అన్వేషించండి

Telangana: వరద బాధితల కోసం నిధులు విడుదల చేసిన రేవంత్- సాయం ఐదు లక్షలకు పెంపు

Reavanth ReddY: వర్షాలకు కకావిలకలమైన ప్రాంతాల ప్రజల తక్షణ సాయం కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఒక్కో జిల్లాకు ఐదు కోట్ల రూపాయలను రిలీజ్ చేసింది.

Rains In Telangana: తెలంగాణలో మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలు బీభత్సం సృష్టించాయి. రహదారులు, రైల్వే పట్టాలు కొట్టుకుపోయాయి. ఊళ్లకు ఊళ్లే జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. చాలా మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినా ఇంకా చాలా పల్లెల్లు నీటిలో కాపురాలు చేస్తున్నాయి. బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. 

ఈ వర్షాలకు ఖమ్మం జిల్లాలో భారీ నష్టం జరిగింది. ఎగువ నుంచి వస్తున్న వరద కారణంగా వాగులు, వంకలు, నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. మంత్రులు బాధిత ప్రాంతాల్లోనే ఉంటూ ప్రజలకు చేదోడుగా ఉంటున్నారు. అధికారులను అప్రమత్తం చేసి ప్రజలకు సమస్యలు రాకుండా ప్రయత్నిస్తున్నారు. పంట భూములు వేల ఎకరాలు నీట మునిగిపోయాయి. 

వర్షాలపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి అధికారులు ఎవరూ సెలవులు పెట్టొద్దని 24 గంటలక పాటు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ముఖ్యంగా సీఎం, డీజీపీ, పురపాలక, విద్యుత్, పంచాయతీరాజ్‌ శాఖ, నీటిపారుదల శాఖ, హైడ్రా అధికారులంతా మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఖమ్మంలో పరిస్థితి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్న సీఎం అక్కడ పరిస్థితి తెలుసుకునేందుకు నేరుగా బయల్దేరి వెళ్తున్నారు. రోడ్డు మార్గంలో ఖమ్మం చేరుకొని ప్రజలకు భరోసా ఇవ్వనున్నారు. 

ఖమ్మం, భద్రాద్రి, సూర్యపేట, మహబూబాద్‌ జిల్లాలకు ప్రత్యేక నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ జిల్లాల్లో వరద బాధితులను ఆదుకునేందుకు తక్షణ సాయం కింద ఐదు కోట్లను రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఇప్పటి వరకు ప్రకృతి విపత్తుల్లో మరణించే వాళ్లకు ఇచ్చే సాయాన్ని నాలుగు లక్షల నుంచి ఐదు లక్షలకు పెంచుతున్నట్టు ప్రకటించారు.  

తెలంగాణలో వరుణుడి బీభత్సం- ఈ జిల్లాల ప్రజలు బయటకు రావద్దని అధికారుల సూచన

ఇప్పటికే ఇద్దరు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క ఖమ్మంలో బస చేసి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. మిగతా జిల్లాల్లో ఉన్న పరిస్థితులను తెలుసుకునేందుకు ఆయా జిల్లాల మంత్రులు, ఇన్‌ఛార్జ్ మంత్రులను కూడా రేవంత్ రెడ్డి అప్రమత్తం చేశారు. వారితో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ విషయాలు తెలుసుకుంటున్నారు. 

తెలంగాణలో వరద పరిస్థితులు గురించి కేంద్రం కూడా ఆరా తీసింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ... సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్‌ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం వరద ప్రభావిత ప్రాంతాలు, తీసుకుంటున్న చర్యలను సీఎం రేవంత్ రెడ్డి ప్రధానికి వివరించారు. కేంద్రం నుంచి మరిన్ని ఎన్డీఆర్‌ఎఫ్‌ బలగాలను పంపిస్తున్నట్టు సీఎంకే ప్రధాని భరోసా ఇచ్చారు. ప్రాణ నష్టం లేకుండా అప్రమత్తంగా సూచించారు. ఎలాంటి సాయం కావాలన్నా అడగాలని చెప్పారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కూడా రేవతంత్ రెడ్డికి ఫోన్ చేశారు. పరిస్థితిపై ఆరా తీశారు. 

ఖమ్మం జిల్లాలతోపాటు పక్కనే ఉన్న ఉమ్మడి వరంగల్, నల్గొండ జిల్లాలో కూడా వర్షాలు నష్టాన్ని కలిగించాయి. మహబూబాబాద్‌ జిల్లా నీటిలో మునిగిపోయింది. జిల్లాలోనే ఇంటికన్నె-కేసముద్రం స్టేషన్ల సుమారు 300 మీటర్ల మేర రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. దీంతో సుమారు 24 రైళ్ల రాకపోకలను నిలిచిపోయాయి. అయితే కీలకమైన మార్గం కావడంతో 24 గంటల్లోనే ట్రాగ్‌ను పునరుద్దరించారు. ప్రస్తుతం పరిమిత వేగంతో రైళ్లు రాకపోకలను అనుమతిస్తున్నారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి వద్ద కూడా పట్టాలు కొట్టుకుపోయాయి. 

