అన్వేషించండి

Telangana Assembly: విపక్షాల నిరసనల మధ్య 3 కీలక బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం

Bills Passed In Telangana Assembly | విపక్షా నిరసనల మధ్య తెలంగాణ జీఎస్టీ సవరణ బిల్లు, విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లు, యంగ్‌ ఇండియా ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌, స్పోర్ట్స్‌ వర్సిటీ బిల్లులు ఆమోదించారు.

Telangana Assembly approves 3 key bills amid opposition protests | హైదరాబాద్‌: తెలంగాణ శాసనసభ సమావేశాలు అధికార కాంగ్రెస్ సభ్యులు వర్సెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యులుగా కొనసాగుతున్నాయి. వికారాబాద్‌ జిల్లా లగచర్లలో రైతుల అరెస్ట్ ఘటనపై సభలో చర్చకు బీఆర్ఎస్ సభ్యులు పట్టుబట్టారు. చర్చకు బీఆర్ఎస్ ఇచ్చిన పిటిషన్ ను స్పీకర్ ప్రసాద్ కుమార్ తోసిపుచ్చారు. మరోవైపు వాయిదా తీర్మానాల కోసం బీజేపీ, బీఆర్ఎస్ సభ్యులు డిమాండ్ చేసినా ప్రయోజనం లేకపోయింది. విపక్షాల నిరసనల మధ్య తెలంగాణ అసెంబ్లీ 3 కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది.

విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లు, తెలంగాణ జీఎస్టీ సవరణ బిల్లులతో పాటు యంగ్‌ ఇండియా ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌, స్పోర్ట్స్‌ వర్సిటీ బిల్లులను రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది. విపక్ష సభ్యులు లగచర్లలో రైతుల చేతికి సంకెళ్లు వేయడం దారుణమంటూ విపక్షాలు గగ్గోలు చేస్తుండగా నిరసనల మధ్య మూడు బిల్లులకు ఆమోదం లభించింది. చర్చ జరపకుండా బిల్లులను ఆమోదించడంపై విపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. అనంతరం రాష్ట్రంలో పర్యాటక రంగంలో చేయాల్సిన మార్పులు, నూతన విధానంపై కొంతసేపు చర్చ జరగగా.. తెలంగాణ అసెంబ్లీ బుధవారానికి వాయిదా పడింది.

కాంగ్రెస్ అప్పులపై మాజీ మంత్రులు ఫైర్

కాంగ్రెస్ పార్టీ ఒక్క ఏడాది పాలనలో రూ. 1,27,208 కోట్లు అప్పు చేసిందని, అప్పులు కొనసాగితే వచ్చే ఐదేళ్లలో అయ్యే అప్పు రూ. 6,36,040 కోట్లు అని మాజీ మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో పేర్కొన్నారు. కానీ పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన మొత్తం అప్పు కేవలం రూ. 4,17,496 కోట్లు మాత్రమే అన్నారు. మిషన్ భగీరథ, మల్లన్న సాగర్, రంగనాయక సాగర్ లాంటి ఎన్నో ప్రాజెక్టులను కట్టి ఆస్తుల కల్పన చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే.. అప్పులు చేసి, కమీషన్లు పంచుకుని తిన్నది కాంగ్రెస్ పార్టీ అని హరీష్ రావు విమర్శించారు. రేవంత్ సర్కార్ తక్కువ సమయంలోనే తెలంగాణను భారీగా అప్పుల పాలు చేసిందన్నారు. ఎన్నికల గ్యారంటీ హామీలు అమలు చేయకుండా, కొత్త ప్రాజెక్టులు కట్టకుండా ఏడాదిలోనే కాంగ్రెస్ ప్రభుత్వం భారీగా అప్పులు చేసి నేతలు తమ జేబులు నింపుకుంటున్నారని బీఆర్ఎస్ ఆరోపించింది. రాష్ట్రంలో సంపద సృష్టికి కాకుండా.. సొంత ఆస్తులు పెంచుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు చేయడం క్షమించరాని నేరం అని, తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు పెను ప్రమాదం అని ఆందోళన వ్యక్తం చేశారు.

 ఏడాదిగా కాంగ్రెస్ చేసిన అప్పు 1,27,208 కోట్ల రూపాయలు అప్పుచేసినా, ఏడాది ఆదాయం వచ్చినా.. చిన్న చిన్న పెండింగ్ బిల్లులను ఎందుకు చెల్లించడం లేదు. ఆ డబ్బంతా ఎటు పోతుంది? అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సభలో ప్రశ్నించారు.

