అన్వేషించండి

KTR Tweet : ఫామ్ హౌస్‌ కేసుపై టీఆర్ఎస్ సైలెంట్ - ఎవరూ మాట్లాడొద్దని పార్టీ నేతలకు కేటీఆర్ ఆదేశం!

ఫామ్‌హౌస్ కేసులో టీఆర్ఎస్‌ నేతలెవరూ స్పందించవద్దని కేటీఆర్ ఆదేశించారు.

 

KTR Tweet :   ఫామ్‌హౌస్‌లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయబోయారని పెద్ద ఎత్తున ఆందోళన చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు గురువారం ఒక్క సారిగా సైలెంట్ అయిపోయారు. ఒక్క లీడర్ కూడా ఈ అంశంపై మాట్లాడలేదు. దీనికి తగ్గట్లుగానే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్..  ఫామ్ హౌస్ కేసు విషయంలో ప్రాథమిక విచారణ జరుగుతోందని..  ఎవరూ మాట్లాడవద్దని సూచిస్తూ పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేశారు. 

 

 

ఫామ్ హౌస్ కేసు విషయంలో  ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ ప్రయత్నించిందంటూ.. టీఆర్ఎస్ నేతలు బుధవారం ఆర్థరాత్రి కూడా ధర్నాలు చేశారు. గురువారం బీజేపీ నేతలు ఈ ఫామ్ హౌస్ కేసుపై ప్రెస్ మీట్ పెట్టి రెండు, మూడు గంటలు తమ వాదన వినిపించారు.  కానీ టీఆర్ఎస్ నేతలు మాత్రం సాయంత్రం వరకూ బయటకు రాలేదు. కేసీఆర్ ఎమ్మెల్యేలతో కలిసి మీడియా ముందుకు వస్తారని.. బుధవారం సాయంత్రం నుంచి టీఆర్ఎస్ వర్గాలు చెబుతూ వస్తున్నాయి.  కానీ గురువారం సాయంత్రానికీ అలాంటి సూచనలేమీ కనిపించ లేదు. పైగా కేటీఆర్ ఎవరూ మాట్లాడవద్దని ఆదేశాలు జారీ చేశారు. దీంతో  ఇక టీఆర్ఎస్ వైపు నుంచి ఈ కేసు విషయంలో ఎలాంటి స్పందన ఉండదని తేలిపోయింది. 


డీల్‌లో ఉన్న ఎమ్మెల్యేలు హర్షవర్థన్ రెడ్డి, గువ్వల బాలరాజు, రోహిత్ రెడ్డి, రేగ కాంతారావు  ఫామ్ హౌస్ నుంచి నేరుగా ప్రగతి  భవన్‌కు వచ్చారు. మళ్లీ బయటకు వెళ్లారో లేదో తెలియదు.  బీజేపీ నేతల ఆరోపణలకు కౌంటర్ ఇవ్వలేదు. అయితే  పోలీసులు మాత్రం... మొత్తం రూ. 250 కోట్ల డీల్ జరగబోయిందని ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. కానీ స్పాట్‌లో ఎంత క్యాష్ పట్టుకున్నారో చెప్పలేదు. అసలు పట్టుకున్నారో లేదో స్పష్టత లేదు. ఈ వ్యవహారం అంతా  గందరగోళంగా మారింది. మరో వైపు ఈ కేసులో  ఏసీబీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. బీజేపీ నేతుల వెంటనే హైకోర్టులో పిటిషన్ వేశారు. పోలీసుల తీరుపై అనుమానం వ్యక్తం చేశారు. సీబీఐ లేద సిట్‌తో దర్యాప్తు చేయించాలన్నారు. 

తనను బీజేపీ నేతలు ప్రలోభపరిచారని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బీజేపీతో సంబంధాలున్న సతీశ్ శర్మ, నంద కుమార్ అనే వ్యక్తులు టీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరితే రూ.100 కోట్లు, సెంట్రల్ గవర్నమెంట్ సివిల్ కాంట్రాక్టులతో పాటు కేంద్రంలో లాభదాయక పదవులు ఇస్తామని తనను ప్రలోభపెట్టారని రోహిత్ రెడ్డి కంప్లైంట్ లో పేర్కొన్నారు.  ఒకవేళ తాను బీజేపీలో చేరని పక్షంలో ఈడీ, సీబీఐ దాడులు, క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని సైతం కూలదోస్తామని హెచ్చరించినట్లు రోహిత్ రెడ్డి కంప్లైంట్లో ప్రస్తావించారు. అయితే ఆ సతీష్ శర్మ.. నందకుమార్‌లకు బీజేపీతో సంబంధాలున్నాయని నిరూపించే సాక్ష్యాలు లేవు. వారు బీజేపీ నేతలతో దిగిన ఫోటోలు మాత్రమే ఉన్నాయి. నందకుమార్ టీఆర్ఎస్ నేతలతోనూ సన్నిహితంగా ఉంటారు. ఆ ఫోటోలూ వైరల్ అయ్యాయి.  

