News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Maharashtra Car Accident: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం, తెలంగాణకు చెందిన నలుగురు దుర్మరణం

Maharashtra Car Accident : మహారాష్ట్రలో ఓ కారు లోయలో పడటంతో తెలంగాణకు చెందిన నలుగురు మృతిచెందారు.

FOLLOW US: 
Share:

Maharashtra Car Accident: మహారాష్ట్రలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఓ కారు  200 మీటర్ల ఎత్తు నుండి లోయలో పడిపోయింది. దాంతో నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు తెలంగాణలోని ఆదిలాబాద్, నల్గొండ జిల్లాకు చెందిన వారు కావడంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది.

అసలేం జరిగిందంటే..
ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని అర్లి (టి) గ్రామానికి చెందిన బ్యాంకు ఉద్యోగులు, మరి కొందరు మహారాష్ట్రలో కారులో ప్రయాణిస్తున్నారు. వీరు ప్రయాణిస్తున్న కారు అమరావతి - నాగపూర్ మార్గ మధ్యలో చిక్కల్ దరి అటవీ ప్రాంతంలో 200 మీటర్ల ఎత్తు నుండి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో మొత్తం ఆరుగురు ఉన్నట్టు సమాచారం. 

సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్గం కోసం తరలించినట్లు తెలిపారు. కారులో ప్రయాణిస్తున్న వారు గ్రామీణ బ్యాంకు ఉద్యోగులని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. చనిపోయిన వారు ఆదిలాబాద్, నల్గొండ జిల్లాల వారు కావడంతో తెలంగాణలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరగడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. మరోవైపు మృతదేహాను తెలంగాణకు తరలించడానికి రాష్ట్ర పోలీసులు, అధికారులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది.

Published at : 17 Sep 2023 04:57 PM (IST) Tags: Road Accident Crime News Car Telangana Maharashtra

ఇవి కూడా చూడండి

GDS Results: ఏపీ, తెలంగాణ జీడీఎస్ ఫలితాలు విడుదల- సర్టిఫికేట్ వెరిఫికేషన్ గడువు ఇదే!

GDS Results: ఏపీ, తెలంగాణ జీడీఎస్ ఫలితాలు విడుదల- సర్టిఫికేట్ వెరిఫికేషన్ గడువు ఇదే!

Voter Sahaya Mithra: తెలంగాణ ఓటర్ల కోసం చాట్ బాట్, అందుబాటులోకి తెచ్చిన ఎన్నికల సంఘం

Voter Sahaya Mithra: తెలంగాణ ఓటర్ల కోసం చాట్ బాట్, అందుబాటులోకి తెచ్చిన ఎన్నికల సంఘం

Telangana Elections: 34 అసెంబ్లీ సీట్లు ఇవ్వాల్సిందే, కాంగ్రెస్‌ బీసీ నేతల నుంచి పెరుగుతున్న డిమాండ్

Telangana Elections: 34 అసెంబ్లీ సీట్లు ఇవ్వాల్సిందే, కాంగ్రెస్‌ బీసీ నేతల నుంచి పెరుగుతున్న డిమాండ్

Kishan Reddy on Modi Telangana Tour: ప్రధాని మోదీ తెలంగాణకు వస్తే కేసీఆర్ కు జ్వరం వస్తుంది - కిషన్​రెడ్డి ఎద్దేవా

Kishan Reddy on Modi Telangana Tour: ప్రధాని మోదీ తెలంగాణకు వస్తే కేసీఆర్ కు జ్వరం వస్తుంది - కిషన్​రెడ్డి ఎద్దేవా

Indrakaran Reddy: రూ.75 కోట్లతో నిర్మించనున్న అంతర్రాష్ట్ర వంతెనకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి భూమి పూజ

Indrakaran Reddy: రూ.75 కోట్లతో నిర్మించనున్న అంతర్రాష్ట్ర వంతెనకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి భూమి పూజ

టాప్ స్టోరీస్

Bigg Boss Telugu 7: కోపం కాదు ఆకలి, ప్రిన్స్ యావర్ ఎమోషనల్ - నువ్వు ట్రోపీ కొట్టాలంటూ హగ్ ఇచ్చిన శోభాశెట్టి

Bigg Boss Telugu 7: కోపం కాదు ఆకలి, ప్రిన్స్ యావర్ ఎమోషనల్ - నువ్వు ట్రోపీ కొట్టాలంటూ హగ్ ఇచ్చిన శోభాశెట్టి

Upcoming Mobiles: స్మార్ట్ ఫోన్ల సీజన్ వచ్చేసింది - అక్టోబర్‌లో ఏయే ఫోన్లు రానున్నాయంటే?

Upcoming Mobiles: స్మార్ట్ ఫోన్ల సీజన్ వచ్చేసింది - అక్టోబర్‌లో ఏయే ఫోన్లు రానున్నాయంటే?

Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?

Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?

ODI World Cup 2023: అక్షర్ పటేల్ సంచలన పోస్టులు, కావాలనే తప్పించారా! అతడి బాధ వర్ణనాతీతం

ODI World Cup 2023: అక్షర్ పటేల్ సంచలన పోస్టులు, కావాలనే తప్పించారా! అతడి బాధ వర్ణనాతీతం