అన్వేషించండి

KA Paul: మోదీకి మందకృష్ణ మాదిగ రూ.72 కోట్లకు అమ్ముడుపోయారు - కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు 

KA Paul: భారత దేశాన్ని అవినీతి నుంచి రక్షించడం తనతోనే సాధ్యమని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ అన్నారు. పార్టీ సింబల్‌ గురించి ఎన్నికల సంఘాన్ని కలిశారు.

KA Paul Comments on Mandakrishna Madiga: భారత దేశాన్ని అవినీతి నుంచి రక్షించడం తనతోనే సాధ్యమని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ (KA Paul) అన్నారు. పార్టీ సింబల్‌ గురించి ఎన్నికల సంఘాన్ని కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని అన్నారు. ప్రధాని మోదీ, మందకృష్ణ మాదిగపై విమర్శలు చేశారు. ప్రపంచంలోనే అత్యంత అవినీతి జరుగుతున్న దేశంగా ఇండియా మారిందని విమర్శించారు. 

అప్పుడు తిట్టారు.. ఇప్పుడు పొగుడుతున్నారా?
మందకృష్ణ మాదిగ (Manda Krishna Madiga) ప్రధాని మోదీకి (PM Modi) అమ్ముడు పోయారని విమర్శించారు. పరేడ్ గ్రౌండ్‌లో సభ పెట్టడానికి మందకృష్ణ మాదిగకు రూ. 72 కోట్లు ముట్టాయని ఆరోపించారు. మందకృష్ణను ప్రజా శాంతి పార్టీలో చేరమంటే రూ. 25 కోట్లు అడిగారని అన్నారు. గతంలో మోదీని ఘోరమైన తిట్లు తిట్టిన మందకృష్ణ మాదిగ.. ఇప్పుడు మోదీ దేవుడు అని అంటున్నారని మండిపడ్డారు. 

ఎవరికి ఓటు వేయొద్దు
ఒక ఎంపీ కోసం ఇస్తారని ప్రధాని మోదీకి మందకృష్ణ మాదిగ అమ్ముడు పోయారని అన్నారు. మాదిగలకు మోదీ ఇన్ని రోజులు చేయని న్యాయం ఇప్పుడు చేస్తారా? అని ప్రశ్నించారు. మూడు పార్టీలకు ఓట్లు వేయొద్దని కోరారు. 30న ఓట్లు వేయకుండా ఇంట్లో కూర్చోవాలన్నారు. కుటుంబ పాలన వద్దని, తమకు సింబల్ ఇవ్వనందుకు రేపు తెలంగాణ హైకోర్టుకు వెళ్లనున్నట్లు చెప్పారు. 

అదానీ అప్పులు మాఫీ చేశారు
ప్రజాశాంతి పార్టీ అభ్యర్థులు చెన్నూరు, జుక్కల్, వేములవాడ, ఉప్పల్, యాకుత్‌పురాతో పాటు 13 సెగ్మెంట్లలో పోటీలో ఉన్నట్లు కేఏ పాల్ చెప్పారు. మోదీ బీసీ కాదని, తన శిష్యుడని అన్నారు. నరేంద్ర మోదీ సర్టిఫికెట్లు అన్ని డూప్లికేట్ అని చెప్పారు. ప్రధానికి కేఏ  పాల్ భయపడడని, మోదీనే తనంటే భయపడతారని అన్నారు. అదాని అప్పులు కట్టకుండా మోదీ మాఫీ చేశారని ఆరోపించారు. 

ఎన్నికల అధికారులు వేధిస్తున్నారు
కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు తమ పార్టీ గుర్తు కేటాయించకుండా వేధిస్తున్నారని కేఏ పాల్ గతంలో ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా శాంతి పార్టీ తరఫున సెప్టెంబర్లోనే అన్ని డాక్యుమెంట్లు ఇచ్చిన ఇంతవరకు గుర్తు కేటాయించలేదని ఆరోపించారు. తెలుగు రాష్ట్రాల్లో తమ పార్టీ యాక్టివ్‌గా ఉందని కేఏ పాల్ చెప్పారు. కానీ పార్టీ యాక్టివ్‌గా లేదని చెప్తున్నారని అన్నారు.

ఎన్నికల సంఘాన్ని కేసీఆర్ నడుపుతున్నారో, ఎన్నికల కమిషనర్ నడుపుతున్నాడో అర్థం కావడంలేదని ఆయన విమర్శించారు. పోటీ చేయని వైఎస్సార్ తెలంగాణ పార్టీకి కూడా గుర్తు కేటాయించారని, కానీ మాకు మాత్రం కేటాయించ లేదన్నారు. 

