అన్వేషించండి

Minister Prashanth Reddy : ఎమ్మెల్సీ కవితను జైల్లో వేస్తామని బీజేపీ ఎంపీ ఎలా డిసైడ్ చేస్తారు- మంత్రి ప్రశాంత్ రెడ్డి

Minister Vemula Prashanth Reddy : ప్రధాని మోదీ సచ్చీలుడైతే అదానీపై సీబీఐ,ఈడీ విచారణ జరపాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. మోదీ,అమిత్ షా కేవలం రెండు కేసుల్లోనే 22 లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారన్నారు.

Minister Vemula Prashanth Reddy : దేశంలో బీజేపీ ప్రభుత్వ అవినీతి, అరాచక పాలనకు వ్యతిరేకంగా కేసీఆర్ ఒక్కరే పోరాటం చేస్తున్నారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. దేశాన్ని నిలువునా దోచుకుతింటున్న పార్టీ బీజేపీ అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎనిమిదేళ్ల మోదీ పాలనలో ఎవరికి లాభం జరిగిందో ప్రజలు ఆలోచన చేయాలని కోరారు. పైగా కేసీఆర్ ప్రభుత్వం చేసే మంచి పనులపై బీజేపీ కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్లు వ్యవహరిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులు పల్లెలకు వస్తున్నాయని ప్రశ్నించారు. కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులు వస్తున్నాయో గమనించాలన్నారు. రాష్ట్రం నుంచి కేంద్రానికి 3 లక్షల 70 వేల కోట్లు పన్నుల రూపంలో కడితే కేంద్రం ఇచ్చింది కేవలం 1 లక్ష 70 వేల కోట్లు మాత్రమే అని, మిగతా సొమ్మంతా బీజేపీ పాలిత రాష్ట్రాలకు తరలిస్తున్నారని మంత్రి ఆరోపించారు. మోదీ ప్రధాని అయిన తర్వాత డాలర్ తో రూపాయి మారకం విలువ ఎన్నడూ లేనివిధంగా క్షీణించిందని అన్నారు. మోదీ వచ్చిన కొత్తలో 56 రూపాయలకు 1 డాలర్ ఉంటే..ఇపుడు 83 రూపాయలకు చేరిందని గుర్తు చేశారు. మోదీ వచ్చిన కొత్తలో నిరుద్యోగ రేటు 5.4 శాతం ఉండే..ఇపుడు 7శాతానికి పెరిగిందన్నారు. పెట్రోల్ ధర రూ.60  ఉండే ఇప్పుడు రూ.110 దాటిందని, డీజిల్ ధర 45 నుంచి రూ.100  దాటిందన్నారు. గ్యాస్ సిలిండర్ ధర రూ.450 నుంచి రూ.1200కు పెరిగిందన్నారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గుతున్న పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతూ ప్రజలపై పెనుభారం మోపుతున్నారని విమర్శించారు. 

చైనాతో పెట్టుకోలేం అని మాట్లాడడం సిగ్గుచేటు

రవాణా ఛార్జీలు పెరిగి నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయన్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. మోదీ కన్నా ముందు ఉన్న 13 మంది ప్రధానులు 55 లక్షల కోట్ల అప్పు చేస్తే మోదీ ఒక్కరే 8 ఏళ్లలో 100 లక్షల కోట్ల అప్పు చేశారని ఆరోపించారు. మరోవైపు చైనా మన దేశ సరిహద్దులు దాటి వస్తున్న ఏమి చేయలేకపోతున్నారని, విదేశాంగ మంత్రి బాధ్యతారాహిత్యంగా చైనాతో ఇప్పుడు పెట్టుకోలేం అని మాట్లాడడం సిగ్గు చేటన్నారు. అసలు దేశ రక్షణ గాలికి వదిలేశారని, మోదీ దేశం కోసం ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. సామాన్య ప్రజలు చిన్న లోన్ తీసుకుంటే బ్యాంకులు ముక్కు పిండి వసూలు చేస్తాయి కానీ మోదీ తన కార్పొరేట్ మిత్రులు తీసుకున్న 12 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేశారన్నారు. ఎవడబ్బ సొమ్మని తమ కార్పొరేట్ మిత్రులకు మేలు చేసి దేశ ప్రజల మీద భారం వేశారని నిలదీశారు. అప్పనంగా వచ్చిన రూ.12 లక్షల కోట్లను బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూలగొట్టేందుకు ఖర్చు చేస్తున్నారన్నారు. అలా ఇప్పటికే 12 రాష్ట్రాల్లో ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నుకున్న ప్రభుత్వాలను కూలదోశారని మండిపడ్డారు. 

