అన్వేషించండి

Karimnagar: కరీంనగర్ జిల్లా సివిల్ ఆసుపత్రిలో సిబ్బంది కొరత- వైద్యులను నియమించాలని స్థానికుల వినతి

Karimnagar News: ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు ప్రధానమైన ఆసుపత్రిలో వసతుల కొరత తీర్చాలని ప్రజలు వేడుకుంటున్నారు. సిబ్బంది లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామంటున్నారు.

Karimnagar Govt Hospital News: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లిలో ఉండే లక్షల మంది ప్రజలకు ఏకైక ప్రధాన ఆసుపత్రి కరీంనగర్ సివిల్ ఆసుపత్రి. ఎవరికైనా ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే తీవ్రతను బట్టి ఆయా ఆసుపత్రులకు వెళ్లి చికిత్స చేయించుకుంటారు. కడుపునొప్పి, జ్వరాలు, చెవి నొప్పి, తలనొప్పి, కాళ్ళ నొప్పులు లాంటి చిన్న చిన్న సమస్యలు వస్తే స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చికిత్స చేస్తారు.  ఏదైనా ప్రమాదం జరిగి తలకు గాయాలైనా గుండె సంబంధిత సమస్య వచ్చినా మూత్రపిండాల సమస్య వచ్చి పరిస్థితి తీవ్రత అధికంగా ఉంటే మాత్రం జిల్లా ప్రధాన ఆసుపత్రికి వెళ్లాల్సిందే.

కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి దుస్థితి...
ఉమ్మడి కరీంనగర్ జిల్లా సివిల్ ఆసుపత్రి 500 పడకల సామర్ధ్యం కలిగిన ప్రధాన ఆసుపత్రి. అలాంటి ఆసుపత్రిలో జరిగే వైద్యం గురించి చెప్పుకుంటే భయం కలుగుతుంది. జిల్లాలోని వారికి ఏదైనా సీరియస్ కండిషన్‌లో ఉండి ఆసుపత్రికి వచ్చారంటే అంతే సంగతి. చెప్పుకోవడానికి కరీంనగర్ జిల్లాకు ప్రధాన ఆసుపత్రి కానీ కావలసినంత మంది వైద్య సిబ్బంది లేరు. వచ్చే పేషెంట్లకు వైద్య సేవలు సరిగా దొరకడం లేదు. సీరియస్ కండీషన్‌లో ఇక్కడకు వస్తే ప్రాణాలు గాల్లో దీపం పెట్టినట్టే ఉంటుంది. 

ప్రధాన వైద్య సేవలు కరవు...
ఏదైనా క్రిటికల్ పరిస్థితిలో న్యూరో సంబంధిత సమల్యలతో పేషంట్స్ వస్తే న్యూరో డాక్టర్ లేరు. మూత్ర పిండాల సమస్యతో వస్తే నెఫ్రాలజీ డాక్టర్ కనిపించరు. గుండె సంబంధిత సమస్య వచ్చినా కార్డియాలజీ విభాగం లేదు. మరి ఇలాంటి ప్రధాన సమస్యలతో వచ్చిన వారిని వరంగల్‌లో ఎంజీఎం ఆసుపత్రికో లేక హైదరాబాద్‌కో పంపించాల్సి పరిస్థితి. ఒక వేళ రోగి పరిస్థితి విషమంగా ఉంటే అంతే నూకలు చెల్లినట్టే.


Karimnagar: కరీంనగర్ జిల్లా సివిల్ ఆసుపత్రిలో సిబ్బంది కొరత- వైద్యులను నియమించాలని స్థానికుల వినతి

స్కానింగ్ టెస్టులకు టెక్నీషియన్స్ కొరత...
కరీంనగర్ సివిల్ ఆసుపత్రిలో సిటీ స్కాన్ చేసే పరికరం ఏళ్ల కింద అమర్చారు. కానీ అక్కడ ఎవరైనా స్కానింగ్ కోసం వస్తే పరికరం చెడిపోయిందనే సమాధానం చెప్తారు. దానితో ప్రైవేట్ స్కానింగ్ సెంటర్‌లో చేయించుకోవాల్సిన పరిస్థితి. స్కానింగ్ చేసేవారు లేక ఆ పరికరం వృథాగా పడి ఉంది. 2D స్కానింగ్ పరికరం కూడా ఉంది. దాని పరిస్థితి కూడా అదే. 


Karimnagar: కరీంనగర్ జిల్లా సివిల్ ఆసుపత్రిలో సిబ్బంది కొరత- వైద్యులను నియమించాలని స్థానికుల వినతి

ప్రైవేట్ సేవలపై ఆసక్తి...
హాస్పిటల్ హబ్‌గా పేరుగాంచిన కరీంనగర్‌లో వందల మంది వైద్యులు ఉన్నారు. అందరూ ప్రైవేట్ వైద్య సేవలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. కాని ప్రభుత్వం ఆసుపత్రిలో వారి సేవలు అందించేందుకు ఎందుకు ఆసక్తి చూపడం లేదు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కొంతమంది ప్రభుత్వ డాక్టర్లు కూడా సొంత క్లినిక్స్‌పై ఉన్న ఇంట్రెస్ట్ ప్రభుత్వ ఆసుపత్రిపై లేదనే విమర్శలు ఉన్నాయి.


Karimnagar: కరీంనగర్ జిల్లా సివిల్ ఆసుపత్రిలో సిబ్బంది కొరత- వైద్యులను నియమించాలని స్థానికుల వినతి

కరీంనగర్ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ఏమన్నారంటే..
కరీంనగర్ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 500 పడకలు ఉన్నాయి. నిత్యం రోగులతో కిటకిటలాడే ఈ ప్రభుత్వాసుపత్రిలో వైద్య సేవలు అందించేందుకు సరిపడా వైద్యులు లేరని అంటున్నారు. వైద్యులతోపాటు సిబ్బంది కొరత ఉందని అన్నారు. ఎమర్జెన్సీ సమయంలో వచ్చే పేషంట్లను సరైన వైద్యులు లేకపోవడంతో వరంగల్ ఎంజీఎంకి లేక హైదరాబాదు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నామని అన్నారు. అయితే ఎలాంటి సమయంలోనైనా తాము వైద్య సేవలు అందించడానికి సిద్ధంగానే ఉన్నాం కానీ వైద్యులు కొరతతో వైద్యం అందించలేకపోతున్నమని అన్నారు. ఐతే ఈ విషయం ప్రభుత్వం పట్టించుకోవడంలేదని కరీంనగర్ జిల్లా ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్‌ వీరారెడ్డి ABP దేశంతో అన్నారు.


Karimnagar: కరీంనగర్ జిల్లా సివిల్ ఆసుపత్రిలో సిబ్బంది కొరత- వైద్యులను నియమించాలని స్థానికుల వినతి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
Virat Kohli Century: మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Embed widget