అన్వేషించండి

Siddipet Murder Case: బెట్టింగ్‌ మాయలో పడి కానిస్టేబుల్ అప్పులు! భార్యతో కలిసి చోరీలు, మర్డర్‌లు! సిద్దిపేటలో దారుణం!

Siddipet Murder Case: సిద్దిపేట జిల్లాలో పోలీస్ కానిస్టేబుల్ ఆన్‌లైన్ బెట్టింగ్‌ వలలో పడి దారుణాలకు తెగబడ్డాడు. వద్దని వారించాల్సిన భార్య నేరాల్లో భాగమైంది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు బానిసైన కానిస్టేబుల్, భార్యతో కలిసి దంపతులు అరెస్ట్.
  • రుణాలు తీర్చేందుకు రియల్టర్‌ను కారులో హత్య చేసి, నగలు దొంగిలించారు.
  • హత్య అనంతరం మృతదేహాన్ని కాలువలో పడేసి, నగలు హైదరాబాద్‌లో అమ్మారు.
  • విచారణలో కానిస్టేబుల్‌పై వృద్ధురాలి బంగారు నగలు దొంగతనం కేసు కూడా వెలుగులోకి.

Siddipet Murder Case: సిద్దిపేట సీసీఎస్ విభాగంలో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న గౌటి ప్రవీణ్‌ కుమార్, గత కొన్నేళ్లుగా ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు బానిసయ్యాడు. 2007లో విధుల్లో చేరిన ఇతను, సమాజంలో గౌరవప్రదమైన హోదాలో ఉండి కూడా ఆన్‌లైన్ బెట్టింగ్ ఊబిలో కూరుకుపోయాడు. 

ప్రవీణ్ కుమార తన భార్య రజితతో కలిసి గత రెండేళ్లుగా విపరీతంగా ఆన్‌లైన్ బెట్టింగ్‌లు ఆడుతూ సుమారు 60 లక్షల వరకు నష్టపోయినట్టు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో రూ. 30 లక్షల వరకు అప్పుల పాలై, వాటిని తీర్చే మార్గం లేక నేరాల బాట పట్టారు. సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో తమకు తెలిసిన వారినే లక్ష్యంగా చేసుకొని కుట్రలు చేశారు. 

రియల్టర్ విశ్వనాథం హత్య

ఈ కేసులో ప్రధాన  బాధితుడు సిద్ధిపేటకు చెందిన రియల్టర్‌ బెల్దె విశ్వనాథం. ప్రవీణ్‌ కుమారు తన తమ్ముడికి చెందిన ఒక స్థలాన్ని విశ్వనాథం బంధువు వద్ద తాకట్టు పెట్టించి 12 లక్షల అప్పు ఇప్పించాడు. అయితే ఆ ప్లాటును విక్రయించాలని విశ్వనాథం చెప్పగా, ప్రవీణ్ అందుకు నిరాకరించి, మోర మంచి ప్లాటు చూపిస్తానని నమ్మించాడు. 

గత శనివారం పథకం ప్రకారం, ప్రవీణ్ రజిత ఇద్దరూ విశ్వనాథాన్ని తమ కారులో ఎక్కించుకొని మెట్టుబండల శివారులోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. కారులోనే ఉన్న సమయంలో విశ్వనాథం కాళ్లూచేతులు కట్టేసి మెడ చుట్టూ వైరు బిగించి అత్యంత దారుణంగా హత్య చేశారు. హత్య అనంతరం అతని ఒంటిపై ఉన్న సుమారు పది తులాల బంగారు నగలను దొంగిలించారు. ఆధారాలు దొరక్కుండా ఉండేందుకు మృతదేహాన్ని ఇమాంబాద్‌ సమీంపలోని ఒక కాలువలో పడేశారు. ఆ తర్వాత దంపతులిద్దరూ కారులో నేరుగా హైదరాబాద్‌ వెళ్లి, అక్కడ ఒక బంగారు దుకాణంలో నగలను విక్రయించారు. 

