అన్వేషించండి

Nizamabad News: ప్రభుత్వం నో అంటున్నా.. వరి సాగుకు సై అంటున్న రైతులు

నిజామాబాద్ లో రైతులు వరి సాగువైపే మెుగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. సుమారు 75 శాతానికి పైగా రైతులు వరి పంటనే సాగు చేస్తున్నారు.

యాసంగిలో వ‌రి వెయ్యొద్దని రాష్ట్ర ప్రభుత్వం మొత్తుకున్నా... నిజామాబాద్ జిల్లా రైతన్నలు వరి సాగుకే మొగ్గుచూపారు. ప్రత్యామ్నయం వైపు వెళ్లకుండా సంప్రదాయంగా వస్తున్న వరి పంటకే సై అన్నారు.  జిల్లా వ్యాప్తంగా దాదాపు 75 నుంచి 80 శాతం రైతులు వరి పంటనే వేశారు. మిగిలిన రైతులు మాత్రం ప్రత్యామ్నాయ పంటలవైపు వెళ్లారు.  యాసంగిలో వ‌రిసాగుతో వ‌చ్చే బాయిల్డ్ రైస్ కొనబోమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం రైతులు ప్రత్యామ్నాయం వైపు వెళ్లాలని సూచించిన రైతులు మాత్రం తగ్గేదే లే అన్నారు. వానాకాలం సీజ‌న్‌కు చెందిన బియ్యాన్నే కొనుగోలు చేసేందుకు ముప్పుతిప్ప‌లు పెట్టిన కేంద్రం…. యాసంగిలో ఒక్క బియ్యం గింజ కూడా కొనేలా కనిపించని పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వంతో అగ్రిమెంటు కూడా చేయించుకున్న‌ది. ప‌రిస్థితి తీవ్ర‌త‌ను అంచ‌నా వేసిన రాష్ట్ర ప్రభుత్వం..వ‌రి వేసుకుంటే త‌మ‌కు సంబంధం లేద‌న్నట్లుగా స్పష్టం చేసింది. 

ఒక్క కొనుగోలు కేంద్రం కూడా ఉండ‌ద‌ని, ధాన్యాన్ని అస‌లే కొనుగోలు చేయ‌బోమ‌ని, ముందుగా మిల్ల‌ర్ల‌తో ఒప్పందం ఉంటేనో లేదంటే … బ‌య‌ట విక్ర‌యంచుకునే వీలుంటేనే వరి వైపు వెళ్లొచ్చని స్పష్టం చేసింది. వరి కాకుండా అన్నదాతలు ప్రత్యామ్నయ పంటలవైపు వెళ్లాలని సూచించింది. అయితే ప్రత్యామ్నయంపై ఎలాంటి ప్రోత్సాహకాలు గానీ విధి విధానాలు గాని రైతులకు వివరించని పరిస్థితి. ఉదాహరణకు పొద్దు తిరుగుడు పువ్వు, జోన్న, సోయా, మొక్క జోన్న, కూరగాయలు వంటి పంటలకు సంబంధించిన నకిలీ విత్తనాలు మార్కెట్లో భారీగా చలామణి అవుతున్నాయ్. గతంలో సోయా సాగు చేసిన రైతులు నకిలీ విత్తనాల ధాటికి దిగుబడి రాక నష్టాల పాలైన సంగతి అందరికీ తెలిసిందే. ప్రత్యామ్నయ పంటల విత్తనాలు అందుబాటులో లేని పరిస్థితి నెలకొంది. మరోవైపు నిజామాబాద్ జిల్లాలో గత వానాకాల సీజన్ లో విస్తృతంగా వర్షాలు కురిశాయ్. ప్రాజెక్టులు, చెరువులు నిండాయ్. భూగర్భ జలాలు పెరిగాయ్. సమృద్ధిగా నీరు ఉంది. 24 గంటల కరెంట్ ఉచితంగా వస్తోంది. వీటితో పాటు సంప్రదాయంగా వస్తున్న వరి సాగు వైపై రైతులు మొగ్గుచూపారు. 

ప్రస్తుతం పరిస్థితుల్లో రైతులకు వ‌రి త‌ప్ప వేరే పంట‌లు వేసుకునే పరిస్థితి లేదు. యాసంగి సీజ‌న్ దాదాపుగా పూర్త‌యింది. వ‌రి సాగు సుమారు 75 నుంచి 80 శాతం విస్తీర్ణంలో సాగులోకి రానుంది. వరి పంట 3 నెలలకు చేతికి వస్తుంది. ధాన్యం వచ్చే సమయానికి పరిస్థితి ఏంటీ ? అప్పుడు వరి ధాన్యాన్ని ఎవరు కొనాలి ? అన్నదానిపై ఖచ్చితంగా గందరగోళ పరిస్థితులు నెలకొని అవకాశం లేకపోలేదు.  మిల్ల‌ర్లు ఎంత కొన్నా 30శాతానికి మించదు. మిగిలిన 50 శాతం సాగైన వ‌రి ధాన్యం ప‌రిస్థితేంటి..? ఆ ధాన్యాన్ని రైతులు ఎవ‌రికి అమ్ముకోవాలి..?  అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Also Read: Anvesh Reddy: పసుపు రైతులకు మద్దతు ధర రావటం లేదు.. పసుపు బోర్డు తెస్తానని చెప్పి ఎన్నికల్లో అరవింద్ గెలిచాడు