Also Read: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు - 432 రైళ్లు రద్దు, మరికొన్ని సర్వీసులు దారి మళ్లింపు

ఈ మూడు జిల్లాలల్లో సాగునీటి కాలువలు తెగిపోయాయి. చెరువులు కోతకు గురయ్యాయి. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కాగితరామచంద్రాపురంలో సాగర్‌ ఎడమ కాల్వకు పెద్ద ఎత్తున గండి పడింది. ఖమ్మం జిల్లా పరిధిలో కూడా సాగర్‌ ఎడమ కాల్వకు రెండు ప్రాంతాల్లో గండి పడింది. వివిధ జిల్లాల్లో కురిసిన వర్షాలకు వరుణుడు సృష్టించిన బీభత్సానికి 15 మందికిపైగా ప్రజలు మృతి చెందారు. మరికొందరు గల్లంతయ్యారు. 

Also Read: అల్ప‌పీడనం అంటే ఏమిటి? తుపాన్ ఎలా ఏర్ప‌డుతుంది? తుపాన్ల‌కు ఆ పేర్లు ఎలా పెడ‌తారు

టాప్ హెడ్ లైన్స్

Breaking News: టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌! జాతీయ జట్టులో సూర్యవంశీకి స్థానం! 
టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌! జాతీయ జట్టులో సూర్యవంశీకి స్థానం! 
GHMC Elections Old City Hyderabad: గ్రేటర్ సమరంలో మారుతున్న సమీకరణాలు - ఎంఐఎం కోటపై కాంగ్రెస్, ఎంబీటీ కలసి దాడి చేయబోతున్నాయా?
గ్రేటర్ సమరంలో మారుతున్న సమీకరణాలు - ఎంఐఎం కోటపై కాంగ్రెస్, ఎంబీటీ కలసి దాడి చేయబోతున్నాయా?
Pawan Kalyan Interview: అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్‌లో ఎబోలా టెన్షన్.. సూడాన్ పౌరుడి రిపోర్ట్ నెగెటివ్! రెండో కేసుపై ఉత్కంఠ
హైదరాబాద్‌లో ఎబోలా టెన్షన్.. సూడాన్ పౌరుడి రిపోర్ట్ నెగెటివ్! రెండో కేసుపై ఉత్కంఠ

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌! జాతీయ జట్టులో సూర్యవంశీకి స్థానం! 
టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌! జాతీయ జట్టులో సూర్యవంశీకి స్థానం! 
CJP Protest: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే! ఢిల్లీ వీధుల్లో బొద్దింకల గర్జన!
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే! ఢిల్లీ వీధుల్లో బొద్దింకల గర్జన!
CJP Protest: కాక్రోచ్‌ జనతా పార్టీ ఆఫ్‌లైన్ పోరాటం! కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌తో జంతర్‌ మంతర్ వద్ద ధర్నా!
కాక్రోచ్‌ జనతా పార్టీ ఆఫ్‌లైన్ పోరాటం! కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌తో జంతర్‌ మంతర్ వద్ద ధర్నా!
Buchi Babu Sana: సారీ లేడీస్... 'పెద్ది'లో ఆ సీన్స్ డిలీట్ చేస్తున్నా - దర్శకుడు బుచ్చి ట్వీట్
సారీ లేడీస్... 'పెద్ది'లో ఆ సీన్స్ డిలీట్ చేస్తున్నా - దర్శకుడు బుచ్చి ట్వీట్
NTR: అడ్రస్ పెట్టు... అడ్రస్ పెట్టు... అభిమానికి కుకీస్ పంపిన ఎన్టీఆర్
అడ్రస్ పెట్టు... అడ్రస్ పెట్టు... అభిమానికి కుకీస్ పంపిన ఎన్టీఆర్
CBSE Verification Last Date Extended: సీబీఎస్‌ఈ 12వ తరగతి విద్యార్థులకు ఊరట! రీ-వాల్యుయేషన్ గడువు పెంపు!
సీబీఎస్‌ఈ 12వ తరగతి విద్యార్థులకు ఊరట! రీ-వాల్యుయేషన్ గడువు పెంపు!
Pawan Kalyan Interview: అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
Rahul Gandhi Great Nicobar Project: అండమాన్‌లో 'కేంద్రం చేస్తున్న విధ్వంసాన్ని' చూపించేందుకు సముద్రంలో డైవ్ చేసిన రాహుల్ గాంధీ
అండమాన్‌లో 'కేంద్రం చేస్తున్న విధ్వంసాన్ని' చూపించేందుకు సముద్రంలో డైవ్ చేసిన రాహుల్ గాంధీ
Embed widget