కానిస్టేబుల్ దంపతులు ఎలా దొరికారంటే?

విశ్వనాథం కనిపించకపోవడంతో అతని భార్య వనిత చిన్నకోడూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆదివారం రాత్రి మృతదేహాన్ని గుర్తించారు.ఏసీపీ రవీందర్ రెడ్డి పర్యవేక్షణలో సీసీఎస్ టాస్క్ ఫోర్స్ పోలీసులు లోతైన దర్యాప్తు చేశారు. 

పోలీసులు పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు విశ్లేషించారు. టెక్నికల్ అనాలసిస్ ఆధారంగా విచారణ జరపగా, ప్రవీణ్ కుమార్ కారు కదలికలు అనుమానాస్పదంగా కనిపించాయి. గట్టిగా విచారించడంతో నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు. మంగళవారం వీరిని అరెస్టు చేసి, బుధవారం రిమాండ్‌కు తరలించారు. 

వృద్ధురాలి నగలు చోరీ 

విశ్వనాథం హత్య కేసు దర్యాప్తులో ప్రవీణ్ కుమార్ చేసిన మరో ఘోరం వెలుగులోకి వచ్చింది. గత నెల 25న తన ఇంటికి సమీపంలో ఉండే నర్సవ్వ అనే వృద్ధురాలిని ఆసుపత్రికి తీసుకెళ్తానని కారులో ఎక్కించుకున్నారు. దారి మధ్యలో ఆమెను ఏమార్చి, మెడలోని బంగారు పుస్తెల తాడు చోరీ చేశారు. బంగారం పోయిందని ఏడుస్తున్న వృద్ధురాలిని స్వయంగా ప్రవీణ్ కుమార్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి ఫిర్యాదు చేయించాడు. ఎవరికీ తెలియకుండా డ్రామా ఆడాడు. దొంగిలించిన నగలను కూడా హైదరాబాద్‌లో విక్రయించాడు. 

Frequently Asked Questions

ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు బానిసైన కానిస్టేబుల్‌ ఎవరు?

సిద్దిపేట సీసీఎస్ విభాగంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న గౌటి ప్రవీణ్‌ కుమార్ ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు బానిసయ్యాడు.

ప్రవీణ్‌ కుమార్, అతని భార్య ఎంత డబ్బు నష్టపోయారు?

ప్రవీణ్‌ కుమార్, అతని భార్య రజిత కలిసి సుమారు 60 లక్షల వరకు ఆన్‌లైన్ బెట్టింగ్‌లలో నష్టపోయారు.

రియల్టర్‌ విశ్వనాథం హత్యకు కారణం ఏమిటి?

అప్పుల తీర్చడానికి సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో, ప్రవీణ్‌ కుమార్, అతని భార్య రజిత కలిసి విశ్వనాథాన్ని హత్య చేశారు.

హత్య తర్వాత దంపతులు ఏం చేశారు?

హత్య అనంతరం విశ్వనాథం ఒంటిపై ఉన్న బంగారు నగలను దొంగిలించి, వాటిని హైదరాబాద్‌లోని ఒక దుకాణంలో విక్రయించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

JEE Advanced 2026 Result: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల.. జూన్ 2 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల.. జూన్ 2 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం
Mega DSC Scam allegations AP: డీఎస్సీ వార్ - వైసీపీ వర్సెస్ లోకేష్.. సీబీఐ విచారణ డిమాండ్‌పై ప్రభుత్వం ఏమంటోంది?
డీఎస్సీ వార్ - వైసీపీ వర్సెస్ లోకేష్.. సీబీఐ విచారణ డిమాండ్‌పై ప్రభుత్వం ఏమంటోంది?
LPG Cylinder Prices Hike: మళ్లీ పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధరలు.. హైదరాబాద్‌లో లేటెస్ట్ రేట్లు చూశారా
మళ్లీ పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధరలు.. హైదరాబాద్‌లో లేటెస్ట్ రేట్లు చూశారా
Blast Zone Collection : బ్లాస్ట్ జోన్ వీకెండ్ కలెక్షన్స్ - అర్జున్ ఖాతాలో హిట్... తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ రెస్పాన్స్
బ్లాస్ట్ జోన్ వీకెండ్ కలెక్షన్స్ - అర్జున్ ఖాతాలో హిట్... తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ రెస్పాన్స్
Advertisement

