అన్వేషించండి

Mancherial News : జాతీయ సమైక్యత ర్యాలీలో అపశృతి, 30 మంది విద్యార్థులకు అస్వస్థత

Mancherial News : తెలంగాణ జాతీయ సమైక్యత వేడుకలలో అపశృతి చోటుచేసుకుంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన ర్యాలీలో 30 మంది విద్యార్థులు ఎండ తీవ్రత తట్టుకోలేక స్పృహ తప్పిపడిపోయారు.

Mancherial News : తెలంగాణ జాతీయ సమైక్యత వేడుకలలో అపశృతి నెలకొంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న సమైక్యత ర్యాలీలో సుమారు 30 మంది విద్యార్థులు స్పృహ కోల్పోయి కిందపడిపోయారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో విద్యార్థులు తట్టుకోలేక ర్యాలీలో స్పృహ కోల్పోయి ఎక్కడికక్కడే పడిపోవడంతో 108 అంబులెన్స్ ద్వారా వారిని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అసలేం జరిగింది? 

మంచిర్యాల జిల్లాలోని ప్రతి పాఠశాలలోని విద్యార్థులను జాతీయ సమైక్యత ర్యాలీలో పాల్గొనాలని విద్యాశాఖ నుంచి ప్రైవేట్ పాఠశాల యజమాన్యాలకు ఉత్తర్వులు జారీ చేయడంతో మంచిర్యాల పట్టణంలోని జిల్లా బాలుర పాఠశాల మైదానం నుంచి డిగ్రీ కళాశాల మైదానం వరకు సుమారు మూడు కిలోమీటర్ల మేర ర్యాలీని చేపట్టారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో కొందరు విద్యార్థులు తట్టుకోలేక ర్యాలీలో స్పృహ కోల్పోయి ఎక్కడికక్కడే పడిపోయారు. వారిని 108 అంబులెన్స్ ద్వారా మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పలువురు విద్యార్థులకు సెలైన్లు పెట్టి వైద్యం అందించారు వైద్యులు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్యం కుదుటుగా ఉందని వైద్యులు తెలపడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. తమ విద్యార్థులను రాజకీయ ర్యాలీలకు పిలువద్దని పలుమార్లు విన్నపించుకున్నామని జిల్లా ట్రస్మా అధ్యక్షుడు విష్ణువర్ధన్ ఆరోపించారు. అయినప్పటికీ తమను సమైక్యత ర్యాలీ విజయవంతం చేయాలని ఉద్దేశంతో ఓటు హక్కు రాని విద్యార్థినిలను ఇలాంటి సమావేశాలకు పిలిచి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

విద్యార్థులకు పాచిపోయిన ఆహారం 

జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా  సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో ఎమ్మెల్యే సాయన్న ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. ఈ వేడుకలలో పాల్గొన్న విద్యార్థులకు దుర్వాసన వస్తున్న భోజనం అందించారు. వాసన వస్తుండడంతో ఆహారాన్ని కొద్దిగా తిని వదిలేశారు విద్యార్థులు. ఎండలో ర్యాలీలో తిప్పి వారికి పాచిపోయిన ఆహారం పెట్టడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రుల ఆగ్రహం వ్యక్తం చేశారు. సమైక్యత వజ్రోత్సవాలకు ప్రభుత్వం లక్షల్లో డబ్బులు కేటాయించగా స్థానిక నేతల కక్కుర్తి పడి పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడారని ఆరోపించారు. దీంతో తేరుకున్న నేతలు, అధికారులు ఆహార పదార్థాలను గుట్టుచప్పుడు కాకుండా డస్ట్ బిన్ లో పడేశారు.  ఎవరి కంటపడకుండా విద్యా్ర్థులను కూడా పంపించేశారు.  ఈ విషయంపై మీడియా ప్రశ్నించగా ఎమ్మార్వో సమాధానం ఇవ్వలేదు. 

