అన్వేషించండి

Telangana: వరద బాధితల కోసం నిధులు విడుదల చేసిన రేవంత్- సాయం ఐదు లక్షలకు పెంపు

Reavanth ReddY: వర్షాలకు కకావిలకలమైన ప్రాంతాల ప్రజల తక్షణ సాయం కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఒక్కో జిల్లాకు ఐదు కోట్ల రూపాయలను రిలీజ్ చేసింది.

Rains In Telangana: తెలంగాణలో మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలు బీభత్సం సృష్టించాయి. రహదారులు, రైల్వే పట్టాలు కొట్టుకుపోయాయి. ఊళ్లకు ఊళ్లే జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. చాలా మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినా ఇంకా చాలా పల్లెల్లు నీటిలో కాపురాలు చేస్తున్నాయి. బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. 

ఈ వర్షాలకు ఖమ్మం జిల్లాలో భారీ నష్టం జరిగింది. ఎగువ నుంచి వస్తున్న వరద కారణంగా వాగులు, వంకలు, నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. మంత్రులు బాధిత ప్రాంతాల్లోనే ఉంటూ ప్రజలకు చేదోడుగా ఉంటున్నారు. అధికారులను అప్రమత్తం చేసి ప్రజలకు సమస్యలు రాకుండా ప్రయత్నిస్తున్నారు. పంట భూములు వేల ఎకరాలు నీట మునిగిపోయాయి. 

వర్షాలపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి అధికారులు ఎవరూ సెలవులు పెట్టొద్దని 24 గంటలక పాటు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ముఖ్యంగా సీఎం, డీజీపీ, పురపాలక, విద్యుత్, పంచాయతీరాజ్‌ శాఖ, నీటిపారుదల శాఖ, హైడ్రా అధికారులంతా మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఖమ్మంలో పరిస్థితి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్న సీఎం అక్కడ పరిస్థితి తెలుసుకునేందుకు నేరుగా బయల్దేరి వెళ్తున్నారు. రోడ్డు మార్గంలో ఖమ్మం చేరుకొని ప్రజలకు భరోసా ఇవ్వనున్నారు. 

ఖమ్మం, భద్రాద్రి, సూర్యపేట, మహబూబాద్‌ జిల్లాలకు ప్రత్యేక నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ జిల్లాల్లో వరద బాధితులను ఆదుకునేందుకు తక్షణ సాయం కింద ఐదు కోట్లను రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఇప్పటి వరకు ప్రకృతి విపత్తుల్లో మరణించే వాళ్లకు ఇచ్చే సాయాన్ని నాలుగు లక్షల నుంచి ఐదు లక్షలకు పెంచుతున్నట్టు ప్రకటించారు.  

తెలంగాణలో వరుణుడి బీభత్సం- ఈ జిల్లాల ప్రజలు బయటకు రావద్దని అధికారుల సూచన

ఇప్పటికే ఇద్దరు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క ఖమ్మంలో బస చేసి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. మిగతా జిల్లాల్లో ఉన్న పరిస్థితులను తెలుసుకునేందుకు ఆయా జిల్లాల మంత్రులు, ఇన్‌ఛార్జ్ మంత్రులను కూడా రేవంత్ రెడ్డి అప్రమత్తం చేశారు. వారితో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ విషయాలు తెలుసుకుంటున్నారు. 

తెలంగాణలో వరద పరిస్థితులు గురించి కేంద్రం కూడా ఆరా తీసింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ... సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్‌ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం వరద ప్రభావిత ప్రాంతాలు, తీసుకుంటున్న చర్యలను సీఎం రేవంత్ రెడ్డి ప్రధానికి వివరించారు. కేంద్రం నుంచి మరిన్ని ఎన్డీఆర్‌ఎఫ్‌ బలగాలను పంపిస్తున్నట్టు సీఎంకే ప్రధాని భరోసా ఇచ్చారు. ప్రాణ నష్టం లేకుండా అప్రమత్తంగా సూచించారు. ఎలాంటి సాయం కావాలన్నా అడగాలని చెప్పారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కూడా రేవతంత్ రెడ్డికి ఫోన్ చేశారు. పరిస్థితిపై ఆరా తీశారు. 

