అన్వేషించండి

BRS MLA Kaushik Reddy: గెలిచాక పార్టీ మారితే వెయ్యి మందితో దాడి, తుక్కుతుక్కు చేస్తాం: కౌశిక్‌రెడ్డి వార్నింగ్

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిపించుకున్నాక ఎవరైనా అభ్యర్థులు పార్టీ మారితే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హెచ్చరించారు.

Telangana News | కమలాపూర్: హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచారు. తెలంగాణలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి (BRS) కార్యకర్తలు కష్టపడి గెలిపించుకున్న అభ్యర్థుు కనుక  పార్టీ మారితే వదిలిపెట్టేది లేదని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి హెచ్చరించారు. స్థానిక ఎన్నికల కోసం బీఆర్ఎస్ ప్రచారం మొదలుపెట్టింది. ఈ క్రమంలో హనుమకొండ జిల్లా కమలాపూర్‌లో సోమవారం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి కౌశిక్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.

గెలిచాక పార్టీ మారితే తీవ్ర పరిణామాలు

పార్టీ కోసం, ప్రజల కోసం పనిచేసే బీఆర్ఎస్ అభ్యర్థులను స్థానిక ఎన్నికల్లో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కానీ ఎన్నికల్లో గెలిచాక ఆ అభ్యర్థులు పార్టీ మారితే మర్యాద దక్కదని హెచ్చరించారు. బీఆర్ఎస్ నుంచి గెలిచాక ఎవరైనా పార్టీ మారితే కనుక 1000 మందిని తీసుకొచ్చి వారి ఇంటిపై దాడి చేసి తుక్కుతుక్కు చేస్తామని హెచ్చరించారు. నియోజకవర్గంలోని 5 మండలాల్లోని తమ అభ్యర్థులందరికీ ఇది వర్తిస్తుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలని వదిలిపెట్టలేదని, అలాగే మిమ్మల్ని కూడా వదిలిపెట్టమని కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించారు. 

‘నాకోసం కష్టపడ్డారు, ఇప్పుడు మీకోసం కష్టపడతా. యూరియా అందించని ప్రభుత్వానికి ఓట్లు అడిగే హక్కు లేదు. కమలాపూర్ గడ్డపై గులాబీ జెండా ఎగరవేస్తాం, హుజురాబాద్ నియోజకవర్గంలో అత్యధిక సీట్లు గెలిపించి కేసీఆర్ కి కానుక ఇస్తాం’ అన్నారు కౌశిక్ రెడ్డి. ఈనెల 9 నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది, అంతా సిద్ధంగా ఉండాలని గులాబీ శ్రేణులకు పిలుపునిచ్చారు.  అసెంబ్లీ ఎన్నికల సమయంలో తనకోసం కష్టపడి గెలిపించిన కార్యకర్తలు, నాయకులకు తాను అండగా నిలబడి, స్థానిక సంస్థల ఎన్నికల్లో వారిని గెలిపించేందుకు కష్టపడతా అన్నారు. 



BRS MLA Kaushik Reddy: గెలిచాక పార్టీ మారితే వెయ్యి మందితో దాడి, తుక్కుతుక్కు చేస్తాం: కౌశిక్‌రెడ్డి వార్నింగ్

సోమవారం కమలాపూర్ లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ — హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి కేసీఆర్ వందల కోట్లు వెచ్చించారని గుర్తుచేశారు. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కదాన్ని కూడా పూర్తిగా అమలు చేయలేదు. రైతులు యూరియా కోసం తీవ్రంగా ఇబ్బందులు పడుతుండగా, యూరియా అందించని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లు అడిగే హక్కే లేదు. 


BRS MLA Kaushik Reddy: గెలిచాక పార్టీ మారితే వెయ్యి మందితో దాడి, తుక్కుతుక్కు చేస్తాం: కౌశిక్‌రెడ్డి వార్నింగ్

ఎన్నికలకు బీఆర్ఎస్ సిద్ధం..

ప్రజల విశ్వాసం గెలుచుకున్న వారికి మాత్రమే బీఆర్ఎస్ టికెట్లు కేటాయిస్తాం. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్‌ఎస్ పార్టీ సిద్ధంగానే ఉంది. హుజురాబాద్ నియోజకవర్గం నుంచి అత్యధిక సీట్లు గెలిపించి కేసీఆర్ కి కానుకగా అందిస్తాం. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో వర్గ రాజకీయాలు ముదిరిపోయాయని, కానీ బీఆర్‌ఎస్‌లో మాత్రం ఒక్కటే వర్గం అది “కేసీఆర్ వర్గం” అని’ కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో కూడా హుజురాబాద్  మొత్తం మీద గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈనెల 9 నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. 

అదే సమయంలో ఉప్పల్ గ్రామం రైల్వే బ్రిడ్జ్ నిర్మాణ పనులను BRS ప్రభుత్వం దాదాపు పూర్తిచేసినా, మధ్యలో కేంద్ర ప్రభుత్వం పనులు నిలిపివేసిందని విమర్శించారు. ప్రస్తుత రహదారిపై ఏర్పడిన గుంతల కారణంగా వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సమస్య పరిష్కారానికి త్వరలోనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ సంపత్ రావు, వైస్ చైర్మన్ ఇంద్రసేనా రెడ్డి, మాజీ జడ్పీటీసీలు లక్ష్మణరావు, నవీన్, సీనియర్ నాయకులు సత్యనారాయణ రావు, తిరుపతి రావు, కేడీసీసీ డైరెక్టర్ కృష్ణ చైతన్య, సమన్వయ కమిటీ సభ్యులు, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
Telangana NEET Cutoff: తెలంగాణలో ఎంబీబీఎస్ సీటు రావాలంటే నీట్‌ ర్యాంక్ ఎంత ఉండాలి? పూర్తి కటాఫ్ వివరాలు ఏంటీ?
తెలంగాణలో ఎంబీబీఎస్ సీటు రావాలంటే నీట్‌ ర్యాంక్ ఎంత ఉండాలి? పూర్తి కటాఫ్ వివరాలు ఏంటీ?

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Embed widget