అన్వేషించండి

MLA Akbaruddin Owaisi: ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టిన అక్బరుద్దీన్ ఒవైసీ, సభలో కాళేశ్వరంపై సూటి ప్రశ్నలివే

Kaleshwaram Project report | కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టుపై చర్యలు, నిర్ణయం తీసుకోలేని పక్షంలో మీకు అధికారం ఎందుకు అని తెలంగాణ ప్రభుత్వాన్ని అక్బరుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు.

కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటు చేసిన కమిషన్ ఏం చేసింది, పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికతో ఏం జరిగిందని అక్బరుద్దీన్ ప్రశ్నించారు. దీనిపై చర్యలు తీసుకోకపోతే కమిషన్ వేసి ఏం లాభం ఉందని, ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై ఏ నిర్ణయం, చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టును స్క్రాప్ చేస్తారా, కొనసాగించాలనుకుంటున్నారా.. రిపేర్ చేస్తారా.. ఏం చేయాలనుకుంటుందో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలంటూ సర్కార్ కోర్టులోకి బాల్ నెట్టారు అక్బరుద్దీన్.

కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ సభలో పెట్టాం, ఏం చర్యలు తీసుకుందాం, దీనిపై ఎలా ముందుకుపోదామని మంత్రులు, సీఎం రేవంత్ రెడ్డి సభ్యులను అడుగుతున్నారు. ఈ చర్చ ఈరోజు ముగుస్తుందా, రేపు కూడా జరుగుతుందా అనేది ప్రభుత్వానికి కూడా తెలియదంటూ ఎద్దేవా చేశారు. రష్యా, ఉక్రెయిన్ లాంటి ఏదైనా దేశంలో ఏమైనా అవినీతి జరిగితే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. పరిపాలన చేయాలని 20 నెలల కిందట తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. కానీ చర్యలు తీసుకోవడానికి ప్రతిపక్షాలకు రాష్ట్ర ప్రభుత్వం అధికారం ఇస్తోంది.

తమపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ ఎలాగూ కోరదు. నేను ఓ మాట అంటా, ఇంకో సభ్యుడు మరో సలహా ఇస్తాడు. బీఆర్ఎస్ పార్టీని రిజెక్ట్ చేసి ప్రజలు కాంగ్రెస్‌కు ఛాన్స్ ఇచ్చారు. కానీ మీరు అధికారం దుర్వినియోగం చేస్తున్నారు. ఏదైనా తప్పు జరిగితే చర్యలు తీసుకోవడానికి బదులుగా ఏం చేయమంటారని ఇతర పార్టీల సభ్యులను ప్రభుత్వం అడగటం సరికాదు. ప్రతిపక్షాలు నిర్ణయం తీసుకోవాలని మా మీద వేస్తున్నారు. మీరు చర్యలు తీసుకునే దమ్ము, దైర్యం లేకపోతే మీకు అధికారం ఎందుకు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సరిగ్గా నిర్వహించలేకపోతున్నారు’ అని అక్బరుద్దీన్ ఒవైసీ తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు.

అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన తీవ్ర వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. కాళేశ్వరం రిపోర్ట్ సభలో పెట్టి చర్చించాం. దీనిపై సభ్యుల అభిప్రాయాన్ని మాత్రమే ప్రభుత్వం కోరిందని, నిర్ణయం తీసుకునే అధికారం ఇచ్చామని అక్బరుద్దీన్ ఒవైసీ చెప్పడం సరికాదన్నారు.  రాజకీయాల్లో కక్ష సాధింపు ధోరణితో కాకుండా పీసీ ఘోష్ కమిషన్‌పై పారదర్శకంగా, ప్రజాస్వామ్య బద్ధంగా సభలో చర్చించి నిర్ణయం తీసుకోవాలి అనేది మా అభిప్రాయం అన్నారు.

అన్ని నిర్ణయాలు మమ్మల్నే అడిగి తీసుకున్నారా..

‘5 ఏళ్లు రాష్ట్ర బాధ్యతల్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు అప్పగించారు. పరిపాలన బాధ్యతలతో పాటు ఏదైనా తప్పు జరిగితే చర్యలు, నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని కలిగి ఉన్నారు. ఈ విషయంలో మా అభిప్రాయాన్ని అడుగుతారు ఇది మంచిదే. కానీ ప్రతి జీవో విషయంలో, ప్రతి నిర్ణయం విషయంలో ప్రతిపక్షాలను అడిగి నిర్ణయం తీసుకున్నారా అని అక్బరుద్దీన్ ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో తప్పు జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్లు, సంబందిత అధికారులు, నేతలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు. కాంట్రాక్టర్లు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ఎలక్టోరల్ బాండ్లు ఇచ్చారు. కమ్యూనిస్టు పార్టీలు, ఎంఐఎం పార్టీలకు మాత్రమే ఎలక్టోరల్ బాండ్లు రాలేదన్నారు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget