Adilabad Crime News: ఆదిలాబాద్ జిల్లాలో భారీ బ్లాక్ మెయిలింగ్ దందా- 11 మందిపై కేసు నమోదు, నలుగురి అరెస్ట్
Telangana News | ఆదిలాబాద్ జిల్లాలో భారీ బ్లాక్ మెయిలింగ్ దందా చేస్తున్న ముఠాలో నలుగుర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వాహన యజమానులను డబ్బు ఇవ్వకుంటే చంపేస్తామని బెదిరిస్తున్న ముఠా

Adilabad Blackmail Gang Arrested | ఆదిలాబాద్ జిల్లాలో పోలీసులు భారీ బ్లాక్ మెయిలింగ్ దందా ముఠాను గుట్టురట్టు చేశారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వివరాలు వెల్లడించారు. తెలంగాణ మహారాష్ట్ర రాష్ట్రాల గుండా కొనసాగే జాతీయ రహదారి 44 గుండా ప్రయాణించే అక్రమంగా తరలించే పశువుల వాహనాల వద్ద బ్లాక్మెయిలింగ్ దందాలకు పాల్పడుతూ లక్షల వసూలు చేస్తున్న భారీ కుంభకోణాన్ని జిల్లా పోలీసులు బట్టబయలు చేశారు.
మహారాష్ట్ర కానిస్టేబుల్ మాస్టర్ మైండ్
నేరడిగోండ లో 11 మందిపై కేసు నమోదు చేసి, నలుగురిని అదుపులోకి తీసుకొని అరెస్టు చేసి రిమాండ్ కు తరలినట్లు తెలిపారు. వీరు ప్రధానంగా పశువుల అక్రమ రవాణాను ఆదిలాబాద్ గుండా రాష్ట్రాల మీదుగా తరలించేందుకు ముఠాగా ఏర్పడి వాహనాలను తనిఖీ చేస్తూ వాహన యజమానులు డ్రైవర్ల వద్ద బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు వసూలు చేయడం, లేకపోతే వారిపై దాడులు, పోలీసులకు ఫిర్యాదులు చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. ఈ అక్రమ దందాను ముఠా సభ్యులు వ్యాపారంగా నిర్వహిస్తున్న విషయాన్ని తెలియజేశారు. ముఖ్యంగా ఈ ముఠా సభ్యులలో మహారాష్ట్ర యావత్ మాల్ జిల్లా కానిస్టేబుల్ సందీప్ అనే వ్యక్తి కీలకంగా వ్యవహరిస్తూ పశువుల అక్రమ రవాణాను నిర్వహిస్తున్నాడని తెలిపారు.

ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన రోహిత్ షిండే అనే రౌడీషీటర్ జిల్లాలో కీలకంగా వ్యవహరిస్తూ పశువుల అక్రమ రవాణా చేస్తున్న వారిపై బెదిరింపులకు పాల్పడడం మరియు ఇదివరకే కుమ్మక్కైన అక్రమ రవాణా వారిని అడ్డుకోకుండా మామూళ్లను వసూలు చేస్తూ ఉన్న విషయాన్ని తెలియజేశారు. వీరికి సహకరించినటువంటి నలుగురు ముఠా సభ్యులను ఆదివారం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందినీ, ముఠా సభ్యులు నేరేడుగొండ కు సంబంధించిన చేతన్ కుమార్, అన్వేష్, ఆదిలాబాద్ పట్టణంలోని మజార్, ఆనంద్ మొత్తం 11 మంది పై నేరడిగొండ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కేసులో కీలక నిందితులు పరారీలో ఉన్నారన్నారనీ, వారి కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి పట్టుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు.
జిల్లాలో చట్ట వ్యతిరేకంగా దందాలకు పాల్పడి బెదిరింపులకు పాల్పడిన వారిపట్ల కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. బాధితులు ఎవరైనా జిల్లా పోలీసు యంత్రాంగాన్ని నిర్భయంగా సంప్రదించాలని వారికి తగిన న్యాయం చేస్తానని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఇచ్చోడా సీఐ బండారి రాజు, నేరడిగొండ ఎస్సై ఇమ్రాన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.





















