By: ABP Desam | Updated at : 31 Aug 2023 12:20 PM (IST)
Edited By: Pavan
వెలవెలబోతున్న శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలు, గోదావరి ప్రాజెక్టుల పరిస్థితీ అంతంతమాత్రమే
Water Crisis: ఈ సంవత్సరం నీటి సమస్యలు తప్పేలా లేవు. గతేడాది ఈ సమయానికి నిండుకుండలా ఉన్న రాష్ట్రంలోని జలాశయాలు ఇప్పుడు నీరు లేక వెలవెలబోతున్నాయి. కృష్ణా నదీ పరివాహక ప్రాజెక్టుల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఈ వర్షాకాలంలో సగటు వర్షాపాతం కూడా నమోదు కాకపోవడం, ఎగువ నుంచి కూడా ఆశించిన స్థాయిలో ప్రవాహం రాకపోవడంతో ప్రాజెక్టుల్లోకి నీరు చేరలేదు. వర్షాభావ పరిస్థితులు ఇలాగే కొనసాగితే.. సాగు నీటికి, తాగు నీటికి ఇబ్బందులు పడాల్సిందేనని అధికారులు చెబుతున్నారు. సెప్టెంబర్ లో కూడా వర్షాలు లేకపోతే.. ఇక సంవత్సరమంతా నీటికి ఇబ్బందిపడాల్సిందేనని ఆందోళన వ్యక్తం అవుతోంది.
ఎగువ ప్రాజెక్టులు నిండి కిందకు రావాలి
రాష్ట్రంలో వర్షాలు కురిసినా, కురవకపోయినా.. ఎగువన ప్రాంతాల్లో భారీ వర్షాలు పడితే కృష్ణా నది ఉరకలెత్తేది. కానీ మన దగ్గర వర్షాలు లేవు, పై ప్రాంతాల్లోనూ వానలు కురవలేదు. దీంతో ఇటు కృష్ణా, అటు గోదావరి పరివాహక ప్రాంతాల్లో గడ్డు పరిస్థితి నెలకొంది. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల్లో కూడా నీటి నిల్వలు ఎక్కువగా లేవు. దీంతో భారీ వర్షాలు కురిసినా.. ముందు ఆయా ప్రాంతాల్లోని జలాశయాలు నిండి, ఆ తర్వాతే రాష్ట్రానికి నీటి ప్రవాహం రావాల్సి ఉంది. ఇది జరిగేనా అని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. జూన్, జులై నెలల్లో వానలు పెద్దగా లేకపోయినా.. ఆగస్టు చివరి నాటికి ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు పుష్కలంగా ఉన్న రోజులు ఉన్నాయి. ప్రస్తుతం వర్షాకాలం ఆఖర్లో ఉన్నాం.. తర్వాత ఈశాన్య రుతుపవన కాలం ప్రారంభం అవుతుంది. ఈ ప్రభావం కొన్ని జిల్లాలపై మాత్రమే ఉంటుంది. సెప్టెంబర్ నెలలో ఆశించిన మేర వర్షాలు కురిస్తే కొంతలో కొంత పరిస్థితి మెరుగ్గా ఉంటుందని అంటున్నారు.
శ్రీశైలం నిండాలంటే..
శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో కలిపి ప్రస్తుతం 242 టీఎంసీలు మాత్రమే నీళ్లు ఉన్నాయి. గత సంవత్సరం ఇదే సమయానికి రెండు జలాశయాల్లో కలిపి మొత్తం 515 టీఎంసీలకు పైగా నీళ్లు ఉన్నాయి. ప్రస్తుతం మాత్రం అందులో సగం కూడా లేవు. డెడ్ స్టోరేజీ మినహా.. శ్రీశైలంలో 34.8 టీఎంసీలు, నాగార్జునసాగర్ లో 21.8 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. శ్రీశైలం ప్రాజెక్టుకు నీరు రావాలంటే.. ఆలమట్టి, నారాయణపూర్, జూరాల, తుంగభద్ర జలాశయాలు నిండాల్సి ఉంటుంది.
రాష్ట్రంలోని 21 జిల్లాల్లో అనేక మధ్య తరహా, చిన్న జలాశయాలు ఉన్నాయి. గతేడాది ఈ సమయానికి వాటిలో 300 టీఎంసీలకు పైగా నీటి నిల్వలు ఉన్నాయి. కానీ ప్రస్తుతం మాత్రం 165 టీఎంసీలే ఉన్నాయి. గోదావరి పరీవాహకంలో కూడా ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు చూడలేదు. ఆగస్టులో ఎప్పుడూ గోదావరికి భారీ వరదలు వచ్చేవి. కానీ ఈ సారి మాత్రం ప్రవాహం తక్కువగానే ఉంది.
భారీ, మధ్య తరహా ప్రాజెక్టుల కింద 70 లక్షలు, చిన్ననీటి పారుదల కింద 25 లక్షలు, నీటి అభివృద్ది సంస్థ పరిధిలో 8 లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టు ఉంది. ప్రస్తుతమున్న గడ్డు పరిస్థితిలో వాటి సాగు ప్రశ్నార్థకమైంది.
Telangana Elections: కేసీఆర్ పై ప్రజలు విశ్వాసం కోల్పోయారు, కాంగ్రెస్ కు 75కు పైగా సీట్లు: ప్రేమ్ సాగర్ రావు
Breaking News Live Telugu Updates: నారా లోకేశ్ కు హైకోర్టులో ఊరట - ఫైబర్ గ్రిడ్, స్కిల్డెవలప్మెంట్ కేసుల్లో బెయిల్కు ప్రయత్నాలు
Mother Dairy Issue : మదర్ డెయిరీపై ఆధిపత్యం కోసం ఎత్తలు - నల్లగొండ రాజకీయాల్లో హై టెన్షన్ !
Motkupalli Meets Shivakumar : డీకే శివకుమార్ను కలిసిన మోత్కుపల్లి - కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమయ్యారా?
KCR Fever : కేసీఆర్కు తగ్గని జ్వరం - కేబినెట్ మీటింగ్ వచ్చే వారం !
TDP News : అధికార మత్తు వదిలేలా మోత మోగిద్దాం - కొత్త ఆన్ లైన్ ప్రచార ఉద్యమాన్ని ప్రకటించిన టీడీపీ !
Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?
Honda SP 125 Sports Edition: రూ. లక్ష లోపే స్పోర్ట్స్ బైక్ లుక్ - హోండా ఎస్పీ125 స్పోర్ట్స్ ఎడిషన్ చూశారా?
YSR Vahana Mitra 2023: వాహన మిత్ర ద్వారా ఇచ్చిన డబ్బులు దేనికైనా వాడుకోండి, కానీ రెండూ మర్చిపోవద్దు: సీఎం జగన్
/body>