అన్వేషించండి

Minister Niranjan Reddy : మునుగోడులో టీఆర్ఎస్ గెలుపు ఖాయం, రెండో స్థానం కోసం కాంగ్రెస్, బీజేపీ పోటీ- మంత్రి నిరంజన్ రెడ్డి

Minister Niranjan Reddy : మునుగోడు ఉపఎన్నిక బీజేపీ ప్రజలపై రుద్దిన ఉపఎన్నిక అని మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు.

Minister Niranjan Reddy : తెలంగాణ రాజకీయాల్లో మునుగోడు ప్రకంపనలు సృష్టిస్తోంది. కేంద్రంతో తెగతెంపులు చేసుకున్నాక తెలంగాణ టీఆర్ఎస్ ఆధిపత్యాన్ని నిలుపుకునేందుకు మునుగోడు ఉపఎన్నిక వేదికగా మారింది. మునుగోడులో గెలిచి టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదగాలని బీజేపీ విశ్వప్రయత్నం చేస్తుంది. కనీసం మునుగోడులోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని కాంగ్రెస్ తహతహలాడుతోంది. మూడు ప్రధాన పార్టీలు గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఇక నేతల మధ్య మాటల యుద్ధం హద్దులు దాటుతోంది.  

ప్రజలపై రుద్దిన ఎన్నిక 

మునుగోడు ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం తథ్యం అంటున్నారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. రెండో స్థానం కోసమే కాంగ్రెస్‌, బీజేపీలు పోటీపడుతున్నాయని వ్యాఖ్యానించారు. మంగళవారం మర్రిగూడెం మండలం దేవర భీమనపల్లిలో మంత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.  బీజేపీ, కాంగ్రెస్ ఏ మొహం పెట్టుకుని ప్రజలను ఓట్లడుగుతాయని మండిపడ్డారు. మునుగోడు ఉపఎన్నిక బీజేపీ బలవంతంగా ప్రజల మీద రుద్దిన ఎన్నిక అని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతు బంధు, రైతు బీమా వంటి ఎన్నో సంక్షేమ పథకాలు అమలుచేస్తుందన్నారు. నల్గొండ జిల్లాను ఫ్లోరైడ్ బారి నుంచి ప్రజలకు విముక్తి కల్పించామన్నారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌,  కేసీఆర్ కిట్ లతో ఆడబిడ్డలకు అండగా నిలిచామన్నారు.  వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులకు ఆసరా పింఛన్‌లు అందజేస్తున్నామని మంత్రి నిరంజన్‌ రెడ్డి తెలిపారు.

విపక్షాలకు ఓట్లడిగే అర్హత లేదు 

మునుగోడులో సాగునీటి కోసం శివన్నగూడెం, క్రిష్ణ రాయినిపల్లి, లక్ష్మణపురం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల నిర్మిస్తున్నామని మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పారు. మునుగోడులో టీఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు. ప్రజల ఆశీస్సులు టీఆర్ఎస్ కు ఉన్నాయని మంత్రి తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి మిషన్ కాకతీయతో గ్రామాలకు నీళ్లు అందించామన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇలాంటి సంక్షేమ పథకాలు అమల్లో లేవన్నారు. విపక్షాలకు ప్రజలను ఓట్లడిగే అర్హత లేదన్నారు. 

సానుభూతి డ్రామాలు 
  
మునుగోడులో ప్రతిపక్షాల డ్రామాలు స్టార్ట్ అయ్యాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. సానుభూతి కోసం చేతికి పట్టీలు వేసుకుంటున్నారన్నారు. దుబ్బాక, హుజురాబాద్ లలో ఇలాగే జరిగిందన్నారు. ఇవాళ జ్వరం, రేపు దాడులు అంటూ ఏడుపులు డ్రామాలు చేస్తారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ నాయకత్వంలో ఫ్లోరెడ్  సమస్యను పూర్తిగా పరిష్కరించామన్నారు.  మునుగోడు ప్రజలు సానుభూతి డ్రామాలను నమ్మొద్దన్నారు. డ్రామాలను నమ్మితే నష్టపోయేది మునుగోడు ప్రజలే అన్నారు.  జనరల్ ఎన్నికల లోపు అభివృద్ధిలో మార్పు కనిపించకపోతే ప్రజలు అప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా స్వీకరిస్తామన్నారు. వాళ్లంతట వాళ్లే దాడులు చేయించుకొని ఏడుస్తారని ఆరోపించారు. 

