అన్వేషించండి

Siddipet Murder Case: బెట్టింగ్‌ మాయలో పడి కానిస్టేబుల్ అప్పులు! భార్యతో కలిసి చోరీలు, మర్డర్‌లు! సిద్దిపేటలో దారుణం!

Siddipet Murder Case: సిద్దిపేట జిల్లాలో పోలీస్ కానిస్టేబుల్ ఆన్‌లైన్ బెట్టింగ్‌ వలలో పడి దారుణాలకు తెగబడ్డాడు. వద్దని వారించాల్సిన భార్య నేరాల్లో భాగమైంది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు బానిసైన కానిస్టేబుల్, భార్యతో కలిసి దంపతులు అరెస్ట్.
  • రుణాలు తీర్చేందుకు రియల్టర్‌ను కారులో హత్య చేసి, నగలు దొంగిలించారు.
  • హత్య అనంతరం మృతదేహాన్ని కాలువలో పడేసి, నగలు హైదరాబాద్‌లో అమ్మారు.
  • విచారణలో కానిస్టేబుల్‌పై వృద్ధురాలి బంగారు నగలు దొంగతనం కేసు కూడా వెలుగులోకి.

Siddipet Murder Case: సిద్దిపేట సీసీఎస్ విభాగంలో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న గౌటి ప్రవీణ్‌ కుమార్, గత కొన్నేళ్లుగా ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు బానిసయ్యాడు. 2007లో విధుల్లో చేరిన ఇతను, సమాజంలో గౌరవప్రదమైన హోదాలో ఉండి కూడా ఆన్‌లైన్ బెట్టింగ్ ఊబిలో కూరుకుపోయాడు. 

ప్రవీణ్ కుమార తన భార్య రజితతో కలిసి గత రెండేళ్లుగా విపరీతంగా ఆన్‌లైన్ బెట్టింగ్‌లు ఆడుతూ సుమారు 60 లక్షల వరకు నష్టపోయినట్టు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో రూ. 30 లక్షల వరకు అప్పుల పాలై, వాటిని తీర్చే మార్గం లేక నేరాల బాట పట్టారు. సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో తమకు తెలిసిన వారినే లక్ష్యంగా చేసుకొని కుట్రలు చేశారు. 

రియల్టర్ విశ్వనాథం హత్య

ఈ కేసులో ప్రధాన  బాధితుడు సిద్ధిపేటకు చెందిన రియల్టర్‌ బెల్దె విశ్వనాథం. ప్రవీణ్‌ కుమారు తన తమ్ముడికి చెందిన ఒక స్థలాన్ని విశ్వనాథం బంధువు వద్ద తాకట్టు పెట్టించి 12 లక్షల అప్పు ఇప్పించాడు. అయితే ఆ ప్లాటును విక్రయించాలని విశ్వనాథం చెప్పగా, ప్రవీణ్ అందుకు నిరాకరించి, మోర మంచి ప్లాటు చూపిస్తానని నమ్మించాడు. 

గత శనివారం పథకం ప్రకారం, ప్రవీణ్ రజిత ఇద్దరూ విశ్వనాథాన్ని తమ కారులో ఎక్కించుకొని మెట్టుబండల శివారులోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. కారులోనే ఉన్న సమయంలో విశ్వనాథం కాళ్లూచేతులు కట్టేసి మెడ చుట్టూ వైరు బిగించి అత్యంత దారుణంగా హత్య చేశారు. హత్య అనంతరం అతని ఒంటిపై ఉన్న సుమారు పది తులాల బంగారు నగలను దొంగిలించారు. ఆధారాలు దొరక్కుండా ఉండేందుకు మృతదేహాన్ని ఇమాంబాద్‌ సమీంపలోని ఒక కాలువలో పడేశారు. ఆ తర్వాత దంపతులిద్దరూ కారులో నేరుగా హైదరాబాద్‌ వెళ్లి, అక్కడ ఒక బంగారు దుకాణంలో నగలను విక్రయించారు. 

కానిస్టేబుల్ దంపతులు ఎలా దొరికారంటే?

విశ్వనాథం కనిపించకపోవడంతో అతని భార్య వనిత చిన్నకోడూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆదివారం రాత్రి మృతదేహాన్ని గుర్తించారు.ఏసీపీ రవీందర్ రెడ్డి పర్యవేక్షణలో సీసీఎస్ టాస్క్ ఫోర్స్ పోలీసులు లోతైన దర్యాప్తు చేశారు. 

