By: ABP Desam | Updated at : 01 Sep 2022 07:42 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
Nirmala Sitharaman : ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ అప్పుల రాష్ట్రంగా మారిందని కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ ఆరోపించారు. కామారెడ్డి జిల్లా పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణ ప్రభుత్వంపై హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర పథకాల పేర్లను మారుస్తున్నారని, కేంద్రం ఒకటి పెడితే రాష్ట్రం ఇంకో పేరు పెడుతోందన్నారు. దీనిపై కేంద్రం ప్రశ్నిస్తే విమర్శిస్తున్నారన్నారు. ఆయుష్మాన్ భారత్ లో బలవంతంగా చేరిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అసలు వ్యయం కన్నా రూ.లక్ష 20 వేల కోట్లకు అధనంగా పెంచారన్నారు. ప్రాజెక్టుల వ్యయం ఇష్టమొచ్చినట్లుగా పెంచుతున్నారని నిర్మలా సీతారామన్ విమర్శించారు. మన ఊరు-మన బడి కేంద్ర పథకం అయితే దాన్ని రాష్ట్ర స్కీమ్ గా క్లెయిమ్ చేసుకుంటున్నారన్నారు. ప్రజలకు వాస్తవాలు అర్థం అవుతాయనే ఆయుష్మాన్ భారత్ లో చేరడం లేదన్నారు.
రైతు ఆత్మహత్యలలో నాలుగో స్థానం
తెలంగాణలో 100 మందిలో 91 మంది రైతులు అప్పుల పాలయ్యారు. ఫసల్ బీమా యోజన ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ రైతు ఆత్మహత్యలలో దేశంలో నాలుగో స్థానంలో ఉంది. రైతులకు ఇచ్చిన హామీ లక్ష రూపాయల రుణ మాఫీ ఎందుకు చేయలేకపోయారు. రైతు బీమా కౌలు రైతులకు ఎందుకు ఇవ్వరు. పెద్ద పెద్ద వాగ్దానాలు ఇస్తున్నారు తప్ప వాటిని నెరవేర్చడం లేదు. మిగులు బడ్జెట్ కాస్త లోటు బడ్జెట్ అయింది. బడ్జెట్ అప్రూవల్ కంటే ఎక్కువగా అప్పులు చేస్తున్నారు. బయట తీసుకునే అప్పులు అసెంబ్లీకి తెలియడం లేదు. బడ్జెట్ లో చాలా అప్పులు చూపించడం లేదు. అప్పుల గురించి అడిగే అధికారం కేంద్రానికి ఉంది. - కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
Smt @nsitharaman is on 3-day visit to Zaheerabad, Telangana as part of @BJP4India's 'Lok Sabha Pravas Yojana' & will attend various programmes including meeting with district office bearers, All BJP Morchas & IT & Social Media volunteers of Zaheerabad Parliamentary Constituency. pic.twitter.com/xxOU8eccYu
— NSitharamanOffice (@nsitharamanoffc) September 1, 2022
ప్రతి పిల్లాడిపై రూ.1.25 లక్షల అప్పు
తెలంగాణ లో పుట్టే ప్రతి పిల్లాడిపై రూ.1 .25 లక్షల అప్పు ఉందని కేంద్ర మంత్రి సీతారామన్ ఆరోపించారు. ఎఫ్ఆర్బీఎమ్ లిమిట్ ను తెలంగాణ దాటి పోతుందన్నారు. బిహార్ లో ఎలా ఉందో చూశారని, అక్కడి సీఎం ఈ సీఎం కేసీఆర్ మాట్లాడుతుంటే లేచి వెళ్లిపోయే ప్రయత్నం చేశారన్నారు. దేశం మొత్తం తిరిగే ముందు తెలంగాణలో సమస్యలు పరిష్కరించుకోవాలని హితవు పలికారు. లిక్కర్ స్కామ్ ఎవరిపై ఆరోపణలు వచ్చాయో వాళ్లే సమాధానం చెప్పాలని ఆమె అన్నారు. ఎమ్మెల్సీ కవితపై ఆరోపణలు వస్తే స్పందిచాల్సింది ఆమె తాను కాదు అని జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు నిర్మలా సీతారామన్.
Also Read : MP Dharmapuri Arvind : బిహార్ లో తెలంగాణ పరువు తీశారు, సీఎం కేసీఆర్ టూర్ పై ఎంపీ అర్వింద్ సూటి ప్రశ్నలు
Also Read : అమర జవాన్ యాదయ్య కుటుంబానికి ఎప్పుడు న్యాయం చేస్తారు? సీఎం కేసీఆర్కు రేవంత్ లేఖ
Telangana Polling 2023 LIVE Updates: తెలంగాణలో గెలిచేది ఎవరు.? నిలిచేది ఎవరు.? - ఏబీపీ సీ ఓటర్ సర్వే ఫలితాలు
Telangana Exit Poll Results 2023: కేసీఆర్ ఓడినందుకు సంతోషంగా ఉంది, శ్రీకాంతాచారికి ఇదే ఘనమైన నివాళి: రేవంత్ రెడ్డి
Telangana Assembly Election 2023: కన్ఫ్యూజన్ వద్దు వందశాతం గెలుపు BRS దే, కేటీఆర్ కామెంట్స్ వైరల్
Telangana Exit Poll 2023 Highlights : ఏబీపీ సీఓటర్ ఎగ్జిట్ పోల్స్ - తెలంగాణలో కాంగ్రెస్కు అడ్వాంటేజ్ కానీ హంగ్కూ చాన్స్ !
Telangana Assembly Election 2023: సాయంత్రం 5 గంటలకు తెలంగాణ వ్యాప్తంగా 63.94 శాతం పోలింగ్, ముగిసిన పోలింగ్ సమయం
విశాఖ ఫిషింగ్ హార్బర్ లో మరో అగ్నిప్రమాదం, ఎగసిపడుతున్న మంటలు - భారీగా నష్టం
ABP Cvoter Exit Poll: ఏయే రాష్ట్రంలో ఎవరిది పైచేయి? ABP CVoter ఎగ్జిట్ పోల్ కచ్చితమైన అంచనాలు
Best Bikes Under Rs 1 lakh: రూ.లక్షలోపు బెస్ట్ బైకులు - బడ్జెట్ ధరలో డబ్బులకు న్యాయం!
Madhya Pradesh Exit Poll 2023 Highlights: మధ్యప్రదేశ్ ఈసారి కాంగ్రెస్దే! ABP CVoter ఎగ్జిట్ పోల్ అంచనాలు ఇవే
/body>