ఖమ్మం జిల్లాలతోపాటు పక్కనే ఉన్న ఉమ్మడి వరంగల్, నల్గొండ జిల్లాలో కూడా వర్షాలు నష్టాన్ని కలిగించాయి. మహబూబాబాద్‌ జిల్లా నీటిలో మునిగిపోయింది. జిల్లాలోనే ఇంటికన్నె-కేసముద్రం స్టేషన్ల సుమారు 300 మీటర్ల మేర రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. దీంతో సుమారు 24 రైళ్ల రాకపోకలను నిలిచిపోయాయి. అయితే కీలకమైన మార్గం కావడంతో 24 గంటల్లోనే ట్రాగ్‌ను పునరుద్దరించారు. ప్రస్తుతం పరిమిత వేగంతో రైళ్లు రాకపోకలను అనుమతిస్తున్నారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి వద్ద కూడా పట్టాలు కొట్టుకుపోయాయి. 

Also Read: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు - 432 రైళ్లు రద్దు, మరికొన్ని సర్వీసులు దారి మళ్లింపు

ఈ మూడు జిల్లాలల్లో సాగునీటి కాలువలు తెగిపోయాయి. చెరువులు కోతకు గురయ్యాయి. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కాగితరామచంద్రాపురంలో సాగర్‌ ఎడమ కాల్వకు పెద్ద ఎత్తున గండి పడింది. ఖమ్మం జిల్లా పరిధిలో కూడా సాగర్‌ ఎడమ కాల్వకు రెండు ప్రాంతాల్లో గండి పడింది. వివిధ జిల్లాల్లో కురిసిన వర్షాలకు వరుణుడు సృష్టించిన బీభత్సానికి 15 మందికిపైగా ప్రజలు మృతి చెందారు. మరికొందరు గల్లంతయ్యారు. 

Also Read: అల్ప‌పీడనం అంటే ఏమిటి? తుపాన్ ఎలా ఏర్ప‌డుతుంది? తుపాన్ల‌కు ఆ పేర్లు ఎలా పెడ‌తారు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Attacks on pubs: హైదరాబాద్ పబ్‌లపై ఈగిల్ పంజా - డ్రగ్స్ కలకలం.. నటి హేమ లైవ్ టెస్ట్!
హైదరాబాద్ పబ్‌లపై ఈగిల్ పంజా - డ్రగ్స్ కలకలం.. నటి హేమ లైవ్ టెస్ట్!
Shock for Gold Men: బంగారుబాబుల గుండెల్లో ఐటీ రైళ్లు - సోషల్ మీడియా మోజు.. ఆదాయపు పన్ను శాఖ వేటు!
బంగారుబాబుల గుండెల్లో ఐటీ రైళ్లు - సోషల్ మీడియా మోజు.. ఆదాయపు పన్ను శాఖ వేటు!
TRS Kavitha : కవిత నోట టీఆర్‌ఎస్ మాట! అదే పేరుతో పార్టీ పెడుతున్నారా? మీడియాతో చేసిన కామెంట్స్‌కు అర్థమేంటీ? 
కవిత నోట టీఆర్‌ఎస్ మాట! అదే పేరుతో పార్టీ పెడుతున్నారా? మీడియాతో చేసిన కామెంట్స్‌కు అర్థమేంటీ? 
Telangana Rythu Bharosa Scheme Update: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్- ఈ నెలలోనే రైతు భరోసా విడుదల!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్- ఈ నెలలోనే రైతు భరోసా విడుదల!

