అన్వేషించండి

BRS MLA Kaushik Reddy: గెలిచాక పార్టీ మారితే వెయ్యి మందితో దాడి, తుక్కుతుక్కు చేస్తాం: కౌశిక్‌రెడ్డి వార్నింగ్

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిపించుకున్నాక ఎవరైనా అభ్యర్థులు పార్టీ మారితే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హెచ్చరించారు.

Telangana News | కమలాపూర్: హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచారు. తెలంగాణలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి (BRS) కార్యకర్తలు కష్టపడి గెలిపించుకున్న అభ్యర్థుు కనుక  పార్టీ మారితే వదిలిపెట్టేది లేదని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి హెచ్చరించారు. స్థానిక ఎన్నికల కోసం బీఆర్ఎస్ ప్రచారం మొదలుపెట్టింది. ఈ క్రమంలో హనుమకొండ జిల్లా కమలాపూర్‌లో సోమవారం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి కౌశిక్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.

గెలిచాక పార్టీ మారితే తీవ్ర పరిణామాలు

పార్టీ కోసం, ప్రజల కోసం పనిచేసే బీఆర్ఎస్ అభ్యర్థులను స్థానిక ఎన్నికల్లో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కానీ ఎన్నికల్లో గెలిచాక ఆ అభ్యర్థులు పార్టీ మారితే మర్యాద దక్కదని హెచ్చరించారు. బీఆర్ఎస్ నుంచి గెలిచాక ఎవరైనా పార్టీ మారితే కనుక 1000 మందిని తీసుకొచ్చి వారి ఇంటిపై దాడి చేసి తుక్కుతుక్కు చేస్తామని హెచ్చరించారు. నియోజకవర్గంలోని 5 మండలాల్లోని తమ అభ్యర్థులందరికీ ఇది వర్తిస్తుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలని వదిలిపెట్టలేదని, అలాగే మిమ్మల్ని కూడా వదిలిపెట్టమని కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించారు. 

‘నాకోసం కష్టపడ్డారు, ఇప్పుడు మీకోసం కష్టపడతా. యూరియా అందించని ప్రభుత్వానికి ఓట్లు అడిగే హక్కు లేదు. కమలాపూర్ గడ్డపై గులాబీ జెండా ఎగరవేస్తాం, హుజురాబాద్ నియోజకవర్గంలో అత్యధిక సీట్లు గెలిపించి కేసీఆర్ కి కానుక ఇస్తాం’ అన్నారు కౌశిక్ రెడ్డి. ఈనెల 9 నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది, అంతా సిద్ధంగా ఉండాలని గులాబీ శ్రేణులకు పిలుపునిచ్చారు.  అసెంబ్లీ ఎన్నికల సమయంలో తనకోసం కష్టపడి గెలిపించిన కార్యకర్తలు, నాయకులకు తాను అండగా నిలబడి, స్థానిక సంస్థల ఎన్నికల్లో వారిని గెలిపించేందుకు కష్టపడతా అన్నారు. 



BRS MLA Kaushik Reddy: గెలిచాక పార్టీ మారితే వెయ్యి మందితో దాడి, తుక్కుతుక్కు చేస్తాం: కౌశిక్‌రెడ్డి వార్నింగ్

సోమవారం కమలాపూర్ లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ — హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి కేసీఆర్ వందల కోట్లు వెచ్చించారని గుర్తుచేశారు. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కదాన్ని కూడా పూర్తిగా అమలు చేయలేదు. రైతులు యూరియా కోసం తీవ్రంగా ఇబ్బందులు పడుతుండగా, యూరియా అందించని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లు అడిగే హక్కే లేదు. 


BRS MLA Kaushik Reddy: గెలిచాక పార్టీ మారితే వెయ్యి మందితో దాడి, తుక్కుతుక్కు చేస్తాం: కౌశిక్‌రెడ్డి వార్నింగ్

ఎన్నికలకు బీఆర్ఎస్ సిద్ధం..

ప్రజల విశ్వాసం గెలుచుకున్న వారికి మాత్రమే బీఆర్ఎస్ టికెట్లు కేటాయిస్తాం. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్‌ఎస్ పార్టీ సిద్ధంగానే ఉంది. హుజురాబాద్ నియోజకవర్గం నుంచి అత్యధిక సీట్లు గెలిపించి కేసీఆర్ కి కానుకగా అందిస్తాం. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో వర్గ రాజకీయాలు ముదిరిపోయాయని, కానీ బీఆర్‌ఎస్‌లో మాత్రం ఒక్కటే వర్గం అది “కేసీఆర్ వర్గం” అని’ కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో కూడా హుజురాబాద్  మొత్తం మీద గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈనెల 9 నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. 

అదే సమయంలో ఉప్పల్ గ్రామం రైల్వే బ్రిడ్జ్ నిర్మాణ పనులను BRS ప్రభుత్వం దాదాపు పూర్తిచేసినా, మధ్యలో కేంద్ర ప్రభుత్వం పనులు నిలిపివేసిందని విమర్శించారు. ప్రస్తుత రహదారిపై ఏర్పడిన గుంతల కారణంగా వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సమస్య పరిష్కారానికి త్వరలోనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ సంపత్ రావు, వైస్ చైర్మన్ ఇంద్రసేనా రెడ్డి, మాజీ జడ్పీటీసీలు లక్ష్మణరావు, నవీన్, సీనియర్ నాయకులు సత్యనారాయణ రావు, తిరుపతి రావు, కేడీసీసీ డైరెక్టర్ కృష్ణ చైతన్య, సమన్వయ కమిటీ సభ్యులు, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Kishan ReddY Latest News:
"రేవంత్ రెడ్డి హయాంలో ప్రశ్నపత్రాల లీకేజ్‌- రాజీనామా చేయాలి" కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ 
Breaking News: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి
Breaking News: హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ 
హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ 
Telangana Latest News:  తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy HYDRA Comments: అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
Parvathipuram Manyam Latest News:మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Bonda Uma TDP: అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన
అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ - త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన
BCCI Coaching Sack: టెన్ డోషేట్, దిలీప్ లపై వేటు.. టీమ్ ఇండియా సపోర్ట్ స్టాఫ్ లో కొత్త వాళ్ల కోసం బీసీసీఐ చూపు!
టెన్ డోషేట్, దిలీప్ లపై వేటు.. టీమ్ ఇండియా సపోర్ట్ స్టాఫ్ లో కొత్త వాళ్ల కోసం బీసీసీఐ చూపు!
Healthy Night Routine : మంచి నిద్ర కావాలంటే నైట్ రొటీన్ ఇలా సెట్ చేసుకోండి.. వైద్యులు సూచించే సింపుల్ అలవాట్లు ఇవే
మంచి నిద్ర కావాలంటే నైట్ రొటీన్ ఇలా సెట్ చేసుకోండి.. వైద్యులు సూచించే సింపుల్ అలవాట్లు ఇవే
Uday Krishna Reddy Arrest: పరారీలో ఉన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్ - మిర్యాలగూడ వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు!
పరారీలో ఉన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్ - మిర్యాలగూడ వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు!
PCOS vs Iron Deficiency : PCOS ఉంటే ఐరన్ తగ్గిపోతుందా? రెండింటి మధ్య సంబంధం ఏంటి? గైనకాలజిస్ట్ సూచనలివే
PCOS ఉంటే ఐరన్ తగ్గిపోతుందా? రెండింటి మధ్య సంబంధం ఏంటి? గైనకాలజిస్ట్ సూచనలివే
Embed widget