News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Bandi Sanjay: కేసీఆర్ యాదాద్రి వద్ద తేల్చుకుందాం రా.. అది నిరూపిస్తే దేనికైనా సిద్ధం

సీఎం కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కామెంట్స్ చేశారు. టీఆర్ఎస్ వల్లే దళిత బంధు ఆగిందని నిరూపించేందుకు తాను సిద్దమని సవాల్ విసిరారు.

FOLLOW US: 
Share:

దళిత బంధు ఆపడానికి బీజేపీ కారణమని నిరూపిస్తే దేనికైనా సిద్ధమని బండి సంజయ్ అన్నారు. లేనిపక్షంలో సీఎం పదవికి రాజీనామా చేస్తారా? అని సవాల్ విసిరారు. టీఆర్ఎస్ వల్లే దళిత బంధు ఆగిందని నిరూపించేందుకు నేను సిద్ధమని సవాల్ విసిరారు. టీఆర్ఎస్ ఓడిపోతుందని తెలిసి కేసీఆర్ దొంగ నాటకాలకు తెరలేపాడని ఆరోపించారు. హుజూరాబాద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బండి సంజయ్ కుమార్ జమ్మికుంట రూరల్ గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. తొలుత అంకుషాపూర్, మడిపెల్లి గ్రామాల్లో  ప్రజలను ఉద్దేశించి బండి సంజయ్ మాట్లాడారు.

బండి సంజయ్ ఇంకా ఏమన్నారంటే..

హుజూరాబాద్ లో టీఆర్ఎస్ ఓడిపోతుందని తెలిసే కేసీఆర్ కొత్త డ్రామాలకు తెరదీశారు. ఎన్నికల తరువాత కేసీఆరే తన మనుషులతో కోర్టులో కేసు వేయించి దళిత బంధు డబ్బులు దళితులకు అందకుండా చేస్తాడు. బీజేపీని గెలిపిస్తే కేసీఆర్ మెడలు వంచి దళితులందరికీ రూ.10 లక్షల సాయం అందేలా పోరాడుతుంది.  

ఈ రోజు అంకుషాపూర్ గడ్డ నుండి ఒక మహానుభావుడికి యావత్ భారత్ తోపాటు నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే నేడు మహత్తరమైన రోజు. ప్రపంచ చరిత్రలోనే గ్రేట్ డే. ప్రపంచంలోనే ఎక్కడా లేనివిధంగా 100 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఉచితంగా అందించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీగారు దేశాన్ని కాపాడిన రోజు ఇది. 

కరోనాతో రాష్ట్రం అల్లాడుతుంటే మన ముఖ్యమంత్రి మాత్రం ఫాంహౌజ్ లో పండుకుని పారాసిట్మాల్ వేసుకుంటే సరిపోతుందన్నడు. ఆయనకు కరోనా వస్తే కార్పొరేట్ ఆసుపత్రికి పోయి చికిత్స చేయించుకుండు. ఆరోగ్య శ్రీకి డబ్బులివ్వలేదు. కేంద్ర పథకం ఆయుష్మాన్ భారత్ ను అమలు చేయలేదు. జనం చస్తున్నా పట్టించుకోలే. చివరకు మరణాలను కూడా దాచిర్రు. శవాలను మాయం చేసిర్రు. హుజూరాబాద్ ఎలక్షన్ రాంగనే మెల్లగా బయటకొచ్చి దళితవాడ తిరుగుడు స్టార్ట్ చేసిండు. 

హుజూరాబాద్ లో బీజేపీ గెలుపు ఖాయమని సీఎం కేసీఆర్ కూడా అర్థమై పోయింది. అందుకే సోయి తప్పి ఏం చేస్తుండో ఆయనకే అర్ధమైతలేదు. ఓడిపోతామనే భయంతో ‘దళిత బంధు’ ప్రకటించిండు. మేం ఆహ్వానించినం. రాష్ట్రమంతా ఇవ్వాలన్నం.  హైదరాబాద్ లో భూములమ్మి వచ్చిన సొమ్ముతో హుజూరాబాద్ లో దళిత బంధు ఇస్తమని ఆశ చూపిండు. అన్ని సర్వేల్లో టీఆర్ఎస్ ఓడిపోతుందని తేలిపోవడంతో దళితులకు డబ్బులెందుకు ఇయ్యాలని చెప్పి అకౌంట్లు ఫ్రీజ్ చేయించిండు.

ఇప్పుడు మళ్లీ కొత్త డ్రామా మొదలు పెట్టిండు. బీజేపీ లేఖ రాసినందువల్లే ఎలక్షన్ కమిషన్ దళిత బంధును ఆపేసిందని చెబుతుండు. అంతా అబద్దం. దళిత బంధు డబ్బులు పేదలకు ఇవ్వాల్సిందేనని మొదటి నుండి చెబుతోంది మేమే. నేను ప్రతిరోజు నా పాదయాత్రలో దళితులకు డబ్బులు రిలీజ్ చేయ్. ఫ్రీజ్ ఎందుకు చేసినవని నిలదీసిన. ఎలక్షన్ కమిషన్ కు కూడా డబ్బులు ఇవ్వాల్సిందేనని లేఖ రాసినం. రాజేందరన్న కూడా ప్రతిరోజు అకౌంట్లో డబ్బులెందుకు ఫ్రీజ్ చేసినవ్. వెంటనే ఇచ్చేయాలని డిమాండ్ చేస్తనే ఉన్నడు. 