వీడియోలు

Sanjeev Goenka Behavior with LSG Captains | సంజీవ్ గోయెంకాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న క్రికెట్ ఫ్యాన్స్ | ABP Desam
Yuvraj Singh Slams SRH Management | కావ్య మారన్ నిర్ణయంపై యువీ అసహనం | ABP Desam
Abhishek Sharma Out vs KKR IPL 2026 | అభిషేక్ శర్మ అవుట్.. అంపైర్ తప్పిదమా? | ABP Desam
MS Dhoni Returns to Practice IPL 2026 | నెట్స్‌లో ప్రాక్టీస్ మొదలు పెట్టిన ధోనీ | ABP Desam
SRH Crushes KKR by 65 Runs IPL 2026 | ఈడెన్ గార్డెన్స్‌లో సన్‌రైజర్స్ ఊచకోత | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu Assembly Elections : విజయ్ టిక్కెట్ ఇచ్చాడు కానీ ఆ అభ్యర్థి వెంట ఒక్కరూ కూడా ఉండటం లేదు -తిరుత్తణిలో టీవీకేకు షాక్!
విజయ్ టిక్కెట్ ఇచ్చాడు కానీ ఆ అభ్యర్థి వెంట ఒక్కరూ కూడా ఉండటం లేదు -తిరుత్తణిలో టీవీకేకు షాక్!
Attacks on pubs: హైదరాబాద్ పబ్‌లపై ఈగిల్ పంజా - డ్రగ్స్ కలకలం.. నటి హేమ లైవ్ టెస్ట్!
హైదరాబాద్ పబ్‌లపై ఈగిల్ పంజా - డ్రగ్స్ కలకలం.. నటి హేమ లైవ్ టెస్ట్!
Vijay nomination affidavits: మొదట్లోనే తప్పు చేసిన విజయ్ - రెండు నామినేషన్లలో వేర్వేరు వివరాలు - తిరస్కరిస్తారా?
మొదట్లోనే తప్పు చేసిన విజయ్ - రెండు నామినేషన్లలో వేర్వేరు వివరాలు - తిరస్కరిస్తారా?
IPL 2026 PBKS VS CSK Result Update: టాప్ లేపిన పంజాబ్! చెన్నైపై ఘ‌న‌విజ‌యం!స‌త్తా చాటిన శ్రేయ‌స్, విజ‌య్, ఆర్య‌! సీఎస్కేకు వ‌రుస‌గా రెండో ఓట‌మి!
టాప్ లేపిన పంజాబ్! చెన్నైపై ఘ‌న‌విజ‌యం!స‌త్తా చాటిన శ్రేయ‌స్, విజ‌య్, ఆర్య‌! సీఎస్కేకు వ‌రుస‌గా రెండో ఓట‌మి!
Chandrababu: అమరావతిని అత్యుత్తుమ రాజధానిగా మారుస్తా - మావిగన్ పేరు కూడా పలకను - చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
అమరావతిని అత్యుత్తుమ రాజధానిగా మారుస్తా - మావిగన్ పేరు కూడా పలకను - చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Shroud of Turin: జీసస్ చివరి వస్త్రంపై ఇండియన్ DNA! సంచలనం రేపుతున్న కొత్త స్టడీ!
జీసస్ చివరి వస్త్రంపై ఇండియన్ DNA! సంచలనం రేపుతున్న కొత్త స్టడీ!
BCB Letter: భారత్- బంగ్లాదేశ్‌  మధ్య మళ్లీ మొదలైన క్రికెట్ దౌత్యం! సంబంధాల పునరుద్ధరణకు బీసీసీఐ లేఖ రాసిన బీసీబీ!
భారత్- బంగ్లాదేశ్‌  మధ్య మళ్లీ మొదలైన క్రికెట్ దౌత్యం! సంబంధాల పునరుద్ధరణకు బీసీసీఐ లేఖ రాసిన బీసీబీ!
Esther Anil: 'దృశ్యం'లో వెంకటేష్ చిన్న కూతురు... ఇప్పుడెంత పెద్దగా అయ్యిందో చూశారా?
'దృశ్యం'లో వెంకటేష్ చిన్న కూతురు... ఇప్పుడెంత పెద్దగా అయ్యిందో చూశారా?
Embed widget