అన్వేషించండి

Mulugu News : డ్రైవర్ కు గుండెపోటు, పొదల్లోకి దూసుకెళ్లిన భవానీ భక్తుల బస్సు

Mulugu News : ములుగు జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్ కు గుండెపోటు రావడంతో బస్సు రోడ్డు పక్కనున్న పొదల్లోకి దూసుకెళ్లింది.

 Mulugu News : ములుగు జిల్లాలో  ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. కాణిపాకం నుండి తీర్థయాత్రలు చేస్తూ యాదగిరిగుట్ట వెళ్తోన్న భవానీ దీక్షదారుల బస్సుకు రోడ్డు ప్రమాదం తప్పింది.   ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని అంకన్నగూడెం వద్ద బస్సు అదుపుతప్పింది. ఏపీ చిత్తూరుకు చెందిన 45 మంది భవానీ మాలలు ధరించిన భక్తులు కుటుంబ సభ్యులతో కలిసి తీర్థ యాత్రలు చేస్తూ భద్రాచలం దర్శనం చేసుకొని వెంకటాపురం మీదుగా యాదగిరిగుట్ట వెళ్తున్నారు. వీరు ప్రయాణిస్తున్న బస్సు అంకన్నగూడెం వద్దకు రాగానే డ్రైవర్ కు సడన్ గా హార్ట్ స్ట్రోక్ రావడంతో అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న తుప్పల్లోకి దూసుకెళ్లింది. స్థానికులు 108కు సమాచారం ఇవ్వగా డ్రైవర్ ను వెంకటాపురం ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. అప్పటికే డ్రైవర్ చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. 

Mulugu News : డ్రైవర్ కు గుండెపోటు, పొదల్లోకి దూసుకెళ్లిన భవానీ భక్తుల బస్సు

అసలేం జరిగింది? 

ములుగు జిల్లా వెంకటాపురం  తీర్థయాత్రలకు వెళ్తున్న ప్రైవేటు టూరిస్ట్ బస్సు డ్రైవర్ కు గుండెపోటు రావడంతో బస్సు రోడ్డు పక్కకు నిలిపివేశాడు. 45 మందితో వెళ్తున్న టూరిస్టు బస్సు డ్రైవర్ కు గుండె నొప్పితో ఒక్కసారిగా అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అయినా కూడా ప్రయాణికులను కాపాడేందుకు బస్సును రోడ్డు పక్కన నిలిపి వారి ప్రాణాలను కాపాడాడు. డ్రైవర్ ను ఆస్పత్రికి తరలించే క్రమంలోనే అతడు మృతి చెందాడు. ఈ సంఘటన ములుగు జిల్లా వెంకటాపురం మండలం అంకన్నగూడెం - వీరభద్రవరం మధ్య శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు... ఏపీలోని చిత్తూరు జిల్లాకు చెందిన 45 మంది భవానీ మాలదారణ భక్తులను తీసుకొని ప్రైవేటు టూరిస్టు బస్సులో డ్రైవర్ తెలంగాణలోని భద్రాద్రికి వచ్చారు. అక్కడి నుంచి బయలుదేరి వెంకటాపురం మండలం మీదుగా యాదాద్రి లక్ష్మీనర్సింహ స్వామి దర్శనం కోసం బయలుదేరారు. ఈ క్రమంలో అంకన్నగూడెం- వీరభద్రవరం గ్రామాల మధ్య డ్రైవర్ కు గుండెపోటు వచ్చింది. బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కకు వెళ్తుండగా ప్రాణపాయ స్థితిలో ఉన్న డ్రైవర్ ప్రమాదం జరుగకుండా బ్రేకులు వేసి నిలిపివేశాడు. వెంటనే డ్రైవర్ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ప్రయాణికులు గమనించి 108కు సమాచారం ఇవ్వగా వెంటనే వెంకటాపురం ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి అప్పటికే అతడు మృతిచెందినట్లు నిర్ధారించారు. గుండె నొప్పితో తీవ్రంగా బాధపడుతూ కూడా 45 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడి తాను మృత్యు ఒడికి వెళ్లిన డ్రైవర్ కు ప్రయాణికులు చేతులెత్తి దండం పెట్టి విలపించారు. డ్రైవర్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వెంకటాపురం పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. 

స్విగ్గీ ఏజెంట్ ను కారుతో ఢీకొట్టి 

ఢిల్లీలోని కంజావాలా హిట్ అండ్ రన్ కేస్ ఇప్పటికే సంచలనం సృష్టిస్తోంది. ఇప్పుడు అలాంటి ఘటనే మరోటి వెలుగులోకి వచ్చింది. నోయిడాలో ఓ కార్‌ టూవీలర్‌ను ఢీకొట్టింది. బైక్ నడుపుతున్న స్విగ్గీ ఏజెంట్ ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఢీకొట్టిన తరవాత దాదాపు 500 మీటర్ల వరకూ కార్‌..బైక్‌ని లాక్కెళ్లిందని పోలీసులు వెల్లడించారు. "స్విగ్గీ ఏజెంట్ కౌశల్...ఫుడ్ డెలివరీ కోసం బయటకు వచ్చాడు. నోయిడా సెక్టార్ 14 వద్ద ఓ కార్ వేగంగా వచ్చి ఢీకొట్టింది" అని వివరించారు. ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాల ప్రకారం...బైక్..కార్‌కు చిక్కుకుంది. కొంత దూరం వరకూ కార్ డ్రైవర్ అలానే ముందుకు వెళ్లాడు. కార్‌లో బాధితుడు చిక్కుకున్నాడు. కాసేపయ్యాక ఉన్నట్టుండి కింద పడిపోయాడు. అప్పుడు కానీ డ్రైవర్ కార్‌ ఆపలేదు. అప్పటికే కౌశల్ మృతి చెందాడు. మృతుని వయసు 24 ఏళ్లు అని పోలీసులు నిర్ధరించారు. అర్ధరాత్రి 1 గంటకు కౌశల్‌కు తన సోదరుడు కాల్ చేశాడు. అప్పటికే కౌశల్ ప్రాణాలు కోల్పోయాడు. యాక్సిడెంట్‌ స్పాట్‌లో ఉన్న ఓ వ్యక్తి కాల్ అటెండ్ చేసి ప్రమాదం గురించి చెప్పాడు. కాసేపటికి పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. "యాక్సిడెంట్ స్పాట్‌ పరిసరాల్లో ఉన్న అన్ని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నాం. నిందితుడిని పట్టుకుంటాం" అని పోలీసులు వెల్లడించారు. 

టాప్ హెడ్ లైన్స్

KTR Revanth Globarena: గ్లోబరీనా వివాదం - రేవంత్‌కు కేటీఆర్ లీగల్ నోటీసు.. తీవ్ర వ్యాఖ్యలు!
గ్లోబరీనా వివాదం - రేవంత్‌కు కేటీఆర్ లీగల్ నోటీసు.. తీవ్ర వ్యాఖ్యలు!
Bellampally MJP School Food Poisoning: బెల్లంపల్లి బీసీ గురుకులంలో మళ్లీ ఫుడ్ పాయిజన్ - 30 మంది బాలికలకు తీవ్ర అస్వస్థత.. తల్లిదండ్రుల ఆందోళన!
బెల్లంపల్లి బీసీ గురుకులంలో మళ్లీ ఫుడ్ పాయిజన్ - 30 మంది బాలికలకు తీవ్ర అస్వస్థత.. తల్లిదండ్రుల ఆందోళన!
Tech Mahindra Employee Protest: 3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
Breaking News: హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ 
హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ 

వీడియోలు

Ravichandran Ashwin Criticizes Gambhir | గంభీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Varshini Gowda Biography & Remuneration | వర్షిణి గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Vaibhav Ready For Zimbabwe T20 Series | జింబాబ్వే సిరీస్‌కు ముందు వైభవ్ కామెంట్స్
Sachin Tendulkar’s Advice to Harbhajan Singh | తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన హర్భజన్
Gundenininda Gudigantalu Serial July 23 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Gandhi Delhi NEET Protest: ఢిల్లీలో నీట్ మంటలు - గాంధీ స్మృతి వైపు రాహుల్ గాంధీ, విపక్ష ఎంపీల మార్చ్.. బారికేడ్లతో నిలిపివేత!
ఢిల్లీలో నీట్ మంటలు - గాంధీ స్మృతి వైపు రాహుల్ గాంధీ, విపక్ష ఎంపీల మార్చ్.. బారికేడ్లతో నిలిపివేత!
IND vs ZIM 1st T20 Result Update: శ్రేయస్ కెప్టెన్సీలో తొలి విజయం! .. జింబాబ్వేపై ఇండియా గ్రాండ్ విక్టరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీ
శ్రేయస్ కెప్టెన్సీలో తొలి విజయం! .. జింబాబ్వేపై ఇండియా గ్రాండ్ విక్టరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీ
Minster Lokesh: అమ్మపై ప్రేమను చాటే అద్భుత అవకాశం.. చిన్నారుల కోసం మంత్రి నారా లోకేశ్ వినూత్న కాంటెస్ట్
అమ్మపై ప్రేమను చాటే అద్భుత అవకాశం.. చిన్నారుల కోసం మంత్రి నారా లోకేశ్ వినూత్న కాంటెస్ట్
Vallabhaneni Vamsi Letter to CM Chandrababu: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
Tech Mahindra Employee Protest: 3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
Land Dispute Selfie Suicide Attempt: కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
Junk Food Ban in Schools: స్కూల్ పరిసరాల్లో జంక్‌ఫుడ్ బ్యాన్- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ICMR విప్లవాత్మక ప్రతిపాదనలు 
స్కూల్ పరిసరాల్లో జంక్‌ఫుడ్ బ్యాన్- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ICMR విప్లవాత్మక ప్రతిపాదనలు 
Shivani Nagaram: శారీలో శివానీ నాగారం... సముద్ర తీరంలో అందాల భామ హొయలు
శారీలో శివానీ నాగారం... సముద్ర తీరంలో అందాల భామ హొయలు
Embed widget