అన్వేషించండి

సరిహద్దుల్లో మావోయిస్టు టీంలు - తెలంగాణ పోలీసులు అలర్ట్ !

రాష్ట్రంలో తీవ్ర‌వాదం , పోలీస్ తీసుకోవాల్సిన భ‌ద్ర‌తా చ‌ర్య‌ల‌పై DGP ప‌వ‌ర్‌పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ఇచ్చారు. ఈ సందర్భంగా సరిహద్దుల్లో మావోయిస్టు టీంలు మాటు వేశాయని ప్రకటించడం కీలకంగా మారింది.

రాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో మావోయిస్టుల కదలికలు ఉన్నాయనే అనుమానంతో పోలీస్ శాఖ అలర్టయింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ వీఐపీల భద్రత మరింత పెంచాల్సిన అభిప్రాయం ఉందని డీజీపీ అంజనీ కుమార్ అన్నారు. మావోయిస్టులు ఎత్తుగడలతో వస్తున్నార‌ని, ఒక‌ర్ని దెబ్బ‌తీయ‌డం వ‌ల్ల వేలాది మందిని భ‌య‌బ్రాంతుల‌కు గురిచేసేలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్నారని డీజీపీ తెలిపారు. కాబ‌ట్టి ఇలాంటి ప‌రిస్థితుల్లో ప్ర‌తి క్ష‌ణం అప్ర‌మ‌త్తంగా ఉండాలని అధికారుల‌కు సూచించారు.

ఇటీవ‌ల దక్షిణ బస్తర్ లోని అరుణ‌పూర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో  ఏప్రిల్ 26న జ‌రిగిన మందుపాత‌ర పేలుడులో 10 మంది భ‌ద్ర‌తా సిబ్బందితోపాటు ఒక పౌరుడు మ‌ర‌ణించిన సంఘ‌ట‌న నేప‌థ్యంలో రాష్ట్రంలో వామ‌ప‌క్ష తీవ్ర‌వాద ప్ర‌భావిత జిల్లాల పోలీస్ అధికారుల‌తో డీజీపీ వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా వ‌ర్క్‌షాప్ నిర్వ‌హించారు. ఇందులో అడిష‌న‌ల్ డీజీ గ్రేహౌండ్స్ విజ‌య్ కుమార్‌, అడిష‌న‌ల్ డీజీ సంజ‌య్ కుమార్ జైన్‌, ఐజీ ఎస్ఐబీ ప్ర‌భాక‌ర్ రావు, ఐజీలు చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి, షాన‌వాజ్ ఖాసీం ఇత‌ర ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు.

మావోయిస్టులు వ్యూహాత్మకంగా వస్తున్నారని సమాచారం- డీజీపీ

రాష్ట్రంలో ఏ ఒక్క చిన్న సంఘటన జరిగినా అది తెలంగాణ అభివృద్ధి పై తీవ్ర ప్రభావం చూపిస్తుందని అన్నారు డీజీపీ అంజనీ కుమార్.  ఈపరిస్థితుల్లో పోలీస్ అధికారులు మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండాలని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో రాష్ట్రంలో రాజ‌కీయ ప్ర‌ముఖులు, వీవీఐపీల ప‌ర్య‌ట‌న స‌మ‌యంలో భ‌ద్ర‌తా బ‌ల‌గాలు సంచ‌రించే స‌మ‌యంలో భ‌ద్ర‌తా ప‌రంగా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని అధికారుల‌కు సూచించారు. ఇదే స‌మ‌యంలో రాష్ట్రాల స‌రిహ‌ద్దుల ప్రాంతాల్లో మావోయిస్టుల యాక్ష‌న్ టీంల క‌ద‌లిక‌లు పెరిగే అవ‌కాశం ఉంద‌ని అన్నారు. ఆ విష‌యంలో మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అధికారుల‌కు డీజీపీ సూచించారు. రాష్ట్రం ఏర్ప‌డ్డ త‌ర్వాత ఐటీ ప‌రిశ్ర‌మ‌లు, అనేక‌ బ‌హుళ‌జాతి సంస్థ‌లు హైద‌రాబాద్ కేంద్రంగా త‌మ కార్య‌ల‌యాలు ఏర్పాటు చేసుకున్నాయ‌న్నారు. మావోయిస్టులు వ్యూహాత్మకంగా వస్తున్నార‌ని, ఒక‌ర్ని దెబ్బ‌తీయ‌డం వ‌ల్ల వేలాది మందిని భ‌య‌బ్రాంతుల‌కు గురిచేసేలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్నారు. కాబ‌ట్టి ఇలాంటి ప‌రిస్థితుల్లో ప్ర‌తి క్ష‌ణం అప్ర‌మ‌త్తంగా ఉండాలని అధికారుల‌కు డీజీపీ సూచించారు. తెలంగాణ‌లో వామ‌ప‌క్ష‌తీవ్ర‌వాదం పూర్తిగా అంత‌రించిపోయింద‌ని  దీనికి పోలీస్ శాఖ నిరంత‌ర కృషే కార‌ణ‌మ‌న్నారు. మావోయిస్టు చ‌ర్య‌ల‌కు సంబంధించిన కీల‌క దాడుల్ని ఈ సంద‌ర్భంగా డీజీపీ అధికారుల‌కు వివ‌రించారు. రాష్ట్రంలో 80శాతం కొత్త‌గా విధుల్లో చేరిన పోలీస్‌లు ఉండ‌టం వ‌ల్ల మావోయిస్టు వ్యూహాలు, చ‌ర్య‌లు, దాడుల‌పై మ‌రింత అవ‌గాహ‌న ఏర్ప‌రుచుకోవాలని డీజీపీ అంజ‌నీ కుమార్ తెలిపారు.