వీడియోలు

Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం
Masterplan Behind RCB's IPL 2026 Victory | ఆర్సీబీ విజయానికి కారణం ఇదే
Reason for GT Lost The IPL 2026 Final | గుజరాత్ పతనం వెనుక అసలు నిజాలు
RCB Celebrations With Family IPL 2026 | ఫ్యామిలీతో ఆర్సీబీ ప్లేయర్స్ సెలబ్రేషన్
RCB Wins IPL 2026 Final | రెండోసారి ఐపీఎల్ టైటిల్ సొంతం చేసుకున్న ఆర్సీబీ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
JEE Advanced 2026 Result: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల.. జూన్ 2 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల.. జూన్ 2 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం
Mega DSC Scam allegations AP: డీఎస్సీ వార్ - వైసీపీ వర్సెస్ లోకేష్.. సీబీఐ విచారణ డిమాండ్‌పై ప్రభుత్వం ఏమంటోంది?
డీఎస్సీ వార్ - వైసీపీ వర్సెస్ లోకేష్.. సీబీఐ విచారణ డిమాండ్‌పై ప్రభుత్వం ఏమంటోంది?
LPG Cylinder Prices Hike: మళ్లీ పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధరలు.. హైదరాబాద్‌లో లేటెస్ట్ రేట్లు చూశారా
మళ్లీ పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధరలు.. హైదరాబాద్‌లో లేటెస్ట్ రేట్లు చూశారా
Blast Zone Collection : బ్లాస్ట్ జోన్ వీకెండ్ కలెక్షన్స్ - అర్జున్ ఖాతాలో హిట్... తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ రెస్పాన్స్
బ్లాస్ట్ జోన్ వీకెండ్ కలెక్షన్స్ - అర్జున్ ఖాతాలో హిట్... తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ రెస్పాన్స్
Gujarat Titans Bus Caught on Fire: ఐపీఎల్ ఫైనల్ తరువాత జీటీ బస్సులో మంటలు.. ప్లేయర్లకు తప్పిన ప్రమాదం, గంటసేపు రోడ్డుపైనే
ఐపీఎల్ ఫైనల్ తరువాత జీటీ బస్సులో మంటలు.. ప్లేయర్లకు తప్పిన ప్రమాదం, గంటసేపు రోడ్డుపైనే
Suriya : సూర్య సక్సెస్ జోష్ - మ్యూజిక్ డైరెక్టర్ To ఎడిటర్‌కు ఖరీదైన కార్లు... ఇండస్ట్రీలోనే ఫస్ట్ టైం
సూర్య సక్సెస్ జోష్ - మ్యూజిక్ డైరెక్టర్ To ఎడిటర్‌కు ఖరీదైన కార్లు... ఇండస్ట్రీలోనే ఫస్ట్ టైం
Pawan Kalyan Telangana meeting June 2: టార్గెట్ చేస్తున్న వారికి పవన్ షాక్ - తెలంగాణలో పార్టీ ఇక యాక్టివ్ - పార్టీ నేతలకు ప్రత్యేక రోడ్ మ్యాప్
టార్గెట్ చేస్తున్న వారికి పవన్ షాక్ - తెలంగాణలో పార్టీ ఇక యాక్టివ్ - పార్టీ నేతలకు ప్రత్యేక రోడ్ మ్యాప్
Indiramma Housing Scheme: లక్ష ఇండ్లకు సామూహిక గృహప్రవేశాలు.. నేడు ఆసిఫాబాద్ జిల్లాలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
లక్ష ఇండ్లకు సామూహిక గృహప్రవేశాలు.. నేడు ఆసిఫాబాద్ జిల్లాలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
Embed widget