అన్వేషించండి

Breaking News Telugu Live Updates: శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద, 10 గేట్లు ఎత్తివేత

Breaking News Telugu Live Updates: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం

Key Events
Munugode Bypolls AP Famer Padayatra AP and Telangana Breaking News Telugu Live Updates on 22 October 2022 Breaking News Telugu Live Updates: శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద, 10 గేట్లు ఎత్తివేత
ఏపీ, తెలంగాణ బ్రేకింగ్ న్యూస్

Background

రైతులు చేపట్టిన అమరావతి పాదయాత్రకు అడ్డంకులు సృష్టించడం సరికాదన్నారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. రాజ్యాంగ బద్ధంగా అనుమతి తీసుకుని వెళ్తున్న వారిని ఏవో కారణాలతో అడ్డుకోవడం సరికాదని, రైతుల పాదయాత్రపై ఏపీ హైకోర్టు ఇది వరకే తీర్పు ఇచ్చిందని గుర్తుచేశారు. అమరావతి పాదయాత్రతో పాటు 3 రాజధానుల అంశంపై సైతం లక్ష్మీనారాయణ స్పందించారు. కేవలం భవనాలు నిర్మిస్తే అభివృద్ధి జరిగినట్లు కాదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. 

అమరావతి పాదయాత్ర అంశం సుప్రీంకోర్టులో ఉంది. పైగా ఏపీ ప్రభుత్వమే అప్పీల్ కు వెళ్లిందని గుర్తు చేశారు. కానీ ప్రభుత్వం తీర్పుల కోసం ఎదురుచూడకుండా, నిర్ణయాలు తీసుకుంటూ అవరోధాలు కలిగించడం సబబు కాదన్నారు. విశాఖను రాజధాని చేయడం కాదు, ఐటీ క్యాపిటల్ గా డెవలప్ చేయాలని సూచించారు. ఐటీ కంపెనీలు విశాఖకు తరలివస్తే రాష్ట్ర యువతకు సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు వస్తాయన్నారు. మూడు ప్రాంతాలు, మూడు రాజధానుల గురించి మాట్లాడుతున్న ఏపీ ప్రభుత్వం విశాఖలో నాలుగు బిల్డింగ్ లు కడితే అభివృద్ధి జరిగినట్లేనా అని ప్రశ్నించారు. ప్రజలకు సరైన మౌలిక వసతులు కల్పించడం, ఉద్యోగాలు వచ్చేలా చేసినప్పుడే రాష్ట్రంలో ప్రగతి సాధించినట్లని, అన్ని జిల్లాలు డెవలప్ కావాలని ఆకాంక్షించారు.

తిరుమలలో‌ భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శనివారం శ్రీనివాసుడికి ప్రీతికరమైన రోజు కావడంతో సుప్రభాతం నువ్వుల గింజలతో ప్రసాదంను నివేదిస్తారు అర్చకులు. శుక్రవారం 21-10-2022 రోజున 62,203 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. ఇక స్వామి వారికి 29,100 మంది తలనీలాలు సమర్పించగా, 3.91 కోట్ల రూపాయలు హుండీ ద్వారా కానుకలుగా సమర్పించారు భక్తులు. అయితే సర్వదర్శనం భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 28 కంపార్ట్మెంట్లల్లో భక్తులు నిండి పోయారు. దీంతో స్వామి వారి సర్వదర్శనానికి దాదాపు 10 గంటలకు పైగా సమయం పడుతుంది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు రెండు గంటల సమయం పడుతుంది. 

ఉత్తర, దక్షిణ అండమాన్‌ సముద్రంలో ఏర్పడిన అల్పపీడం ఉత్తర, పశ్చిమ దిశలలో ప్రయాణించి తీవ్రరూపం దాల్చి వాయుగుండంగా మారింది. నేడు బంగాళాఖాతంలో వాయుగుండం తుపానుగా మారుతుందని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు. అయితే సిత్రాంగ్ తుపానుతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ఎలాంటి ముప్పు లేదని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. అక్టోబర్ 24 ఒడిశా తీరాన్ని చేరుకుని, అక్టోబర్ 25న పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్‌ల మధ్య సిత్రాంగ్ తుపాను తీరం దాటుతుందని అంచనా వేశారు. 

