By: ABP Desam | Updated at : 18 Nov 2021 11:08 AM (IST)
Edited By: Venkateshk
చిన్నారిని దత్తత తీసుకున్న నిర్మల్ కలెక్టర్
నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ పెద్ద మనసు చాటుకున్నారు. అనాథగా మారిన ఐదేళ్ల పాపను దత్తత తీసుకున్నారు. ముథోల్ మండలంలోని ఎడ్బిడ్ గ్రామానికి చెందిన భూమవ్వ అనారోగ్యంతో రెండ్రోజుల క్రితం చనిపోయింది. భర్త కూడా ఐదేళ్ల క్రితమే చనిపోయాడు. దీంతో ఐదేళ్ల రోహిణీ అనాథగా మారిపోయింది. ఆ చిన్నారి దీన స్థితిని ఓ వ్యక్తి మంత్రి కేటీఆర్కు ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేయగా.. మంత్రి స్పందించారు. ఆ చిన్నారిని ఆదుకోవాలని నిర్మల్ జిల్లా కలెక్టర్కు సూచించారు.
Request @WCDTelangana and @Collector_NML to take full care of this child’s well-being https://t.co/kDOqgnOPV3
— KTR (@KTRTRS) November 17, 2021
దీనిపై స్పందించిన కలెక్టర్ మంత్రి సూచన మేరకు ఆయన బుధవారం ఎడ్ బిడ్ గ్రామాన్ని సందర్శించారు. ఐదేళ్ల చిన్నారి రోషిణితో మాట్లాడారు. నీ పేరేంటి అని ప్రశ్నించగా.. రోషిణి అని సమాధానం చెప్పింది. ‘‘నువ్వు స్కూల్కెళ్తున్నవా..’’ అనగా ఆ పాప బాలబడికి (అంగన్వాడీకి) వెళ్తున్నానని చెప్పింది. ‘‘మీ అంగన్వాడీ టీచర్ ఎవరు..’’ అనగా.. ‘‘అగో ఆమెనే..’’ అని చూపించింది.
Many thanks Collector Garu 👍 https://t.co/9LDueudg6Q
— KTR (@KTRTRS) November 17, 2021
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. రోషిణి బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని ప్రకటించారు. శిశు సంరక్షణ అధికారులతో మాట్లాడి, రోషిణిని ఆదిలాబాద్లోని శిశు గృహానికి తరలించారు. గ్రామస్తులు దాతల ద్వారా సేకరించిన రూ.1.80 లక్షల విరాళాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో లోకేశ్వర్రావు, తహసీల్దార్ శివప్రసాద్, సీడీపీవో శ్రీమతి పాల్గొన్నారు.
అనంతరం మంత్రి కేటీఆర్ కూడా కలెక్టర్ చేసిన సాయంపై స్పందించారు. కలెక్టర్ చూపిన చొరవకు ధన్యవాదాలు తెలిపారు.
మానవత్వం పరిమళించే మంచి మనిషి మంత్రి శ్రీ కేటీఆర్ అన్నకు జేజేలు 👏 👏 pic.twitter.com/VdDEMa8GzR
— Venkat Rasala (@venkatrasala1) November 18, 2021
Also Read: Robbery: కుక్కలు చనిపోవడం, దోపిడీ చేశాక చంపేయడం.. ఇది ఆ గ్యాంగు పనేనా?
Also Read: భోజనం చేసే మధ్యలో నీళ్లు ఎందుకు తాగకూడదు? తాగితే ఏమవుతుంది?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి
Weather Latest Update: నేడు 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్! ఇక్కడ అధిక చలి - మధ్యాహ్నం వేళ మండుతున్న ఎండలు
TS Early Polls : ముందస్తు ఎన్నికలకు అన్ని పార్టీలు రెడీనా ? బీజేపీ, కాంగ్రెస్కు తిప్పలు తప్పవా ?
TSLPRB: ఆ పోలీసు అభ్యర్థులకు గుడ్ న్యూస్, హైకోర్టు ఆదేశాల మేరకు బోర్డు కీలక నిర్ణయం! ఏంటంటే?
Breaking News Live Telugu Updates: పారిశ్రామిక దిగ్గజాలతో మంత్రి అమర్నాథ్ భేటీ, పెట్టుబడుల సదస్సుకు ఆహ్వానం
Revanth Reddy Comments: ఉద్యమ సమయంలో జానారెడ్డి కాళ్ల మీద పడింది మరిచావా కేసీఆర్?: టీపీసీసీ చీఫ్
Amaravati In LokSabha : ఏపీ రాజధానిపై కేంద్రం కీలక ప్రకటన - ఇక అడ్డంకులు తొలగిపోయినట్లేనా ?
Kavitha On PM Modi: ఇలాంటి ప్రధాని మనకు అవసరమా? ఆలోచించుకోండి: ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్యలు
Sir Trailer: ‘డబ్బు ఎలాగైనా సంపాదించచ్చు - మర్యాదని చదువు మాత్రమే సంపాదిస్తుంది’ - ధనుష్ ‘సార్’ ట్రైలర్ చూశారా?
Gudivada Amarnath: పారిశ్రామిక దిగ్గజాలతో మంత్రి అమర్నాథ్ భేటీ, పెట్టుబడుల సదస్సుకు ఆహ్వానం