అన్వేషించండి

Telangana IPS Transfers: తెలంగాణలో 23 మంది ఐపీఎస్‌ల బదిలీలు- హైదరాబాద్‌ సీపీగా సజ్జనార్‌- మరికొందరు సీనియర్లకు కీలక బాధ్యతలు  

Telangana IPS Transfers: హైదరాబాద్‌ పోలీసు బాస్‌గా సజ్జనార్‌ వచ్చారు. హోంశాఖ ప్రత్యేక కార్యదర్శిగా సీవీ ఆనంద్‌ నియమితులయ్యారు. కీలకమైన ఇంటెలిజెన్స్‌, విజిలెన్స్‌ విభాగాల్లోనూ మార్పులు జరిగాయి

Show Quick Read
Key points generated by AI, verified by newsroom

Telangana IPS Transfers: తెలంగాణ రాష్ట్ర పరిపాలనా యంత్రాంగంలో ప్రభుత్వం ఒక పెను మార్పునకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో అత్యంత కీలకమైన పోలీస్ వ్యవస్థతో సహా ముఖ్య విభాగాలకు చెందిన 23 మంది  ఐపీఎస్‌ అధికారులను తక్షణమే బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మార్పుతో రాష్ట్ర హోంశాఖ, పౌర సరఫరాల శాఖ, ఆర్టీసీ వంటి ప్రధాన శాఖల్లో కొత్త సారథులు బాధ్యతలు చేపట్టనున్నారు.

రాజధాని కమాండ్‌ సజ్జనార్‌ చేతుల్లో

ఈ బదిలీల పరంపరలో అత్యంత కీలకమైన నియామకం, మీడియా వర్గాలతోపాటు, ప్రజల దృష్టిని ఆకర్షించింది. అదే హైదరాబాద్‌ నగర పోలీస్ కమిషనర్‌ (సీపీ) పోస్టు. రాష్ట్ర రాజధాని, టెక్నాలజీ హబ్‌ అయిన హైదరాబాద్‌లో శాంతిభద్రతలను పర్యవేక్షించే అత్యున్నత బాధ్యతను సీనియర్ ఐపీఎస్‌ అధికారి సజ్జనార్‌కు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Image

హైదరాబాద్‌ నగరంలో శాంతిభద్రతలు, సైబర్‌ క్రైమ్స్‌, ట్రాఫిక్‌ నిర్వహణ, ముఖ్యంగా ముఖ్యమంత్రి, రాష్ట్ర స్థాయి ప్రముఖుల భద్రతను పర్యవేక్షించే ఈ కీలక స్థానంలో సజ్జనార్‌ నియామకం రాష్ట్ర పోలీసు యంత్రాంగానికి కొత్త శక్తిని ఇవ్వనుంది.  

హోంశాఖకు సీవీ ఆనంద్‌  

రాష్ట్ర హోంశాఖ పరిపాలనా వ్యవహారాల్లో పటిష్టతను తీసుకురావడానికి ప్రభుత్వం అత్యంత కీలకమైన మరో నిర్ణయం తీసుకుంది. హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సీవీ ఆనంద్‌ను నియమించింది. పోలీస్ బలగాల నిర్వహణ, ఆస్తులు, మౌలిక సదుపాయాలు, రక్షణ సంబంధిత విధాన నిర్ణయాలు హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఉంటాయి.

సీవీ ఆనంద్‌ నియామకం ద్వారా, రాష్ట్ర పోలీస్ వ్యవస్థకు చెందిన సీనియర్ అధికారి, పరిపాలనా విభాగాన్ని పర్యవేక్షించడం వలన, లా అండ్ ఆర్డర్ విభాగాలు, పరిపాలన మధ్య సమన్వయం మరింత మెరుగుపడే అవకాశం ఉంది. ఈ నియామకం ద్వారా పాలనలో వేగం, నిర్ణయాల్లో స్పష్టత పెరుగుతాయని ప్రభుత్వం ఆశిస్తోంది.

