అన్వేషించండి

Khammam: 104 సేవలకు పల్లె దవాఖానాల ఎఫెక్ట్‌.. నిలిచిపోనున్న వాహనాలు

గ్రామాల్లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన 104 సేవలు నిలిచిపోనున్నాయి. పల్లె దవాఖానాలు ఏర్పాటునేపథ్యంలో 104 సేవలను నిలిపివేసేందుకు నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.

గ్రామాల్లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ఏర్పాటు చేసిన 104 సంచార వైద్య సేవలు నిలిచిపోనున్నాయి. మారుమూల ప్రాంతాల్లో వ్యాధులతో బాధపడుతు ఆసుపత్రులకు వెళ్లలేని వారికి సేవలందించేందుకు ప్రభుత్వం 104 వాహనాలను ఏర్పాటు చేసింది. ఈ వాహనంలో వైద్యుడితోపాటు ఏఎన్‌ఎం, ఫార్మాసిస్టు, ల్యాబ్‌ టెక్నిషియన్, మెడికల్‌ అసిస్టెంట్‌ విధులు నిర్వహించేవారు. గ్రామానికి ప్రతి 20 రోజులకోకసారి వెళ్లి వైద్య సేవలందించేందుకు 104 వాహనాలను వినియోగించారు. ఇటీవల నాన్‌ కమ్యూనికల్‌ డిసీజెస్‌ (ఎన్‌సీడీ) ప్రోగ్రాం ద్వారా ఇంటింటికి తిరిగి బీపీ, షుగర్‌ తదితర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు మందులు ఇస్తున్నారు. అయితే పల్లె దవాఖానాలు ఏర్పాటు చేసి మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే 104 వాహనాలను తీసివేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో 104 సేవలను నిలిపివేసేందుకు నిర్ణయం తీసుకున్నారు.
నిధుల కొరతతో వాహనాలను నడపలేక..
గ్రామాలలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి సేవలందించేందుకు ఏర్పాటు చేసిన 104 వాహనాలు కొంత కాలంగా నిధులు కేటాయింపుల్లో నిర్లక్ష్యం కారణంగా నిలిచిపోతున్నాయి. ప్రతి 20 రోజులకు ప్రతి గ్రామంలోకి వెళ్లి వైద్య పరీక్షలు చేయాల్సి ఉనప్పటికీ నిధులు లేక పోవడంతో డీజీల్‌ భారం భరించలేక 104 వాహనాలు ఆగిపోతున్నాయి. దీంతోపాటు 104లో పనిచేస్తున్న సిబ్బందికి నాలుగు నెలలకోసారి వేతనాలు చెల్లిస్తున్నారు. దీని వల్లసిబ్బంది తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే ఇటీవల ప్రభుత్వం పల్లె దవాఖాలను ఏర్పాటు చేయాలని భావించిన నేపథ్యంలో వాహనాల అవసరం లేదని నిలిపివేస్తున్నట్లు తెలుస్తోంది. 
ఉద్యోగులకు ప్రత్యామ్నయ కేటాయింపులు..
ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 23 104 సర్వీసులు ఉండగా 155 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో 11 వాహనాలకు 86 మంది సిబ్బంది, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 12 వాహనాలకు 69 మంది విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం 104 వాహనాలను నిలిపివేయాలని భావించిన నేపథ్యంలో ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులకు సర్దుబాటు చేసేందుకు ప్రత్యేక అధికారిని నియమించారు. స్టేట్‌ హెల్త్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఆఫీసర్‌ తిరుపతయ్యను ఉద్యోగుల సర్దుబాటు కోసం నియమించింది. ఆయన నేతృత్వంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్యశాఖ అధికారులతో సమావేశమై ఉద్యోగుల వివరాలు సేకరించారు. దీంతోపాటు ప్రస్తుతం పనిచేస్తున్న వారిని ఎక్కడెక్కడ సర్దుబాటు చేయాలనే అంశంపై నివేదికలు తయారు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ 12 సంవత్సరాలపాటు గ్రామాలలో సేవలందించిన 104 వాహనాలు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కనుమరుగుకానున్నాయి. 

Also Read: AP Bank Loans : ఏపీ సర్కార్ బ్యాంకుల వద్ద తీసుకున్న అప్పు రూ.57,479 కోట్లు.. రాజ్యసభలో కేంద్రం ప్రకటన !

Also Read: AP Employees Division : ఏపీ ఉద్యోగసంఘాల మధ్య చీలిక.. ప్రభుత్వంపై నమ్మకం ఉందంటున్న కొన్ని సంఘాలు !

Also Read : కర్నూలులో వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్ .. 3 రాజధానుల బిల్లు వెనక్కి తీసుకున్నా ఏపీ సర్కార్ కీలక నిర్ణయం !

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

MP Mithun Reddy: లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
Chandrababu In Davos: దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
Telangana Cabinet Decisions: మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే
మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Mithun Reddy: లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
Chandrababu In Davos: దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
Telangana Cabinet Decisions: మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే
మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే
Revanth Reddy: హార్వర్డ్‌ విద్యార్థిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీలో లీడర్‌షిప్‌పై కోర్స్‌
హార్వర్డ్‌ విద్యార్థిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ప్రతిష్ఠాత్మక వర్సిటీలో లీడర్‌షిప్‌పై కోర్స్‌
Champion OTT : ఓటీటీలోకి 'ఛాంపియన్' వచ్చేస్తున్నాడు - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి 'ఛాంపియన్' వచ్చేస్తున్నాడు - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Railway Guidelines For Ghee : రైలులో నెయ్యి తీసుకెళ్లొచ్చా? భారతీయ రైల్వే నిబంధనలు ఇవే
రైలులో నెయ్యి తీసుకెళ్లొచ్చా? భారతీయ రైల్వే నిబంధనలు ఇవే
Embed widget