అన్వేషించండి

Bandi Sanjay About Naxalism: నక్సలైట్లు అడవుల్లో చస్తుంటే... అర్బన్ నక్సల్స్ పదవులు అనుభవిస్తున్నారు: బండి సంజయ్

అమాయక నక్సలైట్లను రెచ్చగొట్టి వాళ్ల చావులకు అర్బన్ నక్సల్స్ కారకులవుతున్నారని.. నక్సలైట్లు చనిపోతే వాళ్ల తల్లిదండ్రుల, భార్య, భర్తల గుండె కోత మీకేం తెలుసు అని బండి సంజయ్ ప్రశ్నించారు.

దళిత, గిరిజన, ఆదివాసీల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని వారిని రెచ్చగొట్టి నక్సలైట్లుగా మార్చిన అర్బన్ నక్సలైట్లే వారి చావులకు కూడా బాధ్యత వహించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. అమాయక నక్సలైట్లు అడవుల్లో ప్రాణాలు కోల్పోతుంటే, మరోవైపు ఈ అర్బన్ నక్సలైట్లు మాత్రం ఆస్తులు కూడగట్టుకుని, ప్రభుత్వ నామినేటెడ్, కమిషన్ పదవుల్లో కొనసాగుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడటమే తమ సిద్ధాంతమని పదేపదే చెప్పుకునే అర్బన్ నక్సలైట్లు, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎందుకు పదవుల్లో కొనసాగుతున్నారని సూటిగా ప్రశ్నించారు. 

అర్బన్ నక్సల్స్‌కు వారి గుండెకోత తెలియదా.. 
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పోలింగ్ బూత్ అధ్యక్షులు, కార్యదర్శులు ఆపై స్థాయి నాయకుల సమావేశంలో పాల్గొనేందుకు హుజురాబాద్ విచ్చేసిన సందర్భంగా నక్సలిజం, అర్బన్ నక్సలైట్లపై తీవ్రంగా స్పందించారు. మావోయిజంపై బీజేపీ వైఖరిని స్పష్టం చేస్తూ, అధికారంలో ఉన్నా లేకున్నా మావోయిజానికి బీజేపీ వ్యతిరేకమని, తుపాకీ ద్వారా రాజ్యాధికారం అసాధ్యం. ప్రజలు దాన్ని హర్షించబోరని తాము మొదటి నుంచీ చెబుతూ వస్తున్నామని, నేడు అదే నిజమైందని అన్నారు. మావోయిస్టుల పేరుతో అమాయకులను బలి తీసుకున్నారని, అమాయక పిల్లలను రెచ్చగొట్టి వారి ప్రాణాలను బలిగొనడానికి ప్రధాన కారణం అర్బన్ నక్సల్స్ మాత్రమేనని ఆయన నొక్కి చెప్పారు. ఈరోజు చనిపోయిన కుటుంబాలకు ఈ అర్బన్ నక్సల్స్ ఏం జవాబు చెబుతారని ప్రశ్నించారు. పిల్లలు చనిపోతే తల్లిదండ్రుల గుండె ఎంతగా శోకిస్తుందో, భర్త చనిపోతే భార్య, భార్య చనిపోతే భర్త ఎంత దు:ఖానికి గురవుతారో ఈ అర్బన్ నక్సల్స్‌కు తెలియదా అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

నక్సలైట్ల మృతికి అర్బన్ నక్సల్స్ బాధ్యత వహించాలి
తాను అర్బన్ నక్సలైట్ల విషయంలో చెప్పిన మాటకు కట్టుబడి ఉంటానని బండి సంజయ్ పునరుద్ఘాటించారు. మీడియా, సోషల్ మీడియా ద్వారా రెచ్చగొడుతున్న అర్బన్ నక్సల్స్ అమాయక మావోయిస్టుల చావుకు మీరే బాధ్యత వహించాలని ఆయన అన్నారు. పౌర హక్కుల సంఘం నాయకులతో సహా ఈ అర్బన్ నక్సల్స్‌ను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, పాలకులు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేపడితే, ప్రజలకు నష్టం జరిగితే ఉద్యమాలు చేయాలనేది మీ సిద్ధాంతం అయినప్పుడు, అట్లాంటప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో నామినేటెడ్ పదవుల్లో, కమిషన్ పోస్టుల్లో ఎలా భాగస్వాములయ్యారని ప్రశ్నించారు. మహిళలకు నెలకు రూ.2500లు ఇస్తామన్న హామీ, వృద్ధులకు రూ.4 వేల పెన్షన్ హామీ, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు ఇచ్చిన అనేక హామీలు ఇచ్చారా అని నిలదీశారు. అందుకే అర్బన్ నక్సల్స్ పైరవీలు చేస్తూ, ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆస్తులు కూడగట్టుకుంటున్నారని తాను చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు.

