అన్వేషించండి

Revanth Reddy Funds to OU: ఓయూ అభివృద్ధికి రూ.1000 కోట్లు, ఆక్స్‌ఫర్డ్ స్థాయిలో వర్సిటీని డెవలప్ చేస్తాం: రేవంత్ రెడ్డి

ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University) అభివృద్ధి కోసం రూ.1000 కోట్లు అయినా సరే నిధులు అందిస్తామని, ఆక్స్‌ఫర్డ్, స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీల స్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

Telangana Govt Funds to Osmania University: హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధిపై పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటామని, అవసరమైతే రూ.1000 కోట్లు కావాలన్నా ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) హామీ ఇచ్చారు. ఓయూను స్థాయిని స్టాన్‌ఫర్డ్, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయాల స్థాయికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. విద్యాశాఖ కోసం ఏడాదికి రూ.40 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. నేటి ఉదయం ఉస్మానియా వర్సిటీలో రూ.90 కోట్లతో కొత్తగా నిర్మించిన దుందుభి, బీమా హాస్టల్ భవనాలను రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం అక్కడే డిజిటల్‌ లైబ్రరీ, రీడింగ్‌ రూమ్‌లకు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.  ఉస్మానియా యూనివర్సిటీ లేకపోతే తెలంగాణ రాష్ట్రమే ఉండేది కాదు. ఈ యూనివర్సిటీ తెలంగాణ చరిత్రకు నిలువెత్తు సాక్షిగా నిలవాలి. యూనివర్సిటీ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఇంజనీర్స్ కమిటీని ఏర్పాటు చేసి అంచనాలు తీసుకురమ్మని ఆదేశించాను. మీ అవసరాలు ఏవైనా ఉంటే చెప్పండి, మేము నిధులు మంజూరు చేస్తాం” అని రేవంత్ రెడ్డి తెలిపారు. 

నిరసనలు చేయనివ్వండి – పోలీసులెవ్వరూ కనిపించొద్దు

యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళనల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నేను మళ్లీ ఉస్మానియా యూనివర్సిటీకి వస్తాను. ఆర్ట్స్ కాలేజీ వద్ద ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి నేరుగా నిధులు కేటాయిస్తానని భరోసా ఇచ్చారు. ఆరోజు నిరసనలు తెలిపే వారిని నిరసన తెలపనివ్వండి. ఆ రోజు యూనివర్సిటీలో ఒక్క పోలీస్ కూడా కనిపించకూడదని డీజీపీని ఆదేశిస్తున్నాను. నేను రావొద్దని అడ్డుకునే వారికి సమాధానం చెప్పే ధైర్యం నాకుంది. కొంతమంది రాజకీయ నాయకులు పదవులు పోయాయని బాధపడుతున్నారు. తమ కొడుకులను ప్రోత్సహించలేకపోయారని ఆవేదన చెందుతున్నారు. కానీ వారి ఉచ్చులో మీరు పడొద్దు. సమస్య ఉంటే మాకు చెప్పండి, మా మంత్రులు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు” అని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.

ఉస్మానియా యూనివర్సిటీ గ్రూప్ 1, 2 లాంటి ఉద్యోగాలు తెచ్చుకోవడానికి కాదు తెలంగాణ సమాజాన్ని పునర్ నిర్మించడానికి అవసరమైన మేథా సంపత్తిని ఆశిద్దామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 21 ఏళ్లకే ఐఏఎస్, ఐపీఎస్ అయి జిల్లా ఉన్నతాధికారులుగా పరిపాలన సాగిస్తున్నాం. 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు ఓటు హక్కు వయసును తగ్గించుకున్నాం. 21 ఏళ్లకే ఐఏఎస్, ఐపీఎస్ అవుతుంటే అదే వయసులో ఎమ్మెల్యేగా పోటీ చట్టసభల్లోకి ప్రవేశించి ప్రజా సేవ ఎందుకు చేయకూడదని ప్రశ్నించారు. 