10 వేల మంది విద్యార్థులతో భారీ ర్యాలీ

తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలతో సెప్టెంబర్ 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు  75వ తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని NIRD నుంచి వ్యవసాయ విశ్వవిద్యాలయ గ్రౌండ్ వరకు ప్రజా ప్రతినిధులు, పోలీస్ అధికారులతో పాటు 10 వేల మంది విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కలిసి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ర్యాలీ అనంతరం వ్యవసాయ విశ్వవిద్యాలయ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థుల డాన్స్, స్పీచ్ లతో అలరించారు.  

Also Read : Minister Puvvada Ajay : భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారు, జాతీయ పార్టీలపై మంత్రి పువ్వాడ అజయ్ ఫైర్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP DSC: ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
KK Meets Revanth Reddy: రేవంత్‌తో కేకే సమావేశం- పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం
రేవంత్‌తో కేకే సమావేశం- పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం
Tillu Square: ‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
KTR Comments: కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలు కేసీఆర్‌ను దెబ్బతీయలేవు- నేతల వలసలపై కేటీఆర్‌ సంచలన కామెంట్స్
కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలు కేసీఆర్‌ను దెబ్బతీయలేవు- నేతల వలసలపై కేటీఆర్‌ సంచలన కామెంట్స్
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

RR vs DC Highlights IPL 2024 | Avesh Khan Bowling | చివరి ఓవర్ లో 4 పరుగులే ఇచ్చిన ఆవేశ్ ఖాన్ | ABPRR vs DC Highlights IPL 2024 | Riyan Parag Batting | పాన్ పరాగ్ అన్నారు..పరేషాన్ చేసి చూపించాడుRR vs DC Match Highlights IPL 2024: ఆఖరి ఓవర్ లో అదరగొట్టిన ఆవేశ్, దిల్లీపై రాజస్థాన్ విజయంYS Jagan vs Sunitha | YS Viveka Case: ప్రొద్దుటూరు సభలో జగన్ కామెంట్స్ కు వివేకా కుమార్తె కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC: ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
KK Meets Revanth Reddy: రేవంత్‌తో కేకే సమావేశం- పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం
రేవంత్‌తో కేకే సమావేశం- పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం
Tillu Square: ‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
KTR Comments: కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలు కేసీఆర్‌ను దెబ్బతీయలేవు- నేతల వలసలపై కేటీఆర్‌ సంచలన కామెంట్స్
కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలు కేసీఆర్‌ను దెబ్బతీయలేవు- నేతల వలసలపై కేటీఆర్‌ సంచలన కామెంట్స్
Andhra Pradesh News: ఉపాధి కూలీ లక్కప్ప, అంగన్‌వాడీ వర్కర్‌ శిరీషకు అసెంబ్లీ టికెట్ - ఏపీ రాజకీయాల్లో వీళ్లే స్పెషల్
ఉపాధి కూలీ లక్కప్ప, అంగన్‌వాడీ వర్కర్‌ శిరీషకు అసెంబ్లీ టికెట్ - ఏపీ రాజకీయాల్లో వీళ్లే స్పెషల్
Telangana News: కాంగ్రెస్ లో చేరేందుకు మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు, వద్దే వద్దంటున్న హస్తం పార్టీ కార్యకర్తలు
కాంగ్రెస్ లో చేరేందుకు మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు, వద్దే వద్దంటున్న హస్తం పార్టీ కార్యకర్తలు
Hanuma Vihari: హనుమ విహారికి షోకాజ్‌ నోటీస్‌, మళ్లీ మొదలైన రగడ
హనుమ విహారికి షోకాజ్‌ నోటీస్‌, మళ్లీ మొదలైన రగడ
Prathinidhi 2 Teaser: నారా రోహిత్ ‘ప్రతినిధి 2’ టీజర్ - ఓటు వేయడం కుదరకపోతే చచ్చిపోండి, రూ.5 లక్షల కోట్ల అప్పు ఎలా తీర్చుతారు?
నారా రోహిత్ ‘ప్రతినిధి 2’ టీజర్ - ఓటు వేయడం కుదరకపోతే చచ్చిపోండి, రూ.5 లక్షల కోట్ల అప్పు ఎలా తీర్చుతారు?
Embed widget