అన్వేషించండి

కేసీఆర్‌ సార్‌కే ఓటెస్తం - కామారెడ్డి జిల్లాలో 9 పంచాయతీల్లో తీర్మానం

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. సీఎం కేసీఆర్ కామారెడ్ నుంచి కూడా పోటీ చేస్తారని ప్రకటించిన నేపథ్యంలో అక్కడ రాజకీయ వేడి రాజుకుంది.

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇటీవల బీఆర్‌ఎస్ అభ్యర్థుల ప్రకటన సమయంలో సీఎం కేసీఆర్ తాను గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో అక్కడ రాజకీయ వేడి రాజుకుంది. బీఆర్‌ఎస్‌ను బలపరిచేందుకు ఆ పార్టీ నేతలు రంగంలోకి దిగారు. కేసీఆర్ గెలుపు చారిత్రాత్మకంగా ఉండేలా ప్రణాళికలు వేస్తున్నారు. అందులో భాగంగా ఏకంగా పంచాయతీలకు పంచాయతీలే ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నారు. 

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓట్లన్నీ సీఎం కేసీఆర్‌కే వేస్తామని కామారెడ్డి జిల్లాలో 9 పంచాయతీల్లో నేతలు ఏకగ్రీవ తీర్మానాలు చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ రెండు చోట్ల నుంచి పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం గజ్వేల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండగా.. రాబోయే ఎన్నికల్లో గజ్వేల్ తోపాటు.. కామారెడ్డి నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో తమ  పంచాయతీ పరిధిలోని ప్రజలు మొత్తం కేసీఆర్‌కు ఓటు వేస్తామని మాచారెడ్డి మండలంలోని  8, పాల్వంచ మండలంలో ఓ పంచాయతీ పాలకవర్గం తీర్మానం చేశాయి. ఎంపీపీ లోయపల్లి నర్సింగ్‌​రావు,  జెడ్పీటీసీ మినుకూరి రాంరెడ్డి ఆధ్వర్యంలో మాచారెడ్డి మండలంలోని ఎల్లంపేట,  అంకిరెడ్డిపల్లి తండా, వెనుకతండా, నడిమితండా,  నెమ్లిగుట్ట తండా, బొడిగుట్ట తండా, మైసమ్మ చెరువు తండా, రాజ్‌​ఖాన్‌​పేట, పాల్వంచ మండలంలోని మంథని దేవునిపల్లి పంచాయతీ కేసీఆర్‌కు ఏకగ్రవంగా ఓటు వేసేలా తీర్మానాలు చేశాయి. 

ఇందులో భాగంగా ఆయా పంచాయతీల్లో ర్యాలీలు నిర్వహించి కేసీఆర్ ఫొటోకు క్షీరాభిషేకాలు చేశారు. తరువాత పంచాయతీ లెటర్‌​హెడ్‌​పై సీఎం కేసీఆర్‌కు మద్దతుగా ఏకగ్రీవంగా తీర్మానం చేస్తున్నట్లు రాసి సర్పంచులు, ఉప సర్పంచులు సంతకాలు చేశారు. ఎంపీపీ లోయపల్లి నర్సింగ్‌​రావు,  జెడ్పీటీసీ మినుకూరి రాంరెడ్డి మాట్లాడుతూ.. దేశానికే ఆదర్శంగా తెలంగాణ అభివృద్ధి చెందుతోందన్నారు. కేసీఆర్ నేతృత్వంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయన్నారు. 

కామారెడ్డి అభివృద్ధికి సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ కట్టుబడి ఉందన్నారు. రింగురోడ్డు నిర్మాణంతో కామారెడ్డి అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. ఇటీవల కామారెడ్డికి రింగ్ రోడ్డు నిర్మిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కార్యక్రమంలో బీఆర్‌ఎస్​ లీడర్లు పాల్గొన్నారు.  కాగా,  సిద్దిపేట రూరల్​ మండలం రాంపూర్‌లో కూడా బీఆర్​ఎస్‌కు ఓట్లు వేస్తామని అక్కడి గ్రామస్తులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.
 