ఎల్ఐసీకి రూ.40 వేల కోట్ల నష్టం 

వేల కోట్ల ఎల్ఐసీ ప్రీమియం డబ్బులను కూడా పక్కదోవ పట్టించిన ఘనత మోదీ ప్రభుత్వానిదని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. అదానీ కేవలం 8 ఏళ్లలో 45 వేల కోట్ల నుంచి 11లక్షల కోట్లకు పడగలెత్తిండు ఆ డబ్బంతా ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు. హిండేన్ బర్గ్ రీసెర్చ్ సంస్థ మోదీ దోస్త్ అవినీతిని బయటపెట్టిందని అన్నారు. ఒక్క ఎల్ఐసీ సంస్థనే అదానీ వల్ల 40 వేల కోట్లు నష్ట పోయిందని అదంతా ప్రజలసొమ్మని అన్నారు. నిజంగానే ప్రధాని మోది సచ్చీలుడైతే అదానీపై సీబీఐ,ఈడీ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ప్రశ్నించిన అందరిపై సీబీఐ ప్రయోగిస్తున్నారని..రేపు తనలాంటి వారి పై కూడా వేధింపులు ప్రారంభిస్తారని అన్నారు. కేసీఆర్ బిడ్డ ఎమ్మెల్సీ కవితా జైల్ కు వెళ్తుందని ఒక మామూలు బీజేపీ ఎంపీ ఎలా డిసైడ్ చేస్తారని నిలదీశారు. 2జీ స్ప్రెక్టం రూ.1.70 లక్షల కోట్లకు అమ్ముడు పోతే ఆ విషయంలో అవినీతి జరిగిందని గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోల చేసిన మోదీ..15 ఏళ్ల తర్వాత 5జీ స్పెక్ట్రం రూ.1.48 లక్షల కోట్లకే అమ్మి 10 లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారన్నారు. రుణమాఫీ, 5జీ స్పెక్ట్రం లాంటి రెండు కేసుల్లోనే మోదీ,అమిత్ షా దాదాపు 22 లక్షల కోట్ల అవినీతి చేశారని అన్నారు. అక్రమంగా వచ్చిన డబ్బులు వెదజల్లుతూ స్వైర విహారం చేస్తున్నారని, వినకుంటే తప్పుడు కేసులలో వేధిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ అవినీతిని ప్రశ్నిస్తున్న కేసీఆర్ కుటుంబంపై పడ్డారని, ఆయన కూతురు ఎమ్మెల్సీ కవితను జైల్ కు పంపిస్తామని ఒక సాధారణ బీజేపీ ఎంపీ మాట్లాడుతున్నారని అన్నారు. సుప్రీంకోర్టు వీరి ఆగడాలు అన్ని గమనిస్తుందని, అవినీతి బీజేపీ నేతలకు బేడీలు తప్పవని హెచ్చరించారు. 

ఐదు రోజుల్లో పసుపు బోర్డు ఏమైంది? 

