అన్వేషించండి

NHRC: కాళేశ్వరం ముంపు ప్రభావంపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు... 8 వారాల్లో అధ్యయన నివేదిక ఇవ్వాలని ఆదేశం

కాళేశ్వరం ముంపు ప్రభావంపై అధ్యయనం చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు జారీచేసింది. 8 వారాల్లో అధ్యయన నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుపై జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీచేసింది. కాళేశ్వరం ముంపు ప్రభావంపై అధ్యయనం చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. అధ్యయనం చేసి ఎనిమిది వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశించింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల ముంపు అధికంగా ఉంటుందని ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు అందింది. కాళేశ్వరం ప్రాజెక్టు వెనుక జలాల వల్ల 40 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ఫిర్యాదులో ఉందని ఎన్‌హెచ్‌ఆర్‌సీ తెలిపింది. పంట నష్టంతో మనస్థాపం చెందిన ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడినట్లు ఫిర్యాదుదారుడి తరఫున న్యాయవాది శ్రావణ్ ఎన్‌హెచ్‌ఆర్సీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన ఎన్‌హెచ్‌ఆర్సీ గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశాలను ఎందుకు పట్టించలేదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించింది. కాళేశ్వరం ప్రాజెక్టు ముంపుపై పూర్తిస్థాయి అధ్యయనం చేసి నివేదిక అందించాలని ఆదేశాలు జారీచేసింది.

Also Read: తమిళనాడు పర్యటనలో సీఎం కేసీఆర్.. రేపు స్టాలిన్ తో భేటీ

కాళేశ్వరం ప్రాజెక్టు

కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టును దాదాపు రూ.80,500 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణలోని దాదాపు 13 జిల్లాలకు ఈ ప్రాజెక్టు ద్వారా ప్రయోజనం చేకూరుతుందని తెలిపింది. గోదావరి నుంచి 90 రోజులపాటు రోజూ రెండు టీఎంసీల నీటిని..మొత్తం 180 టీఎంసీలు ఎత్తిపోయడమే ఈ పథకం ఉద్దేశం. ఈ ప్రాజెక్టు కోసం వందల కిలోమీటర్ల దూరం కాలువలు, సొరంగ మార్గాల నిర్మిస్తున్నారు. దేశంలోనే అతి పెద్ద ఎత్తిపోతలు, ఆసియాలోనే అతి పెద్ద ఎగసిపడేనీటి జలాశయం ఏర్పాటు, భూగర్భంలో నీటిపంపులు, గోదావరి నదిపై వరుసగా బ్యారేజీల నిర్మాణం ఈ ప్రాజెక్టులో భాగంగా ఉన్నాయి. దీని కోసం మొత్తంగా 80 వేల ఎకరాల భూసేకరణ చేసింది ప్రభుత్వం. 18,25,700 ఎకరాల ఆయకట్టుకు 134.5 టీఎంసీల నీటిని వినియోగంలోకి తీసుకురానున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రాజెక్టుల కింద ఆయకట్టు స్ధిరీకరణకు 34.5 టీఎంసీల కేటాయించనున్నారు. కాళేశ్వరం నుంచి హైదరబాద్ తాగునీటికి 30 టీఎంసీలు , గ్రామాల తాగునీటికి మరో 10 టీఎంసీలు పారిశ్రామికంగా అవసరాలకు16 టీఎంసీల నీటిని అందిస్తారు. 

Also Read: తెలంగాణలో బొగ్గు గనుల వేలం నిలిపివేయాలి... లోక్ సభలో లేవనెత్తిన ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి

ప్రాజెక్టుపై వివాదాలు

ఈ ప్రాజెక్టు భూసేక‌ర‌ణ విషయంలో వివాదాలు నెలకొన్నాయి. సిద్ధిపేట ద‌గ్గర మ‌ల్లన్న సాగ‌ర్ రిజ‌ర్వాయ‌ర్ కోసం భూసేక‌ర‌ణపై వివాదం నెలకొంది. తెలంగాణ ప్రభుత్వ భూసేక‌ర‌ణ ప‌రిహారం చ‌ట్టం ప్రకారం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీవో ద్వారా ఇస్తుంది. దీనిపై నిర్వాసితులు అభ్యంత‌రం వ్యక్తంచేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు మొత్తం 70 వేల ఎక‌రాలు అవ‌స‌రం ఉండ‌గా, ఇంకా 33 వేల ఎకరాలు సేక‌రించాల్సి ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు తొలి ఏడాది మోటార్లను పంప్​ హౌస్​​లను సక్సెస్​గా రన్​ చేసినా కొత్త ఆయకట్టుకు మాత్రం ఈ ప్రాజెక్టు నుంచి అందలేదు. వర్షాల వలన ముందు తోడిన నీరంతా మళ్లీ దిగువకు వదిలారని విమర్శలు వచ్చాయి. 

