అన్వేషించండి

KA Paul: పోలింగ్ బూత్‌ల వద్ద కేఏ పాల్ ఉరుకులు, ఆయన సమాధానం వింటే నవ్వుకోవాల్సిందే!

మునుగోడు నియోజకవర్గం పరిధిలో తాను 100 పోలింగ్ బూత్ లను చుట్టి రావాలని అందుకే టైం సరిపోదు కాబట్టి, వేగంగా వెళ్తున్నానని చెప్పారు.

మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, స్వతంత్ర అభ్యర్థి కేఏ పాల్ వ్యవహరించిన తీరు అందర్నీ ఆశ్చర్యపర్చింది. ఆయన ఎన్నికల ప్రచారం మొదలుకొని కాస్త విభిన్నంగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. కేఏ పాల్ ఆత్మవిశ్వాసంతో తానే గెలుస్తానని చెప్పడం, రెండో స్థానంలో నిలిచే పార్టీ ఎవరో చెప్పాలనడం లాంటి వ్యాఖ్యలను చాలా మంది కామెడీగా తీసుకున్నారు. మరోవైపు, ప్రచారంలో రోజుకు ఓ గెటప్ వేసి అందరి దృష్టినీ ఆకర్షించారు.

ఇప్పుడు ఎన్నికలు జరుగుతుండగా కూడా ఆయన వ్యవహరించిన విధానం అందరినీ నవ్వించింది. ఉదయం నుంచి కేఏ పాల్ తన పది వేళ్లకి పది ఉంగరాలు ధరించి పోలింగ్ బూత్ వద్దకు వచ్చారు. ఈ ఎన్నికల్లో ఆయనకు ఎన్నికల సంఘం ఉంగరం గుర్తును కేటాయించిన సంగతి తెలిసిందే. అందుకే చేతి పది వేళ్లకు పది ఉంగరాలు ధరించి వచ్చారు. ఒక్కో పోలింగ్ బూత్ తిరుగుతూ పరిశీలించారు. ఒక బూత్ నుంచి మరో బూత్‌కు పరిగెత్తుకుంటూ వెళ్లడం అందరికీ నవ్వు తెప్పించింది. 

పోలింగ్ బూత్‌ల ముందు కేఏ పాల్ పరిగెత్తిన వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మునుగోడు నియోజకవర్గం పరిధిలో తాను 100 పోలింగ్ బూత్ లను చుట్టి రావాలని అందుకే టైం సరిపోదు కాబట్టి, వేగంగా వెళ్తున్నానని చెప్పారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

ఆ ప్రశ్నకు సమాధానం మరీ కామెడీగా

పది వేళ్లకు పది ఉంగరాలు ధరించి వచ్చిన కేఏ పాల్ మీడియాతో మాట్లాడుతుండగా విలేకరులు ఆయన్ను ఓ ప్రశ్న అడిగారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తూ ఆయనకు కేటాయించిన గుర్తును అలా ప్రదర్శిస్తుండడం నేరం కదా అని అడిగారు. దానికి కేఏ పాల్ చెప్పిన సమాధానం మరింత ఫన్నీగా ఉంది. ‘‘టీఆర్ఎస్ పార్టీది కారు గుర్తు. వారు 30 వేల కార్లలో వచ్చారు. మరి అది కూడా ఎన్నికల నిబంధన ఉల్లంఘించినట్లే కదా? అలా అయితే వాళ్లంతా బైక్ లపైన రావాలి’’ అంటూ సమాధానం ఇచ్చారు. ఈ వీడియోను అందరూ వైరల్ చేస్తున్నారు. వాట్సప్‌లలో స్టేటస్ పెట్టుకుంటున్నారు.

సంస్థానారాయణ పూర్‌లో టీఆర్ఎస్ నేతలు ఓటర్లను ప్రలోభ పెట్టే విధంగా పోలింగ్ బూత్‌ల లోపలకు వెళ్లారని కేఏ పాల్ అన్నారు. దాంతో పోలీసులు సహకారంతో కేఏ పాల్ వాళ్లను బయటకు పంపించానని చెప్పారు. మునుగోడులో ఎన్నికల ప్రక్రియ సజావుగా జరుగుతోందని, ప్రజలు మార్పు కోరుకుంటున్నారని పాల్ అన్నారు. కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్‌ పార్టీలు ఇక్కడ ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని ఆరోపించారు. బీజేపీ ఒక్కో ఓటరుకు రూ.30 వేలు ఇస్తానని చెప్పి రూ.3 వేలు ఇచ్చిందని విమర్శించారు. టీఆర్ఎస్ తులం బంగారం, రూ.30 వేలు ఇస్తామని చెప్పి రూ. 3 వేలు ఇచ్చిందని అన్నారు. అలాంటి వీరిని పోలీసులు ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు.

