అన్వేషించండి

Nizamabad News: ప్రభుత్వం నో అంటున్నా.. వరి సాగుకు సై అంటున్న రైతులు

నిజామాబాద్ లో రైతులు వరి సాగువైపే మెుగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. సుమారు 75 శాతానికి పైగా రైతులు వరి పంటనే సాగు చేస్తున్నారు.

యాసంగిలో వ‌రి వెయ్యొద్దని రాష్ట్ర ప్రభుత్వం మొత్తుకున్నా... నిజామాబాద్ జిల్లా రైతన్నలు వరి సాగుకే మొగ్గుచూపారు. ప్రత్యామ్నయం వైపు వెళ్లకుండా సంప్రదాయంగా వస్తున్న వరి పంటకే సై అన్నారు.  జిల్లా వ్యాప్తంగా దాదాపు 75 నుంచి 80 శాతం రైతులు వరి పంటనే వేశారు. మిగిలిన రైతులు మాత్రం ప్రత్యామ్నాయ పంటలవైపు వెళ్లారు.  యాసంగిలో వ‌రిసాగుతో వ‌చ్చే బాయిల్డ్ రైస్ కొనబోమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం రైతులు ప్రత్యామ్నాయం వైపు వెళ్లాలని సూచించిన రైతులు మాత్రం తగ్గేదే లే అన్నారు. వానాకాలం సీజ‌న్‌కు చెందిన బియ్యాన్నే కొనుగోలు చేసేందుకు ముప్పుతిప్ప‌లు పెట్టిన కేంద్రం…. యాసంగిలో ఒక్క బియ్యం గింజ కూడా కొనేలా కనిపించని పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వంతో అగ్రిమెంటు కూడా చేయించుకున్న‌ది. ప‌రిస్థితి తీవ్ర‌త‌ను అంచ‌నా వేసిన రాష్ట్ర ప్రభుత్వం..వ‌రి వేసుకుంటే త‌మ‌కు సంబంధం లేద‌న్నట్లుగా స్పష్టం చేసింది. 

ఒక్క కొనుగోలు కేంద్రం కూడా ఉండ‌ద‌ని, ధాన్యాన్ని అస‌లే కొనుగోలు చేయ‌బోమ‌ని, ముందుగా మిల్ల‌ర్ల‌తో ఒప్పందం ఉంటేనో లేదంటే … బ‌య‌ట విక్ర‌యంచుకునే వీలుంటేనే వరి వైపు వెళ్లొచ్చని స్పష్టం చేసింది. వరి కాకుండా అన్నదాతలు ప్రత్యామ్నయ పంటలవైపు వెళ్లాలని సూచించింది. అయితే ప్రత్యామ్నయంపై ఎలాంటి ప్రోత్సాహకాలు గానీ విధి విధానాలు గాని రైతులకు వివరించని పరిస్థితి. ఉదాహరణకు పొద్దు తిరుగుడు పువ్వు, జోన్న, సోయా, మొక్క జోన్న, కూరగాయలు వంటి పంటలకు సంబంధించిన నకిలీ విత్తనాలు మార్కెట్లో భారీగా చలామణి అవుతున్నాయ్. గతంలో సోయా సాగు చేసిన రైతులు నకిలీ విత్తనాల ధాటికి దిగుబడి రాక నష్టాల పాలైన సంగతి అందరికీ తెలిసిందే. ప్రత్యామ్నయ పంటల విత్తనాలు అందుబాటులో లేని పరిస్థితి నెలకొంది. మరోవైపు నిజామాబాద్ జిల్లాలో గత వానాకాల సీజన్ లో విస్తృతంగా వర్షాలు కురిశాయ్. ప్రాజెక్టులు, చెరువులు నిండాయ్. భూగర్భ జలాలు పెరిగాయ్. సమృద్ధిగా నీరు ఉంది. 24 గంటల కరెంట్ ఉచితంగా వస్తోంది. వీటితో పాటు సంప్రదాయంగా వస్తున్న వరి సాగు వైపై రైతులు మొగ్గుచూపారు. 

