అన్వేషించండి

Leopard News: నారాయణపేటలో సెల్ఫీ కోసం ఎగబడ్డ జనం, భయంతో పరారైన చిరుతలు!

Leopard in Narayanpet: రెండు పులులు మృతిచెందిన ఘటన మరువక ముందే మరోచోట చిరుత పులులు నారాయణపేట జిల్లాల్లో పొలంలోకి రావడం కలకలం రేపింది.

Leopard Telugu News: నారాయణపేట: కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఇటీవల రెండు పులులు మృతిచెందిన ఘటన మరువక ముందే మరోచోట చిరుత పులులు నారాయణపేట జిల్లాల్లో పొలంలోకి రావడం కలకలం రేపింది. కానీ గ్రామస్తుల హడావుడి, అరుపులు చూసి భయంతో చిరుతలు పరారయ్యాయంటే పరిస్థితి ఎలా మారిందో అర్థం చేసుకోవచ్చు.

నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం వత్తు గుండ్ల, కంసాన్ పల్లి గ్రామాల మధ్య ఉన్న గట్టు ప్రాంతంలో చిరుతలు కనిపించాయి. ఓ వ్యవసాయ భూమి వద్ద శనివారం సాయంత్రం  సమయంలో మూడు చిరుతలు మొదటగా రైతులకు కనిపించాయి. మూడు చిరుతల్లో ఓ పెద్ద చిరుత, రెండు పిల్ల చిరుతలు ఉన్నాయి. అయితే పొలం గట్లపై పెద్ద చిరుత నెమ్మదిగా తిరుగుతుండటం గమనించారు. ఆపై వాటిని ఫొటోలు తీస్తూ సమీపానికి వెళ్లినా ప్రజలపై ఎలాంటి దాడి చేయలేదు. స్థానికులు వాటి వద్దకు వెళ్లినా ఆ చిరుత తమకేమీ పట్టనట్లుగా వెళ్తూ కనిపించింది. విషయం తెలిసిన స్థానికులు చాలా మంది అక్కడికి చేరుకుని చిరుతలతో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. కొందరు తమ ఫోన్లలో ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతున్నాయి. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకుని పరిశీలించినట్లు తెలుస్తోంది. చిరుతలు ఎక్కడి నుంచి వచ్చాయి అనే దానిపై అధికారులకు స్పష్టత రావాల్సి ఉంది.

తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్,  తెలంగాణలో గత రెండేళ్లుగా వన్య మృగాలు గ్రామాల్లోకి రావడం అధికమైంది. ఏపీలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా, శ్రీకాకుళం, చిత్తూ జిల్లాల్లో పలు చోట్ల చిరుతలు, ఎలుగుబంట్లు, పులులు, ఏనుగుల సంచారంతో ప్రజలు హడలెత్తి పోయిన సందర్భాలు ఉన్నాయి. కొన్నిసార్లు ఏనుగులు, ఎలుగుబంట్ల దాడిలో మరణాలు సైతం సంభవించాయి. తెలంగాణలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో, ములుగు జిల్లాలో ఒకట్రెండు చోట్ల వన్య ప్రాణులు గ్రామాల్లోకి వచ్చిన ఘటనల గురించి అప్పుడప్పుడూ వింటుంటాం. కానీ ఈ వారం కాగజ్ నగర్ సమీపంలోని అటవీ ప్రాంతంలో రెండు పులులు విష ప్రయోగంతో చనిపోవడంపై జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Rythu Bharosa Scheme: రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి, రేపటిలోగా ఖాతాల్లో రూ.6 వేలు జమ
రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి, రేపటిలోగా ఖాతాల్లో రూ.6 వేలు జమ
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
PM Modi Telangana Tour: ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
PM Modi Telangana Tour: ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
Dhurandhar 2 : ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
AP Nandi Awards: నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
Embed widget