అన్వేషించండి

Revanth Reddy Comments On Chandra Babu: చంద్రబాబూ! నువ్వు అనుకున్నవి జరగవు!- అఖిలపక్షం భేటీ తర్వాత రేవంత్ రెడ్డి వార్నింగ్ 

Revanth Reddy Comments On Chandra Babu: మోదీ వద్ద పలుకుబడి ఉందని బనకచర్లకు అనుమతులు తెచ్చుకుంటామనే కుదరదని చంద్రబాబుకు రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. కచ్చితంగా అడ్డుకుంటాని స్పష్టం చేశారు.

Revanth Reddy Comments On Chandra Babu: ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై ఎందుకు వద్దంటున్నాం? ఏం జరగబోతోంది? ఆ ప్రాజెక్టు రూపకల్పనకు అవకాశం ఇచ్చింది ఎవరు ఇలాంటి విషయాలను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అఖిలపక్షం సమావేశంలో వివరించారు. ఎంపీలు అడిగిన అనుమానాలు నివృత్తి చేశారు. సమగ్ర వివరాలతో పవర్‌ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం ప్రెస్‌మీట్ పెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు ఈ ‌ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్లాలా వద్దా అన్నది కేంద్రం చేతుల్లో ఉందని ఈ విషయంలో ఎంపీలు మోదీపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. 

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గోదావరి నీటి వివాదాల ట్రిబ్యునల్(GWDT) 1980 అవార్డు, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం(APRA) 2014ని ఉల్లంఘిస్తుందని ఆరోపించారు. గోదావరిలోని తెలంగాణ వాటాను కూడా వాడుకుంటోందని విమర్శించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టబోయే ప్రాజెక్టుతో భద్రాచలంలో వరద ముప్పును పెంచుతున్నారని అన్నారు. దీనంతటికీ నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ కారణమని ఆరోపించారు. గోదావరి వృథా జలాలు వాడుకోమని ఏపీకి సలహా ఇచ్చింది  ఆయనేనని అన్నారు. ఇప్పుడు అనవసరంగా తప్పు తమపై వేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణకు ద్రోహం చేసిన వాళ్లు ఎవరైనా ఉన్నారంటే మొదటి దోషి కేసీఆర్ అవుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదట ఉరి తీయాల్సి వస్తే ఆయన్నే తీయాలని అన్నారు. 

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుపై కూడా విమర్శలు చేశారు రేవంత్ రెడ్డి. కేంద్రంలో తన పలుకుబడి ఉపయోగించి ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన చేయొద్దని సూచించారు. మోదీపై ఒత్తిడి తీసుకొచ్చి అనుమతులు పొందాలంటే మాత్రం అది జరిగే పని కాదని చెప్పుకొచ్చారు. కచ్చితంగా తెలంగాణ హక్కుల కోసం ఎంత వరకైనా కోట్లాడతామని అన్నారు. అవసరమైతే న్యాయపోరాటానికి సిద్ధమని పేర్కొన్నారు.  ముందు తెలంగాణకు రావాల్సిన 968 టీఎంసీల నీటిని వినియోగించుకునేందుకు అవకాశం ఇస్తే తర్వాత కిందికి వెళ్లే నీటిని ఎంతైనా వాడుకోవచ్చని కూడా సూచించారు.  

గత పాలకులు కాసులు కక్కుర్తితో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయకుండా కాళేశ్వరం మాత్రమే కట్టారని అన్నారు రేవంత్.  కేవలం కాళేశ్వరం పేరు చెప్పి ఖజానా ఖాళీ చేశారని ఆరోపించారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ప్రాజెక్టుల కోసం ఐదు వందల రూపాయలు ఇచ్చేందుకు కూడా నిధులు లేకుండా చేశారని ధ్వజమెత్తారు. అన్నింటినీ కూడగట్టుకొని ఆర్థికంగా ఏదైనా చేద్దామంటే తప్పుడు ఆరోపణలతో అడ్డం పడుతున్నారని అన్నారు. పేదలకు పంచక, ప్రాజెక్టులు కట్టక, అంతా తరలించేశారని అన్నారు.  