ప్రస్తుతం పరిస్థితుల్లో రైతులకు వ‌రి త‌ప్ప వేరే పంట‌లు వేసుకునే పరిస్థితి లేదు. యాసంగి సీజ‌న్ దాదాపుగా పూర్త‌యింది. వ‌రి సాగు సుమారు 75 నుంచి 80 శాతం విస్తీర్ణంలో సాగులోకి రానుంది. వరి పంట 3 నెలలకు చేతికి వస్తుంది. ధాన్యం వచ్చే సమయానికి పరిస్థితి ఏంటీ ? అప్పుడు వరి ధాన్యాన్ని ఎవరు కొనాలి ? అన్నదానిపై ఖచ్చితంగా గందరగోళ పరిస్థితులు నెలకొని అవకాశం లేకపోలేదు.  మిల్ల‌ర్లు ఎంత కొన్నా 30శాతానికి మించదు. మిగిలిన 50 శాతం సాగైన వ‌రి ధాన్యం ప‌రిస్థితేంటి..? ఆ ధాన్యాన్ని రైతులు ఎవ‌రికి అమ్ముకోవాలి..?  అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Also Read: Anvesh Reddy: పసుపు రైతులకు మద్దతు ధర రావటం లేదు.. పసుపు బోర్డు తెస్తానని చెప్పి ఎన్నికల్లో అరవింద్ గెలిచాడు

Also Read: Minister Harish Rao: తెలంగాణలో ఫీవర్ సర్వే.. వైరస్ లక్షణాలు గుర్తిస్తే హోం ఐసోలేషన్ కిట్లు

టాప్ హెడ్ లైన్స్

HYDRA Ranganath: హైడ్రా చుట్టూ వివాదాల వలయం - హైకోర్టు ఆదేశాలనూ లెక్క చేయడం లేదా? ఆర్మీ జోక్యం ఎందుకు?
హైడ్రా చుట్టూ వివాదాల వలయం - హైకోర్టు ఆదేశాలనూ లెక్క చేయడం లేదా? ఆర్మీ జోక్యం ఎందుకు?
Breaking News: విజయవాడలోని మధురానగర్‌లో బిర్యాని షాపు దగ్ధం! 
విజయవాడలోని మధురానగర్‌లో బిర్యాని షాపు దగ్ధం! 
Breaking News: మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై గృహ హింస కేసు..!
మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై గృహ హింస కేసు..!
Revanth Reddy Indiramma Housing: హైదరాబాద్ క్యూర్ పరిధిలో జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
హైదరాబాద్ క్యూర్ పరిధిలో జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Govt Employees PRC IR Demands: ఏపీలో ఉద్యోగుల పీఆర్‌సీ రాజకీయం - చంద్రబాబు మార్క్ ఐఆర్ వ్యూహం.. ఆశల్లో ఉద్యోగ లోకం!
ఏపీలో ఉద్యోగుల పీఆర్‌సీ రాజకీయం - చంద్రబాబు మార్క్ ఐఆర్ వ్యూహం.. ఆశల్లో ఉద్యోగ లోకం!
Jhandu Kumar In Commonwealth Games: కూరగాయలు అమ్మాడు, రిక్షా నడిపాడు, ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు తొలి పతకాన్ని తీసుకొచ్చాడు!
కూరగాయలు అమ్మాడు, రిక్షా నడిపాడు, ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు తొలి పతకాన్ని తీసుకొచ్చాడు!
Prime Minister Modi:
"రీల్స్ చేయండి, ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉండండి" కేబినెట్ మంత్రులకు మరోసారి ప్రధాని మోదీ సలహా 
Modi video:
"స్పందించి సలహాలు ఇచ్చిన వారికి ధన్యవాదాలు" మరో సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన ప్రధానమంత్రి
Jana Nayagan Box Office Collection Day 2: 'జన నాయకుడు' కలెక్షన్లు... రెండో రోజు ఢమాల్... విజయ్ సినిమాకు భారీ డ్రాప్! 
కలెక్షన్లలో విజయ్‌కు భారీ దెబ్బ... వంద కోట్ల క్లబ్బులో 'జన నాయకుడు'... కానీ రెండో రోజు అంతేనా?
Revanth Reddy Indiramma Housing: హైదరాబాద్ క్యూర్ పరిధిలో జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
హైదరాబాద్ క్యూర్ పరిధిలో జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
కన్వర్ యాత్రలో నిజమైన ప్రేమ: దివ్యాంగుడైన భర్తను 180 కి.మీ మోసిన భార్య!
కన్వర్ యాత్రలో నిజమైన ప్రేమ: దివ్యాంగుడైన భర్తను 180 కి.మీ మోసిన భార్య!
తొలి ఏకాదశి పూజా విధానం, ఉపవాస నియమాలు తెలుసుకోండి!
తొలి ఏకాదశి పూజా విధానం, ఉపవాస నియమాలు తెలుసుకోండి!
Embed widget