నేతల తీర్మానంపై కాంగ్రెస్ ఆగ్రహం

9 పంచాయతీల్లో కేసీఆర్‌కు ఓటు వేస్తామని బీఆర్ఎస్ నేతలు తీర్మాణం చేయడంపై కాంగ్రెస్ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ చేసే తీర్మానాన్ని ప్రజా తీర్మానంగా ఎలా చూపుతారని కాంగ్రెస్‌ ​మాచారెడ్డి  మండల అధ్యక్షుడు గణేశ్‌ ​నాయక్​  ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ఎవరికి నచ్చిన పార్టీలతో వారు ముందుకెళ్తారన్నారు. బీఆర్‌ఎస్ చేసిన తీర్మానాలకు ఎటువంటి విలువ లేదన్నారు. గ్రామం మొత్తం బీఆర్ఎస్​‌కు ఏకగ్రీవంగా మద్దతు ఇస్తోందని తీర్మానించడం కరెక్ట్‌ ​కాదన్నారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేస్తూ, భూములను అమ్మకుంటున్న బీఆర్‌ఎస్‌కు వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. ఓడిపోతారనే భయంతోనే కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీచేస్తున్నారని విమర్శించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy: జలద్రోహం చేసింది కేసీఆర్ - కీలక విషయాలు బయట  పెట్టిన రేవంత్ రెడ్డి
జలద్రోహం చేసింది కేసీఆర్ - కీలక విషయాలు బయట పెట్టిన రేవంత్ రెడ్డి
ABP Network Ideas Of India 2025:
"మానవ స్ఫూర్తిని మానవత్వం పునరుద్ధరించాలి"- ABP నెట్ వర్క్ చీఫ్ ఎడిటర్ అతిదేబ్ సర్కార్
ABP Network Ideas Of India 2025: గ్రాండ్‌గా ప్రారంభమైన ABP నెట్‌వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2025
గ్రాండ్‌గా ప్రారంభమైన ABP నెట్‌వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2025
Koneru Konappa: కాంగ్రెస్ కు షాక్ - ఇలా చేరి అలా గుడ్ బై చెప్పిన మాజీ ఎమ్మెల్యే - బీఆర్ఎస్‌లోకేనా ?
కాంగ్రెస్ కు షాక్ - ఇలా చేరి అలా గుడ్ బై చెప్పిన మాజీ ఎమ్మెల్యే - బీఆర్ఎస్‌లోకేనా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Tirupati Special Herbal Soup | తిరుపతిలో ప్రాచుర్యం పొందుతున్న హెర్బల్ సూప్ కార్నర్ | ABP DesamIdeas of India 2025 | ఎలన్ మస్క్ గురించి గోయెంకాల వారసుడు ఏం చెప్పారంటే | ABP DesamIdeas of India 2025 : ఏబీపీ నెట్ వర్క్ చీఫ్ ఎడిటర్ Atideb Sarkar ప్రారంభోపన్యాసం | ABP DesamIdeas of India 2025 | ముంబైలో ప్రారంభమైన ఐడియాస్ ఆఫ్ ఇండియా సదస్సు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: జలద్రోహం చేసింది కేసీఆర్ - కీలక విషయాలు బయట  పెట్టిన రేవంత్ రెడ్డి
జలద్రోహం చేసింది కేసీఆర్ - కీలక విషయాలు బయట పెట్టిన రేవంత్ రెడ్డి
ABP Network Ideas Of India 2025:
"మానవ స్ఫూర్తిని మానవత్వం పునరుద్ధరించాలి"- ABP నెట్ వర్క్ చీఫ్ ఎడిటర్ అతిదేబ్ సర్కార్
ABP Network Ideas Of India 2025: గ్రాండ్‌గా ప్రారంభమైన ABP నెట్‌వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2025
గ్రాండ్‌గా ప్రారంభమైన ABP నెట్‌వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2025
Koneru Konappa: కాంగ్రెస్ కు షాక్ - ఇలా చేరి అలా గుడ్ బై చెప్పిన మాజీ ఎమ్మెల్యే - బీఆర్ఎస్‌లోకేనా ?
కాంగ్రెస్ కు షాక్ - ఇలా చేరి అలా గుడ్ బై చెప్పిన మాజీ ఎమ్మెల్యే - బీఆర్ఎస్‌లోకేనా ?
Andhra Pradesh Group 2 Exam: 23న ఏపీలో గ్రూప్‌ 2 - హైదరాబాద్‌లో అభ్యర్థుల ధర్నా- మద్దతు ప్రకటించిన షర్మిల  
23న ఏపీలో గ్రూప్‌ 2 - హైదరాబాద్‌లో అభ్యర్థుల ధర్నా- మద్దతు ప్రకటించిన షర్మిల  
Hari Hara Veera Mallu: 'హరిహర వీరమల్లు' నుంచి 'కొల్లగొట్టినాదిరో' సాంగ్ ప్రోమో రిలీజ్ - పవర్ స్టార్‌ ఫ్యాన్స్ మనసులు కొల్లగొట్టేస్తుందిగా..
'హరిహర వీరమల్లు' నుంచి 'కొల్లగొట్టినాదిరో' సాంగ్ ప్రోమో రిలీజ్ - పవర్ స్టార్‌ ఫ్యాన్స్ మనసులు కొల్లగొట్టేస్తుందిగా..
Sourav Ganguly Biopic: సౌరవ్ గంగూలీ బయోపిక్‌లో ఆ స్టార్ హీరో - స్వయంగా రివీల్ చేసిన 'దాదా'.. ఫ్యాన్స్‌లో హైప్ పెరిగిందిగా..
సౌరవ్ గంగూలీ బయోపిక్‌లో ఆ స్టార్ హీరో - స్వయంగా రివీల్ చేసిన 'దాదా'.. ఫ్యాన్స్‌లో హైప్ పెరిగిందిగా..
Farmer Protest: రుణమాఫీ చేయాలే-గాంధీభవన్ మెట్లపై రైతు ధర్నా- వీడియో వైరల్
రుణమాఫీ చేయాలే-గాంధీభవన్ మెట్లపై రైతు ధర్నా- వీడియో వైరల్
Embed widget