అన్వేషించండి

దేశంలోనే అత్యుత్తమ సహకార బ్యాంకుగా కరీంనగర్ డీసీసీ

దేశంలోనే దశాబ్దపు అత్యుత్తమ సహకార బ్యాంకుగా కరీంనగర్ కేడీసీసీ బ్యాంక్ సేవలకు గుర్తింపు దక్కింది. ఢిల్లీలో కేంద్ర మంత్రి అమిత్ షా చేతులమీదుగా అవార్డు సైతం అందుకున్నారు.

సహకార ఉద్యమంలో విప్లవాత్మకమైన బ్యాంకుగా ఉన్న కరీంనగర్‌ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు మరో ఘన సాధించింది. దేశంలోనే అత్యంత ఉత్తమమైన పనితీరుకు దేశవ్యాప్త గుర్తింపు వచ్చింది. సహకార ఉద్యమం వరుస విజయాలతో రైతాంగానికి సేవలందించడమే పరమావధిగా 1904 సంవత్సరంలో స్థాపించిన కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఇటీవలే శత వసంతోత్సవాలు జరుపుకుంది. ఎన్నో ఎత్తు పల్లాలను అధిగమిస్తూ ఈ బ్యాంకు గత దశాబ్ద కాలం వరకు కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతూ ఉండేది.

అసలు బ్యాంకు మనుగడే కష్టమైన పరిస్థితుల్లో వరుసగా రెండుసార్లు అధ్యక్షుడిగా ఎన్నికైన కొండూరు రవీందర్ బ్యాంకు వ్యాపార సరళిని మార్చేశారు. సేవలను విస్తృతపరచి దేశంలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో అన్నింటిలో అగ్రగామిగా నిలిపారు. పాలకవర్గ సహకారం.. ముఖ్య కార్యనిర్వహణాధికారి సత్యనారాయణ ఇతర సిబ్బందితో కలిసి అద్భుతాలు సాధించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడం లోనే కాదు... గత దశాబ్దకాలంలోనే ముంబైలోని నాప్కాబ్ ద్వారా అత్యుత్తమ బ్యాంక్‌గా గుర్తింపు తీసుకొచ్చారు. తాజాగా దేశంలోనే ఈ దశాబ్దపు ఉత్తమ బ్యాంకుగా ఎంపికై సత్తా చాటారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి అమిత్ షా చేతులమీదుగా అవార్డు సైతం అందుకున్నారు.

గ్రామీణ ప్రజలకు అత్యవసర సమయాల్లో సేవలు

కేడీసీసీబీ ఒకప్పుడు ఎన్నో ఎత్తుపల్లాలను ఎదుర్కొంది. తీవ్రమైన నష్టాల ఊబిలో కూరుకుపోయింది. 2005 - 2006 ఆర్థిక సంవత్సరం వరకు రూ. 57.72 కోట్ల నష్టాల్లో ఉండగా, 2012-13 నుంచి లాభాల బాటలో పయనిస్తుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని చిన్న సన్నకారు రైతులకు అన్ని రకాల ఆర్థిక అవసరాలు తీరుస్తుంది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా ఆర్థికేతర సేవలను అందిస్తూ గ్రామీణ ప్రజలకు అత్యవసర సమయాల్లో దిక్కుగా మారింది. ప్రజాస్వామ్య స్ఫూర్తితో పాలకవర్గం రూపొందించే మార్గదర్శకాలు మంచి ఫలితాలు ఇచ్చాయి. వివిధ అంశాల కోసం ఏర్పడిన ప్రత్యేక కమిటీలు, వాటి నిర్ణయాలు తద్వారా చేపట్టే అన్ని రకాల సేవలు జిల్లాలోని గ్రామీణులకు కొంగు బంగారమైంది. 1,207 గ్రామాల్లోని 7.68 లక్షల ఖాతాదారుల ఆర్థిక పరిపుష్టికి వారి మేలైన జీవన విధానానికి తోడ్పాటు అందిస్తుంది. ప్రజల ఆర్థిక అవసరాలను గుర్తించి వారికి అనువైన సౌకర్యాలు చాలా సరళీకృత పద్ధతులు ఈ బ్యాంకు అందిస్తుంది.

లాభాల బాటలో కేడీసీసీ బ్యాంక్

2012లో కేవలం 29 శాతంగా ఉన్న బ్యాంకు ప్రస్తుతం 65 శాఖలకు విస్తరించింది. అప్పటి వాటా ధనం రూ .62 కోట్ల నుంచి ప్రస్తుతం 346 కోట్లకు పెరిగింది. 2012లో రూ. 271.30 కోట్ల డిపాజిట్లు ఉండగా ప్రస్తుతం 2263 పాయింట్ 68 కోట్లకు అభివృద్ధి చెందింది. బ్యాంకులో పని చేసే సిబ్బంది 165 నుంచి 483 వరకు పెరిగారు. వ్యాపారం రూ.4.47 కోట్ల నుంచి 10.14 కోట్లకు పెరిగింది. సగటున ఒక్కోచోట వ్యాపారం చూస్తే రూ. 25.4 కోట్ల నుంచి రూ. 73.14 కోట్లకు చేరింది. 2.40 శాతంగా ఉన్న నిరర్ధక ఆస్తులు 1.2 శాతానికి తగ్గాయి. 2011-12 ఆర్థిక సంవత్సరం నాటికి నికర నష్టం రూ. 563.43 లక్షలు కాగా, 2021 22 ఆర్థిక సంవత్సరం నాటికి లాభం 2,142.38 లక్షలు ఆర్జించింది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Jeevan Reddy To joins BRS: బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
Telangana RTC Protest : మార్చి 26 నుంచి ఆర్టీసీ బస్‌లకు బదులు రోడ్డెక్కనున్న సిబ్బంది! 31 డిమాండ్‌లతో సర్కారుకు సమ్మె నోటీసు!
మార్చి 26 నుంచి ఆర్టీసీ బస్‌లకు బదులు రోడ్డెక్కనున్న సిబ్బంది! 31 డిమాండ్‌లతో సర్కారుకు సమ్మె నోటీసు!
RGUKT Admissions 2026: తెలంగాణ ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఐటీ అడ్మిషన్లు సందడి షురూ! 2026-27 విద్యాసంవత్సర షెడ్యూల్ విడుదల!
తెలంగాణ ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఐటీ అడ్మిషన్లు సందడి షురూ! 2026-27 విద్యాసంవత్సర షెడ్యూల్ విడుదల!
Telangana Tenth Class Exams: తెలంగాణ పదో తరగతి పరీక్షలకు అంతా సిద్ధం! ఈ రూల్స్ తెలుసుకోకుంటే ఎగ్జామ్ రాయలేరు!
తెలంగాణ పదో తరగతి పరీక్షలకు అంతా సిద్ధం! ఈ రూల్స్ తెలుసుకోకుంటే ఎగ్జామ్ రాయలేరు!

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Embed widget