Image

ఇంటెలిజెన్స్‌ డీజీగా విజయ్‌ కుమార్‌  

ఏదైనా రాష్ట్రంలో శాంతిభద్రతల నిర్వహణకు, ప్రభుత్వాన్ని రక్షించడానికి మూల స్తంభంలా పనిచేసే విభాగం ఇంటెలిజెన్స్‌ . కీలకమైన సమాచారాన్ని సేకరించడం, ఉగ్రవాద బెదిరింపులను, అంతర్గత భద్రతా సమస్యలను ముందుగానే పసిగట్టడం ఈ విభాగం బాధ్యత. ప్రభుత్వం ఇంటెలిజెన్స్‌ డీజీగా విజయ్‌ కుమార్‌ను నియమించడం ద్వారా, రాష్ట్రంలో శాంతిభద్రతల నిర్వహణకు సంబంధించిన ముందస్తు వ్యూహాలను పటిష్టం చేయడానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఒక కీలక సమయంలో, అత్యంత నమ్మకస్తుడైన, అనుభవజ్ఞుడైన అధికారికి ఈ బాధ్యతలు అప్పగించడం వ్యూహాత్మక చర్యగా చెప్పవచ్చు.

ప్రభుత్వం విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగంలో, అవినీతి నిరోధక శాఖలో (ఏసీబీ) కూడా సమర్థులైన అధికారులను నియమించింది. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీగా శిఖా గోయల్‌ను ప్రభుత్వం నియమించింది. ప్రభుత్వ పథకాల అమలులో లోపాలు, అవకతవకలను గుర్తించడంలో ఈ విభాగం కీలక పాత్ర పోషిస్తుంది. శిఖా గోయల్ నియామకం ద్వారా విజిలెన్స్‌ విభాగానికి కొత్త దిశానిర్దేశం లభించనుంది.

అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) విషయానికి వస్తే, ప్రస్తుతం సీఐడీ అదనపు డీజీగా ఉన్న చారుసిన్హాకు ఏసీబీ డీజీగా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఒక సీనియర్ అధికారి అదనపు బాధ్యతలు స్వీకరించడం వలన, ఏసీబీ విచారణల్లో సమగ్రత, పారదర్శకత పెరుగుతాయని అంచనా. స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ డీజీగా స్వాతిలక్రాకు అదనపు బాధ్యతలు అప్పగించారు. 

1. ఆర్టీసీ ఎండీగా నాగిరెడ్డి నియమితులయ్యారు. ఆర్టీసీ ఆర్థిక స్థిరత్వం, ప్రజలకు రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచడం నాగిరెడ్డి ముందున్న ముఖ్య లక్ష్యాలుగా ఉన్నాయి.ఇప్పటి వరకు ఈ విభాగంలో సజ్జనార్ తన మార్క్‌ చూపించారు. దాన్ని కొనసాగిస్తా లేదంటే ప్రత్యేక స్టైల్‌ను అనుసరిస్తారా అనే ఆసక్తి ఉంది. 

2. పౌరసరఫరాల ప్రిన్సిపల్‌ సెక్రటరీగా స్టీఫెన్‌ రవీంద్రను నియమించారు. ఆహార భద్రత, రేషన్‌ పంపిణీ వంటి అత్యంత సున్నితమైన, ప్రజలతో ప్రత్యక్ష సంబంధం ఉన్న ఈ శాఖ బాధ్యతలను స్టీఫెన్‌ రవీంద్రకు అప్పగించడం ద్వారా, పంపిణీ వ్యవస్థలో పారదర్శకతను పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది.

Image
 
మొత్తం 23 మంది ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఈ ఉత్తర్వులు, కేవలం అధికారుల మార్పులు మాత్రమే కాదు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ, ముఖ్య పాలనా విభాగాలకు సమర్థత, అనుభవం కలిగిన అధికారులను నియమించడం ద్వారా, పాలనా యంత్రాంగాన్ని మరింత దృఢంగా మార్చాలనే ప్రభుత్వ సంకల్పం ఇందులో కనిపిస్తోంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs nz 2nd odi highlights: రాజ్‌కోట్‌లో భారత్ ఓటమి.. డారిల్ మిచెల్ సెంచరీతో న్యూజిలాండ్ ఘనవిజయం.. 1-1తో సిరీస్ సమం
రాజ్‌కోట్‌లో భారత్ ఓటమి.. డారిల్ మిచెల్ సెంచరీతో న్యూజిలాండ్ ఘనవిజయం.. 1-1తో సిరీస్ సమం
Harish Rao: సజ్జనార్.. ఖాకీ దుస్తులు తీసేసి కాంగ్రెస్ కండువా కప్పుకో - హరీష్ రావు ఆగ్రహం
సజ్జనార్.. ఖాకీ దుస్తులు తీసేసి కాంగ్రెస్ కండువా కప్పుకో - హరీష్ రావు ఆగ్రహం
Chandrababu Sankranti Celebrations: నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు
నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు
Nagoba Jatara 2026: నాగోబా జాతర సందర్భంగా జనవరి 22న విద్యాసంస్థలకు సెలవు: ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్
నాగోబా జాతర సందర్భంగా జనవరి 22న విద్యాసంస్థలకు సెలవు: ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్

