అన్వేషించండి

Rajagopal Reddy Comments: టీఆర్ఎస్ ప్రభుత్వంపై యుద్ధం మొదలైంది, ఆ మంత్రులు ఉద్యమంలో పాల్గొన్నారా ?: రాజగోపాల్ రెడ్డి

Komatireddy Rajagopal Reddy: తెలంగాణలో సీఎం కేసీఆర్ కుటుంబం అరాచక పాలన కొనసాగిస్తోందని కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. టీఆర్ఎస్ తెలంగాణ ద్రోహుల పార్టీ అయిందని విమర్శించారు.

Komatireddy Rajagopal Reddy: సీఎం కేసీఆర్ తెలంగాణలో అరాచక పాలను కొనసాగిస్తున్నారని మునుగోడు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. చాలా మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీని వీడాలనుకుంటున్నట్లు వెల్లడించారు. అలాగే టీఆర్ఎస్ లోని చాలా మందితో తాను మాట్లాడుతున్నట్లు వివరించారు. అయితే ఇటీవలే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. నేటి ఉదయం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన రాజీనామా లేఖను స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డికి అందజేశారు. ఆయన తన రాజీనామాను సభాపతి ఆమోదించినట్లు రాజగోపాల్ రెడ్డి తెలిపారు. అంతకు ముందు ఆయన గన్ పార్కులో అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించి మీడియాతో మాట్లాడారు.

అరాచక పాలనకు వ్యతిరేకంగానే రాజీనామా..!

టీఆర్ఎస్ ప్రభుత్వంపై ధర్మయుద్ధం ప్రకటించానని కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఈ ధర్మ యుద్ధంలో తెలంగాణ, మునుగోడు ప్రజలు గెలుస్తారని అన్నారు. టీఆర్ఎస్ అరాచక పాలనకు వ్యతిరేకంగా రాజీనామా చేస్తున్నట్లు వివరించారు. సబ్బండ వర్గాలు పోరాటం చేస్తేనే తెలంగాణ వచ్చిందన్నారు. ప్రజలు ఆత్మగౌరవం కోరుకున్నారని.. కానీ సీఎం కేసీఆర్ అరాచక పాలన కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను రాజీనామా అంటే కేసీఆర్ దిగొస్తున్నారని వివరించారు. తన రాజీనామాతో జరిగే ఉప ఎన్నికల్లో మునుగోడు ప్రజలు చరిత్రాత్మక తీర్పు ఇస్తారన్నారు. తెలంగాణకు కేసీఆర్ నుంచి విముక్తి కల్పిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. 

కావాలనే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం..

నియోజకవర్గ ప్రజలకు తన మీద ప్రేమ, అభిమానం ఉన్నాయని.. తనకు ఆ నమ్మకం ఉండటం వల్లే రాజీనామా చేసినట్లు వివరించారు. మీరే తీర్పు చెప్పాలని నియోజకవర్గ ప్రజలను కోరారు. కావాలనే కొంతమంది తనపై సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉందన్నారు. నిరుద్యోగులు, ప్రజలకు వైద్యం, పేదలకు ఇళ్లు, పింఛన్ల కోసమే తాను రాజీనామా చేసినట్లు వెల్లడించారు. తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించగానే గట్టుప్పల్ మండలం ఏర్పాటు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రికి సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ తప్ప ఇతర నేతల నియోజకవర్గాలు కనిపించడం లేదని అన్నారు. 

ప్రజలు ఇవన్నీ గ్రహించాలి..

ప్రాజెక్టులు కట్టొద్దని మేం చెప్పలేదని ఆయన వివరించారు. రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ ఏమైందని ప్రశ్నించారు. మిషన్ భగీరథలో 20 వేల కోట్లు దోచుకున్నది నిజం కాదా అని అన్నారు. జీతాలు ఇవ్వాలంటే అప్పుల చేయాల్సిన పరిస్థితి వచ్చిందని విమర్శించారు. టీఆర్ఎస్ తెలంగాణ ద్రోహుల పార్టీగా మారిందన్నారు.  మంత్రులు గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పువ్వాడ అజయ్ ఉద్యమ కారులా అని ప్రశ్నించారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదన్నారు. చండూరులో రేవంత్ రెడ్డి మాట్లాడిన భాష చాలా దారుణంగా ఉందని.. డబ్బులిచ్చి పదవులు తెచ్చుకున్న వాళ్లు, జైలుకెళ్లిన వాళ్లు ఇలాగే మాట్లాడతారంటూ మండిపడ్డారు. ప్రజలు ఇవన్నీ గమనించాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోరారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Minister Ramanaidu:  మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
Revanth Reddy:  ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
Priyanka Chopra: హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ICC Champions Trophy 2025 Team India | అగార్కర్ తో డ్రెస్సింగ్ రూమ్ లో Gambhir డిష్యూం డిష్యూం | ABP DesamChhatrapati Sambhaji Maharaj 'Sambar' | సాంబార్ చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు | ABP DesamVicky Kaushal Bollywood Super Star | Chhava తో కొత్త సూపర్ స్టార్ పుట్టాడా.? | ABP DesamMLC Candidate Aviash Jadhav Interview | పదిహేను నా లక్కీ నెంబర్ ఎందుకంటే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Ramanaidu:  మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
Revanth Reddy:  ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
Priyanka Chopra: హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
First GBS Death in AP: ఏపీలో తొలి జీబీఎస్ పేషెంట్ మృతి, నిర్ధారించిన గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్
ఏపీలో తొలి జీబీఎస్ పేషెంట్ మృతి, నిర్ధారించిన గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్
Who Is Mastan Sai: ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
Sai Pallavi: 'జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది' - సాయిపల్లవి అమ్మమ్మ చీర సెంటిమెంట్ నెరవేరుతుందా?
'జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది' - సాయిపల్లవి అమ్మమ్మ చీర సెంటిమెంట్ నెరవేరుతుందా?
Kishan Reddy : ఏడాదికే కాంగ్రెస్ పై అసంతృప్తి.. ఇక వచ్చేది బీజేపీనే - తెలంగాణకు రూ. 10 లక్షల కోట్లు : కిషన్ రెడ్డి
ఏడాదికే కాంగ్రెస్ పై అసంతృప్తి.. ఇక వచ్చేది బీజేపీనే - తెలంగాణకు రూ. 10 లక్షల కోట్లు : కిషన్ రెడ్డి
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.