వారివద్ద రూ.కోట్లలో డబ్బులు దొరికినా ఆ అభ్యర్థులను ఎందుకు డిస్ క్వాలిఫై చేయడంలేదని కేఏ పాల్ ప్రశ్నించారు. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల అభ్యర్థులను డిస్ క్వాలిఫై చేయాలని, ఆయా పార్టీల ఏజెంట్లను బయటకు పంపించాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. ఏది ఏమైనా ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఆ మార్పు ఈ నెల 6వ తేదీనే తెలుస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి బయటికి రావాలని కేఏ పాల్ పిలుపు ఇచ్చారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

HPV Vaccine India: దేశవ్యాప్తంగా ఉచిత హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రారంభం- తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
దేశవ్యాప్తంగా ఉచిత హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రారంభం- తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
PM Kisan Yojana: హోలీకి PM కిసాన్ యోజన 22వ విడత నిధులు వస్తాయా? తాజా అప్‌డేట్ ఏంటీ?
హోలీకి PM కిసాన్ యోజన 22వ విడత నిధులు వస్తాయా? తాజా అప్‌డేట్ ఏంటీ?
HPV Vaccine: రూ. 10 HPV వ్యాక్సిన్ ఉచితంగా నేటి నుంచి పంపిణీ! వ్యాక్సినేషన్‌కు 14 ఏళ్ల బాలికలకు అవసరమయ్యే పత్రాలివే! 
రూ. 10 HPV వ్యాక్సిన్ ఉచితంగా నేటి నుంచి పంపిణీ! వ్యాక్సినేషన్‌కు 14 ఏళ్ల బాలికలకు అవసరమయ్యే పత్రాలివే! 
KCR Petition: కాళేశ్వరం కేసులో సాక్షిగా పిలిచి దోషిగా తేల్చారు! జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ రద్దు చేయాలని కేసీఆర్ న్యాయపోరాటం!
కాళేశ్వరం కేసులో సాక్షిగా పిలిచి దోషిగా తేల్చారు! జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ రద్దు చేయాలని కేసీఆర్ న్యాయపోరాటం!

వీడియోలు

ABP Network Chief Editor Atideb Sarkar Speech | ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 ప్రారంభోపన్యాసం చేసిన అతిదేబ్ సర్కార్ | ABP Desam
ABP Network Ideas of India Summit 2026 Inaguration | ఏబీపీ నెట్ వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 సమ్మిట్ ప్రారంభం | ABP Desam
Kavitha about Delhi Liquor Scam Case | లిక్కర్ స్కాం కేసులో కవితకు క్లీన్ చిట్
India vs Zimbabwe Highlights T20 World Cup | జింబాబ్వేను 72 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా
Rinku Singh Father Passes Away | రింకూ సింగ్ తండ్రి కన్నుమూత

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BR Naidu Deepfake Videos: టీటీడీ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు డీప్ ఫేక్ వీడియోలు.. సైబర్ క్రైమ్‌కు బీఆర్ నాయుడు ఫిర్యాదు
టీటీడీ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు డీప్ ఫేక్ వీడియోలు.. సైబర్ క్రైమ్‌కు బీఆర్ నాయుడు ఫిర్యాదు
Kakinada Fireworks Explosion: వేట్లపాలెంలో ప్రమాద తీవ్రత ఎందుకు పెరిగింది ? భారీ ప్రాణ నష్టానికి కారణం ఇదే!
వేట్లపాలెంలో ప్రమాద తీవ్రత ఎందుకు పెరిగింది ? భారీ ప్రాణ నష్టానికి కారణం ఇదే!
1st March Rules Change: ట్రైన్ టికెట్ బుకింగ్ నుంచి LPG సిలిండర్ వరకు... మార్చి 1 నుంచి మారుతున్న రూల్స్
ట్రైన్ టికెట్ బుకింగ్ నుంచి LPG సిలిండర్ వరకు... మార్చి 1 నుంచి మారుతున్న రూల్స్
CM Revanth Reddy: మదీనా ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం చెక్ లు అందించిన సీఎం రేవంత్ రెడ్డి
మదీనా ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం చెక్ లు అందించిన సీఎం రేవంత్ రెడ్డి
Toxic Romantic Song : టాక్సిక్ ఫస్ట్ సాంగ్ రెడీ - యశ్, కియారా రొమాంటిక్ ట్రాక్ వచ్చేది ఎప్పుడంటే?
టాక్సిక్ ఫస్ట్ సాంగ్ రెడీ - యశ్, కియారా రొమాంటిక్ ట్రాక్ వచ్చేది ఎప్పుడంటే?
శ్రీలంకపై నెగ్గినా వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. సెమీఫైనల్స్‌కు న్యూజిలాండ్
శ్రీలంకపై నెగ్గినా వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. సెమీఫైనల్స్‌కు న్యూజిలాండ్
Israel Strike On Iran: ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
Chronic Pain : ఆరు నెలలకు మించి నొప్పి ఉంటే జాగ్రత్త.. ఇవే అత్యంత బాధాకరమైన వ్యాధులు
ఆరు నెలలకు మించి నొప్పి ఉంటే జాగ్రత్త.. ఇవే అత్యంత బాధాకరమైన వ్యాధులు
Embed widget