అన్వేషించండి

Telangana: కుల గణనకు సిద్ధమవుతున్న తెలంగాణ ప్రభుత్వం- ఆ తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టే అవకాశం!

Revanth Reddy: తెలంగాణలో కులగణన చేపట్టేందుకు రేవంత్ రెడ్డి సర్కారు సిద్ధమైంది. ఈ మేరకు మరికొన్ని రోజుల్లో విధివిధానాలు ఖరారు చేయనుంది.

Caste Census In Telangana: దేశవ్యాప్తంగా కులగణన చేపయాలని పట్టుబడుతున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఇప్పటి వరకు ఆ అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. స్థానిక సంస్థలు ఎన్నికలు తరుముకొస్తున్న వేళ దీనిపై ప్రభుత్వం ఏం చేయబోతోందనే చర్చ అయితే నడుస్తోంది. ఇలాంటి టైంలో పీసీసీ చీఫ్‌ మహేష్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అన్నింటిపై చాలా మందిలో ఉన్న అనుమానాలపై క్లారిటీ ఇచ్చారు. 

హైదరాబాద్​లో జరిగిన ఓ కార్యక్రమంలో పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ పాల్గొన్నారు. కామారెడ్డి డిక్లరేషన్​కు అనుగుణంగా సమగ్ర కులగణన, బీసీ రిజర్వేషన్ల పెంపు అంశంపై జరిగిన ఈ సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే కులగణనకు సంబంధించిన ప్రకటన వస్తుందని అన్నారు.

త్వరలో విధి విధానాలు

తెలంగాణలో బీసీలకు అండగా ఉండటంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ఉంటుందని అన్నారు మహేష్‌గౌడ్. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునేందుకు కట్టుబడి ఉందన్నారు. ఇప్పటికే కొన్ని అమలు చేసింది. కీలకమైన కులగణనకు సంబంధించిన గైడ్‌లైన్ మూడు నాలుగు రోజుల్లో రానున్నాయని తెలిపారు. అవి పూర్తి అయిన తర్వాత బీసీలకు రావాల్సిన రిజర్వేషన్ల అంశాన్ని తేలుస్తామన్నారు. ఈ ప్రక్రియ పూర్తి అయిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తారని కూడా చెప్పేశారు. 

త్వరలోనే బీసీ సంఘాలను సీఎం వద్దకు తీసుకెళ్తానని మహేష్‌ మాట ఇచ్చారు. బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలు, వారికి కావాల్సిన డిమాండ్లు, అన్నీ కూడా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్దామన్నారు. అంతే కాకుండా కుల గణన పూర్తైన తర్వాత నిజాం గ్రౌండ్స్‌లో సభ పెట్టి సీఎం రేవంత్‌ను సన్మానిద్దామని పిలుపునిచ్చారు. 

మూడో రాష్ట్రం తెలంగాణ

పార్టీ పదవుల్లో, ప్రభుత్వం పదవుల్లో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి తీవ్రంగా శ్రమిస్తున్నారని అన్నారు. కర్ణాటకలో, బిహార్‌లో అధికారంలో ఉన్నప్పుడు కుల గణన చేసి చూపించామన్నారు. ఇప్పుడు తెలంగాణలో కూడా చేసి చూపిస్తామని చెప్పుకొచ్చారు. 

బీసీ ఓటు బ్యాంకు కాపాడుకునేలా ప్లాన్

బీసీ రిజర్వేషన్‌లు, ఇతర సమస్యలపై ఓవైపు నుంచి కృష్ణయ్య పోరాటానికి సిద్ధమవుతున్నారు. అదే టైంలో బీఆర్‌ఎస్‌ కూడా ఒత్తిడి తీసుకొస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తోంది. బీసీ సమస్యలు పరిష్కరించి కృష్ణయ్య లాంటి వ్యక్తిని పార్టీలోకి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. బీసీలు తమవైపే ఉండేలా ప్లాన్ చేస్తోంది. అందుకే ఆయన వద్దకు రాయబారం కూడా పంపించారు. రెండు రోజుల క్రితం వైసీపీకి రాజీనామా చేసిన కృష్ణయ్యతో మల్లు రవి సమావేశమయ్యారు. పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. 

ఇటు బీఆర్‌ఎస్‌కి కూడా అవకాశం ఇవ్వండా ఉండేలా ప్లాన్ చేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల లోపు కుల గణన పూర్తి చేసి సంపూర్ణ ఆధిపత్యం సాధించాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోంది. అందుకు తగ్గట్టుగానే వచ్చే వారంలో కులగణనకు సంబంధించిన కీలక ప్రకటన చేయనుంది. 

Also Read: చెరువులు, ప్రభుత్వ స్థలాల్లోనే కూల్చివేతలు - హైడ్రాను వ్యతిరేకిస్తే ఎవరికి నష్టం ?