Also Read: BRS MLAs Protest: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన - కేటీఆర్, హరీష్ దొరతనం బయటపడిందన్న మంత్రి సీతక్క

 

లగచర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి, వారిపైన థర్డ్ డిగ్రీ ప్రయోగించి జైళ్లలో నిర్బంధించి, రైతన్నల చేతులకు కాంగ్రెస్ ప్రభుత్వం బేడీలు వేసిందని బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల విద్యాసారగ్ రావు ఆరోపించయారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ, అణిచివేత విధానాలకు నిరసనగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు జగిత్యాలలో బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

హైదరాబాద్‌ స్టేడియాలను అంతర్దాతీయ స్థాయిలోకి మారుస్తా..: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్‌ స్టేడియాలను అంతర్దాతీయ స్థాయిలోకి మారుస్తా..: సీఎం రేవంత్ రెడ్డి
Khammam Devarapalli Greenfield Highway: ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
Revanth Reddy: అక్కా!మూసీ ప్రాజెక్టుపై వేసిన కేసులు వెనక్కి తీసుకోమని మీ కొడుక్కి చెప్పు! రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్‌!
అక్కా!మూసీ ప్రాజెక్టుపై వేసిన కేసులు వెనక్కి తీసుకోమని మీ కొడుక్కి చెప్పు! రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్‌!
Telangana: తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగుల జీతంలో 15 శాతం కోత! చట్టాన్ని తీసుకొస్తున్న తెలంగాణ!
తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగుల జీతంలో 15 శాతం కోత! చట్టాన్ని తీసుకొస్తున్న తెలంగాణ!

వీడియోలు

IPL 2026 Opening Ceremony | ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ కి ముందు ఎలాంటి హంగామా ఉండదు | ABP Desam
MS Dhoni Injury CSK IPL 2026 Update | మొదటి మ్యాచ్ కి ముందే తలా అభిమానులకు భారీ షాక్ | ABP Desam
RCB vs SRH Match Preview IPL 2026 | నేటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ | ABP Desam
Vaibhav Sooryavanshi Turned 15 IPL 2026 | బీసీసీఐ నిబంధనలకు అర్హుడయ్యాడు...సీనియర్స్ టీమ్ లో చోటే తరువాయి | ABP Desam
Surya Tilak in Ayodhya on Ram Navami | అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 RCB Vs SRH Result Update: ఆర్సీబీ గ్రాండ్ విక్ట‌రీ- రాణించిన ప‌డిక్క‌ల్, కోహ్లీ, డ‌ఫీ- స‌న్ రైజ‌ర్స్ కు నిరాశ‌
ఆర్సీబీ గ్రాండ్ విక్ట‌రీ- రాణించిన ప‌డిక్క‌ల్, కోహ్లీ, డ‌ఫీ- స‌న్ రైజ‌ర్స్ కు నిరాశ‌
Khammam Devarapalli Greenfield Highway: ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
CM Revanth Reddy Assembly: అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
Amaravati What Next: అమరావతికి చట్టబద్ధత - అసెంబ్లీ తీర్మానం తర్వాత అసలు ప్రక్రియ ఇదే!
అమరావతికి చట్టబద్ధత - అసెంబ్లీ తీర్మానం తర్వాత అసలు ప్రక్రియ ఇదే!
Railway Advertisements: మద్యం, పొగాకు, అశ్లీల ప్రకటనలు రైల్వేలో ప్రదర్శించడంపై నిషేధం: అశ్విని వైష్ణవ్
మద్యం, పొగాకు, అశ్లీల ప్రకటనలు రైల్వేలో ప్రదర్శించడంపై నిషేధం: అశ్విని వైష్ణవ్
Family Entertainers : వీకెండ్ ఈ మూవీస్ చూసి ఎంజాయ్ చెయ్యండి - తెలుగు టాప్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఇవే
వీకెండ్ ఈ మూవీస్ చూసి ఎంజాయ్ చెయ్యండి - తెలుగు టాప్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఇవే
CM Revanth Reddy: 2034లో హైదరాబాద్‌లో ఒలింపిక్స్ లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు: సీఎం రేవంత్ రెడ్డి
2034లో హైదరాబాద్‌లో ఒలింపిక్స్ లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు: సీఎం రేవంత్ రెడ్డి
Iran War Updates: గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి దాడులు - కువైట్ ఎయిర్ పోర్టుపై దాడి - విస్తరిస్తున్న యుద్ధం!
గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి దాడులు - కువైట్ ఎయిర్ పోర్టుపై దాడి - విస్తరిస్తున్న యుద్ధం!
Embed widget