అన్వేషించండి

Siddipet Murder Case: బెట్టింగ్‌ మాయలో పడి కానిస్టేబుల్ అప్పులు! భార్యతో కలిసి చోరీలు, మర్డర్‌లు! సిద్దిపేటలో దారుణం!

Siddipet Murder Case: సిద్దిపేట జిల్లాలో పోలీస్ కానిస్టేబుల్ ఆన్‌లైన్ బెట్టింగ్‌ వలలో పడి దారుణాలకు తెగబడ్డాడు. వద్దని వారించాల్సిన భార్య నేరాల్లో భాగమైంది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు బానిసైన కానిస్టేబుల్, భార్యతో కలిసి దంపతులు అరెస్ట్.
  • రుణాలు తీర్చేందుకు రియల్టర్‌ను కారులో హత్య చేసి, నగలు దొంగిలించారు.
  • హత్య అనంతరం మృతదేహాన్ని కాలువలో పడేసి, నగలు హైదరాబాద్‌లో అమ్మారు.
  • విచారణలో కానిస్టేబుల్‌పై వృద్ధురాలి బంగారు నగలు దొంగతనం కేసు కూడా వెలుగులోకి.

Siddipet Murder Case: సిద్దిపేట సీసీఎస్ విభాగంలో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న గౌటి ప్రవీణ్‌ కుమార్, గత కొన్నేళ్లుగా ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు బానిసయ్యాడు. 2007లో విధుల్లో చేరిన ఇతను, సమాజంలో గౌరవప్రదమైన హోదాలో ఉండి కూడా ఆన్‌లైన్ బెట్టింగ్ ఊబిలో కూరుకుపోయాడు. 

ప్రవీణ్ కుమార తన భార్య రజితతో కలిసి గత రెండేళ్లుగా విపరీతంగా ఆన్‌లైన్ బెట్టింగ్‌లు ఆడుతూ సుమారు 60 లక్షల వరకు నష్టపోయినట్టు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో రూ. 30 లక్షల వరకు అప్పుల పాలై, వాటిని తీర్చే మార్గం లేక నేరాల బాట పట్టారు. సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో తమకు తెలిసిన వారినే లక్ష్యంగా చేసుకొని కుట్రలు చేశారు. 

రియల్టర్ విశ్వనాథం హత్య

ఈ కేసులో ప్రధాన  బాధితుడు సిద్ధిపేటకు చెందిన రియల్టర్‌ బెల్దె విశ్వనాథం. ప్రవీణ్‌ కుమారు తన తమ్ముడికి చెందిన ఒక స్థలాన్ని విశ్వనాథం బంధువు వద్ద తాకట్టు పెట్టించి 12 లక్షల అప్పు ఇప్పించాడు. అయితే ఆ ప్లాటును విక్రయించాలని విశ్వనాథం చెప్పగా, ప్రవీణ్ అందుకు నిరాకరించి, మోర మంచి ప్లాటు చూపిస్తానని నమ్మించాడు. 

గత శనివారం పథకం ప్రకారం, ప్రవీణ్ రజిత ఇద్దరూ విశ్వనాథాన్ని తమ కారులో ఎక్కించుకొని మెట్టుబండల శివారులోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. కారులోనే ఉన్న సమయంలో విశ్వనాథం కాళ్లూచేతులు కట్టేసి మెడ చుట్టూ వైరు బిగించి అత్యంత దారుణంగా హత్య చేశారు. హత్య అనంతరం అతని ఒంటిపై ఉన్న సుమారు పది తులాల బంగారు నగలను దొంగిలించారు. ఆధారాలు దొరక్కుండా ఉండేందుకు మృతదేహాన్ని ఇమాంబాద్‌ సమీంపలోని ఒక కాలువలో పడేశారు. ఆ తర్వాత దంపతులిద్దరూ కారులో నేరుగా హైదరాబాద్‌ వెళ్లి, అక్కడ ఒక బంగారు దుకాణంలో నగలను విక్రయించారు. 

కానిస్టేబుల్ దంపతులు ఎలా దొరికారంటే?

విశ్వనాథం కనిపించకపోవడంతో అతని భార్య వనిత చిన్నకోడూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆదివారం రాత్రి మృతదేహాన్ని గుర్తించారు.ఏసీపీ రవీందర్ రెడ్డి పర్యవేక్షణలో సీసీఎస్ టాస్క్ ఫోర్స్ పోలీసులు లోతైన దర్యాప్తు చేశారు. 

