుతున్న సమయంలో అటవీ ప్రాంతంలోని ఏ ఒక్క చెట్టు కూడా నరికివేతకు గురికాకుండా అడుగడుగునా బీట్ స్థాయిలో పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని ఆదేశించారు. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే బీట్ ఆఫీసర్లు, ఇతర సిబ్బంది నిరంతరం డేగ కన్నుతో నిఘాను కొనసాగించాలని ఆదేశించారు. అవసరమైతే పోలీసు శాఖ సహాయం తీసుకోవాలని సూచించారు. అటవీ ప్రాంతంలో ఏ ఒక్క చెట్టును నరికినా, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు. ఈ విషయమై ఇక నుంచి భవిష్యత్తులో తమ తమ గ్రామాల్లోని అడవిని, అటవీ భూముల్ని కాపాడుకోవడానికి అంకిత భావం, చిత్తశుద్ధితో కృషి చేస్తామని అన్ని రాజకీయ పార్టీలు బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. 

ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా..

ఆయా ఫారెస్ట్ రేంజ్‌ల వారీగా అటవీ విస్తీర్ణం, ఫారెస్ట్ బీటలు, సిబ్బంది సంఖ్య తదితర వివరాలను మంత్రి ఆరా తీస్తూ, అటవీ ప్రాంతం ఎక్కువగా ఉన్న చోట అదనపు సిబ్బందిని సర్దుబాటు చేయాలని నిజామాబాద్ జిల్లా అటవీ శాఖ అధికారి వికాస్ మీనాకు మరియు కామారెడ్డి అటవీ శాఖ అధికారి నిఖితకు సూచించారు. హరితహారం కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎనలేని ప్రాధాన్యతను ఇస్తున్నారని మంత్రి ప్రశాంత్ రెడ్డి గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యల ఫలితంగా ప్రపంచంలోనే మరెక్కడా లేని విధంగా తెలంగాణలో 2021 లెక్కల ప్రకారం రాష్ట్రంలో 6 శాతం అటవీ విస్తీర్ణం వృద్ధి చెందిందన్నారు. మరో మూడు శాతం కలుపుకుని మొత్తంగా తొమ్మిది శాతం వరకు అటవీ విస్తీర్ణాన్ని పెంచుకోగలిగితే వర్షాభావ పరిస్థితులను నివారించుకుని సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంటుందన్నారు. 

దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం హరితహారం కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున నిధులు వెచ్చిస్తూ పచ్చదనాన్ని పెంపొందించేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ అభిమతానికి అనుగుణంగా అటవీ విస్తీర్ణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని హితవు పలికారు. ఈ సందర్భంగా పోడు భూముల సమస్యల పరిష్కారం కోసం చేపడుతున్న చర్యలు, గ్రామ, డివిజనల్, జిల్లా స్థాయిలలో కమిటీల ఏర్పాటుకు చేస్తున్న కసరత్తులు గురించి కలెక్టర్ మంత్రి దృష్టికి తెచ్చారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Weather: ఏపీలో మాడు పగిలేలా ఎండలు, ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు - విపత్తుల సంస్థ వార్నింగ్
ఏపీలో మాడు పగిలేలా ఎండలు, ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు - విపత్తుల సంస్థ వార్నింగ్
IPL 2024: బెంగళూరుదే తొలి బాటింగ్, ప్లే ఆఫ్ ఆశ నెరవేరేనా
బెంగళూరుదే తొలి బాటింగ్, ప్లే ఆఫ్ ఆశ నెరవేరేనా
Telangana Graduate MLC :  తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
Sajjala Ramakrishna: ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Paritala Sunitha Files Nomination | వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రకాష్ రెడ్డిపై పరిటాల సునీత ఫైర్Singanamala YCP MLA Candidate Veeranjaneyulu | శింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులు ఇంటర్వ్యూCongress Leader Feroz Khan |ఒవైసీ ఓడిపోతే నేను రాజకీయాలు వదిలేస్తా: ABP Straight Talkలో ఫిరోజ్‌ఖాన్SRH vs RCB AT Uppal | Fans Reactions | ఉప్పల్ వద్ద ఫ్యాన్స్ రచ్చ.. కోహ్లీ ఫ్యాన్సే పాపం..! | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Weather: ఏపీలో మాడు పగిలేలా ఎండలు, ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు - విపత్తుల సంస్థ వార్నింగ్
ఏపీలో మాడు పగిలేలా ఎండలు, ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు - విపత్తుల సంస్థ వార్నింగ్
IPL 2024: బెంగళూరుదే తొలి బాటింగ్, ప్లే ఆఫ్ ఆశ నెరవేరేనా
బెంగళూరుదే తొలి బాటింగ్, ప్లే ఆఫ్ ఆశ నెరవేరేనా
Telangana Graduate MLC :  తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
Sajjala Ramakrishna: ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
Nominations Over :  తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం-  ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం- ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
DGP  Ravi Gupta : ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం  చేశారో తెలుసా ?
ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం చేశారో తెలుసా ?
మీ పిల్లలు హార్లిక్స్‌ని ఇష్టంగా తాగేస్తున్నారా? అది హెల్తీ డ్రింక్ కాదట - ఆ సంస్థే ఒప్పుకుంది
మీ పిల్లలు హార్లిక్స్‌ని ఇష్టంగా తాగేస్తున్నారా? అది హెల్తీ డ్రింక్ కాదట - ఆ సంస్థే ఒప్పుకుంది
Fact Check: ముస్లింలకు ఆస్తులు పంచి పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందా? బీజేపీ చేసిన ఆ ఆరోపణల్లో నిజమెంత?
Fact Check: ముస్లింలకు ఆస్తులు పంచి పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందా? బీజేపీ చేసిన ఆ ఆరోపణల్లో నిజమెంత?
Embed widget