వీడియోలు

AA 23 Announcement Video Decode | Allu Arjun తో ఏం ప్లాన్ చేశావయ్యా Lokesh Kanagaraj | ABP Desam
Mumbai Indians vs Gujarat Giants WPL 2026 | హర్మన్‌ప్రీత్ కౌర్ విధ్వంసం!
Ind vs NZ Shreyas Iyer Records | రికార్డు సృష్టించనున్న శ్రేయస్ అయ్యర్!
Jitesh Sharma Being Dropped from T20 World Cup | వరల్డ్ కప్ జితేష్ సంచలన వ్యాఖ్యలు!
India vs New Zealand 2nd ODI | టీమిండియాలో భారీ మార్పులు ?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs nz 2nd odi highlights: రాజ్‌కోట్‌లో భారత్ ఓటమి.. డారిల్ మిచెల్ సెంచరీతో న్యూజిలాండ్ ఘనవిజయం.. 1-1తో సిరీస్ సమం
రాజ్‌కోట్‌లో భారత్ ఓటమి.. డారిల్ మిచెల్ సెంచరీతో న్యూజిలాండ్ ఘనవిజయం.. 1-1తో సిరీస్ సమం
Harish Rao: సజ్జనార్.. ఖాకీ దుస్తులు తీసేసి కాంగ్రెస్ కండువా కప్పుకో - హరీష్ రావు ఆగ్రహం
సజ్జనార్.. ఖాకీ దుస్తులు తీసేసి కాంగ్రెస్ కండువా కప్పుకో - హరీష్ రావు ఆగ్రహం
Chandrababu Sankranti Celebrations: నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు
నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు
Nagoba Jatara 2026: నాగోబా జాతర సందర్భంగా జనవరి 22న విద్యాసంస్థలకు సెలవు: ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్
నాగోబా జాతర సందర్భంగా జనవరి 22న విద్యాసంస్థలకు సెలవు: ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్
Hyderabad CP Sajjanar: మహిళలను అవమానించడం క్రూరత్వమే, దుష్ప్రచారం చేస్తే చర్యలు తప్పవు: సజ్జనార్ వార్నింగ్
మహిళలను అవమానించడం క్రూరత్వమే, దుష్ప్రచారంపై చర్యలు తప్పవు: సజ్జనార్ వార్నింగ్
Harshit Rana: గంభీర్ దత్తపుత్రుడు అంటూ ట్రోలింగ్.. కట్ చేస్తే టీమిండియా సక్సెస్‌ఫుల్ బౌలర్‌గా రికార్డ్
గంభీర్ దత్తపుత్రుడు అంటూ ట్రోలింగ్.. కట్ చేస్తే టీమిండియా సక్సెస్‌ఫుల్ బౌలర్‌గా రికార్డ్
Telangana: జర్నలిస్టుల అరెస్టుపై భగ్గుమన్న బీఆర్ఎస్ - మొహబ్బత్‌కా దుకాణ్ ఇదేనా అని రాహుల్‌కు కేటీఆర్ ప్రశ్న
జర్నలిస్టుల అరెస్టుపై భగ్గుమన్న బీఆర్ఎస్ - మొహబ్బత్‌కా దుకాణ్ ఇదేనా అని రాహుల్‌కు కేటీఆర్ ప్రశ్న
Affordable Cars in India: భారత్‌లో అతి చవకైన 5 కార్లు ఇవే.. తక్కువ మెయింటనెన్స్ తో మీకు మరింత ప్రయోజనం
భారత్‌లో అతి చవకైన 5 కార్లు ఇవే.. తక్కువ మెయింటనెన్స్ తో మీకు మరింత ప్రయోజనం
Embed widget