Breaking News Telugu Live Updates: యూజీసీ నెట్ పరీక్ష వాయిదా
Breaking News Telugu Live Updates: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్డేట్స్, వివరాలు మీకోసం

Background
జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదలయ్యాయి. జేఈఈ మెయిన్ 2022 సెషన్ 2 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. ర్యాంకు కార్డులను అభ్యర్థులు వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించింది. ఆదివారం ప్రొవిజనల్ ఫైనల్ కీని విడుదల చేసిన ఎన్టీఏ తాజాగా జేఈఈ మెయిన్ 2022 సెషన్ 2 ఫలితాలు విడుదల చేసింది. జులై 25 నుంచి 30 వరకు ఈ పరీక్షలు నిర్వహించగా.. మొత్తం 6.29లక్షల మంది ఈ పరీక్షలకు హాజరయ్యారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలో రెండు నుంచి మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. అల్పపీడనం తీవ్రరూపం దాల్చుతోంది. దీని ప్రభావం ఒడిశా, ఏపీలోని కోస్తాంధ్ర తీరం, పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో ఉంటుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకూ విస్తరించి నైరుతి దిశగా వంగి ఉంది. నేటి రాత్రిగానీ, రేపటిలోగా ఈ అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఏపీ, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, ఢిల్లీలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం కొన్ని చోట్ల రెడ్ అలర్ట్ ప్రకటించగా, మరికొన్ని ప్రాంతాల్లో ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తీరం వెంట బలమైన గాలులు గంటకు 50 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయని.. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకూడదని హెచ్చరించారు.
బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఆగస్టు నెలలో పెరిగాయి. ఆగస్టు ప్రారంభంలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.51,380 కాగా, నేడు రూ.51,870కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర హైదరాబాద్ మార్కెట్లో ఆగస్టు 1న రూ.47,100 కాగా, నేడు రూ.47,550 అయింది. హైదరాబాద్ వెండి 1 కేజీ ధర నేడు రూ.63,000గా ఉంది. అంటే ఈ ఆగస్టు తొలి వారంలో వెండి ధర రూ.300 మేర పెరిగింది. కరీంనగర్, వరంగల్లో 24 క్యారెట్ల ఆర్నమెంట్ ధర రూ.51,870 కాగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,550కు చేరింది. వెండి కేజీ ధర రూ.63,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
ఏపీలో బంగారం ధరలు..
ఏపీ మార్కెట్లోనూ బంగారం ధరలు పెరిగాయి. నేడు విజయవాడలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.51,870 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,550 గా ఉంది. నేడు విజయవాడలో స్వచ్ఛమైన వెండి 1 కేజీ ధర రూ.63,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
హైదరాబాద్లో చాలా రోజుల నుంచి ఇంధన ధరలు నిలకడగా ఉన్నాయి. హైదరాబాద్లో ఆగస్టు 08 (సోమవారం) లీటర్ పెట్రోల్ ధర (Petrol Price Today 08 August 2022) రూ.109.66 కాగా, డీజిల్ లీటర్ ధర రూ.97.82 గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలోనూ పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. ఢిల్లీలో పెట్రోల్ లీటర్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62 వద్ద పాత ధరలకే విక్రయిస్తున్నారు.
విజయవాడలో ఇంధన ధరలు మారాయి. పెట్రోల్ లీటర్ ధర రూ.111.53 కాగా, 30 పైసలు తగ్గడంతో డీజిల్ లీటర్ ధర రూ.99.30 అయింది.
విశాఖపట్నంలో ఇంధన ధర నిలకడగా ఉంది. విశాఖలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.48 అయింది. డీజిల్ లీటర్ ధర రూ.98.27 అయింది. చిత్తూరులో 20 పైసలు దిగొచ్చి పెట్రోల్ లీటర్ రూ.112.35 కాగా, డీజిల్ ధర 18 పైసలు తగ్గి లీటర్ ధర రూ.100.01 అయింది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో ఎక్కువగా మార్పులు కనిపిస్తున్నాయి. కర్నూలులో 24 పైసలు తగ్గడంతో పెట్రోల్ ధర రూ.112.27 కాగా, డీజిల్ ధర రూ. 99.96 అయింది. నెల్లూరులో 36 పైసలు తగ్గడంతో పెట్రోల్ ధర రూ.111.16 కు చేరింది. డీజిల్ ధర రూ.98.90 అయింది.
యూజీసీ నెట్ సెకండ్ ఫేజ్ పరీక్ష వాయిదా
UGC-NET సెకండ్ ఫేజ్ పరీక్ష వాయిదా పడింది. ఈ పరీక్షను సెప్టెంబర్ 20-30 తేదీల మధ్య నిర్వహిస్తామని UGC ఛైర్మన్ జగదీష్ కుమార్ ప్రకటించారు.
తెలంగాణ కానిస్టేబుల్ పరీక్ష తేదీ మార్పు
Constable Exam : తెలంగాణలో కానిస్టేబుల్ రాత పరీక్ష తేదీ మారింది. ఈ నెల 21న జరగాల్సిన పరీక్షను పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వాయిదా వేసింది. కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షను ఆగస్టు 28న నిర్వహించనున్నట్టు బోర్డు ప్రకటించింది.





















