అన్వేషించండి

టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం, బరిలో 21 మంది అభ్యర్థులు

మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీకి ఈనెల 13వ తేదీన ఓటింగ్. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు.

మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీకి ఈనెల 13వ తేదీన ఓటింగ్ జరగబోతోంది. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు అధికారులు. మొత్తం 29,720 ఓటర్లకు గాను 137 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులో 126 మెయిన్ పోలింగ్ స్టేషన్లు ఉండగా, 11 అదనపు పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. మొత్తం 29,720 ఓటర్లలో, పురుషులు 15,472, స్త్రీలు 14,246, ఇతరులు ఇద్దరు.

మొత్తం 137 పోలింగ్ స్టేషన్లలో మహబూబ్ నగర్ జిల్లాలో 15 పోలింగ్ స్టేషన్లు, నాగర్ కర్నూల్ 14 పోలింగ్ స్టేషన్లు, వనపర్తి 7 పోలింగ్ స్టేషన్లు, జోగులాంబ గద్వాల్ 11 పోలింగ్ స్టేషన్లు, నారాయణ పేట్ 5 పోలింగ్ స్టేషన్లు, రంగారెడ్డి జిల్లాలో 31 పోలింగ్ స్టేషన్లు, వికారాబాద్ 18 పోలింగ్ స్టేషన్లు, మేడ్చల్ మల్కాజ్ గిరి 14 పోలింగ్ స్టేషన్లు, హైదరాబాద్ జిల్లాలో 22 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు.  టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు 739 పోలింగ్ అధికారులు అవసరమైన సిబ్బందిని నియమించారు. మొత్తం 137 పోలింగ్ కేంద్రాలు కాగా, ఒక్కొక్క పోలింగ్ కేంద్రానికి 137 పీవోలు, 137 పీపీవోలు, 319 ఇతర పోలింగ్ సిబ్బందిని నియమించారు. మొత్తం 593 మందిని నియమించగా అందులో 146 మంది రిజర్వ్. 29 మంది పీవోలు, ఏపీవోలు 30 మంది, పోలింగ్ పర్సనల్ 87మంది రిజర్వ్ గా ఉన్నారు. 

ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన మెటీరియల్ తీసుకుపోవడానికి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. పోలింగ్ అధికారులు, సిబ్బంది 12వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటలకు జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటరుకు రావాలని ఆదేశాలు జారీచేశారు. రిసెప్షన్ సెంటర్ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేశారు. హైదరాబాద్ జిల్లాలో ఎన్నికల నిర్వహణ కోసం 12 మంది సెక్ట్రోల్ అధికారులను నియమించారు. ఈ నెల 13వ తేదీన పోలింగ్ జ‌ర‌గనున్న నేప‌థ్యంలో మూడు జిల్లాల పరిధిలోని వైన్ షాపులను శనివారం సాయంత్రం 4 గంటల నుంచి సోమవారం సాయంత్రం 4 గంటల వరకు మూసేయాలని ఎక్సైజ్‌ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ఆబ్కారీ శాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. నిబంధనలు అతిక్రమిస్తే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

బరిలో ఉన్న 21 మంది అభ్యర్థులు ఇప్పటికే ప్రచారాన్ని హోరెత్తించారు. జిల్లాలు, ఉపాధ్యాయ సంఘాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేసి తమకే ఓటు వేయాలని అభ్యర్థించారు. ఉపాధ్యాయుల ఇంటింటికి వెళ్లి మరీ గెలిపించాలని అభ్యర్ధించారు. నిజానికి ఈ ఎన్నికలకు రాజకీయపార్టీలతో సంబంధాలు లేకపోయినా.. కేండిడేట్ల క్యాంపెయిన్ మాత్రం వాడివేడిగా సాగింది. సోమవారం ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్‌ జరుగుతుంది. 16వ తేదీన సరూర్‌నగర్‌ స్టేడియంలో కౌంటింగ్‌ ఉంటుంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు నిర్మిస్తాం - ఆదిలాబాద్ పర్యటనలో రేవంత్ సంచలన ప్రకటన
తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు నిర్మిస్తాం - ఆదిలాబాద్ పర్యటనలో రేవంత్ సంచలన ప్రకటన
Organ Transplant Green Channel: ప్రాణం కాపాడేందుకు ఒక్కటైన జనం, పోలీసులు - గ్రీన్ చానల్ ద్వారా ఆస్పత్రి ఆర్గాన్ తరలింపు
ప్రాణం కాపాడేందుకు ఒక్కటైన జనం, పోలీసులు - గ్రీన్ చానల్ ద్వారా ఆస్పత్రి ఆర్గాన్ తరలింపు
Tank Bund Shiva:ట్యాంక్‌బండ్‌లో దూకేవాళ్ల కథలన్నీ అలాంటివే! ట్యాంక్ బండ్ శివతో ABPదేశం ఇంట్రాక్షన్
ట్యాంక్‌బండ్‌లో దూకేవాళ్ల కథలన్నీ అలాంటివే! ట్యాంక్ బండ్ శివతో ABPదేశం ఇంట్రాక్షన్
Huzurabad Politics: హుజురాబాద్‌లో డంపింగ్ యార్డ్ వివాదం.. పోరాటానికి సిద్ధమని ప్రకటించిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి
హుజురాబాద్‌లో డంపింగ్ యార్డ్ వివాదం.. పోరాటానికి సిద్ధమని ప్రకటించిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి

