By: ABP Desam | Updated at : 02 Jun 2023 11:28 AM (IST)
తెలంగాణ అంటే హైదరాబాద్ మాత్రమే కాదు- పల్లె పల్లెలో ప్రగతి కనిపించాలి: గవర్నర్
Telangana Decade Celebrations : తెలంగాణ దశాబ్ధి వేడుకల వేళ తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై విమర్శలు చేశారు. తెలంగాణ ఏర్పడి పదో ఏట అడుగు పెట్టినా ఇంకా ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. అభివృద్ధి అంటే ఒక్క హైదరాబాద్లో ప్రగతి సాధించడం కాదని అన్ని ప్రాంతాల్లో సమాన అభివృద్ధి కావాలన్నారు.
రాజ్భవన్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పాల్గొన్నారు. జాతీయ జెండా ఎగరవేశారు. అనంతరం మాట్లాడిన ఆమె... ప్రభుత్వంపై విమర్శలు చేశారు. తెలంగాణ అంటే ఒక్క హైదరాబాద్ కాదని అ్నారు. హైదరాబాద్ అభఇవృద్ధి చెందినంత మాత్రాన రాష్ట్రమంతా అభివృద్ధి చెందినట్టు కాదన్నారు. మారుమూల పల్లెల్లో కూడా ప్రగతి ఫలాలు కనిపించాలన్నారు. అప్పుడే అసలైన అభివృద్ధి కనిపిస్తుందన్నారు. రాష్ట్రం సిద్దించి పదేళ్లు అవుతున్నా ఉద్యమకారుల ఆకాంక్షలు ఇంకా నెరవేరలేదన్నారు. రాజ్భవన్లో వేడుకలు నిర్వహించిన గవర్నర్... ఉద్యమకారులకు సన్మానం చేశారు. అమర వీరులకు నివాళి అర్పించారు.
కొంత మంది అభివృద్ధి కాకుండా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి అయితేనే సంపూర్ణ అభివృద్ధి అనిపించుకుంటుందన్నారు తమిళిసై. వచ్చే సంవత్సరం నాటికి దేశంలో తెలంగాణ నంబర్1 కావాలని ఆకాంక్షించారు. జై తెలంగాణ అంటే స్లోగన్ నినాదం కాదన్న ఆమె... అదో ఆత్మ గౌరవ నినాదమన్నారు. తన జీవితంలో ప్రతి నిమిషం ప్రజల కోసమే పని చేస్తున్నట్టు వెల్లడించారు. దేవుడు తనను తెలంగాణకు పంపడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నట్టు తెలిపారు. నేను మీతో ఉన్నాను. మీరు నాతో ఉన్నారని ఉద్యమకారులతో మాట్లాడారు గవర్నర్.
CPGET Seat Allotment: సెప్టెంబరు 29న సీపీగెట్ సీట్ల కేటాయింపు, ఈ తేదీలోగా జాయిన్ అవ్వాల్సిందే!
TSPSC: 'గ్రూప్-1' పరీక్షలో అవకతవకలు జరగలేదు, టీఎస్పీఎస్సీ వివరణ
Rain In Hyderabad: హైదరాబాద్లో వర్షం - చిరుజల్లుల మధ్యే కొనసాగుతున్న నిమజ్జనం
Khairatabad Ganesh Immersion: గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ వినాయకుడు - అర్ధరాత్రి ఆఖరి పూజ, వేకువజాము నుంచి యాత్ర
Hyderabad Ganesh Laddu Auction 2023: కోటి 26 లక్షలు పలికిన గణేష్ లడ్డూ, బాలాపూర్ రికార్డు బ్రేక్, ఎక్కడో కాదండోయ్ మన హైదరాబాదులోనే!
Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు
Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !
Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం
BhagavanthKesari: గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే - బాలయ్య ఊరమాస్ అవతార్, 'భగవంత్ కేసరి' సర్ప్రైజ్ అదిరింది
/body>