గుర్తు ఏంటని అడుగుతున్నారు?
ప్రజా శాంతి పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేయడానికి వెళ్తే సింబల్ ఏంటి అని ప్రశ్నించారని కేఏ పాల్ వ్యాఖ్యానించారు. తనకు ఎందుకు ఇంతలా నరకం చూపిస్తున్నారో అర్థం కావడం లేదని పాల్ ఆవేదన వ్యక్తం చేశారు. సింబల్ కోసం నిరాహారదీక్ష చేయ్యాలా? అంటూ ప్రశ్నించారు. హెలికాప్టర్, రింగ్ గుర్తుల్లో ఏది కేటాయించారో చెప్పడం లేదని, ఆరు నెలలుగా ఇస్తున్నామని చెప్తున్నారే తప్ప కేటాయించడం లేదని మండిపడ్డారు. 

తక్షణమే ప్రజా శాంతి పార్టీకి గుర్తు వెంటనే కేటాయించాలని పాల్ డిమాండ్ చేశారు. నామినేషన్లకు మరో రెండు రోజులు సమయం ఇవ్వాలని కోరారు. ప్రజా శాంతి పార్టీకి సింబల్ ఎందుకు ఇవ్వడం లేదో ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాలని నిలదీశారు. మ

టాప్ హెడ్ లైన్స్

Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
BRS YSRCP Silent on BJP Centre: జాతీయ అంశాలపై రీజినల్ పార్టీల సైలెంట్ రాజకీయం! BRS, YSRCP మౌనం వెనుక మర్మమేంటి?
జాతీయ అంశాలపై రీజినల్ పార్టీల సైలెంట్ రాజకీయం! BRS, YSRCP మౌనం వెనుక మర్మమేంటి?
Telangana Delimitation 2026: తెలంగాణలో డిలిమిటేషన్ ధమాకా - గ్రేటర్ హైదరాబాద్ కేంద్రంగా మారబోతున్న రాష్ట్ర రాజకీయం?
తెలంగాణలో డిలిమిటేషన్ ధమాకా - గ్రేటర్ హైదరాబాద్ కేంద్రంగా మారబోతున్న రాష్ట్ర రాజకీయం?
KTR Revanth Globarena: గ్లోబరీనా వివాదం - రేవంత్‌కు కేటీఆర్ లీగల్ నోటీసు.. తీవ్ర వ్యాఖ్యలు!
గ్లోబరీనా వివాదం - రేవంత్‌కు కేటీఆర్ లీగల్ నోటీసు.. తీవ్ర వ్యాఖ్యలు!

వీడియోలు

Ravichandran Ashwin Criticizes Gambhir | గంభీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Varshini Gowda Biography & Remuneration | వర్షిణి గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Vaibhav Ready For Zimbabwe T20 Series | జింబాబ్వే సిరీస్‌కు ముందు వైభవ్ కామెంట్స్
Sachin Tendulkar’s Advice to Harbhajan Singh | తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన హర్భజన్
Gundenininda Gudigantalu Serial July 23 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi On Paper Leak: పేపర్ లీక్‌లపై ప్రత్యేక బిల్లు తెస్తామన్న ప్రధాని మోదీ.. అర్ధరాత్రి దీక్ష విరమించిన వాంగ్‌చుక్
పేపర్ లీక్‌లపై ప్రత్యేక బిల్లు తెస్తామన్న ప్రధాని మోదీ.. అర్ధరాత్రి దీక్ష విరమించిన వాంగ్‌చుక్
AP Local Body Direct Elections: ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Rahul Gandhi Delhi NEET Protest: ఢిల్లీలో నీట్ మంటలు - గాంధీ స్మృతి వైపు రాహుల్ గాంధీ, విపక్ష ఎంపీల మార్చ్.. బారికేడ్లతో నిలిపివేత!
ఢిల్లీలో నీట్ మంటలు - గాంధీ స్మృతి వైపు రాహుల్ గాంధీ, విపక్ష ఎంపీల మార్చ్.. బారికేడ్లతో నిలిపివేత!
IND vs ZIM 1st T20 Result Update: శ్రేయస్ కెప్టెన్సీలో తొలి విజయం! .. జింబాబ్వేపై ఇండియా గ్రాండ్ విక్టరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీ
శ్రేయస్ కెప్టెన్సీలో తొలి విజయం! .. జింబాబ్వేపై ఇండియా గ్రాండ్ విక్టరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీ
Minster Lokesh: అమ్మపై ప్రేమను చాటే అద్భుత అవకాశం.. చిన్నారుల కోసం మంత్రి నారా లోకేశ్ వినూత్న కాంటెస్ట్
అమ్మపై ప్రేమను చాటే అద్భుత అవకాశం.. చిన్నారుల కోసం మంత్రి నారా లోకేశ్ వినూత్న కాంటెస్ట్
Vallabhaneni Vamsi Letter to CM Chandrababu: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
Tech Mahindra Employee Protest: 3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
Embed widget