అన్వేషించండి

Sigachi Tragedy : సిగాచీ దుర్ఘటనలో 8 మృతదేహాలు దొరకని విషాదం.. కుటుంబాలకు తీరని వేదన! యాజమాన్యం తీరుపై ఆగ్రహం

అంతులేని నిర్లక్ష్యంతో కార్మికుల 44 మంది కార్మికుల ప్రాణాలు కాల్చి బూడిద చేసిన సిగాచీ యాజమాన్యం , మృతుల కుటుంబ సభ్యలను తీవ్రంగా అవమానించి మరో తప్పిదం చేసింది.కనీసం బూడిదైనా ఇవ్వమంటే ఇంటికి పొమ్మంది.

Sigachi Incident : సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో సిగాచీ పరిశ్రమలో సరిగ్గా పదిరోజుల క్రితం సంభవించిన భారీ పేలుడుతో 44మంది కార్మికుల ప్రాణాలు కొోల్పోయారు.  ఇంకా 16 మంది వేరు వేరు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. పోయిన ప్రాణాలు తిరిగి తీసుకురాలేరు. కనీసం కుటుంబ సభ్యులకు మృతదేహాలు అప్పగించడంలోనూ సిగాచీ యాజమాన్యం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించింది. నేటికీ ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 8 మంది కార్మికుల మృతదేహాలు లభించలేదు. వారి ఆనవాళ్లు దొరకలేదు. కనీసం బూడిదైనా ఇవ్వండి మహా ప్రభో అంటూ పదిరోజులుగా ఫ్యాక్టరీ ముందు పడిగాపులు పడ్డ కుటుంబ సభ్యులు బరువెక్కిన గుండెలతో బోరున విలపిస్తున్నారు. చివరి చూపు చూడలేదు. అంతిమ సంస్కారలైనా చేస్తే, మా బిడ్డల ఆత్మశాంతిస్తుందని కళ్లు కాయలు కాచేలా ఎదురు చూసి, చూసి ఓపిక నశించి అలసిపోయారు.  

జస్టిన్, అఖిల్, వెంకటేష్, ఇన్ఫాన్ అన్సారీ, రాహుల్, శివాజీ, విజయ్, రవి ఇలా ఈ ఎనిమిది మంది సిగాచీ ప్రమాదం జరిగిన సమయంలో డ్యూటీలో ఉన్నారు. పేలుడు జరిగిన సమయంలో విధులు నిర్వహిస్తున్నట్లుగా కుటుంబ సభ్యులకు  ఇచ్చిన సమాచారం ఆధారంగా స్పష్టమవుతోంది. అయితే పేలుడు తరువాత వీరి ఆచూకీ నేటికీ తెలియలేదు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కుటుంబ సభ్యుల డిఎన్ ఏ లు పలుమార్లు సేకరించినా ఫలితంలేదు. ఆ ఎనిమిది మంది మృతదేహాలు గుర్తించడం మా వల్లకాదంటూ తాజాగా క్లారిటీ ఇచ్చిన అధికారులు, కుటుంబ సభ్యుల ఆగ్రహాన్ని చల్లార్చేందుకు 15లక్షలు ముట్టజెప్పి మీ ఇళ్లకు వెళ్లండంటూ తాత్కాలికంగా చేతులు దులుపుకున్నారు. తిరిగి మూడు నెలల తరువాత మేమే పిలుస్తామంటూ చెప్పి పంపించారు.