ఈటల రాజేందర్ సహా ఎందరో తెలంగాణ కోసం ఉద్యమాలు చేసిండ్రు. ఎన్నో త్యాగాలు చేసిండు. కేసీఆర్, ఆయన కుటుంబం చేసిన త్యాగాలేందో చెప్పాలి. పేదోళ్లు త్యాగం చేస్తే కేసీఆర్ రాజ్యమేలుతుండు. కులాలు, మతాలు, వర్గాలు, సంఘాల పేరుతో పేదోళ్లను చీలుస్తుండు. కొట్లాట పెట్టిస్తుండు. అందుకే పేదోళ్లంతా ఒక్కటి కావాలి. కేసీఆర్ కు బుద్ది చెప్పాలి. ఈటల రాజేందర్ కు ఓటు వేయాలి.

Also Read: ఏపీలో కాకరేపుతున్న పట్టాభిరామ్ కామెంట్స్ .. టీడీపీ ఆఫీసులు, నేతల ఇళ్లపై వైసీపీ శ్రేణుల దాడులు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

 

Published at : 20 Oct 2021 01:57 PM (IST) Tags: etela rajendar huzurabad bypoll cm kcr Bandi Sanjay band sanjay on cm kcr

ఇవి కూడా చూడండి

Telangana Polling 2023 LIVE Updates:  తెలంగాణలో గెలిచేది ఎవరు.? నిలిచేది ఎవరు.? - ఏబీపీ సీ ఓటర్ సర్వే ఫలితాలు

Telangana Polling 2023 LIVE Updates: తెలంగాణలో గెలిచేది ఎవరు.? నిలిచేది ఎవరు.? - ఏబీపీ సీ ఓటర్ సర్వే ఫలితాలు

Telangana Assembly Election 2023: కన్ఫ్యూజన్ వద్దు వందశాతం గెలుపు BRS దే, కేటీఆర్ కామెంట్స్ వైరల్

Telangana Assembly Election 2023: కన్ఫ్యూజన్ వద్దు వందశాతం గెలుపు BRS దే, కేటీఆర్ కామెంట్స్ వైరల్

Telangana Exit Poll 2023 Highlights : ఏబీపీ సీఓటర్ ఎగ్జిట్ పోల్స్ - తెలంగాణలో కాంగ్రెస్‌కు అడ్వాంటేజ్ కానీ హంగ్‌కూ చాన్స్ !

Telangana Exit Poll 2023 Highlights :   ఏబీపీ  సీఓటర్ ఎగ్జిట్ పోల్స్ -  తెలంగాణలో కాంగ్రెస్‌కు అడ్వాంటేజ్ కానీ హంగ్‌కూ చాన్స్ !

Telangana Assembly Election 2023: సాయంత్రం 5 గంటలకు తెలంగాణ వ్యాప్తంగా 63.94 శాతం పోలింగ్, ముగిసిన పోలింగ్ సమయం

Telangana Assembly Election 2023: సాయంత్రం 5 గంటలకు తెలంగాణ వ్యాప్తంగా 63.94 శాతం పోలింగ్, ముగిసిన పోలింగ్ సమయం

Telangana Elections 2023: స్వల్ప ఉద్రిక్తతలతో ముగిసిన తెలంగాణ ఎన్నికలు, కొద్దిసేపట్లోనే ఎగ్జిట్ పోల్స్

Telangana Elections 2023: స్వల్ప ఉద్రిక్తతలతో ముగిసిన తెలంగాణ ఎన్నికలు, కొద్దిసేపట్లోనే ఎగ్జిట్ పోల్స్

టాప్ స్టోరీస్

Rajasthan Exit Poll 2023 Highlights:రాజస్థాన్‌లో కాంగ్రెస్‌కి షాక్ తప్పదు! ABP CVoter ఎగ్జిట్‌ పోల్‌ అంచనా

Rajasthan Exit Poll 2023 Highlights:రాజస్థాన్‌లో కాంగ్రెస్‌కి షాక్ తప్పదు! ABP CVoter ఎగ్జిట్‌ పోల్‌ అంచనా

Chattisgarh Exit Poll 2023 Highlights: ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ గెలవడం కష్టమేనా? ఆసక్తికరంగా ABP CVoter ఎగ్జిట్ పోల్ అంచనాలు

Chattisgarh Exit Poll 2023 Highlights: ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ గెలవడం కష్టమేనా? ఆసక్తికరంగా ABP CVoter ఎగ్జిట్ పోల్ అంచనాలు

Mizoram Exit Poll 2023 Highlights: మిజోరంలో మళ్లీ MNFదే అధికారం! అంచనా వేసిన ABP CVoter ఎగ్జిట్ పోల్

Mizoram Exit Poll 2023 Highlights: మిజోరంలో మళ్లీ MNFదే అధికారం! అంచనా వేసిన ABP CVoter ఎగ్జిట్ పోల్

Upcoming Mobiles in December 2023: కొత్త ఫోన్‌తో కొత్త సంవత్సరంలో అడుగుపెట్టాలనుకుంటున్నారా? - డిసెంబర్‌లో లాంచ్ కానున్న బెస్ట్ ఫోన్లు ఇవే!

Upcoming Mobiles in December 2023: కొత్త ఫోన్‌తో కొత్త సంవత్సరంలో అడుగుపెట్టాలనుకుంటున్నారా? - డిసెంబర్‌లో లాంచ్ కానున్న బెస్ట్ ఫోన్లు ఇవే!