అన్వేషించండి

Komatireddy Rajagopal Reddy: తండ్రికి విలువ ఇవ్వని కవిత ప్రజలకేం మేలు చేస్తారు - కొత్తపార్టీపై రాజగోపాల్ రెడ్డి విమర్శలు

Kavitha Party: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కవిత కొత్త పార్టీపై విమర్శలు గుప్పించారు. ఆమె తండ్రిని గౌరవించడం లేదని..ప్రజలకేం సేవ చేస్తారని ప్రశ్నించారు.

rajagopal Reddy criticized Kavitha Party: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బుధవారం మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై  తీవ్ర విమర్శలు చేశారు.  డబ్బులు ఉన్నాయని పార్టీ పెట్టడం అంటే పాన్ షాప్ పెట్టినంత సులువు అయిపోయింది  అంటూ ఆయన ఎద్దేవా చేశారు. కవిత నూతనంగా ప్రారంభించిన పార్టీ వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదని, ఆమెతో  ఊదు కాలదు.. పీరు లేవదు  అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో రాణించాలంటే ప్రజాబలం ఉండాలి కానీ, కేవలం ఆర్థిక బలం సరిపోదని ఆయన హితవు పలికారు.

కేసీఆర్ ను విమర్శించడాన్ని తప్పు పట్టిన కోమటిరెడ్డి                          

కవిత తన మొదటి సమావేశంలోనే సొంత తండ్రి, మాజీ సీఎం కేసీఆర్‌ను విమర్శించడాన్ని రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. ఉద్యమకారుడిగా పేరున్న కేసీఆర్‌ను ఆయన బిడ్డ విమర్శించడం తనను బాధించిందని, తండ్రికి విలువ ఇవ్వని వ్యక్తి ప్రజలకు ఏ విధంగా సేవ చేస్తుందని ఆయన ప్రశ్నించారు. తన అన్న కేటీఆర్ మీద ఉన్న వ్యక్తిగత కోపాన్ని తండ్రి మీద చూపించడం సరైన పద్ధతి కాదని, టీఆర్ఎస్ పేరుతో పార్టీ పెట్టి కేసీఆర్‌ను విమర్శించడం హాస్యాస్పదమని పేర్కొన్నారు.

ఉద్యమకారుడి బిడ్డగానే కవితకు గుర్తింపు                                 

కవితకు కేవలం ఉద్యమకారుడి బిడ్డగానే గుర్తింపు ఉందని, అంతకు మించి ఆమెకు వ్యక్తిగత ఛరిష్మా లేదని రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. ఆమె పార్టీ పెట్టడం పక్కన పెడితే, రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తే కనీసం డిపాజిట్ కూడా రాదని జోస్యం చెప్పారు. అలాగే ఢిల్లీ మద్యం కుంభకోణం కేసును ప్రస్తావిస్తూ.. ఆ కేసులో ఆమెకు ఇంకా క్లీన్ చిట్ రాలేదని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆయన గుర్తు చేశారు.

మంత్రి పదవి ఇస్తే న్యాయం చేస్తా !                          

మంత్రి పదవి  పై  పార్టీ అధిష్టానం తనకు ముందే హామీ ఇచ్చిందని వెల్లడించారు. ఒకవేళ తనకు మంత్రి పదవి దక్కితే, ఆ బాధ్యతకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి, పార్టీ బలోపేతానికి నిరంతరం శ్రమిస్తానని, పదవులు ఉన్నా లేకున్నా తాను ప్రజల మనిషినేనని రాజగోపాల్ రెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.         

