అన్వేషించండి

Modi Charishma: ఏమాత్రం తగ్గని మోదీ ఛరిష్మా, ప్రతి 10 మందిలో 8 మంది ఆయన వైపే - తేల్చి చెప్పిన రీసెర్చ్

Modi Charishma: మోదీ ఛరిష్మా ఏమాత్రం తగ్గలేదని మరో సర్వే తేల్చి చెప్పింది. ప్యూ రీసెర్చ్ ఈ మేరకు వెల్లడించింది.

Modi Charishma: భారతీయుల్లో మోదీ పట్ల వైఖరి ఏమాత్రం చెక్కుచెదరలేదని, అది మరింతగా బలపడినట్లు తాజా అధ్యయనాలు వెల్లడించాయి. తాజాగా వెలువడిన ప్యూ రీసెర్చ్ కూడా ఇదే గుర్తించింది. ప్రతి 10 మంది భారతీయుల్లో 8 మంది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పట్ల సానుకూల దృక్పథాన్ని కలిగి ఉన్నట్లు ప్యూ రీసెర్చ్ తేల్చింది. 55 శాతం మంది మరింత ఎక్కువ అనుకూలమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు వెల్లడించింది. అమెరికాకు చెందిన థింక్ ట్యాంక్ ప్యూ రీసెర్చ్ సెంటర్ బుధవారం తన సర్వే నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇతర నేతలతో పోలిస్తే చాలా ముందంజలో ఉన్నట్లు నిర్ధారించింది. 2024 లోనూ మోదీయే ప్రధాని పదవి చేపట్టే అవకాశాలు గణనీయంగా ఉన్నట్లు చెప్పుకొచ్చింది. 

సర్వే ప్రకారం, 10 మంది భారతీయుల్లో ఏడుగురు ఇటీవలి సంవత్సరాలల్లో ప్రపంచంలో భారతదేశ ప్రభావం మరింత బలంగా పెరుగుతున్నట్లు చెప్పారు. మోదీ హయాంలో భారతదేశ భౌగోళిక రాజకీయ బలం పెరిగిందనే అభిప్రాయాన్ని రాజకీయ వర్గాల్లో అంచనా వేస్తున్నారు. దీనికి విరుద్ధంగా, 19 శాతం మంది భారతదేశం బలహీనంగా ఉందని, 13 శాతం మంది దాని ప్రభావం మారలేదని చెప్పారు. 

10 మంది భారతీయుల్లో ఆరుగురు కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీని సానుకూల దృక్పథంతో చూశారని సర్వే వెల్లడించింది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్.. బీజేపీకి ప్రత్యామ్నాయంగా చూస్తున్నట్లు సర్వేలో తేలింది. సర్వే చేసిన వారిలో దాదాపు 34 శాతం మంది రాహుల్ గాంధీ పట్ల ప్రతికూల అభిప్రాయాన్ని కలిగి ఉన్నట్లు వెల్లడైంది. 46 శాతం మంది పెద్దలు భారతదేశం పట్ల అనుకూలమైన అభిప్రాయాన్ని కలిగి ఉన్నారని సర్వే ఫలితాలు వెల్లడించాయి. అయితే 34 శాతం మంది మధ్యస్థులు ప్రతికూల అభిప్రాయాలను కలిగి ఉన్నారు. 

Also Read: Blue Moon: ఆకాశంలో అరుదైన ఘటన, సూపర్ బ్లూ మూన్‌గా చందమామ

ఢిల్లీలో జరగనున్న G20 సమ్మిట్ కు ముందు ఈ సర్వే ఫలితాలు వచ్చాయి. ఢిల్లీలో సెప్టెంబర్ 9-10 వ తేదీల్లో G 20 సదస్సు (G 20 Summit) జరగనుంది. మోదీ సర్కార్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈ సదస్సుని పకడ్బందీగా నిర్వహించేందుకు ప్లాన్ చేసుకుంది. పలు దేశాల అధినేతలతో పాటు అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. అందుకే...భద్రతను కట్టుదిట్టం చేశారు. మూడు రోజుల పాటు ఢిల్లీలో లాక్‌డౌన్ విధించనున్నారు. ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపం కన్వెన్షన్ సెంటర్‌లో జరగనుందీ ఈ సమ్మిట్. ఈ రెండు, మూడు రోజుల పాటు ఎలాంటి ట్రాఫిక్‌ సమస్య కలగకుండా పూర్తిగా లాక్‌డౌన్ పెట్టారు. అంతే కాదు. పోలీసులు పలు చోట్ల తనిఖీలు చేపడుతున్నారు. ఆ రెండు రోజుల పాటు వ్యాపారాలూ బంద్ చేయాల్సిందేనని ప్రభుత్వం ఆదేశించింది. ఈ సమావేశానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్‌ హాజరు కానున్నారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కీ భారత్ ఆహ్వానం పంపినప్పటికీ ఆయన రావడం లేదని తెలుస్తోంది. ఢిల్లీ, NCR ప్రాంతాల్లోని హోటల్స్‌లో రూమ్స్ బుకింగ్స్‌తో బిజీగా ఉన్నాయి. ITC Maurya, తాజ్ ప్యాలెస్, ది ఇంపీరియల్ సహా పలు ఫైవ్ స్టార్ హోటళ్లలోని రూమ్స్ బుకింగ్స్ పూర్తయ్యాయి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
Raja Saab Ticket Price: ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం

వీడియోలు

Keslapur Nagoba Mesram Padayatra | హస్తలమడుగులో గంగమ్మకు మెస్రం వంశీయుల పూజలు | ABP Desam
Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్
Shreyas Iyer Vijay Hazare Trophy | శ్రేయాస్ అయ్య‌ర్‌ రీఎంట్రీ సూపర్
Nita Ambani Prize Money to Blind Cricketers | వరల్డ్ కప్ విజేతలకు అంబానీ భారీ గిఫ్ట్
Shubman Gill Vijay Hazare Trophy | దేశవాళీ టోర్నీలో గిల్ వైఫల్యం!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
Raja Saab Ticket Price: ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Avakai Amaravati Festival : పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని
పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని "అవకాయ్ -అమరావతి సంబరాలు", పాసులు ఎలా తీసుకోవాలి అంటే?
Jana Nayagan:విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' విడుదల వాయిదా! అభిమానులకు షాక్ ఇచ్చిన నిర్మాణ సంస్థ!
విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' విడుదల వాయిదా! అభిమానులకు షాక్ ఇచ్చిన నిర్మాణ సంస్థ!
​​US Student Visa :భారతీయ విద్యార్థులను టెన్షన్‌ పెడుతున్న ట్రంప్‌! ఇప్పుడు ఏం జరిగిందంటే?
భారతీయ విద్యార్థులను టెన్షన్‌ పెడుతున్న ట్రంప్‌! ఇప్పుడు ఏం జరిగిందంటే?
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
Embed widget