అన్వేషించండి

Minister KTR : నేతన్నలపై కక్ష కట్టిన కేంద్రం, చేనేతపై పన్ను విధించిన తొలి ప్రధాని మోదీ- మంత్రి కేటీఆర్

Minister KTR : నేతన్నలపై కేంద్రం కక్షసాధిస్తుందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. చేనేత వస్త్రాలపై జీఎస్టీ విధించిందన్నారు.

Minister KTR : చేనేత వస్త్రాలపై పన్ను విధించిన తొలి ప్రధాని మోదీ అని మంత్రి కేటీఆర్ విమర్శించారు. మునుగోడు నియోజకవర్గంలోని నేతన్నలతో మంత్రి టెలికాన్ఫెరెన్స్ ద్వారా మాట్లాడారు. చేనేత, టెక్స్ టైల్ రంగానికి తీరని ద్రోహం చేస్తున్న బీజేపీకి మునుగోడు నేతన్నలు గట్టిగా బుద్ధి చెప్పాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. నేతన్నల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను వివరించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో నేతన్నలకు గుర్తింపు, గౌరవం లభించిందన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏడాదికి రూ.1200 కోట్ల భారీ నిధులను బడ్జెట్లో కేటాయిస్తూ వస్తున్నామని కేటీఆర్ తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా భారీగా యార్న్ సబ్సిడీ చేనేత మిత్ర పథకం ద్వారా అందిస్తున్నామని స్పష్టం చేశారు. నేతన్నకు చేయుత పొదుపు కార్యక్రమం ద్వారా చేనేత కార్మికుల పొదుపు మొత్తానికి రెట్టింపుగా ప్రభుత్వం అందిస్తున్నదని తెలిపారు. రైతు బీమా మాదిరే నేతన్నల కోసం ఐదు లక్షల బీమా సదుపాయాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. నారాయణపేటలో ఇంటిగ్రేటెడ్ చేనేత అభివృద్ధి కేంద్రంతోపాటు గద్వాలలో చేనేత పార్కును ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ నేతన్నలకు తెలిపారు. 

నేతన్నలపై కేంద్రం కక్ష 

టీఆర్ఎస్ ప్రభుత్వం నేతన్న కోసం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలుచేస్తుంటే కేంద్రం మాత్రం నేతన్నలపైన కక్ష కట్టిందని కేటీఆర్ ఆరోపించారు. దేశ చరిత్రలో ఏ ప్రధాని చేనేత వస్త్రాల పైన పన్ను వేయలేదని, కానీ బీజేపీ ప్రభుత్వం జీఎస్టీ విధించిందన్నారు. ప్రస్తుతమున్న ఐదు శాతం జీఎస్టీని 12 శాతానికి పెంచే కుట్రలు కూడా బీజేపీ చేస్తుందని కేటీఆర్ ఆరోపించారు. స్వదేశీ మంత్రంతో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ వ్యవసాయ రంగం తర్వాత అత్యంత ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న చేనేత రంగాన్ని పూర్తిగా సంక్షోభంలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. చేనేత పరిశ్రమ పూర్తిగా దివాళా తీసేలా కేంద్ర ప్రభుత్వ చర్యలు ఉన్నాయన్నారు. ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ బోర్డు, ఆల్ ఇండియా హ్యాండీక్రాఫ్ట్స్ బోర్డ్, చేనేతల పొదుపు పథకం, చేనేతలకు ఉన్న బీమా పథకం, చేనేతల హౌస్ కం వర్క్ షెడ్ వంటి కీలకమైన సంక్షేమ కార్యక్రమాలను రద్దుచేసి చేనేత పట్ల మోదీ ప్రభుత్వం కక్షతో వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. చేనేతలకు ఇచ్చే యార్న్ సబ్సిడీలను 40% నుంచి 15 శాతానికి తగ్గించి చేనేత వస్త్రాల ఉత్పత్తిపై కేంద్రం చావుదెబ్బ కొట్టిందన్నారు. 

బీజేపీకి బుద్ధి చెప్పాలి

తెలంగాణ ప్రభుత్వం చేనేతల కోసం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి కొంత సాయం అడిగితే ఇప్పటిదాకా మోదీ ప్రభుత్వం స్పందించలేదని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. నేషనల్ టెక్స్టైల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, హ్యాండ్లూమ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని కొరితే స్పందన లేదన్నారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ, బ్లాక్ లెవెల్ హ్యాండ్ లూమ్ క్లస్టర్ ఏర్పాటు వంటి విషయాల్లో  కేంద్ర ప్రభుత్వం నుంచి నిరాశనే ఎదురైందని కేటీఆర్ మండిపడ్డారు. అన్ని రంగాల్లో చేనేత కార్మికుల జీవితాలను చీకట్లలోకి తోస్తున్న మోదీ ప్రభుత్వానికి, బీజేపీకి మునుగోడు ఉపఎన్నిక ద్వారా గట్టిగా బుద్ధి చెప్పాలని కేటీఆర్ మునుగోడు నేతన్నలకు విజ్ఞప్తి చేశారు. మునుగోడు నియోజకవర్గ పరిధిలోని కొయ్యలగూడెం, పుట్టపాక, గట్టుపల్, చౌటుప్పల్, చండూరు, మునుగోడు, నారాయణపురం, లింగోటం వంటి కేంద్రాలలో ఉన్న నేతన్నల సంక్షేమం కోసం పనిచేస్తామని హామీ ఇచ్చారు.  

టాప్ హెడ్ లైన్స్

Inter Student Commits Suicide: నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య
నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య
Breaking News: లెక్చరర్ అవమానించారని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. గద్వాల జిల్లాలో ఘటన
లెక్చరర్ అవమానించారని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. గద్వాల జిల్లాలో ఘటన
Hyderabad Crime News: మియాపూర్‌లో మ్యాన్‌హోల్‌లో పడి వ్యక్తి గల్లంతు.. ఘటనాస్థలానికి వెళ్లిన ఎమ్మెల్యే గాంధీ
మియాపూర్‌లో మ్యాన్‌హోల్‌లో పడి వ్యక్తి గల్లంతు.. ఘటనాస్థలానికి వెళ్లిన ఎమ్మెల్యే గాంధీ
GHMC Indiramma Housing Scheme: KCR డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
GHMC Indiramma Housing Scheme: KCR డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
AP Legislative Council MLC Elections: కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
Jubilee Hills CI Suspension: ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
కొత్త టయోటా హైలక్స్‌ వచ్చేసింది.. 360 డిగ్రీ కెమెరా, 204hp డీజిల్‌ ఇంజిన్‌తో అదిరిపోయే పికప్‌
2026 టయోటా హైలక్స్‌ లాంచ్‌.. కొత్త లుక్‌, కొత్త ఫీచర్లతో మీ ఆదాయానికి మరింత ఊపు
Revanth Reddy HYDRA Comments: అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
AP Mee Mart: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న "మీ మార్ట్"- ఈ క్వార్టర్‌లోనే వెయ్యి స్టోర్‌లు ప్రారంభించనున్న ప్రభుత్వం!‌
Embed widget