అన్వేషించండి

Karimnagar Ayush: ఫలించిన బండి సంజయ్ కృషి - కరీంనగర్‌కు ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ మంజూరు చేసిన కేంద్రం

AYUSH hospital: కరీంనగర్ కు ఆయుష్ ఆస్పత్రిని మంజూరు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన ప్రయత్నాలకు ఫలితం లభించింది.

AYUSH hospital for Karimnagar:  కరీంనగర్ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి   బండి సంజయ్ కుమార్  చేసిన నిరంతర కృషి ఫలితంగా కరీంనగర్‌కు 50 పడకల   ఆయుష్  ఆసుపత్రి మంజూరైంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తాజాగా పరిపాలనాపరమైన అనుమతులు మంజూరు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తర తెలంగాణలోనే ఒక ప్రధాన వైద్య హబ్‌గా కరీంనగర్ ఎదిగేందుకు ఈ నిర్ణయం దోహదపడనుంది.  

 మొదటి విడత నిధులు మంజూరు చేసిన కేంద్రం            

ఈ ఆసుపత్రి నిర్మాణానికి మొత్తం రూ. 15 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేయగా, అందులో మొదటి విడతగా కేంద్ర ప్రభుత్వం రూ. 7.5 కోట్ల నిధులను తక్షణమే విడుదల చేసింది. అల్లోపతి మందుల వల్ల కలిగే దుష్ప్రభావాల  భయంతో ఆయుర్వేదం, హోమియోపతి వైపు మొగ్గు చూపుతున్న ప్రజల ఆకాంక్షను గుర్తించిన బండి సంజయ్  , కేంద్ర ఆయుష్ మంత్రి ప్రతాప్ రావు జాదవ్ ని కలిసి ఈ ఆసుపత్రి అవశ్యకతను వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్రం, ఈ ప్రాంత అవసరాలను దృష్టిలో ఉంచుకుని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.              

ఆయుర్వేద చికిత్సలు అందించనున్న ఆయుష్    
  
మంజూరైన 50 పడకల ఆసుపత్రిలో వైవిధ్యభరితమైన విభాగాలను ఏర్పాటు చేయనున్నారు. కాయచికిత్సకు 20, పంచకర్మకు 10,  సర్జికల్ సేవలకు  10, అలాగే ఈఎన్టీ, ప్రసూతి, స్త్రీ ఆరోగ్య సేవలకు మరో 5 పడకలను ప్రత్యేకంగా కేటాయించారు. ఇక్కడ కేవలం చికిత్సలే కాకుండా కాయకల్ప చికిత్స, యోగా, ధ్యానం, జీవనశైలి మార్పులపై కౌన్సిలింగ్ వంటి సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయి. తద్వారా దీర్ఘకాలిక వ్యాధులైన బీపీ, షుగర్, ఆస్తమా, మైగ్రేన్ వంటి సమస్యలకు సహజమైన పరిష్కారాలు లభించనున్నాయి.       

స్థలం ఎంపిక చేయనున్న కలెక్టర్                
  
ఆసుపత్రి ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని కేటాయించడం, వైద్యులు ,  ఇతర సిబ్బందిని నియమించే బాధ్యతలను కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది. ఈ మేరకు కేంద్రం నుంచి అధికారిక లేఖ అందడంతో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఇప్పటికే ఆయుష్ అధికారులతో చర్చలు ప్రారంభించారు. త్వరలోనే తగిన స్థలాన్ని ఎంపిక చేసి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టనున్నారు.

ఉమ్మడి జిల్లా ప్రజలకు ఎంతో మేలు                        
  
ఈ ఆసుపత్రి అందుబాటులోకి వస్తే కరీంనగర్ జిల్లా ప్రజలతో పాటు చుట్టుపక్కల ఉన్న ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రజలకు ఉపశమనం లభిస్తుంది. మెడికల్ సూపరింటెండెంట్ నేతృత్వంలో సుమారు 21 మంది సెక్యూరిటీ సిబ్బందితో సహా భారీ సంఖ్యలో నర్సింగ్ స్టాఫ్, ల్యాబ్ టెక్నీషియన్లు, యోగా ట్రైనర్లు ఇక్కడ సేవలందించనున్నారు. మోదీ ప్రభుత్వం భారతీయ సాంప్రదాయ వైద్యానికి ఇస్తున్న ప్రాధాన్యతలో భాగంగా కరీంనగర్‌కు ఈ ప్రాజెక్టు దక్కడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.  

 

టాప్ హెడ్ లైన్స్

Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Godavari River Overflow: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Harish Rao Padayatra : హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Iran War: దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
Hyderabad Crime News: ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
రూ. 15 వేల EMI పై Maruti Brezza కొంటే డౌన్ పేమెంట్ ఎంత చెల్లించాలి? ఫీచర్ల వివరాలు
రూ. 15 వేల EMI పై Maruti Brezza కొంటే డౌన్ పేమెంట్ ఎంత చెల్లించాలి? ఫీచర్ల వివరాలు
Taslima Nasrin Back To Kolkata: రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
Jasprit Bumrah Out.!: లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
Tilak Varma News: సౌత్ జోన్ కెప్టెన్ గా తిలక్ వర్మ .. వైస్ కెప్టెన్ గా రికీ భుయ్  ఎంపిక
సౌత్ జోన్ కెప్టెన్ గా తిలక్ వర్మ .. వైస్ కెప్టెన్ గా రికీ భుయ్  ఎంపిక.. 23 నుంచి దులీప్ ట్రోఫీ
YSRCP MLA Virupakshi: కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Embed widget