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తూ భారతదేశాన్ని ఆర్థిక ప్రగతిలో 4వ స్థానానికి చేర్చిందని, విదేశాధి నేతలే మోదీకి సాష్టాంగ పడుతుంటే ఈ అర్బన్ నక్సల్స్‌కు కన్పించదా అని ప్రశ్నించారు. అడవుల్లోని అన్నలకు ఆయన విజ్ఞప్తి చేస్తూ, అర్బన్ నక్సల్స్ మిమ్ముల్ని రెచ్చగొడుతున్నారని, వాళ్లు ఆస్తులు కూడగడుతూ పదవులు అనుభవిస్తున్నారని, వారి మాటలు నమ్మి మోసపోవద్దని కోరారు. 

2026 మార్చి నాటికి మావోయిస్టులు అంతం..
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒక్క మాట ఇస్తే తప్పరని, వచ్చే మార్చి నాటికి మావోయిజాన్ని పూర్తిగా అంతం చేస్తామని బండి సంజయ్ హెచ్చరించారు. దయచేసి నక్సలైట్లంతా లొంగిపోవాలని, వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి సాయం అందిస్తామని, వారు సంతోషంగా జీవించవచ్చని హామీ ఇచ్చారు. నక్సలిజాన్ని ఎవరు సమర్థించినా వాళ్లు కూడా నేరస్తులేనని, మావోయిస్టులే తుపాకులు వదిలి జన జీవన స్రవంతిలో కలుస్తుంటే, అందుకు భిన్నంగా అర్బన్ నక్సల్స్ తుపాకులు పట్టండి, మావోయిస్టుల్లో చేరండి అంటే ఊరుకుంటామా, అది సమర్థనీయమా అని ప్రశ్నించి, వారి విజ్ఞతకే ఆ నిర్ణయాన్ని వదిలేస్తున్నానని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Re-NEET UG 2026 Result: నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
Breaking News:ఏపీ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోంది--కళ్లు నెత్తికెక్కే ఓడిపోయాం- కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
ఏపీ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోంది--కళ్లు నెత్తికెక్కే ఓడిపోయాం- కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Kaleshwaram Project: కాళేశ్వరం నీళ్లు వదలకుంటే హైదరాబాద్‌లో బిందెల యుద్ధమే :ABP Desamతో మాజీ ఇరిగేషన్ ఇంజనీర్ టి. వెంటేశం
కాళేశ్వరం నీళ్లు వదలకుంటే హైదరాబాద్‌లో బిందెల యుద్ధమే :ABP Desamతో మాజీ ఇరిగేషన్ ఇంజనీర్ టి. వెంటేశం
Telangana Latest News: 9,000 రూపాయల ఖరీదు చేసే డ్రోన్ 91 రూపాయలకే! టీబీ రోగుల పాలిట వరంలా సేవలు! 
9,000 రూపాయల ఖరీదు చేసే డ్రోన్ 91 రూపాయలకే! టీబీ రోగుల పాలిట వరంలా సేవలు! 

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: బెంగాల్‌లో ఘోర ప్రమాదం.. స్కూల్‌ బస్సును ఢీకొట్టిన రైలు- ముగ్గురి మృతి, పలువురికి గాయాలు
బెంగాల్‌లో ఘోర ప్రమాదం.. స్కూల్‌ బస్సును ఢీకొట్టిన రైలు- ముగ్గురి మృతి, పలువురికి గాయాలు
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
Rains In AP And Telangana: అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి జల్లులు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి జల్లులు
Re-NEET UG 2026 Result: నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
Embed widget