అన్వేషించండి

Srisailam Reservoir: పోతిరెడ్డిపాడుతో తెలంగాణకు తీవ్ర అన్యాయం, శ్రీశైలంలో నీళ్లు త్వరలో ఖాళీ: జూపల్లి కృష్ణారావు

Pothireddypadu Reservoir | ఏపీ కృష్ణా జలాలను తరలించుకుపోతున్నదని, పోతిరెడ్డిపాడు విస్తరణతో తెలంగాణకు మరింత అన్యాయం జరుగుతుందని, శ్రీశైలంలో నీళ్లు ఖాళీ అవుతాయని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

Jupally Krishna Rao About Srisailam Dam Water | కొల్లాపూర్: పోతిరెడ్డిపాడు కాల్వ ద్వారా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం కృష్ణా జలాలను ఇప్ప‌టికే భారీగా తరలించుకుపోతున్నదని, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేట‌ర్ విస్త‌ర‌ణ‌తో మ‌న ప్రాంతానికి తీవ్ర అన్యాయం జ‌రగ‌నుంద‌ని, శ్రీశైలం రిజ‌ర్వాయ‌ర్ లోని నీళ్లు రెండు మూడు నెలల్లోనూ ఖాళీ అయ్యే ప్ర‌మాదం ఉంద‌ని మంత్రి జూప‌ల్లి కృష్ణారావు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఈ ప్రాంత‌ నీటీ స‌మ‌స్య తీరాలంటే వెల్టూరు, చిన్న‌మ‌ర్రి మ‌ధ్య కృష్ణ న‌దిపై డ్యాం నిర్మించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని, ఒక్క ఎక‌రం ముంపు ముప్పు లేకుండా సుమారు 60 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే అవ‌కాశం ఉంటుందన్నారు. ఈ అంశాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామ‌ని, డిప్యూటీ సీఎం భట్టివిక్ర‌మార్క సహకారం కోరాలన్నారు.

ఇక్క‌డ డ్యాం నిర్మాణం వ‌ల్ల నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లాతో పాటు నార్లాపూర్ మోట‌ర్లు, కల్వ‌కుర్తి లిప్ట్ ఇరిగేష‌న్ ప్రాజెక్ట్ లో భాగంగా చేప‌ట్టిన ఎల్లూర్ లిప్ట్, పాల‌మూరు - రంగారెడ్డి ప్రాజెక్టులకు నీటిని వినియోగించుకోవ‌చ్చ‌ని తెలిపారు. కొల్లాపూర్ పట్టణంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంతో పాటు నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కని మంత్రి జూపల్లి సమక్షంలో మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ మేకల రమ్య నాగరాజు శాలువాతో సత్కరించి, జ్ఞాపిక ను అందజేశారు..

బీఆర్ఎస్ పాల‌న‌లో రాష్ట్రం ఆధోగ‌తిపాలు
ప‌దేండ్ల బీఆర్ఎస్ పాల‌న‌లో తెలంగాణ రాష్ట్రం ఆధోగ‌తి పాలైంద‌న్నారు. విభ‌న‌కు మందు మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ అప్పులు కుప్పగా మారింద‌ని  గ‌త ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌ట్టారు. తెలంగాణ‌కు ఏర్ప‌డ‌క ముందు రూ. 75 వేల కోట్ల అప్పు ఉంటే.. ప‌దేండ్ల బీఆర్ఎస్ పాల‌న‌లో రూ. 8 ల‌క్ష‌ల కోట్ల అప్పు అయింద‌ని, గ‌తంలో ఏడాదికి రూ. 6500 కోట్ల వ‌డ్డీ చెల్లిస్తే... ఇప్పుడు నెల‌కు రూ. 6500 వ‌డ్డీ క‌ట్టాల్సిన ప‌రిస్థితికి వ‌చ్చింద‌ని ఆవేద‌న వక్తం చేశారు. Srisailam Reservoir: పోతిరెడ్డిపాడుతో తెలంగాణకు తీవ్ర అన్యాయం, శ్రీశైలంలో నీళ్లు త్వరలో ఖాళీ: జూపల్లి కృష్ణారావు

ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్ప‌టికీ ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చేందుకు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సార‌ధ్యంలోని ప్ర‌జా ప్ర‌భుత్వం చిత్త‌శుద్ధితో పని చేస్తుంద‌ని అన్నారు. ప‌దేండ్ల‌లో కొత్త రేష‌న్ కార్డులు ఇచ్చిన దాఖలాలు లేవ‌ని ఎద్దేవా చేశారు. ఇంకా చేయాల్సింది చాలా ఉంద‌ని, వాటిన్నింటిని అమ‌లు చేసి తీరుతామ‌ని,  ఈ ట‌ర్మ్ తో పాటు  మ‌రో ఐదేండ్లు కాంగ్రెస్ ప్ర‌భుత్వ‌మే అధికారంలో ఉంటుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు. 

ముంపు బాధితుల‌కు అండ‌గా ఉంటాం
గ‌తంలో శ్రీశైలం ప్రాజెక్ట్ నిర్మాణంతో  సుమారు 35 గ్రామాలు మంపున‌కు గురయ్యాయ‌ని, అప్పుడు చెల్లించిన న‌ష్ట‌ప‌రిహారం స‌రిపోలేద‌ని పేర్కొన్నారు. మంపు గ్రామాల ప్ర‌జ‌లు అనాడు నిర్మించుకున్న మ‌ట్టి మిద్దెలు కూలిపోతున్నాయ‌ని, ఈ గ్రామాల‌తో పాటు జీవో నం. 123 తో న‌ష్ట‌పోయిన‌ నార్లాపూర్ రిజ‌ర్వాయ‌ర్ ముంపు బాధితుల‌కు ఇందిర‌మ్మ ఇండ్లు మంజూరు చేయాల‌ని డిప్యూటీ సీయంను కోరారు. 