మరిన్ని చూడండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pahalgam Terror Attack : పహల్గాం దాడిపై ప్రధాని మోడీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం- కీలక నిర్ణయం తీసుకునే అవకాశం
పహల్గాం దాడిపై ప్రధాని మోడీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం- కీలక నిర్ణయం తీసుకునే అవకాశం
Andhra Pradesh BJP State President :
"నేనంటే నేను" ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ అధ్యక్ష పదవికి భారీ పోటీ! క్యూలో కీలక నేతలు !
Warangal Crime News: వాళ్లిద్దరూ సన్నిహితంగా ఉండటం చూడటమే పాపం - హత్యకు గురయ్యాడు - చంపేసిందెవరు?
వాళ్లిద్దరూ సన్నిహితంగా ఉండటం చూడటమే పాపం - హత్యకు గురయ్యాడు - చంపేసిందెవరు?
AP SSC Results 2025: జిల్లాలవారీగా ఏపీ టెన్త్ క్లాస్ రిజల్ట్స్, అమ్మాయిలే టాప్.. 1680 స్కూళ్లలో వంద శాతం పాస్.. పూర్తి వివరాలు
జిల్లాలవారీగా ఏపీ టెన్త్ క్లాస్ రిజల్ట్స్, అమ్మాయిలే టాప్.. 1680 స్కూళ్లలో వంద శాతం పాస్.. పూర్తి వివరాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

SRH vs MI Match Preview IPL 2025 | సన్ రైజర్స్  హైదరాబాద్ కోమాలో నుంచి మేల్కొంటుందా.?Axar Patel Batting IPL 2025 | కీలక సమయాల్లో ఆదుకుంటున్న కెప్టెన్ ఆల్ రౌండర్KL Rahul vs Rishabh Pant | సంజీవ్ Goenka అనుకున్నది ఒకటి..అయినది ఒకటిKL Rahul Ignored LSG Owner Goenka | రాహుల్ కి ఇంకా కోపం లేదు..తిట్టారనే కసి మీదే ఉన్నట్లున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pahalgam Terror Attack : పహల్గాం దాడిపై ప్రధాని మోడీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం- కీలక నిర్ణయం తీసుకునే అవకాశం
పహల్గాం దాడిపై ప్రధాని మోడీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం- కీలక నిర్ణయం తీసుకునే అవకాశం
Andhra Pradesh BJP State President :
"నేనంటే నేను" ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ అధ్యక్ష పదవికి భారీ పోటీ! క్యూలో కీలక నేతలు !
Warangal Crime News: వాళ్లిద్దరూ సన్నిహితంగా ఉండటం చూడటమే పాపం - హత్యకు గురయ్యాడు - చంపేసిందెవరు?
వాళ్లిద్దరూ సన్నిహితంగా ఉండటం చూడటమే పాపం - హత్యకు గురయ్యాడు - చంపేసిందెవరు?
AP SSC Results 2025: జిల్లాలవారీగా ఏపీ టెన్త్ క్లాస్ రిజల్ట్స్, అమ్మాయిలే టాప్.. 1680 స్కూళ్లలో వంద శాతం పాస్.. పూర్తి వివరాలు
జిల్లాలవారీగా ఏపీ టెన్త్ క్లాస్ రిజల్ట్స్, అమ్మాయిలే టాప్.. 1680 స్కూళ్లలో వంద శాతం పాస్.. పూర్తి వివరాలు
Pithapuram: పిఠాపురం మల్లంలో దళితుల సాంఘిక బహిష్కరణ దేని కోసం? ఇప్పుడు గ్రామంలో ఏం జరుగుతోంది?
పిఠాపురం మల్లంలో దళితుల సాంఘిక బహిష్కరణ దేని కోసం? ఇప్పుడు గ్రామంలో ఏం జరుగుతోంది?
Pahalgam Terrorist Attack: ప్రభాస్ సినిమాకు పహల్గాం టెర్రర్ ఎటాక్ సెగ... ఆ హీరోయిన్‌ను తీసేయాలని డిమాండ్!
ప్రభాస్ సినిమాకు పహల్గాం టెర్రర్ ఎటాక్ సెగ... ఆ హీరోయిన్‌ను తీసేయాలని డిమాండ్!
Smart Umpiring in IPL 2025: ఫ్లయింగ్ కెమెరాల నుంచి సౌండ్ సెన్సార్ల వరకు, IPL 2025లో వాడుతున్న లేటెస్ట్ టెక్నాలజీ తెలుసా?
ఫ్లయింగ్ కెమెరాల నుంచి సౌండ్ సెన్సార్ల వరకు, IPL 2025లో వాడుతున్న లేటెస్ట్ టెక్నాలజీ తెలుసా?
Pahalgam Attack Terrorists Sketch: పహల్గాంలో కాల్పులు జరిపిన ముగ్గురు ఉగ్రవాదుల ఊహాచిత్రాలు విడుదల
పహల్గాంలో కాల్పులు జరిపిన ముగ్గురు ఉగ్రవాదుల ఊహాచిత్రాలు విడుదల
Embed widget