వీడియోలు

CSK Bowling Failure vs RCB IPL 2026 | చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించిన ఆర్సీబీ
IPL 2026 RCB VS CSK Highlights | ఆర్సీబీ గ్రాండ్ విక్ట‌రీ
LSG Owner Sanjiv Goenka Tears Up IPL 2026 | కన్నీటి పర్యంతమైన ఓనర్ సంజీవ్ గోయెంకా
IPL 2026 SRH VS LSG Highlights | ఐపీఎల్ లో బోణీ కొట్టిన ల‌క్నో
RCB 250 vs CSK Chinnaswamy IPL 2026 | చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ పరుగుల వరద

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు నిర్మిస్తాం - ఆదిలాబాద్ పర్యటనలో రేవంత్ సంచలన ప్రకటన
తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు నిర్మిస్తాం - ఆదిలాబాద్ పర్యటనలో రేవంత్ సంచలన ప్రకటన
Chandrababu Naidu: రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా మార్చేందుకు లక్ష కోట్లు - జగన్‌పై ఏపీపై పగ - తాడిపత్రిలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా మార్చేందుకు లక్ష కోట్లు - జగన్‌పై ఏపీపై పగ - తాడిపత్రిలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Sathankulam Custodial Deaths Case: మధురై జిల్లా కోర్టు సంచలన తీర్పు - 9 మంది పోలీసులకు మరణశిక్ష - ఏం చేశారంటే ?
మధురై జిల్లా కోర్టు సంచలన తీర్పు - 9 మంది పోలీసులకు మరణశిక్ష - ఏం చేశారంటే ?
Car Maintenance Guide: తక్కువ పెట్రోల్, డీజిల్‌తో వాహనాన్ని ఎలా నడపాలి? పాటించాల్సిన చిట్కాలు ఏంటీ?
తక్కువ పెట్రోల్, డీజిల్‌తో వాహనాన్ని ఎలా నడపాలి? పాటించాల్సిన చిట్కాలు ఏంటీ?
Organ Transplant Green Channel: ప్రాణం కాపాడేందుకు ఒక్కటైన జనం, పోలీసులు - గ్రీన్ చానల్ ద్వారా ఆస్పత్రి ఆర్గాన్ తరలింపు
ప్రాణం కాపాడేందుకు ఒక్కటైన జనం, పోలీసులు - గ్రీన్ చానల్ ద్వారా ఆస్పత్రి ఆర్గాన్ తరలింపు
Car SafetyTips in Summer : ఎండకాలంలో కారులో ఈ 5 వస్తువులు అస్సలు ఉంచకండి.. ఏమరుపాటుగా ఉంటే కారు పేలిపోయే ప్రమాదం!
ఎండకాలంలో కారులో ఈ 5 వస్తువులు అస్సలు ఉంచకండి.. ఏమరుపాటుగా ఉంటే కారు పేలిపోయే ప్రమాదం!
Somu Veerraju: కమ్యూనిస్టులు దేశానికి నీచులు - సోము వీర్రాజు ఆగ్రహం !
కమ్యూనిస్టులు దేశానికి నీచులు - సోము వీర్రాజు ఆగ్రహం !
FASTag Rule: హైవే ప్రయాణికులకు అలర్ట్ - ఏప్రిల్ 10 నుంచి మారనున్న టోల్ నిబంధనలు!
హైవే ప్రయాణికులకు అలర్ట్ - ఏప్రిల్ 10 నుంచి మారనున్న టోల్ నిబంధనలు!
Embed widget