సిత్రాంగ్ తుపాను, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. వాయుగుండం తుపానుగా మారడంతో మరో మూడు రోజుల వరకు తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాలకు వర్ష సూచనతో ఎల్లో అలర్ట్ జారీ చేశాయి అమరావతి, హైదరాబాద్ వాతావరణ కేంద్రాలు. ఏపీకి సిత్రాంగ్ తుపాను ప్రమాదం తప్పింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, సిత్రాంగ్ తుఫానుకి ఎటువంటి సంబంధం ఉండదని, ఏపీ, తెలంగాణలో వర్షాలు మాత్రం ఉంటాయి. ఈశాన్య రుతుపవనాలు ఏపీలో నెల్లూరు జిల్లాలోకి ప్రవేశిస్తాయని చెప్పారు. 

నేడు సంగారెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట, కామారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. తూర్పు దిశ నుంచి గంటకు 6 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. 

సిత్రాంగ్ తుపాను ముప్పు తప్పినప్పటికీ, ఏపీపై కాస్త ప్రభావం చూపుతోంది. తుపాను ప్రభావంతో నేడు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో పలుచోట్ల వర్షాలున్నాయి. వర్ష సూచనతో మూడు రోజులవరకు ఎల్లో వార్నింగ్ జారీ చేసింది అమరావతి వాతావరణ కేంద్రం. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలున్నాయి.

గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమపై సిత్రాంగ్ ప్రభావం చాలా తక్కువగా ఉంది. అన్నమయ్య జిల్లాలోని పలుచోట్ల ముఖ్యంగా మదనపల్లి - పుంగనూరు బెల్ట్, చిత్తూరు జిల్లాలో అక్కడక్కడ, కడప జిల్లాలోని జమ్మలమడుగు పరిసరాల్లో వర్షాలు కురవనున్నాయి.

13:33 PM (IST)  •  22 Oct 2022

శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద, 10 గేట్లు ఎత్తివేత 

శ్రీశైల జలాశయానికి వరద ఉదృతి కొనసాగుతోంది. ఈ ఏడాదిలో ఆరవ సారి ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తి దిగువకు నాగార్జునసాగర్ కు వరదనీటిని రేడియల్ క్రస్ట్ గెట్ ద్వారా కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ నాగార్జునసాగర్ వైపు ఊరుకలేస్తుంది. ఎగువ పరీవాహక ప్రాంతాలైన జూరాల,సుంకేసుల నుంచి శ్రీశైలం జలాశయానికి ఇన్ ఫ్లోగా 2,52,501 క్యూసెక్కులు ఉండగా ఔట్ ఫ్లో 3,45,113 క్యూసెక్కులు వరదనీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అయితే శ్రీశైలం జలాశయం పూర్తిస్దాయి నీటిమట్టం 885.00 అడుగులు కాగా ప్రస్తుతం 884.70 అడుగులగా ఉంది. పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు, కాగా ప్రస్తుతం 213.8824 టీఎంసీలుగా ఉంది శ్రీశైలం కుడి ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి పూర్తిస్థాయిలో కొనసాగుతుంది.

12:33 PM (IST)  •  22 Oct 2022

గోవాలో 53వ ఇంటర్ నేషనల్ ఫిలిం ఫెస్టివల్

గోవా: వచ్చే నెల 20 నుండి 28 వరకు గోవాలో 53వ ఇంటర్ నేషనల్ ఫిలిం ఫెస్టివల్

రెండు తెలుగు సినిమాల ప్రదర్శన , ఆర్ ఆర్ ఆర్, అఖండ లకు గుర్తింపు 

ఫిలిం ఫెస్టివల్ తేదీలు, ప్రదర్శించే సినిమాల వివరాలు ప్రకటించిన ఇండియన్ పనోరమా

ఆసియాలో జరిగే అతిపెద్ద ఫిలం ఫెస్టివల్స్ లో ఒకటిగా ఇండియా ఇంటర్ నేషనల్ ఫిలిం ఫెస్టివల్ 

ఈ సారి 25 ఫీచర్ ఫిలిమ్స్, 20 నాన్ ఫీచర్ ఫిలిమ్స్ ప్రదర్శన

మెయిన్ స్ర్టీమ్ సినిమా సెక్షన్ లో ప్రదర్శించే ఐదు సినిమాల్లో రెండు తెలుగు సినిమాలకు చోటు 

ఆర్ ఆర్ ఆర్, అఖంఢ సినిమాల ప్రదర్శన

ఆర్ ఆర్ ఆర్, అఖంఢ లతో పాటు మెయిన్ స్ర్టీమ్ సినిమా సెక్షన్ లో కాశ్మీర్ ఫైల్స్ (హిందీ) టోనిక్ ( బెంగాలీ) ధర్మం వీర్ ముక్కడ్ పోస్ట్ థానే (మరాఠీ) ప్రదర్శన