ఆకస్మిక దాడులు జరిగితే ఎదుర్కోడానికి స్పెషల్ ట్రైనింగ్  

పోలీస్ ద‌ళాల క‌ద‌లిక‌ల్లో మార్పులు, వ్యూహాల్ని ఎప్ప‌టిక‌ప్ప‌డు మారుస్తుండాల‌న్నారు అద‌న‌పు డీజీపీ(ఆప‌రేష‌న్స్‌) విజ‌య్ కుమార్. వీఐపీల వ‌ద్ద ఉండే పీఎస్ఓల‌కు మావోయిస్టులు జ‌రిపే ఆక‌స్మిక దాడులు, అనుకోని ప‌రిస్థితులు ఏర్ప‌డితే భ‌ద్ర‌త క‌ల్పించే అంశంపై ప్ర‌త్యేక శిక్ష‌ణ ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు తెలిపారు. రాష్ట్రంలో తీవ్ర‌వాదం ప‌రిస్థితి, పోలీస్ తీసుకోవాల్సిన భ‌ద్ర‌తా చ‌ర్య‌ల‌పై ప‌వ‌ర్‌పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ద్వారా స‌మ‌గ్రంగా వివ‌రించారు ఐజీ ప్ర‌భాక‌ర్ రావు. గ్రామ‌స్థాయి ప్ర‌జ‌ల‌తో నిరంత‌రం మ‌మేక‌మై మావోయిస్టులు, కొత్త‌వారి క‌ద‌లిక‌పై స‌మాచారం సేక‌రించాల‌న్నారు. మ‌రీ ముఖ్యంగా స‌రిహ‌ద్దు గ్రామాల పోలీస్‌లు ఈ విష‌యంలో మ‌రిన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌న్నారు. ఈ వర్క్‌షాప్‌లో అన్ని యూనిట్ల‌ అధికారులు, సరిహద్దు ప్రాంత డీఎస్పీలు పాల్గొన్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Harish Rao vs Revanth Reddy: హరీష్ రావుకు చెక్ పెట్టేందుకు రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్.. సిద్దిపేటకు మంత్రి పదవి ఆఫర్
హరీష్ రావుకు చెక్ పెట్టేందుకు రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్.. సిద్దిపేటకు మంత్రి పదవి ఆఫర్
Jeevan Reddy: ఈ 25న కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి రాజీనామా.. జగిత్యాలలో మారనున్న రాజకీయ ముఖచిత్రం
ఈ 25న కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి రాజీనామా.. జగిత్యాలలో మారనున్న రాజకీయ ముఖచిత్రం
Rythu Bharosa Scheme: రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి, రేపటిలోగా ఖాతాల్లో రూ.6 వేలు జమ
రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి, రేపటిలోగా ఖాతాల్లో రూ.6 వేలు జమ
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Iran US War Updates: శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
CM Chandrababu: ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
SRH Playing 11: ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. సన్‌రైజర్స్ ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. SRH ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
Embed widget