కారణం ఏదైనా ..  హై పొలిటికల్ టెన్షన్ ఉంటుందని భావించిన ఈ కేసులో టీఆర్ఎస్ ఒక్క సారిగా సైలెంట్ అయిపోవడం.. తమ పార్టీ నేతల్ని కూడా నోరు తెరవవద్దని చెప్పడంతో ఏం తెర వెనుక ఏం జరుగుతోందన్న ఆసక్తి రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CBG Plant In Prakasam: రిలయన్స్ సీబీజీ ప్లాంట్‌కు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన- రూ.65వేల కోట్ల పెట్టుబడులు, 2.5 లక్షల మందికి ఉద్యోగాలు
రిలయన్స్ సీబీజీ ప్లాంట్‌కు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన- రూ.65వేల కోట్ల పెట్టుబడులు, 2.5 లక్షల మందికి ఉద్యోగాలు
Waqf Amendment Bill: వక్ఫ్ సవరణ బిల్లును ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలు రెడీ, కేంద్ర విభజన అజెండాను అడ్డుకుంటామన్న కాంగ్రెస్
వక్ఫ్ సవరణ బిల్లును ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలు రెడీ, కేంద్ర విభజన అజెండాను అడ్డుకుంటామన్న కాంగ్రెస్
Renu Desai Video: హెచ్‌సీయూ భూ వివాదంపై రేణు దేశాయ్ సంచలన పోస్ట్, సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ రిక్వెస్ట్
హెచ్‌సీయూ భూ వివాదంపై రేణు దేశాయ్ సంచలన పోస్ట్, సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ రిక్వెస్ట్
Waqf Amendment Bill: నేడు పార్లమెంట్‌ ముందుకు వక్ఫ్ సవరణ బిల్,  ప్రభుత్వం పాస్ చేయగలదా ? సంఖ్యాబలం ఎలా ఉంది?
నేడు పార్లమెంట్‌ ముందుకు వక్ఫ్ సవరణ బిల్, ప్రభుత్వం పాస్ చేయగలదా ? సంఖ్యాబలం ఎలా ఉంది?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

LSG vs PBKS Match Highlights IPL 2025 | లక్నో పై 8 వికెట్ల తేడాతో పంజాబ్ ఘన విజయం | ABP DesamAnant Ambani Dwarka Padyatra | హెలికాఫ్టర్లు వద్దంటూ కాలినడకన కృష్ణుడి గుడికి అంబానీ వారసుడు | ABP DesamAnant Ambani Rescue Hens From Cages | అత్తారింటి దారేదిలో పవన్ లా..మొత్తం కొనేసిన అనంత్ అంబానీ | ABP DesamAmeer Rinku Singh Trending | IPL 2025 లోనూ తన పూర్ ఫామ్ కంటిన్యూ చేస్తున్న రింకూ సింగ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CBG Plant In Prakasam: రిలయన్స్ సీబీజీ ప్లాంట్‌కు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన- రూ.65వేల కోట్ల పెట్టుబడులు, 2.5 లక్షల మందికి ఉద్యోగాలు
రిలయన్స్ సీబీజీ ప్లాంట్‌కు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన- రూ.65వేల కోట్ల పెట్టుబడులు, 2.5 లక్షల మందికి ఉద్యోగాలు
Waqf Amendment Bill: వక్ఫ్ సవరణ బిల్లును ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలు రెడీ, కేంద్ర విభజన అజెండాను అడ్డుకుంటామన్న కాంగ్రెస్
వక్ఫ్ సవరణ బిల్లును ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలు రెడీ, కేంద్ర విభజన అజెండాను అడ్డుకుంటామన్న కాంగ్రెస్
Renu Desai Video: హెచ్‌సీయూ భూ వివాదంపై రేణు దేశాయ్ సంచలన పోస్ట్, సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ రిక్వెస్ట్
హెచ్‌సీయూ భూ వివాదంపై రేణు దేశాయ్ సంచలన పోస్ట్, సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ రిక్వెస్ట్
Waqf Amendment Bill: నేడు పార్లమెంట్‌ ముందుకు వక్ఫ్ సవరణ బిల్,  ప్రభుత్వం పాస్ చేయగలదా ? సంఖ్యాబలం ఎలా ఉంది?
నేడు పార్లమెంట్‌ ముందుకు వక్ఫ్ సవరణ బిల్, ప్రభుత్వం పాస్ చేయగలదా ? సంఖ్యాబలం ఎలా ఉంది?
Divyabharathi: తమిళ హీరో, మ్యూజిక్ డైరెక్టర్ జీవీతో డేటింగ్... మరోసారి బాంబు పేల్చిన దివ్యభారతి
తమిళ హీరో, మ్యూజిక్ డైరెక్టర్ జీవీతో డేటింగ్... మరోసారి బాంబు పేల్చిన దివ్యభారతి
Rishabh Pant Trolls: పంత్ కర్మ ఫలితం అనుభవించక తప్పదు- డబ్బులు ఊరికే రావు, ఏకిపారేస్తున్న నెటిజన్స్
పంత్ కర్మ ఫలితం అనుభవించక తప్పదు- డబ్బులు ఊరికే రావు, ఏకిపారేస్తున్న నెటిజన్స్
Shalini Pandey: 'అర్జున్ రెడ్డి' హీరోయిన్‌ది పబ్లిసిటీ స్టంటా? సడన్‌గా సౌత్ డైరెక్టర్‌పై కామెంట్స్‌ ఎందుకు?
'అర్జున్ రెడ్డి' హీరోయిన్‌ది పబ్లిసిటీ స్టంటా? సడన్‌గా సౌత్ డైరెక్టర్‌పై కామెంట్స్‌ ఎందుకు?
HCU Land Dispute: 400 ఎకరాలు హెచ్సీయూవి కావు- ఎలాంటి వెంచర్లు వేయడం లేదు: మంత్రుల బృందం
400 ఎకరాలు హెచ్సీయూవి కావు- ఎలాంటి వెంచర్లు వేయడం లేదు: మంత్రుల బృందం
Embed widget