ఈ మొత్తం వ్యవహారంపై ఆచూకీ దొరకని మృతుల కుటుంబ సభ్యుల వాదన మరోలా ఉంది. మృతదేహాల వెలికితీతలో మొదటి నుంచి తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపిస్తున్నారు. సాధ్యమైనంత వేగంగా శిథిలాల తొలగింపు చేయాల్సి ఉండగా, నెమ్మదిగా తొలగింపు ప్రక్రియ జరగడంతో మృతదేహాల గుర్తింపు కష్టమవ్వడంతోపాటు, మాంసపు ముద్దలుగా విడిపోవడం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Sigachi Tragedy : సిగాచీ దుర్ఘటనలో 8 మృతదేహాలు దొరకని విషాదం.. కుటుంబాలకు తీరని వేదన! యాజమాన్యం తీరుపై ఆగ్రహం

పది రోజులైనా ఆచూకీ లభించకపోవడంతో ఇప్పుడు మావల్ల కాదంటూ చేతులెత్తేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదంలో మృతుల ఆచూకీ లభించలేదని సర్టిఫికేట్ ఇవ్వమని వారి కుటుంబ సభ్యులు అడిగినా పట్టించుకోవడంలేదు. మేము నిర్దారించము, మూడు నెలల తరువాత రండి అప్పుడు చూద్దామంటూ తేల్చిచెప్పడం దిక్కుతోచని స్దితిలో ఆచూకీ దొరకని 8 మందికి చెందిన కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా వెనుదిరిగి తమ సొంత రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారు. 

నేటికీ సిగాచీ యాజమాన్యం ఘటనా స్దాలానికి చేరుకోలేదు. డబ్బుతో ఏదైనా సాధ్యమే అన్నట్లుగా యాజమాన్యం తీరు కనిపిస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పరిహారం ప్రకటించాం. మృతదేహాల కోసం ఆలోచించాల్సిన పనేలేదు అన్నట్లుగా వ్యవహరించిందనే ఆరోపణలు వెల్లుతెత్తున్నాయి.

Sigachi Tragedy : సిగాచీ దుర్ఘటనలో 8 మృతదేహాలు దొరకని విషాదం.. కుటుంబాలకు తీరని వేదన! యాజమాన్యం తీరుపై ఆగ్రహం

ఐదు నెలల క్రితమే పెళ్లైన ఉప్పల్ కు చెందిన  అఖిల్ ఫ్యాకర్టీలోకి వచ్చినట్లు భార్యకు మెసేజ్ పెట్టిన పదినిమిషాల్లోనే బ్లాస్ట్ జరిగింది. తండ్రికి ఏకైక ఆధారంగా ఉన్న జస్టిన్ ఇక తిరిగి రాడని తెలిసిన తండ్రి దిక్కుతోచని స్దితిలో బోరున విలపిస్తున్నాడు. శ్రీకాకుళం నుంచి ఉపాధి కోసం వచ్చిన వెంకటేష్ పరిస్దితి మరింత దయనీయం. తండ్రిని కంటికి రెప్పలా కాపాడుకునే వెంకటేష్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడనే వార్త టివిలో చూసి నిర్ఘాంతపోయారు. సిగాచీ వద్దకు వచ్చిన తండ్రి, కాళ్లరిగేలా తిరిగి , బిడ్డకోసం చూసిన ఎదురు చూపులు ఇంకా సిగాచీ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తునే ఉన్నాయి. నా బిడ్డ ఎముకలైనా ఇవ్వండైయ్యా అని వేడుకున్నా ఆలకించేవారు లేరు.

Sigachi Tragedy : సిగాచీ దుర్ఘటనలో 8 మృతదేహాలు దొరకని విషాదం.. కుటుంబాలకు తీరని వేదన! యాజమాన్యం తీరుపై ఆగ్రహం

ఇలా సిగాచీ ప్రమాదంలో మిసైన మృతుల కుటుంబసభ్యుల హృదయవిదారక రోదనలు అంతులేనివి. ఇవన్నీ పట్టనట్లుగా వ్యవహించిన యాజమాన్యం చివరకు డబ్బు ఇచ్చి పంపుతున్నామంటూ వ్యవహరించిన తీరు, కనీసం అంతిమ సంస్కారాలు కూడా చేసుకునే అవకాశంలేని దుస్దితి, బాధితుల కుటుంబాలకు అంతులేని గుండెకోతను మిగల్చింది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget