అన్వేషించండి

Karimnagar: కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా జ్వరాల విజృంభణ- ఆసుపత్రిలో వసతులపై రోగుల అసంతృప్తి

Health News: కరీంనగర్ జిల్లా ప్రభుత్వం ప్రధాన ఆసుపత్రిలో ఇప్పటికే ప్రతిరోజు వందల సంఖ్యల్లో విష జ్వరాల బారిన పడ్డవారు ఆసుపత్రిలో అడ్మిట్ అవుతున్నారు.

Telangana: తెలంగాణ వ్యాప్తంగా ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. జ్వరాల బారిన పడ్డవారు ఆసుపత్రుల్లో అడ్మిట్ అవుతున్నారు. విష జ్వరాల బారిన పడ్డవారి సంఖ్య రోజురోజుకీ విజృంభిస్తుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా విష జ్వరాలు, డెంగీ ఫీవర్ కేసులు రోజురోజుకు విజృంభిస్తున్నాయి. కరీంనగర్ ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రి రోగులతో కిటకిటలాడుతోంది.

కరీంనగర్ ప్రభుత్వాసుపత్రి కిటకిట

కరీంనగర్ జిల్లా ప్రభుత్వం ప్రధాన ఆసుపత్రిలో ఇప్పటికే ప్రతిరోజు వందల సంఖ్యల్లో రోగులు జ్వరాల బారిన పడి అడ్మిట్ అవుతున్నారు. ప్రతిరోజు వందల సంఖ్యలో డెంగీ టెస్ట్‌లు నిర్వహిస్తున్నారు. రోజు మూడు నుంచి 5 కేసుల వరకు డెంగీ పాజిటివ్ కేసులు బయపడుతున్నాయి. వచ్చిన రోగులకు ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పిస్తూ వైద్యం అందిస్తున్నామని కరీంనగర్ ప్రధాన ఆసుపత్రి సూపరిండెంట్ వీరారెడ్డి తెలిపారు. ఎలాంటి జ్వరం వచ్చినా డెంగీగా భావించి వైద్యులను సంప్రదించాలని ఆయన సూచిస్తున్నారు. 

ప్రభుత్వాసుపత్రిలో సౌకర్యాల కొరతపై రోగుల అసంతృప్తి

జ్వరాలు వచ్చి ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం చేయించుకోలేని పరిస్థితుల్లో ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్నామని రోగలు చెబుతున్నారు. వైద్యంతోపాటు సౌకర్యాల కొరత ఉందని ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. రోగులకు సెలైన్ ఎక్కించలేని పరిస్థితి ఉందని స్టాండ్ల కొరత వేధిస్తోందంటున్నారు. అందుకే కిటికీ గ్రిల్స్‌కి బిగించి సెలైన్లను ఎక్కిస్తున్నారని అంటున్నారు. ముక్కు మూసుకొని బాత్రూంలోకి వెళ్లాల్సిన పరిస్థితి ఉందని రోగులు చెబుతున్నారు. వైద్యులు నర్సులతో ఇబ్బంది లేదంటున్నారు. 

Also Read: అమెరికాకు వెళ్లిన కరీంనగర్ మేయర్, నోటీసులు జారీ చేసిన జిల్లా కలెక్టర్ - రీజన్ ఏంటంటే!

డెంగీ జ్వరం వస్తే ఇలా తెలుసుకోవాలి...?
సామాన్యంగా ఈ మధ్యకాలంలో ఎలాంటి జ్వరం వచ్చినా డెంగీగా భావించి వైద్యులను సంప్రదించి వైద్యం చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. జ్వరం వచ్చిన మూడు రోజులకి డెంగీగా మారే అవకాశం ఉందంటున్నారు. ఒకవేళ కళ్ళు ఎర్రబడ్డ కాళ్లు చేతులు విపరీతంగా నొప్పులు వచ్చిన డెంగీగా నిర్ధారణ చేసుకోవాలని చెబుతున్నారు. 

భయపడొద్దని సూచిస్తున్న వైద్యాధికారులు

మంకీ పాక్స్ వ్యాధి వెలుగులోకి వచ్చిన వేళ ప్రజలు భయపడాల్సిన పని లేదంటున్నారు వైద్యులు. ఇప్పటి వరకు భారతదేశంలో ఎలాంటి కేసులు నమోదుకాలేదని ధైర్యం చెబుతున్నారు. ఒక వేళ కళ్ళు  వంటిపై ఎర్రటి దద్దుర్లు వచ్చినా వెంటనే వైద్యులను సంప్రదించాలని కరీంనగర్ ప్రధాన ఆసుపత్రి సూపర్డెంట్ అంటున్నారు. విష జ్వరాల బారిన పడ్డ రోగులు మంచి పోషక ఆహారాలను తీసుకోవాలని చెబుతున్నారు. 

