అన్వేషించండి

Leopard News: నారాయణపేటలో సెల్ఫీ కోసం ఎగబడ్డ జనం, భయంతో పరారైన చిరుతలు!

Leopard in Narayanpet: రెండు పులులు మృతిచెందిన ఘటన మరువక ముందే మరోచోట చిరుత పులులు నారాయణపేట జిల్లాల్లో పొలంలోకి రావడం కలకలం రేపింది.

Leopard Telugu News: నారాయణపేట: కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఇటీవల రెండు పులులు మృతిచెందిన ఘటన మరువక ముందే మరోచోట చిరుత పులులు నారాయణపేట జిల్లాల్లో పొలంలోకి రావడం కలకలం రేపింది. కానీ గ్రామస్తుల హడావుడి, అరుపులు చూసి భయంతో చిరుతలు పరారయ్యాయంటే పరిస్థితి ఎలా మారిందో అర్థం చేసుకోవచ్చు.

నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం వత్తు గుండ్ల, కంసాన్ పల్లి గ్రామాల మధ్య ఉన్న గట్టు ప్రాంతంలో చిరుతలు కనిపించాయి. ఓ వ్యవసాయ భూమి వద్ద శనివారం సాయంత్రం  సమయంలో మూడు చిరుతలు మొదటగా రైతులకు కనిపించాయి. మూడు చిరుతల్లో ఓ పెద్ద చిరుత, రెండు పిల్ల చిరుతలు ఉన్నాయి. అయితే పొలం గట్లపై పెద్ద చిరుత నెమ్మదిగా తిరుగుతుండటం గమనించారు. ఆపై వాటిని ఫొటోలు తీస్తూ సమీపానికి వెళ్లినా ప్రజలపై ఎలాంటి దాడి చేయలేదు. స్థానికులు వాటి వద్దకు వెళ్లినా ఆ చిరుత తమకేమీ పట్టనట్లుగా వెళ్తూ కనిపించింది. విషయం తెలిసిన స్థానికులు చాలా మంది అక్కడికి చేరుకుని చిరుతలతో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. కొందరు తమ ఫోన్లలో ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతున్నాయి. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకుని పరిశీలించినట్లు తెలుస్తోంది. చిరుతలు ఎక్కడి నుంచి వచ్చాయి అనే దానిపై అధికారులకు స్పష్టత రావాల్సి ఉంది.

తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్,  తెలంగాణలో గత రెండేళ్లుగా వన్య మృగాలు గ్రామాల్లోకి రావడం అధికమైంది. ఏపీలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా, శ్రీకాకుళం, చిత్తూ జిల్లాల్లో పలు చోట్ల చిరుతలు, ఎలుగుబంట్లు, పులులు, ఏనుగుల సంచారంతో ప్రజలు హడలెత్తి పోయిన సందర్భాలు ఉన్నాయి. కొన్నిసార్లు ఏనుగులు, ఎలుగుబంట్ల దాడిలో మరణాలు సైతం సంభవించాయి. తెలంగాణలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో, ములుగు జిల్లాలో ఒకట్రెండు చోట్ల వన్య ప్రాణులు గ్రామాల్లోకి వచ్చిన ఘటనల గురించి అప్పుడప్పుడూ వింటుంటాం. కానీ ఈ వారం కాగజ్ నగర్ సమీపంలోని అటవీ ప్రాంతంలో రెండు పులులు విష ప్రయోగంతో చనిపోవడంపై జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: రోడ్లపై ధర్నాలొద్దు, సమస్యలు తీర్చేందుకు 2 ఏళ్లు టైమ్ ఇవ్వండి: టీచర్లకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
రోడ్లపై ధర్నాలు వద్దు.. సమస్యలు తీర్చడానికి 2 ఏళ్లు టైమ్ ఇవ్వండి: టీచర్లకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
Mahesh Kumar Goud On Cabinet: క్యాబినెట్ విస్తరణ ఇప్పట్లో లేనట్లే.. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు
క్యాబినెట్ విస్తరణ ఇప్పట్లో లేనట్లే.. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు
Adilabad Road Accident: లారీ, ట్యాంకర్ ఢీ.. NH-44పై 10 కి.మీ మేర భారీగా ట్రాఫిక్ జామ్.. ప్రత్యామ్నాయ మార్గాలివే
లారీ, ట్యాంకర్ ఢీ.. NH-44పై 10 కి.మీ మేర భారీగా ట్రాఫిక్ జామ్.. ప్రత్యామ్నాయ మార్గాలివే
Krishna Water Issue: కొలిక్కిరాని కృష్ణా జలాల పంచాయితీ.. వాడీవేడిగా వాదనలు.. నెలాఖరున మరోసారి భేటీ!
కొలిక్కిరాని కృష్ణా జలాల పంచాయితీ.. వాడీవేడిగా వాదనలు.. నెలాఖరున మరోసారి భేటీ!

వీడియోలు

Cybercab Autonomous Robotaxi USA Public Rides | అమెరికాలో సైబర్ క్యాబ్ రైడ్స్ హల్‌చల్.. డ్రైవర్ కాదు స్టీరింగే లేని టెస్లా కార్ల విప్లవం
Parvathipuram Manyam Jiyyammavalasa Pandulavanivalsa PVTG Gadaba Tribe Neglect | పేరుకే గ్రామం.. మౌలిక సదుపాయాలకు ఆమడ దూరం
BCCI Devajit Saikia On Indian Players | బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సంచలన వ్యాఖ్యలు
Gundenininda Gudigantalu Serial September 5 | రోహిణి మైండ్ గేమ్‌తో రివర్స్ అయిన ప్రభావతి
Asian Games 2026 Team India | ఆసియా గేమ్స్‌కు గౌతమ్ గంభీర్ దూరం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: రోడ్లపై ధర్నాలొద్దు, సమస్యలు తీర్చేందుకు 2 ఏళ్లు టైమ్ ఇవ్వండి: టీచర్లకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
రోడ్లపై ధర్నాలు వద్దు.. సమస్యలు తీర్చడానికి 2 ఏళ్లు టైమ్ ఇవ్వండి: టీచర్లకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
Mahesh Kumar Goud On Cabinet: క్యాబినెట్ విస్తరణ ఇప్పట్లో లేనట్లే.. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు
క్యాబినెట్ విస్తరణ ఇప్పట్లో లేనట్లే.. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు
Vijayasai Reddy Politics: విజయసాయిరెడ్డి కీలక ప్రకటన... రాజకీయ పార్టీపై ఈ నెల 7న ముహూర్తం ఫిక్స్
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక ప్రకటన... రాజకీయ పార్టీపై ఈ నెల 7న ముహూర్తం ఫిక్స్
Adilabad Road Accident: లారీ, ట్యాంకర్ ఢీ.. NH-44పై 10 కి.మీ మేర భారీగా ట్రాఫిక్ జామ్.. ప్రత్యామ్నాయ మార్గాలివే
లారీ, ట్యాంకర్ ఢీ.. NH-44పై 10 కి.మీ మేర భారీగా ట్రాఫిక్ జామ్.. ప్రత్యామ్నాయ మార్గాలివే
CM Chandrababu: 'సీఈవో సీఎం'గా కాదు నీళ్లిచ్చిన నాయకుడిలా.. సీఎం చంద్రబాబు ఆసక్తికర పోస్ట్
'సీఈవో సీఎం'గా కాదు నీళ్లిచ్చిన నాయకుడిలా.. సీఎం చంద్రబాబు ఆసక్తికర పోస్ట్
10 ఎయిర్ బ్యాగ్స్, 7 సీటర్ Kia Sorento లోన్ ద్వారా తీసుకుంటే EMI ఎంత చెల్లించాలి
10 ఎయిర్ బ్యాగ్స్, 7 సీటర్ Kia Sorento లోన్ ద్వారా తీసుకుంటే EMI ఎంత చెల్లించాలి
Family Jumps Into Godavari River: గోదావరిలో దూకి మరో కుటుంబం ఆత్మహత్యాయత్నం.. ఒకర్ని కాపాడిన జాలర్లు, ముగ్గురి కోసం గాలింపు
గోదావరిలో దూకి మరో కుటుంబం ఆత్మహత్యాయత్నం.. ఒకర్ని కాపాడిన జాలర్లు, ముగ్గురి కోసం గాలింపు
Indians Missing In Nepal Floods: నేపాల్ వరదల్లో 275 మంది భారత పౌరులు గల్లంతు.. విదేశాంగ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన
నేపాల్ వరదల్లో 275 మంది భారత పౌరులు గల్లంతు.. విదేశాంగ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన
Embed widget