ఎంపీ అరవింద్ నోరు విప్పితే అబద్ధాలు, బూతులు మాట్లాడుతారు తప్పా ఆయన వల్ల ఒరిగింది ఏం లేదన్నారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. తాను బాల్కొండలో 10 వేల మందికి 40 కోట్ల రూపాయలు  ముఖ్యమంత్రి సహయనిధి ద్వారా అందించాననీ, దమ్ముంటే ప్రధాన మంత్రి సహాయనిధి కింద నిధులు తీసుకురావాలని సవాల్ చేశారు. ఎంపీ అర్వింద్ కు దమ్ముంటే గ్రామాల్లో పర్యటించే ముందు ఆ ఊరికి ఏమి ఇచ్చారో, కేంద్రం నుంచి తెచ్చిన నిధులతో ఏమీ అభివృద్ధి చేశారో చెప్పి ఆ గ్రామంలో అడుగు పెట్టాలని డిమాండ్ చేశారు. ఐదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని బాండ్ రాసిచ్చి గెలిచి రైతులను మోసం చేసిన అర్వింద్, ఇప్పుడు మళ్లీ గెలిపిస్తే పసుపు పరిశ్రమ తెస్తానని సిగ్గులేకుండా చెప్తున్నాడని దుయ్యబట్టారు.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
Ind vs Nz 3rd ODI: ఒక మార్పుతో బరిలోకి దిగిన గిల్ సేన.. ఇండోర్‌లో తమ రికార్డు కాపాడుకుంటుందా?
ఒక మార్పుతో బరిలోకి దిగిన గిల్ సేన.. ఇండోర్‌లో తమ రికార్డు కాపాడుకుంటుందా?
AR Rahman Vs Kangana Ranaut: ఏఆర్ రెహమాన్‌పై విమర్శలు గుప్పించిన కంగనా రనౌత్... నన్ను కలవలేదు, అంత ద్వేషమా?
ఏఆర్ రెహమాన్‌పై విమర్శలు గుప్పించిన కంగనా రనౌత్... నన్ను కలవలేదు, అంత ద్వేషమా?
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
Ind vs Nz 3rd ODI: ఒక మార్పుతో బరిలోకి దిగిన గిల్ సేన.. ఇండోర్‌లో తమ రికార్డు కాపాడుకుంటుందా?
ఒక మార్పుతో బరిలోకి దిగిన గిల్ సేన.. ఇండోర్‌లో తమ రికార్డు కాపాడుకుంటుందా?
AR Rahman Vs Kangana Ranaut: ఏఆర్ రెహమాన్‌పై విమర్శలు గుప్పించిన కంగనా రనౌత్... నన్ను కలవలేదు, అంత ద్వేషమా?
ఏఆర్ రెహమాన్‌పై విమర్శలు గుప్పించిన కంగనా రనౌత్... నన్ను కలవలేదు, అంత ద్వేషమా?
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Rafale Fighter Jets: భారత్‌లో తయారుకానున్న రాఫెల్ ఫైటర్ జెట్స్.. విదేశాలకు ఎగుమతితో ఎలైట్ క్లబ్‌లోకి
భారత్‌లో తయారుకానున్న రాఫెల్ ఫైటర్ జెట్స్.. విదేశాలకు ఎగుమతితో ఎలైట్ క్లబ్‌లోకి
Shefali Jariwala Death Reason: చేతబడి వల్లే నా భార్య మరణించింది... అజ్ఞాతవాసి, సర్కారు వారి పాట విలన్
చేతబడి వల్లే నా భార్య మరణించింది... అజ్ఞాతవాసి, సర్కారు వారి పాట విలన్
IND vs NZ 3rd ODI: కీలకమైన మూడో వన్డేలో పరుగుల వర్షమే.. పిచ్ రిపోర్ట్, IND vs NZ ప్లేయింగ్ XI అంచనా
కీలకమైన మూడో వన్డేలో పరుగుల వర్షమే.. పిచ్ రిపోర్ట్, IND vs NZ ప్లేయింగ్ XI అంచనా
Embed widget