అన్వేషించండి

Karimnagar: ప్రధాని మోదీ కరీంనగర్ సభతో పార్టీలో నూతనోత్సాహం, ఆనందంలో కార్యకర్తలు

మునుగోడు ఉప ఎన్నికల్లో పరాభవం తర్వాత బీజేపీలో జోష్ తగ్గిందనడం వాస్తవం. అయితే మోదీ స్థాయి నేత జాతీయ స్థాయి ప్రాజెక్టుకు నేరుగా రావడంతో బీజేపీ శ్రేణులకు ఉత్సాహం వచ్చింది.

ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో ఉత్తర తెలంగాణకే ఆయువు పట్టుగా  భావించే ఉమ్మడి కరీంనగర్ జిల్లా రామగుండంలో జరిగిన ప్రధాని మోదీ సభ పట్ల బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం వ్యక్తం అవుతుంది. ఈ మధ్య జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో పరాభవం తర్వాత బీజేపీలో జోష్ తగ్గిందనడం వాస్తవం. అయితే వెను వెంటనే దిద్దుబాటు చర్యలకు దిగిన బీజేపీ శ్రేణులకు మోదీ స్థాయి నేత జాతీయ స్థాయి ప్రాజెక్టుకు నేరుగా రావడం కలిసి వచ్చిందని చెప్పవచ్చు. గతంలో సీఎం కేసీఆర్ తో సహా పలువురు మంత్రులు యూరియాకి సంబంధించి ప్రకటనలు చేసినప్పటికీ ఆచరణాత్మకంగా తాము మాత్రమే చేసి చూపించగలిగామని మోదీ ప్రకటించడం పట్ల బీజేపీ వర్గాల్లో ఆనందం వ్యక్తం అవుతోంది.

తెలంగాణలో కీలకమైన రైతుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించామని పేర్కొన్న మోదీ కేవలం శంకుస్థాపనకే తాము పరిమితం కాదని రైతుల సమస్యలను ప్రాక్టికల్ గా ఆలోచించి మరీ పరిష్కరిస్తామని తెలపడంతో బీజేపీ వర్గాలు మరింత ఉత్సాహంగా పనిచేయడానికి ముందుకెళ్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక సింగరేణి ప్రైవేట్ పరం చేస్తారంటూ వచ్చిన పుకార్లను పీఎం నేరుగానే కొట్టి పారేశారు. ప్రైవేట్ చేయాలంటే 51 శాతం ఉన్న రాష్ట్ర ప్రభుత్వమే వలన అవుతుందని తమ వాటా 49 శాతం అని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితిలో సింగరేణి ప్రైవేట్ పరం చేసే ఆలోచన లేదని కుండ బద్దలు కొట్టడం కొంతవరకు బీజేపీ పార్టీకి అనుకూలించిందని చెప్పవచ్చు.

పీఎం నోట కూల్చివేత మాట
ఎప్పుడూ లేని విధంగా ఏకంగా ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి ప్రభుత్వాన్ని కూల్చివేస్తామంటూ ప్రకటించడం రాజకీయ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. తాము ప్రజావ్యతిరేక ప్రభుత్వాలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని.. అవినీతికి పాల్పడితే ఎలాంటి స్థానిక ప్రభుత్వాన్ని అయినా సరే.. కూల్చివేస్తామంటూ నేరుగా ప్రకటించడంతో ఇక బీజేపీ కేంద్ర స్థాయి నేతలు ఎలాంటి వ్యూహాలను రచించి దుందుడుకుగా వెళ్ళబోతున్నారో చెప్పకనే చెప్పినట్టు అయింది. ఈ మాట రాష్ట్ర నేతల్లో ఉత్సాహం నింపగా ప్రతిపక్షాలకు సీరియస్ గానే ఒక వార్నింగ్ ఇచ్చినట్టు అయింది.

ఈ ఊపు కొనసాగేనా?
నిజానికి రాష్ట్ర రాజకీయాల్లో బిజెపిలో కీలక పాత్ర వహిస్తున్న పలువురు నేతలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వారే ప్రస్తుతం ఉన్న పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్లో కార్పొరేటర్ నుండి ఎంపీ వరకు ఎదిగారు. ఇక టీఆర్ఎస్ పార్టీ పుట్టుక నుండి ఉన్న ఈటల రాజేందర్ ప్రస్తుతం హుజురాబాద్ ఉప ఎన్నిక తరువాత చేరికల కమిటీ చైర్మన్గా కొనసాగుతున్నారు. నేరుగా కేంద్రస్థాయి నేతలతో సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఇక మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు, సీనియర్ బీజేపీ నేత మురళీధర్ రావు పేరాల శేఖర్ జి లాంటి ఉద్దండులంతా కరీంనగర్ జిల్లాకు చెందిన వారి కావడం గమనార్హం. 