పోలీసులు పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు విశ్లేషించారు. టెక్నికల్ అనాలసిస్ ఆధారంగా విచారణ జరపగా, ప్రవీణ్ కుమార్ కారు కదలికలు అనుమానాస్పదంగా కనిపించాయి. గట్టిగా విచారించడంతో నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు. మంగళవారం వీరిని అరెస్టు చేసి, బుధవారం రిమాండ్‌కు తరలించారు. 

వృద్ధురాలి నగలు చోరీ 

విశ్వనాథం హత్య కేసు దర్యాప్తులో ప్రవీణ్ కుమార్ చేసిన మరో ఘోరం వెలుగులోకి వచ్చింది. గత నెల 25న తన ఇంటికి సమీపంలో ఉండే నర్సవ్వ అనే వృద్ధురాలిని ఆసుపత్రికి తీసుకెళ్తానని కారులో ఎక్కించుకున్నారు. దారి మధ్యలో ఆమెను ఏమార్చి, మెడలోని బంగారు పుస్తెల తాడు చోరీ చేశారు. బంగారం పోయిందని ఏడుస్తున్న వృద్ధురాలిని స్వయంగా ప్రవీణ్ కుమార్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి ఫిర్యాదు చేయించాడు. ఎవరికీ తెలియకుండా డ్రామా ఆడాడు. దొంగిలించిన నగలను కూడా హైదరాబాద్‌లో విక్రయించాడు. 

Frequently Asked Questions

ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు బానిసైన కానిస్టేబుల్‌ ఎవరు?

సిద్దిపేట సీసీఎస్ విభాగంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న గౌటి ప్రవీణ్‌ కుమార్ ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు బానిసయ్యాడు.

ప్రవీణ్‌ కుమార్, అతని భార్య ఎంత డబ్బు నష్టపోయారు?

ప్రవీణ్‌ కుమార్, అతని భార్య రజిత కలిసి సుమారు 60 లక్షల వరకు ఆన్‌లైన్ బెట్టింగ్‌లలో నష్టపోయారు.

రియల్టర్‌ విశ్వనాథం హత్యకు కారణం ఏమిటి?

అప్పుల తీర్చడానికి సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో, ప్రవీణ్‌ కుమార్, అతని భార్య రజిత కలిసి విశ్వనాథాన్ని హత్య చేశారు.

హత్య తర్వాత దంపతులు ఏం చేశారు?

హత్య అనంతరం విశ్వనాథం ఒంటిపై ఉన్న బంగారు నగలను దొంగిలించి, వాటిని హైదరాబాద్‌లోని ఒక దుకాణంలో విక్రయించారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: రేపు ఏపీ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం
రేపు ఏపీ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం
తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు! తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్! ఏపీలో ఈదురు గాలుల ముప్పు!
తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు! తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్! ఏపీలో ఈదురు గాలుల ముప్పు!
Breaking News:తెలంగాణ కొత్త సీఎస్‌గా సంజయ్ జాజు! ఉత్తర్వులు జారీ
తెలంగాణ కొత్త సీఎస్‌గా సంజయ్ జాజు! ఉత్తర్వులు జారీ
New IB Chief Mahesh Dixit:దేశీయ నిఘా పీఠంపై మన తెలంగాణ సింహం! నూతన ఐబీ చీఫ్‌గా ఐపీఎస్ మహేష్ దీక్షిత్ నియామకం!
దేశీయ నిఘా పీఠంపై మన తెలంగాణ సింహం! నూతన ఐబీ చీఫ్‌గా ఐపీఎస్ మహేష్ దీక్షిత్ నియామకం!
Advertisement

వీడియోలు

Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Afghanistan Earthquake: అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
Tirumala Devotees Rush: తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Made in Jonnagiri Gold Biscuits: బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
KTR Politics: కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
NRI Priest Arrest: పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
Vizag Land Scam: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
Jai Moondra Cricket Career: ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
Pawan Kalyan Comments :
"క్రిమినల్స్‌కి వత్తాసు పలికే వైసీపీ కమిట్‌మెంట్‌ చూసి ముచ్చటేస్తుంది- వారు అలానే ఉండి, మరింత కరిగిపోవాలి" పవన్ కామెంట్స్ వైరల్ 
Embed widget