Also Read: Minister Harish Rao: తెలంగాణలో ఫీవర్ సర్వే.. వైరస్ లక్షణాలు గుర్తిస్తే హోం ఐసోలేషన్ కిట్లు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Cheyutha Pension Scheme: జూన్ 2 నుంచి మీ అకౌంట్‌లోకి డబ్బులు.. చేయూత పథకం అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్ ఇలా
జూన్ 2 నుంచి మీ అకౌంట్‌లోకి డబ్బులు.. చేయూత పథకం అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్ ఇలా
Tiger Trapped In Cage: నలుగురు మహిళల్ని చంపిన పులిని బంధించిన అధికారులు.. స్థానిక ప్రజలుకు బిగ్ రిలీఫ్
నలుగురు మహిళల్ని చంపిన పులిని బంధించిన అధికారులు.. స్థానిక ప్రజలుకు బిగ్ రిలీఫ్
Telangana News: మొక్కజొన్న కొనుగోళ్లపై స్పందించని కేంద్రం.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
మొక్కజొన్న కొనుగోళ్లపై స్పందించని కేంద్రం.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Hyderabad News: క్యాన్సర్ బాధితుల కోసం జుట్టు డొనేట్ చేసిన హైదరాబాద్ బాలిక.. నెటిజన్ల ప్రశంసలు
క్యాన్సర్ బాధితుల కోసం జుట్టు డొనేట్ చేసిన హైదరాబాద్ బాలిక.. నెటిజన్ల ప్రశంసలు

వీడియోలు

Vaibhav Suryavanshi MI vs RR IPL 2026 | ప్లేఆఫ్‌లో ఉండాలంటే రాజస్థాన్ గెలవాల్సిందే
Shreyas Iyer LSG vs PBKS Do or Die Match | మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన శ్రేయస్
IPL Playoff Race PBKS, RR, KKR | నాలుగో స్థానం కోసం మూడుముక్కలాట
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
Sachin Tendulkar Emotional Post For Arjun | కొడుకు ప్రదర్శనపై సచిన్ ఎమోషనల్ పోస్ట్ వైరల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: లేబర్‌ అడ్డాలతో ఏపీలో నూతన అధ్యాయం.. కార్మికుల నైపుణ్యాలకు పదును పెట్టేలా స్కిల్ ట్రైనింగ్
లేబర్‌ అడ్డాలతో ఏపీలో నూతన అధ్యాయం.. కార్మికుల నైపుణ్యాలకు పదును పెట్టేలా స్కిల్ ట్రైనింగ్
Telangana News: మొక్కజొన్న కొనుగోళ్లపై స్పందించని కేంద్రం.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
మొక్కజొన్న కొనుగోళ్లపై స్పందించని కేంద్రం.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
IPL 2026 RR VS MI Result Update: స‌న్ రైజ‌ర్స్ వ‌ర్సెస్ రాయ‌ల్స్.. ఎలిమినేట‌ర్ పోరు ఖరారు.. ఆఖ‌రి లీగ్ మ్యాచ్ లో ముంబైపై రాయ‌ల్స్ గెలుపు, రాణించిన జురేల్, ఆర్చ‌ర్
స‌న్ రైజ‌ర్స్ వ‌ర్సెస్ రాయ‌ల్స్.. ఎలిమినేట‌ర్ పోరు ఖరారు.. ఆఖ‌రి లీగ్ మ్యాచ్ లో ముంబైపై RR గెలుపు, రాణించిన జురేల్, ఆర్చ‌ర్
Tamil Nadu Politics: కాంగ్రెస్ వెన్నుపోటు పార్టీ! డీఎంకే అడ్డంగా దొరికింది.. ఇక మీ నాటకాలు ఆపండి!
కాంగ్రెస్ వెన్నుపోటు పార్టీ! డీఎంకే అడ్డంగా దొరికింది.. ఇక మీ నాటకాలు ఆపండి!
Crime Thriller OTT : వింత సింబల్‌తో దారుణ హత్యలు - బొటన వేలిస్తే తీరే కోరికలు... ఓటీటీలో ట్రెండింగ్ హారర్ క్రైమ్ థ్రిల్లర్
వింత సింబల్‌తో దారుణ హత్యలు - బొటన వేలిస్తే తీరే కోరికలు... ఓటీటీలో ట్రెండింగ్ హారర్ క్రైమ్ థ్రిల్లర్
Tiger Trapped In Cage: నలుగురు మహిళల్ని చంపిన పులిని బంధించిన అధికారులు.. స్థానిక ప్రజలుకు బిగ్ రిలీఫ్
నలుగురు మహిళల్ని చంపిన పులిని బంధించిన అధికారులు.. స్థానిక ప్రజలుకు బిగ్ రిలీఫ్
Heatwave Heart Care : వేసవిలో పెరుగుతోన్న హార్ట్ ఎటాక్(Heart Attack) రిస్క్.. ఎండల్లో గుండెను కాపాడే ఫుడ్స్ ఇవే
వేసవిలో పెరుగుతోన్న హార్ట్ ఎటాక్(Heart Attack) రిస్క్.. ఎండల్లో గుండెను కాపాడే ఫుడ్స్ ఇవే
త్వరలో పెరగనున్న Maruti Alto K10 ధర.. చీపెస్ట్ కారు ఇక కాస్ట్‌లీ- ధర, ఫీచర్లు చూశారా
త్వరలో పెరగనున్న Maruti Alto K10 ధర.. చీపెస్ట్ కారు ఇక కాస్ట్‌లీ- ధర, ఫీచర్లు చూశారా
Embed widget