అన్వేషించండి

Minister KTR : నేతన్నలపై కక్ష కట్టిన కేంద్రం, చేనేతపై పన్ను విధించిన తొలి ప్రధాని మోదీ- మంత్రి కేటీఆర్

Minister KTR : నేతన్నలపై కేంద్రం కక్షసాధిస్తుందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. చేనేత వస్త్రాలపై జీఎస్టీ విధించిందన్నారు.

Minister KTR : చేనేత వస్త్రాలపై పన్ను విధించిన తొలి ప్రధాని మోదీ అని మంత్రి కేటీఆర్ విమర్శించారు. మునుగోడు నియోజకవర్గంలోని నేతన్నలతో మంత్రి టెలికాన్ఫెరెన్స్ ద్వారా మాట్లాడారు. చేనేత, టెక్స్ టైల్ రంగానికి తీరని ద్రోహం చేస్తున్న బీజేపీకి మునుగోడు నేతన్నలు గట్టిగా బుద్ధి చెప్పాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. నేతన్నల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను వివరించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో నేతన్నలకు గుర్తింపు, గౌరవం లభించిందన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏడాదికి రూ.1200 కోట్ల భారీ నిధులను బడ్జెట్లో కేటాయిస్తూ వస్తున్నామని కేటీఆర్ తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా భారీగా యార్న్ సబ్సిడీ చేనేత మిత్ర పథకం ద్వారా అందిస్తున్నామని స్పష్టం చేశారు. నేతన్నకు చేయుత పొదుపు కార్యక్రమం ద్వారా చేనేత కార్మికుల పొదుపు మొత్తానికి రెట్టింపుగా ప్రభుత్వం అందిస్తున్నదని తెలిపారు. రైతు బీమా మాదిరే నేతన్నల కోసం ఐదు లక్షల బీమా సదుపాయాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. నారాయణపేటలో ఇంటిగ్రేటెడ్ చేనేత అభివృద్ధి కేంద్రంతోపాటు గద్వాలలో చేనేత పార్కును ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ నేతన్నలకు తెలిపారు. 

నేతన్నలపై కేంద్రం కక్ష 

టీఆర్ఎస్ ప్రభుత్వం నేతన్న కోసం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలుచేస్తుంటే కేంద్రం మాత్రం నేతన్నలపైన కక్ష కట్టిందని కేటీఆర్ ఆరోపించారు. దేశ చరిత్రలో ఏ ప్రధాని చేనేత వస్త్రాల పైన పన్ను వేయలేదని, కానీ బీజేపీ ప్రభుత్వం జీఎస్టీ విధించిందన్నారు. ప్రస్తుతమున్న ఐదు శాతం జీఎస్టీని 12 శాతానికి పెంచే కుట్రలు కూడా బీజేపీ చేస్తుందని కేటీఆర్ ఆరోపించారు. స్వదేశీ మంత్రంతో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ వ్యవసాయ రంగం తర్వాత అత్యంత ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న చేనేత రంగాన్ని పూర్తిగా సంక్షోభంలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. చేనేత పరిశ్రమ పూర్తిగా దివాళా తీసేలా కేంద్ర ప్రభుత్వ చర్యలు ఉన్నాయన్నారు. ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ బోర్డు, ఆల్ ఇండియా హ్యాండీక్రాఫ్ట్స్ బోర్డ్, చేనేతల పొదుపు పథకం, చేనేతలకు ఉన్న బీమా పథకం, చేనేతల హౌస్ కం వర్క్ షెడ్ వంటి కీలకమైన సంక్షేమ కార్యక్రమాలను రద్దుచేసి చేనేత పట్ల మోదీ ప్రభుత్వం కక్షతో వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. చేనేతలకు ఇచ్చే యార్న్ సబ్సిడీలను 40% నుంచి 15 శాతానికి తగ్గించి చేనేత వస్త్రాల ఉత్పత్తిపై కేంద్రం చావుదెబ్బ కొట్టిందన్నారు. 

బీజేపీకి బుద్ధి చెప్పాలి

తెలంగాణ ప్రభుత్వం చేనేతల కోసం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి కొంత సాయం అడిగితే ఇప్పటిదాకా మోదీ ప్రభుత్వం స్పందించలేదని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. నేషనల్ టెక్స్టైల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, హ్యాండ్లూమ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని కొరితే స్పందన లేదన్నారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ, బ్లాక్ లెవెల్ హ్యాండ్ లూమ్ క్లస్టర్ ఏర్పాటు వంటి విషయాల్లో  కేంద్ర ప్రభుత్వం నుంచి నిరాశనే ఎదురైందని కేటీఆర్ మండిపడ్డారు. అన్ని రంగాల్లో చేనేత కార్మికుల జీవితాలను చీకట్లలోకి తోస్తున్న మోదీ ప్రభుత్వానికి, బీజేపీకి మునుగోడు ఉపఎన్నిక ద్వారా గట్టిగా బుద్ధి చెప్పాలని కేటీఆర్ మునుగోడు నేతన్నలకు విజ్ఞప్తి చేశారు. మునుగోడు నియోజకవర్గ పరిధిలోని కొయ్యలగూడెం, పుట్టపాక, గట్టుపల్, చౌటుప్పల్, చండూరు, మునుగోడు, నారాయణపురం, లింగోటం వంటి కేంద్రాలలో ఉన్న నేతన్నల సంక్షేమం కోసం పనిచేస్తామని హామీ ఇచ్చారు.  

టాప్ హెడ్ లైన్స్

KTR Challenges Revanth Reddy: చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. అన్ని జలాశయాలు నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!
చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. మొత్తం నీటితో నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!
KTR News: కన్నెపల్లి పంప్‌హౌస్‌ పర్యటనకు కేటీఆర్‌.. లారీలు అడ్డుపెట్టిన పోలీసులతో బీఆర్ఎస్ నేతల వాగ్వాదం
కన్నెపల్లి పంప్‌హౌస్‌ పర్యటనకు కేటీఆర్‌.. లారీలు అడ్డుపెట్టిన పోలీసులతో బీఆర్ఎస్ నేతల వాగ్వాదం
MLC Shambhipur Raju: కేటీఆర్ కాన్వాయ్‌లో ప్రమాదం.. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుకు తీవ్ర గాయాలు.. కిమ్స్ ఆసుపత్రికి తరలింపు!
MLC Shambhipur Raju: కేటీఆర్ కాన్వాయ్‌లో ప్రమాదం.. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుకు తీవ్ర గాయాలు.. కిమ్స్ ఆసుపత్రికి తరలింపు!
Nalgonda Road Accident: హైదరాబాద్- విజయవాడ హైవేపై కారును ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు.. నలుగురు మృతి
హైదరాబాద్- విజయవాడ హైవేపై కారును ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు.. నలుగురు మృతి

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Fishermen Missing: విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
YouTuber Prashna Ravan: ఏపీ హైకోర్టును ఆశ్రయించిన ప్రశ్న రావణ్: ఒకే కేసుగా విచారించాలని, సీబీఐ దర్యాప్తు కోరుతూ పిటిషన్!
ఏపీ హైకోర్టును ఆశ్రయించిన ప్రశ్న రావణ్: ఒకే కేసుగా విచారించాలని, సీబీఐ దర్యాప్తు కోరుతూ పిటిషన్!
Prashna Ravan Arrest: నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
Parliament Monsoon Session 2026: జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
Sai Krishna Case: ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
CM Revanth Reddy Midjil Speech: మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
Rao Bahadur : నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
TRS Chief Kavitha: టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
Embed widget