ఫీచర్స్ ఫిలిమ్స్ విభాగంలో సినిమా బండి, కుదిరం బోసే తో పాటు ప్రదర్శన

Load More
New Update
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mallojula Venugopal Rao: మావోయిస్టు పార్టీకి ఎదురుదెబ్బ, అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ లొంగుబాటు
మావోయిస్టు పార్టీకి ఎదురుదెబ్బ, అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ లొంగుబాటు
Nidadavolu Junction: నిడదవోలు స్టేషన్ లో ఆ 3 రైళ్లను ఆపండి.. అధికారులకు ప్రయాణికుల డిమాండ్
నిడదవోలు స్టేషన్ లో ఆ 3 రైళ్లను ఆపండి.. అధికారులకు ప్రయాణికుల డిమాండ్
Chiru Bobby 2: చిరంజీవి సరసన 'ది రాజా సాబ్' హీరోయిన్... ఈసారి ఒక్కరు కాదు, ఇద్దరు!
చిరంజీవి సరసన 'ది రాజా సాబ్' హీరోయిన్... ఈసారి ఒక్కరు కాదు, ఇద్దరు!
New YouTubers Guide : కొత్తగా యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేస్తే.. ఇలా మానిటైజ్ చేసుకోండి, లేదంటే డబ్బులు రావు
కొత్తగా యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేస్తే.. ఇలా మానిటైజ్ చేసుకోండి, లేదంటే డబ్బులు రావు
Advertisement

వీడియోలు

Edge Of The Universe Explained : విశ్వానికి ఆది, అంతం తెలుసుకోవటం సాధ్యమేనా..? | ABP Desam
Eiffel Tower Demolition | ఈఫిల్ టవర్ కూల్చివేత | ABP Desam
Smriti Mandhana Records | India vs Australia | స్మృతి మంధానా ఫాస్టెస్ట్ రికార్డ్ | ABP Desam
India vs Australia ODI World Cup | నిరాశపరిచిన భారత్ | ABP Desam
India vs West Indies Test Match | పోరాడుతున్న విండీస్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mallojula Venugopal Rao: మావోయిస్టు పార్టీకి ఎదురుదెబ్బ, అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ లొంగుబాటు
మావోయిస్టు పార్టీకి ఎదురుదెబ్బ, అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ లొంగుబాటు
Nidadavolu Junction: నిడదవోలు స్టేషన్ లో ఆ 3 రైళ్లను ఆపండి.. అధికారులకు ప్రయాణికుల డిమాండ్
నిడదవోలు స్టేషన్ లో ఆ 3 రైళ్లను ఆపండి.. అధికారులకు ప్రయాణికుల డిమాండ్
Chiru Bobby 2: చిరంజీవి సరసన 'ది రాజా సాబ్' హీరోయిన్... ఈసారి ఒక్కరు కాదు, ఇద్దరు!
చిరంజీవి సరసన 'ది రాజా సాబ్' హీరోయిన్... ఈసారి ఒక్కరు కాదు, ఇద్దరు!
New YouTubers Guide : కొత్తగా యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేస్తే.. ఇలా మానిటైజ్ చేసుకోండి, లేదంటే డబ్బులు రావు
కొత్తగా యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేస్తే.. ఇలా మానిటైజ్ చేసుకోండి, లేదంటే డబ్బులు రావు
EPF Withdraw Rules: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్, ఇక 100 శాతం వరకు విత్‌డ్రాకు అవకాశం
పీఎఫ్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్, ఇక 100 శాతం వరకు విత్‌డ్రా
దేశంలోనే అత్యంత చవకైన 7 సీటర్‌ కారు ధర రూ.5.76 లక్షలకు తగ్గిందోచ్‌, మీకు ఏకంగా రూ.1.08 లక్షలు ఆదా
5-సీటర్‌ ధరకే 7-సీటర్‌ కారు, మీకు రూ.లక్షకు పైగా సేవ్‌ - ఈ దీపావళి మీదే
Telangana News: బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పు- సుప్రీంకోర్టును ఆశ్రయించిన తెలంగాణ ప్రభుత్వం
బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే- సుప్రీంకోర్టుకు వెళ్లిన తెలంగాణ ప్రభుత్వం.. నెక్ట్స్ ఏంటి?
Bunny Vas: తొక్కితే పడను... వెంట్రుక తీసి ఇచ్చిన బన్నీ వాసు... పెయిడ్ ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ కౌంటర్
తొక్కితే పడను... వెంట్రుక తీసి ఇచ్చిన బన్నీ వాసు... పెయిడ్ ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ కౌంటర్
Embed widget