2016 అపెక్స్ కౌన్సిల్‌లో కేసిఆర్ ఇచ్చిన ప్రకటన నుంచే బనకచర్ల ఆలోచన పుట్టిందని రేవంత్ అన్నారు. మూడు టీఎంసీలు అని కేసీఆర్ చెబితే వాళ్లు మూడు వందల టీఎంసీలకు స్కెచ్ వేశారని గుర్తు చేశారు. గోదావరి జలాలు వృథాగా పోతున్నాయని చెప్పడమే కాకుండా పూర్తి సహకారం ఉంటుందని కూడా మాట ఇచ్చారని అన్నారు. ఇప్పుడు సరి చేసే ఉద్దేశంతో అఖిల పక్షం ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి వివరించారు. భవిష్యత్ కార్యచరణపై వారి సూచనలు తీసుకున్నట్టు వెల్లడించారు.  
 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

CM Chandra Babu :టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
The Raja Saab Live Updates: 'ది రాజా సాబ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ ఏం జరిగిందో తెలుసుకోండి - ఏపీలో షోస్ షురూ
'ది రాజా సాబ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ ఏం జరిగిందో తెలుసుకోండి - ఏపీలో షోస్ షురూ
Andhra Pradesh: సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
Amaravati: జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్

వీడియోలు

Pasarlapudi Blowout 30 Years | ఇరుసుమండ బ్లోఅవుట్ కు తాతలాంటి పాశర్లపూడి బ్లో అవుట్ ఘటన | ABP Desam
WPL 2026 Mumbai Indians | ముంబై ఇండియన్స్ లో కీలక మార్పులు | ABP Desam
India vs South Africa Vaibhav Suryavanshi | మూడో వన్డేలో 233 పరుగుల తేడాతో విజయం
Shreyas Iyer Fitness Update Ind vs NZ | టీమ్ ఇండియాకు గుడ్‌న్యూస్!
Robin Uthappa about Team India | ఉత‌ప్ప సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandra Babu :టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
The Raja Saab Live Updates: 'ది రాజా సాబ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ ఏం జరిగిందో తెలుసుకోండి - ఏపీలో షోస్ షురూ
'ది రాజా సాబ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ ఏం జరిగిందో తెలుసుకోండి - ఏపీలో షోస్ షురూ
Andhra Pradesh: సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
Amaravati: జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
Seethakka Surekha meets KCR: ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో మంత్రులు సురేఖ, సీతక్క సమావేశం - మేడారం జాతరకు ఆహ్వానం
ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో మంత్రులు సురేఖ, సీతక్క సమావేశం - మేడారం జాతరకు ఆహ్వానం
Jagan: రెండో దశ భూసమీకరణకు వ్యతిరేకం - 2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా? - అమరావతిపై జగన్ వ్యాఖ్యలు
రెండో దశ భూసమీకరణకు వ్యతిరేకం - 2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా? - అమరావతిపై జగన్ వ్యాఖ్యలు
Geetu Mohandas: ఎవరీ గీతూ మోహన్‌దాస్? 'టాక్సిక్' టీజర్‌తో హాట్ టాపిక్‌... డైరెక్టరే కాదు, నటిగా అవార్డు విన్నర్
ఎవరీ గీతూ మోహన్‌దాస్? 'టాక్సిక్' టీజర్‌తో హాట్ టాపిక్‌... ఫిమేల్ డైరెక్టరే కాదు, నటిగా అవార్డు విన్నర్!
Cheekatilo OTT Release Date: ఓటీటీలోకి అక్కినేని కోడలు శోభిత సినిమా... ప్రైమ్ వీడియోలో క్రైమ్ & సస్పెన్స్ డ్రామా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి అక్కినేని కోడలు శోభిత సినిమా... ప్రైమ్ వీడియోలో క్రైమ్ & సస్పెన్స్ డ్రామా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Embed widget