13 నియోజకవర్గాలున్న ఈ జిల్లాలో పట్టు సాధిస్తే తెలంగాణపై చేయి సాధించడం తేలిక అనేది వాస్తవం. అందుకే మొదటి నుండి టీఆర్ఎస్ అగ్రనేత కేసీఆర్ సైతం కరీంనగర్ ని నమ్ముకునే తన రాజకీయ ప్రస్తానాన్ని ప్రారంభించారు. అలాంటి కీలక ప్రాంతంలో పీఎం మోడీ సభ నిర్వహించి సక్సెస్ కావడం పట్ల బీజేపీ నాయకుల్లో కార్యకర్తల్లో ఆనందం వ్యక్తం అవుతుంది. తాము నిర్వహించింది.. రాజకీయ సంబంధిత సభ కాదు అని బీజేపీ నేతలు అంటున్నప్పటికీ పూర్తిగా వ్యూహాత్మకంగానే ప్లాన్ చేశారన్నది మాత్రం వాస్తవం.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Latest News: తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Budget 2026:దేశంలో తొలిసారి ఆదివారం నాడు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారా ? కొనసాగుతున్న సస్పెన్స్ !
దేశంలో తొలిసారి ఆదివారం నాడు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారా ? కొనసాగుతున్న సస్పెన్స్ !
Ibomma Case: ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ

వీడియోలు

INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Rohit Sharma, Virat Kohli ODI Matches in 2026 | 2026లో రో - కో ఆడే మ్యాచులు ఇవే
India vs New Zealand Series Squad | టీమ్ సెలక్షన్ లో భారీ ట్విస్ట్
Shubman Gill in Team India BCCI | గిల్ విషయంలో సెలెక్టర్ల మాస్టర్ ప్లాన్ ఇదేనా?
Hardik Pandya in Test Cricket | టెస్టుల్లోకి పాండ్యా రీఎంట్రీ ఫిక్స్?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Latest News: తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Budget 2026:దేశంలో తొలిసారి ఆదివారం నాడు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారా ? కొనసాగుతున్న సస్పెన్స్ !
దేశంలో తొలిసారి ఆదివారం నాడు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారా ? కొనసాగుతున్న సస్పెన్స్ !
Ibomma Case: ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
Gig Workers Strike : గిగ్ వర్కర్ల సమ్మె నివారణకు కేంద్రం కొత్త ఫార్ములా! ఈ షరతులు నెరవేర్చితేనే సామాజిక భద్రతా ప్రయోజనాలు!
గిగ్ వర్కర్ల సమ్మె నివారణకు కేంద్రం కొత్త ఫార్ములా! ఈ షరతులు నెరవేర్చితేనే సామాజిక భద్రతా ప్రయోజనాలు!
India Tour of Bangladesh 2026:బంగ్లాదేశ్‌లో హింసపై భారత్‌లో ఆందోళనలు కొనసాగుతున్న వేళ బీసీబీ కీలక ప్రకటన
బంగ్లాదేశ్‌లో హింసపై భారత్‌లో ఆందోళనలు కొనసాగుతున్న వేళ బీసీబీ కీలక ప్రకటన
Pariksha Pe Charcha 2026: పరీక్షా పే చర్చ 2026 కోసం ఎలా నమోదు చేసుకోవాలి? ఎవరు పాల్గొనవచ్చు?
పరీక్షా పే చర్చ 2026 కోసం ఎలా నమోదు చేసుకోవాలి? ఎవరు పాల్గొనవచ్చు?
CBSE Practical Examinations :సీబీఎస్ఈ 10వ, 12వ తరగతి ప్రాక్టికల్ పరీక్షలకు కొత్త మార్గదర్శకాలు! ఆ మార్పులేంటో తెలుసుకోండి!
సీబీఎస్ఈ 10వ, 12వ తరగతి ప్రాక్టికల్ పరీక్షలకు కొత్త మార్గదర్శకాలు! ఆ మార్పులేంటో తెలుసుకోండి!
Embed widget