పోలీసులు పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు విశ్లేషించారు. టెక్నికల్ అనాలసిస్ ఆధారంగా విచారణ జరపగా, ప్రవీణ్ కుమార్ కారు కదలికలు అనుమానాస్పదంగా కనిపించాయి. గట్టిగా విచారించడంతో నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు. మంగళవారం వీరిని అరెస్టు చేసి, బుధవారం రిమాండ్‌కు తరలించారు. 

వృద్ధురాలి నగలు చోరీ 

విశ్వనాథం హత్య కేసు దర్యాప్తులో ప్రవీణ్ కుమార్ చేసిన మరో ఘోరం వెలుగులోకి వచ్చింది. గత నెల 25న తన ఇంటికి సమీపంలో ఉండే నర్సవ్వ అనే వృద్ధురాలిని ఆసుపత్రికి తీసుకెళ్తానని కారులో ఎక్కించుకున్నారు. దారి మధ్యలో ఆమెను ఏమార్చి, మెడలోని బంగారు పుస్తెల తాడు చోరీ చేశారు. బంగారం పోయిందని ఏడుస్తున్న వృద్ధురాలిని స్వయంగా ప్రవీణ్ కుమార్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి ఫిర్యాదు చేయించాడు. ఎవరికీ తెలియకుండా డ్రామా ఆడాడు. దొంగిలించిన నగలను కూడా హైదరాబాద్‌లో విక్రయించాడు. 

Frequently Asked Questions

ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు బానిసైన కానిస్టేబుల్‌ ఎవరు?

సిద్దిపేట సీసీఎస్ విభాగంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న గౌటి ప్రవీణ్‌ కుమార్ ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు బానిసయ్యాడు.

ప్రవీణ్‌ కుమార్, అతని భార్య ఎంత డబ్బు నష్టపోయారు?

ప్రవీణ్‌ కుమార్, అతని భార్య రజిత కలిసి సుమారు 60 లక్షల వరకు ఆన్‌లైన్ బెట్టింగ్‌లలో నష్టపోయారు.

రియల్టర్‌ విశ్వనాథం హత్యకు కారణం ఏమిటి?

అప్పుల తీర్చడానికి సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో, ప్రవీణ్‌ కుమార్, అతని భార్య రజిత కలిసి విశ్వనాథాన్ని హత్య చేశారు.

హత్య తర్వాత దంపతులు ఏం చేశారు?

హత్య అనంతరం విశ్వనాథం ఒంటిపై ఉన్న బంగారు నగలను దొంగిలించి, వాటిని హైదరాబాద్‌లోని ఒక దుకాణంలో విక్రయించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bandi Bhagirath POCSO Case: బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు.. తక్షణ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు.. తక్షణ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
Bandi Bhagirath Files:బండి సంజయ్‌కు బిగ్‌షాక్! కుమారుడిపై ఫోక్సో కేసు నమోదు! హనీట్రాప్ అంటున్న భగీరథ్‌!
బండి సంజయ్‌కు బిగ్‌షాక్! కుమారుడిపై ఫోక్సో కేసు నమోదు! హనీట్రాప్ అంటున్న భగీరథ్‌!
Karimnagar Tension: కరీంనగర్‌లో పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు! బండి, రేవంత్ కలిసి తనను చంపే కుట్ర చేశారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఆరోపణలు!
కరీంనగర్‌లో పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు! బండి, రేవంత్ కలిసి తనను చంపే కుట్ర చేశారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఆరోపణలు!
Karimnagar Tension: కరీంనగర్‌లో బీజేపీ శ్రేణుల విధ్వంసం! గంగుల క్యాంప్ ఆఫీస్‌పై దాడి!బండిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం!
కరీంనగర్‌లో బీజేపీ శ్రేణుల విధ్వంసం! గంగుల క్యాంప్ ఆఫీస్‌పై దాడి!బండిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం!
Advertisement

వీడియోలు

Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Pitapuram Politics: పిఠాపురం ఇన్‌చార్జ్ మార్పు.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన వర్మ... ప్రెస్‌మీట్‌లో ఎమోషనల్
Abhishek Sharma: అభిషేక్ శర్మ vs పంజాబ్: ఇది బ్యాటింగ్ కాదు.. తాండవం
Medchal Infant Kidnap: '50 CC కెమెరాలతో గంటల్లో పట్టుకున్న పోలీసులు.
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
LPG Subsidy New Rules: ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
TamilNadu Politics: అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
Bandi Bhageerath case: కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
Chiranjeevi: బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
Liquor Shops Ban: ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Jagan towards Congress: మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
Embed widget