 ఇక మూడు రోజులే 

"ఒకవైపు రాజగోపాల్ రెడ్డికి జ్వరం, మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి ఏడుపు. మునుగోడులో టీఆర్ఎస్ స్పష్టమైన మెజారిటీతో గెలుస్తోంది. ప్రతిపక్ష ఎమ్మెల్యే మునుగోడులో ఉన్నా ప్రభుత్వ పథకాలు అన్ని అందినాయి. మునుగోడులో ఉన్నది కూడా తెలంగాణ సమాజమే. బీజేపీకి మిగిలింది ఇక మూడు రోజులే..కాబట్టి సెంటిమెంట్ రగిలించడానికి అనేక డ్రామాలు ప్రయత్నాలు. రాజకీయ పార్టీగా ప్రతి ఎన్నికను ఛాలెంజ్ గా తీసుకుంటాం. మేం కాంట్రాక్టర్ల కోసం రాజకీయం చేసే వాళ్లం కాదు. కుట్రలు, కుతంత్రాలు మాకు అవసరం లేదు." -మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ 

 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: మదీనా ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం చెక్ లు అందించిన సీఎం రేవంత్ రెడ్డి
మదీనా ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం చెక్ లు అందించిన సీఎం రేవంత్ రెడ్డి
Kokapet Swarupananda Lands: కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
HPV Vaccine India: దేశవ్యాప్తంగా ఉచిత హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రారంభం- తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
దేశవ్యాప్తంగా ఉచిత హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రారంభం- తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
Vikarabad Crime News: 'నాన్న లేకపోతే ఇన్ని సమస్యలా?' అని లెటర్ రాసి సూసైడ్ చేసుకున్న లేడీ కానిస్టేబుల్‌! 
'నాన్న లేకపోతే ఇన్ని సమస్యలా?' అని లెటర్ రాసి సూసైడ్ చేసుకున్న లేడీ కానిస్టేబుల్‌! 

వీడియోలు

ABP Network Chief Editor Atideb Sarkar Speech | ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 ప్రారంభోపన్యాసం చేసిన అతిదేబ్ సర్కార్ | ABP Desam
ABP Network Ideas of India Summit 2026 Inaguration | ఏబీపీ నెట్ వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 సమ్మిట్ ప్రారంభం | ABP Desam
Kavitha about Delhi Liquor Scam Case | లిక్కర్ స్కాం కేసులో కవితకు క్లీన్ చిట్
India vs Zimbabwe Highlights T20 World Cup | జింబాబ్వేను 72 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా
Rinku Singh Father Passes Away | రింకూ సింగ్ తండ్రి కన్నుమూత

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
శ్రీలంకపై నెగ్గినా వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. సెమీఫైనల్స్‌కు న్యూజిలాండ్
శ్రీలంకపై నెగ్గినా వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. సెమీఫైనల్స్‌కు న్యూజిలాండ్
Israel Strike On Iran: ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
PM Modi On Kakinada Incident: సామర్లకోట ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
సామర్లకోట బాణసంచా ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
Kokapet Swarupananda Lands: కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
Nara Lokesh : సంజయ్ దత్‌తో నారా లోకేశ్ మీటింగ్ - మంత్రి విజన్‌కు బాలీవుడ్ లెజెండ్ ఫిదా
సంజయ్ దత్‌తో నారా లోకేశ్ మీటింగ్ - మంత్రి విజన్‌కు బాలీవుడ్ లెజెండ్ ఫిదా
TTD budget: వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
Ananya Nagalla: తాతయ్యగుంట గంగమ్మ గుడిలో అనన్య నాగళ్ళ... 'పుష్ప 2'లో గంగమ్మ జాతర ఫైట్, టీటీడీ చొరవతో!
తాతయ్యగుంట గంగమ్మ గుడిలో అనన్య నాగళ్ళ... 'పుష్ప 2'లో గంగమ్మ జాతర ఫైట్, టీటీడీ చొరవతో!
Pakistan vs Sri Lanka: టీ20 వరల్డ్ కప్‌లో కోహ్లీ రికార్డు బద్ధలుకొట్టిన పాక్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్
టీ20 వరల్డ్ కప్‌లో కోహ్లీ రికార్డు బద్ధలుకొట్టిన పాక్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్
Embed widget