 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

e- Shram Card 2026: అసంఘటిత రంగాల్లోని కార్మికులకు రూ.2 లక్షల బీమా.. ఇ-శ్రమ్ కార్డు ప్రయోజనాలు, దరఖాస్తు విధానం
అసంఘటిత రంగాల్లోని కార్మికులకు రూ.2 లక్షల బీమా.. ఇ-శ్రమ్ కార్డు ప్రయోజనాలు, దరఖాస్తు విధానం
Balka Suman Remand: బాల్క సుమన్‌‌కు 14 రోజుల రిమాండ్.. చంచల్ గూడ జైలుకు తరలించిన పోలీసులు
బాల్క సుమన్‌‌కు 14 రోజుల రిమాండ్.. చంచల్ గూడ జైలుకు తరలించిన పోలీసులు
Breaking News: కర్నూలు జిల్లాలో తుంగభద్ర నదిలో ఐదుగురు గల్లంతు
కర్నూలు జిల్లాలో తుంగభద్ర నదిలో ఐదుగురు గల్లంతు
AP Telangana regional politics: ఏపీలో తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు పెట్టాలని డిమాండ్ - ఆదర్శప్రాయుల విగ్రహాలు పెడితే తప్పేమీ లేదన్న బీజేపీ
ఏపీలో తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు పెట్టాలని డిమాండ్ - ఆదర్శప్రాయుల విగ్రహాలు పెడితే తప్పేమీ లేదన్న బీజేపీ
Advertisement

వీడియోలు

GT vs RR Qualifier 2 Highlights IPL 2026 | ఐపీఎల్ ఫైనల్‌కు గుజరాత్ టైటాన్స్
Vaibhav Sooryavanshi 96 Runs Highlights IPL 2026 | వైభవ్ సూర్యవంశీని వెంటాడిన దురదృష్టం
Riyan Parag about Vaibhav IPL 2026 | రాజస్థాన్‌కు రెండో టైటిల్ తెచ్చేది వైభవే
Hardik Pandya Leaves Mumbai Indians | ముంబైని వీడి CSKలోకి హార్దిక్ ఎంట్రీ?
Sai Sudharsan Hit Wicket In IPL 2026 | వరుసగా రెండు మ్యాచ్‌ల్లో హిట్ వికెట్ అయిన సాయి సుదర్శన్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Karnataka New CM DK Shivakumar: సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఎన్నిక ఏకగ్రీవం.. జూన్ 3న కర్ణాటక సీఎంగా ప్రమాణం
సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఎన్నిక ఏకగ్రీవం.. జూన్ 3న కర్ణాటక సీఎంగా ప్రమాణం
PM SETU Scheme: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలు
Kurnool Tragedy: కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
Deputy CM Pawan Kalyan: డంపింగ్ యార్డులు లేని రాష్ట్రంగా ఏపీ మారాలి.. జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంటు పరిశీలించిన పవన్ కళ్యాణ్
డంపింగ్ యార్డులు లేని రాష్ట్రంగా ఏపీ మారాలి.. జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంటు పరిశీలించిన పవన్ కళ్యాణ్
AP Telangana regional politics: ఏపీలో తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు పెట్టాలని డిమాండ్ - ఆదర్శప్రాయుల విగ్రహాలు పెడితే తప్పేమీ లేదన్న బీజేపీ
ఏపీలో తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు పెట్టాలని డిమాండ్ - ఆదర్శప్రాయుల విగ్రహాలు పెడితే తప్పేమీ లేదన్న బీజేపీ
IPL 2026 Final GT vs RCB: ఆర్‌సీబీతో ఫైన‌ల్లో మాకు ఆ అడ్వాంటేజ్.. ప్రెజర్ అస్సలు లేదు - ఫైనల్ కు ముందు జీటీ కెప్టెన్ గిల్
ఆర్‌సీబీతో ఫైన‌ల్లో మాకు ఆ అడ్వాంటేజ్.. ప్రెజర్ అస్సలు లేదు - ఫైనల్ కు ముందు జీటీ కెప్టెన్ గిల్
Ram Charan : సీఎం విజయ్‌ను చూసి గర్వ పడుతున్నా - పెద్ది ఈవెంట్‌లో దళపతిపై రామ్ చరణ్ ప్రశంసలు
సీఎం విజయ్‌ను చూసి గర్వ పడుతున్నా - పెద్ది ఈవెంట్‌లో దళపతిపై రామ్ చరణ్ ప్రశంసలు
Vaibhav Sooryavanshi News: ఏషియన్ గేమ్స్ ప్రాబబుల్స్ లిస్టులో వైభవ్ సూర్యవంశీ: సూర్య, గిల్‌కు దక్కని చోటు.. 
ఏషియన్ గేమ్స్ ప్రాబబుల్స్ లిస్టులో వైభవ్ సూర్యవంశీ: సూర్య, గిల్‌కు దక్కని చోటు.. 
Embed widget