Also Read: జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై టీఎస్ హైకోర్టులో విచారణ... నోటీసులు జారీ చేసిన హైకోర్టు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ustaad Bhagat Singh: తెలంగాణలో పెంచలేదు... నార్మల్ టికెట్ రేట్స్‌కు 'ఉస్తాద్'
తెలంగాణలో పెంచలేదు... నార్మల్ టికెట్ రేట్స్‌కు 'ఉస్తాద్'
Telangana drugs case politics: అసెంబ్లీ సమావేశాల ముందు కాంగ్రెస్‌కు అంది వచ్చిన డ్రగ్స్ కేసు - బీఆర్ఎస్ పార్టీ చిక్కుల్లో పడుతుందా?
అసెంబ్లీ సమావేశాల ముందు కాంగ్రెస్‌కు అంది వచ్చిన డ్రగ్స్ కేసు - బీఆర్ఎస్ పార్టీ చిక్కుల్లో పడుతుందా?
Moinabad Drugs Case: మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం.. డ్రగ్స్ వాడటం ఇదే తొలిసారి కాదా? శాంపిల్స్‌లో మరిన్ని అవశేషాలు
మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం.. డ్రగ్స్ వాడటం ఇదే తొలిసారి కాదా? శాంపిల్స్‌లో మరిన్ని అవశేషాలు
Nandini Sidda Reddy : తెలంగాణ అక్షర శిఖరానికి జాతీయ గౌరవం! నందిని సిధారెడ్డిని వరించిన కేంద్ర సాహిత్య పురస్కారం 
తెలంగాణ అక్షర శిఖరానికి జాతీయ గౌరవం! నందిని సిధారెడ్డిని వరించిన కేంద్ర సాహిత్య పురస్కారం 

వీడియోలు

AIMIM MLAs Walkout Vandematarm | తెలంగాణ అసెంబ్లీలో జరిగిన ఘటనపై కేంద్ర మంత్రుల ఫైర్ | ABP Desam
Jay Shah Smashes T20W C 2026 Controversies | పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లకు జై షా వార్నింగ్ | ABP Desam
Abhishek Sharma T20WC 2026 Secret Revealed | అభిషేక్ కు గంభీర్ సలహా | ABP Desam
Rishabh Pant Transformation IPL 2026 | యువరాజ్ సింగ్ శిక్షణలో రిషబ్ పంత్ | ABP Desam
Sanju Samson Funny Advice to Abhishek | అభిషేక్ శర్మకు సంజూ పెళ్లి సలహా | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pakistan Airstrike: కాబూల్‌లో పాక్ వైమానిక దాడులు.. 400 మందికి పైగా మృతి- హాస్పిటల్స్, నివాస ప్రాంతాలే టార్గెట్
కాబూల్‌లో పాక్ వైమానిక దాడులు.. 400 మందికి పైగా మృతి- హాస్పిటల్స్, నివాస ప్రాంతాలే టార్గెట్
YSRCP local polls plan: లోకల్‌పోల్స్‌లో అసలు టార్గెట్ కూటమి మధ్య చిచ్చే - వైసీపీ పక్కా ప్లాన్‌తో రెడీ అవుతోందా?
లోకల్‌పోల్స్‌లో అసలు టార్గెట్ కూటమి మధ్య చిచ్చే - వైసీపీ పక్కా ప్లాన్‌తో రెడీ అవుతోందా?
Kerala Assembly Elections 2026: కేరళంలో కాంగ్రెస్‌కు డూ ఆర్ డై ఎన్నికలు - మూడోసారీ ఓడిపోతే బీజేపీదే ఆ స్థానం !
కేరళంలో కాంగ్రెస్‌కు డూ ఆర్ డై ఎన్నికలు - మూడోసారీ ఓడిపోతే బీజేపీదే ఆ స్థానం !
Jeevan Reddy: జగిత్యాలలో రాజకీయ ప్రకంపనలు! 40 ఏళ్ల కాంగ్రెస్‌ బంధానికి జీవన్ రెడ్డి గుడ్‌బై? కారు ఎక్కనున్న సీనియర్‌ నేత!
జగిత్యాలలో రాజకీయ ప్రకంపనలు! 40 ఏళ్ల కాంగ్రెస్‌ బంధానికి జీవన్ రెడ్డి గుడ్‌బై? కారు ఎక్కనున్న సీనియర్‌ నేత!
YS Avinash Reddy: హత్య చేసిన దస్తగిరికి మద్దతు - డ్రైవర్ ప్రసాద్ విషయంలో సైలెంట్ - సునీతపై అవినాష్ రెడ్డి ఆరోపణలు
హత్య చేసిన దస్తగిరికి మద్దతు - డ్రైవర్ ప్రసాద్ విషయంలో సైలెంట్ - సునీతపై అవినాష్ రెడ్డి ఆరోపణలు
Iran War Updates: నెతన్యాహు వీడియోలు ఓకే - మరి ఇరాన్ కొత్త సుప్రీంలీడర్ వీడియోలు ఎక్కడ - నిజంగానే కోమాలో ఉన్నారా?
నెతన్యాహు వీడియోలు ఓకే - మరి ఇరాన్ కొత్త సుప్రీంలీడర్ వీడియోలు ఎక్కడ - నిజంగానే కోమాలో ఉన్నారా?
Telangana Assembly: వందేమాతరం పాడకుండా వాకౌట్ చేసిన మజ్లిస్ ఎమ్మెల్యేలు - బీజేపీ నేతల తీవ్ర విమర్శలు
వందేమాతరం పాడకుండా వాకౌట్ చేసిన మజ్లిస్ ఎమ్మెల్యేలు - బీజేపీ నేతల తీవ్ర విమర్శలు
Statue of Sacrifice: ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
Embed widget