అన్వేషించండి

Karimnagar: కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా జ్వరాల విజృంభణ- ఆసుపత్రిలో వసతులపై రోగుల అసంతృప్తి

Health News: కరీంనగర్ జిల్లా ప్రభుత్వం ప్రధాన ఆసుపత్రిలో ఇప్పటికే ప్రతిరోజు వందల సంఖ్యల్లో విష జ్వరాల బారిన పడ్డవారు ఆసుపత్రిలో అడ్మిట్ అవుతున్నారు.

Telangana: తెలంగాణ వ్యాప్తంగా ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. జ్వరాల బారిన పడ్డవారు ఆసుపత్రుల్లో అడ్మిట్ అవుతున్నారు. విష జ్వరాల బారిన పడ్డవారి సంఖ్య రోజురోజుకీ విజృంభిస్తుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా విష జ్వరాలు, డెంగీ ఫీవర్ కేసులు రోజురోజుకు విజృంభిస్తున్నాయి. కరీంనగర్ ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రి రోగులతో కిటకిటలాడుతోంది.

కరీంనగర్ ప్రభుత్వాసుపత్రి కిటకిట

కరీంనగర్ జిల్లా ప్రభుత్వం ప్రధాన ఆసుపత్రిలో ఇప్పటికే ప్రతిరోజు వందల సంఖ్యల్లో రోగులు జ్వరాల బారిన పడి అడ్మిట్ అవుతున్నారు. ప్రతిరోజు వందల సంఖ్యలో డెంగీ టెస్ట్‌లు నిర్వహిస్తున్నారు. రోజు మూడు నుంచి 5 కేసుల వరకు డెంగీ పాజిటివ్ కేసులు బయపడుతున్నాయి. వచ్చిన రోగులకు ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పిస్తూ వైద్యం అందిస్తున్నామని కరీంనగర్ ప్రధాన ఆసుపత్రి సూపరిండెంట్ వీరారెడ్డి తెలిపారు. ఎలాంటి జ్వరం వచ్చినా డెంగీగా భావించి వైద్యులను సంప్రదించాలని ఆయన సూచిస్తున్నారు. 

ప్రభుత్వాసుపత్రిలో సౌకర్యాల కొరతపై రోగుల అసంతృప్తి

జ్వరాలు వచ్చి ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం చేయించుకోలేని పరిస్థితుల్లో ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్నామని రోగలు చెబుతున్నారు. వైద్యంతోపాటు సౌకర్యాల కొరత ఉందని ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. రోగులకు సెలైన్ ఎక్కించలేని పరిస్థితి ఉందని స్టాండ్ల కొరత వేధిస్తోందంటున్నారు. అందుకే కిటికీ గ్రిల్స్‌కి బిగించి సెలైన్లను ఎక్కిస్తున్నారని అంటున్నారు. ముక్కు మూసుకొని బాత్రూంలోకి వెళ్లాల్సిన పరిస్థితి ఉందని రోగులు చెబుతున్నారు. వైద్యులు నర్సులతో ఇబ్బంది లేదంటున్నారు. 

Also Read: అమెరికాకు వెళ్లిన కరీంనగర్ మేయర్, నోటీసులు జారీ చేసిన జిల్లా కలెక్టర్ - రీజన్ ఏంటంటే!

డెంగీ జ్వరం వస్తే ఇలా తెలుసుకోవాలి...?
సామాన్యంగా ఈ మధ్యకాలంలో ఎలాంటి జ్వరం వచ్చినా డెంగీగా భావించి వైద్యులను సంప్రదించి వైద్యం చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. జ్వరం వచ్చిన మూడు రోజులకి డెంగీగా మారే అవకాశం ఉందంటున్నారు. ఒకవేళ కళ్ళు ఎర్రబడ్డ కాళ్లు చేతులు విపరీతంగా నొప్పులు వచ్చిన డెంగీగా నిర్ధారణ చేసుకోవాలని చెబుతున్నారు. 

భయపడొద్దని సూచిస్తున్న వైద్యాధికారులు

మంకీ పాక్స్ వ్యాధి వెలుగులోకి వచ్చిన వేళ ప్రజలు భయపడాల్సిన పని లేదంటున్నారు వైద్యులు. ఇప్పటి వరకు భారతదేశంలో ఎలాంటి కేసులు నమోదుకాలేదని ధైర్యం చెబుతున్నారు. ఒక వేళ కళ్ళు  వంటిపై ఎర్రటి దద్దుర్లు వచ్చినా వెంటనే వైద్యులను సంప్రదించాలని కరీంనగర్ ప్రధాన ఆసుపత్రి సూపర్డెంట్ అంటున్నారు. విష జ్వరాల బారిన పడ్డ రోగులు మంచి పోషక ఆహారాలను తీసుకోవాలని చెబుతున్నారు. 

Also Read:సారు నా కొడుకులు అన్నం పెడతలేరు - వృద్ధురాలు ఆవేదన, పోలీసులకు ఫిర్యాదు 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: హైదరాబాద్‌లో టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అపశృతి.. ఇద్దరు విద్యార్థులకు గాయాలు
హైదరాబాద్‌లో టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అపశృతి.. ఇద్దరు విద్యార్థులకు గాయాలు
Konda Surekha: కొండా సురేఖకు ప్రత్యామ్నాయం ఎవరు? సూటబుల్‌ నేతలను వెతికే పనిలో కాంగ్రెస్‌ అధిష్ఠానం!
కొండా సురేఖకు ప్రత్యామ్నాయం ఎవరు? సూటబుల్‌ నేతలను వెతికే పనిలో కాంగ్రెస్‌ అధిష్ఠానం!
CM Revanth Reddy US Visit: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
Kesineni Nani: విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
IND VS SL Padikkal Hundred: పడిక్కల్ సూపర్ సెంచరీ.. భారీ స్కోరు దిశ‌గా టీమిండియా.. రాణించిన గిల్, జ‌డేజా, జైస్వాల్, పంత్ ఇంజ్యూరీ సస్పెన్స్, లంక‌తో రెండో టెస్టు!
పడిక్కల్ సూపర్ సెంచరీ.. భారీ స్కోరు దిశ‌గా టీమిండియా.. రాణించిన గిల్, జ‌డేజా, జైస్వాల్, పంత్ ఇంజ్యూరీ సస్పెన్స్, లంక‌తో రెండో టెస్టు!
Viral Video: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
Zombie Reddy 2 : జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
Anagani Satya Prasad: అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
Auto Drivers Strike: చర్చల ద్వారానే సమస్య పరిష్కారం.. ఆటో కార్మికులు సమ్మెకు వెళ్లొద్దని మంత్రి పొన్నం విజ్ఞప్తి
చర్చల ద్వారానే సమస్య పరిష్కారం.. ఆటో కార్మికులు సమ్మెకు వెళ్లొద్దని మంత్రి పొన్నం విజ్ఞప్తి
Gachibowli Building Collapse: గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
Embed widget