అబద్ధాల ప్రచారాలకు లోను కాకండి
కోదండరాం పై గతంలో జరిగిన కుట్రలను ప్రస్తావిస్తూ, “కోదండరాం సార్‌ను సుప్రీం కోర్టు వరకు లాగి పదవి నుంచి తొలగించారు. ఇదేంటీ పైశాచిక ఆనందం? మేము మళ్లీ ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తాం” అని ప్రకటించారు. ప్రభుత్వంపై సోషల్ మీడియా, వాట్సాప్ ద్వారా తప్పుడు ప్రచారం జరుగుతోందని సీఎం ఆరోపించారు. “ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌తో సింహాలు, ఏనుగులు ఉన్నాయని సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర అడ్డుకున్నారు. తెలంగాణలో సింహాలు, ఏనుగులు లేవు. కానీ మానవ రూపంలో ఉన్న మృగాలు మాత్రం ఉన్నాయి. వాళ్లు తెలంగాణ సమాజానికి పట్టిన చెదలు. వాళ్లు తిరిగి వస్తే ఉస్మానియా యూనివర్సిటీని కూడా ఉండనివ్వరు,” అని ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు.

యూనివర్సిటీ అభివృద్ధి బాధ్యత నాది
“మీ చదువుకు ఏం కావాలో అడగండి. ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి చేయడం నా బాధ్యత. తెలంగాణ సమాజం బాగు కోరని అబద్ధాల సంఘం మాటలను నమ్మొద్దు,” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రెండో సీఎంగా బాధ్యతలు చేపట్టిన నేను పొట్టి శ్రీరాములు పేరును మార్చి రజాకర్లపై పోరాడిన, పాత్రికేయుడిగా రాణించిన సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టుకున్నాం. వాళ్లు మన స్ఫూర్తి ప్రధాతలు. ఐఐఎఫ్‌టీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టాం. కోటి మహిళా యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐకమ్మ పేరు పెట్టి వారి పోరాటాన్ని గుర్తించుకున్నాం. కానీ సిద్ధాంతాలు నచ్చక కొందరు మనల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. చిన్న కాలేజీలు, డిగ్రీ కాలేజీల విద్యార్థులను గంజాయికి అలవాటు చేసి ప్రశ్నించాల్సిన యువతను నిర్వీర్యం చేసే ప్రయత్నం జరిగింది. 

 ఒకనాడు దేశంలో, తెలంగాణ సమాజంలో ఇందిరా గాంధీ, పీవీ నరసింహారావు తీసుకొచ్చిన ల్యాండ్ చట్టాలతో దళితులు, గిరిజనులు, పేదలకు ఇండ్ల పట్టాలు ఇచ్చారు. ఆనాడు భూమి ఉంటే గౌరవం అని ఇందిరమ్మ పోరుతో కాంగ్రెస్ ప్రభుత్వాలు పేదలకు పట్టాలిచ్చాయి. పోడు భూముల పట్టాలు, 25 లక్షల భూములు దళితులు, గిరిజనులు, ఆదివాసీలకు పట్టాలుగా అందాయి. చదువు, చైతన్యం ఉంటేనే రాణిస్తారు. నా వద్ద పంచడానికి భూములు లేవు, ఖజానా లేదు. నేను ఇవ్వగలిగింది నాణ్యమైన విద్య ఒక్కటే. 

పంచడానికి భూములు లేవు..

రాష్ట్రంలో భూములు లేవు. పంపకాలు జరిగాయి. 1.50 కోట్ల ఎకరాలు సాగవుతుంటే 96 శాతం చిన్న, సన్నకారు రైతులే ఉన్నారు. ఒకట్రెండు ఎకరాలు ఉన్నవారే. అందుకే మీరు ధనవంతులు కావాలంటే మేం నాణ్యమైన విద్యను అందిస్తాం. విద్యా ప్రమాణాలు పెంచాలంటే ఏం చేయాలన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీ విలువైన సలహాలు, సూచనలు యూనివర్సిటీ ద్వారా ఇవ్వాలని’ సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Embed widget