Srisailam Reservoir: పోతిరెడ్డిపాడుతో తెలంగాణకు తీవ్ర అన్యాయం, శ్రీశైలంలో నీళ్లు త్వరలో ఖాళీ: జూపల్లి కృష్ణారావు

కొల్లాపూర్ లో ఇంజ‌నీరింగ్, పాలిటెక్నిక్, ఐటీఐ ఏర్పాటుకు కృషి
కొల్లాపూర్ లో విద్యాభివృద్ధికి  ఇంజ‌నీరింగ్, పాలిటెక్నిక్,  ఐటీఐ కాలేజీల‌ను ఏర్పాటు చేయాల‌ని సూచించారు. శ్రీశైలం ప్రాజెక్ట్ ముంపు బాధితుల‌కు 98 జీవో ద్వారా ఉద్యోగ‌,ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించాల్సి ఉండే కానీ అది నెర‌వేర‌లేద‌ని, వారికి క‌నీసం పంచాయ‌తీ సెక్ర‌ట‌రీ లేదా ల‌ష్క‌ర్ ఉద్యోగాలు ఇవ్వాల‌ని లేక‌పోతే ఒక్కో కుటుంబానికి రూ. 25 ల‌క్ష‌ల న‌ష్ట‌పరిహారం చెల్లించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాల‌ని, మాదాసీల‌కు ఎస్సీ సర్టిఫికెట్లు  జారీకి కృషి చేయాల‌ని కోరారు. నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లాలో లైబ్రరీల అభివృద్ధికి కోటి రూపాయాలు ఇస్తాన‌ని ప్ర‌క‌టించిన ఎంపీ మ‌ల్లు ర‌వికి ఈ సంద‌ర్భంగా మంత్రి జూప‌ల్లి కృత‌జ్ఞ‌తలు తెలిపారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Cognizants Campus in Visakhapatnam: ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
Telangana Panchayat Election Results: తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
Alluri Road Accident: అల్లూరి జిల్లాలో లోయలో పడిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, 9 మంది మృతి! సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
అల్లూరి జిల్లాలో లోయలో పడిన ప్రైవేట్ ట్రావెల్స్, 9 మంది మృతి! సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
Akhanda 3 Title : 'అఖండ 2' క్లైమాక్స్‌లో బిగ్ సర్ ప్రైజ్ - ఫ్యాన్స్‌కు బోయపాటి బిగ్ ట్రీట్ కన్ఫర్మ్
'అఖండ 2' క్లైమాక్స్‌లో బిగ్ సర్ ప్రైజ్ - ఫ్యాన్స్‌కు బోయపాటి బిగ్ ట్రీట్ కన్ఫర్మ్

వీడియోలు

Ind vs SA T20 Suryakumar Press Meet | ఓటమిపై సూర్య కుమార్ యాదవ్ కామెంట్స్
Shubman Gill Golden Duck in Ind vs SA | రెండో టీ20లో గిల్ గోల్డెన్ డకౌట్
Arshdeep 7 Wides in Ind vs SA T20 | అర్షదీప్ సింగ్ చెత్త రికార్డు !
India vs South Africa 2nd T20 | టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా!
Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cognizants Campus in Visakhapatnam: ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
Telangana Panchayat Election Results: తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
Alluri Road Accident: అల్లూరి జిల్లాలో లోయలో పడిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, 9 మంది మృతి! సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
అల్లూరి జిల్లాలో లోయలో పడిన ప్రైవేట్ ట్రావెల్స్, 9 మంది మృతి! సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
Akhanda 3 Title : 'అఖండ 2' క్లైమాక్స్‌లో బిగ్ సర్ ప్రైజ్ - ఫ్యాన్స్‌కు బోయపాటి బిగ్ ట్రీట్ కన్ఫర్మ్
'అఖండ 2' క్లైమాక్స్‌లో బిగ్ సర్ ప్రైజ్ - ఫ్యాన్స్‌కు బోయపాటి బిగ్ ట్రీట్ కన్ఫర్మ్
Maharashtra News: కేంద్ర మాజీ హోం మంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత
కేంద్ర మాజీ హోం మంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత
Sasivadane OTT : మరో ఓటీటీలోకి విలేజ్ క్యూట్ లవ్ స్టోరీ 'శశివదనే' - రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్
మరో ఓటీటీలోకి విలేజ్ క్యూట్ లవ్ స్టోరీ 'శశివదనే' - రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్
Investment Tips: పిల్లల చదువు కోసం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వీటిలో రిస్క్ తక్కువ, మీకు ఏది బెస్ట్
పిల్లల చదువు కోసం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వీటిలో రిస్క్ తక్కువ, మీకు ఏది బెస్ట్
Kaantha OTT : ఓటీటీలోకి వచ్చేసిన దుల్కర్ 'కాంత' - 5 భాషల్లో స్ట్రీమింగ్
ఓటీటీలోకి వచ్చేసిన దుల్కర్ 'కాంత' - 5 భాషల్లో స్ట్రీమింగ్
Embed widget