Also Read:సారు నా కొడుకులు అన్నం పెడతలేరు - వృద్ధురాలు ఆవేదన, పోలీసులకు ఫిర్యాదు 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

HPV Vaccine India: దేశవ్యాప్తంగా ఉచిత హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రారంభం- తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
దేశవ్యాప్తంగా ఉచిత హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రారంభం- తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
PM Kisan Yojana: హోలీకి PM కిసాన్ యోజన 22వ విడత నిధులు వస్తాయా? తాజా అప్‌డేట్ ఏంటీ?
హోలీకి PM కిసాన్ యోజన 22వ విడత నిధులు వస్తాయా? తాజా అప్‌డేట్ ఏంటీ?
HPV Vaccine: రూ. 10 HPV వ్యాక్సిన్ ఉచితంగా నేటి నుంచి పంపిణీ! వ్యాక్సినేషన్‌కు 14 ఏళ్ల బాలికలకు అవసరమయ్యే పత్రాలివే! 
రూ. 10 HPV వ్యాక్సిన్ ఉచితంగా నేటి నుంచి పంపిణీ! వ్యాక్సినేషన్‌కు 14 ఏళ్ల బాలికలకు అవసరమయ్యే పత్రాలివే! 
KCR Petition: కాళేశ్వరం కేసులో సాక్షిగా పిలిచి దోషిగా తేల్చారు! జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ రద్దు చేయాలని కేసీఆర్ న్యాయపోరాటం!
కాళేశ్వరం కేసులో సాక్షిగా పిలిచి దోషిగా తేల్చారు! జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ రద్దు చేయాలని కేసీఆర్ న్యాయపోరాటం!

వీడియోలు

ABP Network Chief Editor Atideb Sarkar Speech | ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 ప్రారంభోపన్యాసం చేసిన అతిదేబ్ సర్కార్ | ABP Desam
ABP Network Ideas of India Summit 2026 Inaguration | ఏబీపీ నెట్ వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 సమ్మిట్ ప్రారంభం | ABP Desam
Kavitha about Delhi Liquor Scam Case | లిక్కర్ స్కాం కేసులో కవితకు క్లీన్ చిట్
India vs Zimbabwe Highlights T20 World Cup | జింబాబ్వేను 72 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా
Rinku Singh Father Passes Away | రింకూ సింగ్ తండ్రి కన్నుమూత

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
శ్రీలంకపై నెగ్గినా వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. సెమీఫైనల్స్‌కు న్యూజిలాండ్
శ్రీలంకపై నెగ్గినా వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. సెమీఫైనల్స్‌కు న్యూజిలాండ్
Israel Strike On Iran: ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
PM Modi On Kakinada Incident: సామర్లకోట ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
సామర్లకోట బాణసంచా ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
Kokapet Swarupananda Lands: కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
Nara Lokesh : సంజయ్ దత్‌తో నారా లోకేశ్ మీటింగ్ - మంత్రి విజన్‌కు బాలీవుడ్ లెజెండ్ ఫిదా
సంజయ్ దత్‌తో నారా లోకేశ్ మీటింగ్ - మంత్రి విజన్‌కు బాలీవుడ్ లెజెండ్ ఫిదా
TTD budget: వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
Ananya Nagalla: తాతయ్యగుంట గంగమ్మ గుడిలో అనన్య నాగళ్ళ... 'పుష్ప 2'లో గంగమ్మ జాతర ఫైట్, టీటీడీ చొరవతో!
తాతయ్యగుంట గంగమ్మ గుడిలో అనన్య నాగళ్ళ... 'పుష్ప 2'లో గంగమ్మ జాతర ఫైట్, టీటీడీ చొరవతో!
Pakistan vs Sri Lanka: టీ20 వరల్డ్ కప్‌లో కోహ్లీ రికార్డు బద్ధలుకొట్టిన పాక్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్
టీ20 వరల్డ్ కప్‌లో కోహ్లీ రికార్డు బద్ధలుకొట్టిన పాక్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్
Embed widget