అన్వేషించండి

Nimmala Ramanaidu: వృథాగా పోతున్న నీళ్లనే బనకచర్లకు ఉపయోగిస్తాం, తెలంగాణ అర్థం చేసుకోవాలి: నిమ్మల రామానాయుడు

Andhra Pradesh News | గోదావరి జలాలు ప్రతి ఏడాది 3 వేల టీఎంసీల నీళ్లు సముంద్రంలో కలుస్తున్నాయని, అందులో 200 టీఎంసీలు బనకచర్ల ప్రాజెక్టుకు ఉపయోగిస్తామని నిమ్మల రామానాయుడు తెలిపారు.

Bhanakacherla Project | అమరావతి: పోలవరం- బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టుకు త్వరలో టెండర్లు ఆహ్వానించడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సముద్రంలోకి వృథాగా పోతున్న నీళ్లనే బనకచర్ల ప్రాజెక్టుకు ఏపీ ప్రభుత్వం వినియోగించనుందని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu) కోరారు. కనుక ఎవరూ ఈ ప్రాజెక్టుకు అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదని, తెలంగాణ నేతలు, ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని మంత్రి నిమ్మల రామానాయుడు కోరారు. ప్రతి ఏడాది 3 వేల టీఎంసీల మేర గోదావరి జలాలు సముద్రంలో కలిసిపోతున్నాయని, అందులో కేవలం 200 టీఎంసీలు మాత్రమే పోలవరం బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టుకు వినియోగిస్తామని తెలిపారు.

అటవీ, పర్యావరణ అనుమతుల కోసం ప్రయత్నాలు

ఏపీ సచివాలయంలో మంత్రి నిమ్మల రామానాయుడు శుక్రవారం రాత్రి మీడియాతో మాట్లాడారు. పోలవరం - బనకచర్ల అనుసంధానం, ఇతర ఇరిగేషన్ ప్రాజెక్ట్ లపై సమీక్ష జరిగింది. పోలవరం బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టుకు అటవీ పర్యావరణ అనుమతిపై దృష్టి సారించాం. భూ సేకరణ పై కూడా  కసరత్తు జరుగుతోంది. తెలంగాణ నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కానీ కరువు సమస్యకు నదుల అనుసంధానమే పరిష్కారమని కేఎల్ రావు చాలా ఏళ్ల కిందటే సూచించారు. 

తెలంగాణ నేతలు, ప్రజలు అర్థం చేసుకోవాలి

నదుల అనుసంధానం ద్వారా ప్రతి రాష్ట్రానికి ప్రయోజనం చేకూరుతుంది. ఖరీఫ్ ప్రారంభానికి ముందే ఈ ఏడాది నీటి నిల్వలు ఉన్నాయి. కరువు ప్రాంతమైన రాయలసీమ ప్రాంతంలో కూడా నీటి నిల్వలు ఉన్నాయి. వర్షాలు మొదలవకముందే గోదావరి నుంచి నీరు సముద్రంలో వృథాగా కలిసిపోతుంది. అలా వృథాగా పోతున్న నీటిని వినియోగించుకుంటే తప్పేముంది. రాజకీయాల కోసమే తెలంగాణ నేతలు పోలవరం బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టుపై విమర్శలు చేస్తున్నారని వ్యక్తిగతంగా నేను భావిస్తున్నాను. వృథాగా సముద్రంలోకి పోతున్న నీటిలో కొంత మేర ఉపయోగించుకుంటున్నామని తెలంగాణ నేతలు, ప్రజలు అర్థం చేసుకోవాలని’ కోరారు.

ఈ ఏడాది 200 టీఎంసీల నీళ్లు అదనంగా నిలిపాం. సీఎం చంద్రబాబు శాస్త్రీయంగా వాటర్ ఆడిటింగ్-వాటర్ మేనేజ్మెంట్ జరగాలని ఆదేశించారు. దాని ద్వారా ఇది సాధ్యమైంది. 365 రోజులు పంటలతో పచ్చగా ఉండాలని, బుడమేరులో పూడిక తొలిగించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. పిజియో మీటర్లు, సెన్షర్ల కొనుగోలుకు రూ.30 కోట్లు కేటాయించినట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. రాయలసీమ ప్రాంతానికి నీళ్లు ఇచ్చాం. హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టుకు రూ.3800 కోట్లు ఇచ్చామన్నారు. పోలవరం లెఫ్ట్ కెనాల్ ద్వారా జులై కల్లా ఆయకట్టుకు, హంద్రీనీవా నీళ్లు చివరి ఆయకట్టుకు తీసుకెళ్తామన్నారు. ఉత్తరాంధ్ర కు గోదావరి జలాలను తీసుకెళ్లే పనులు  వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. 

నీటి లభ్యతపై బులెటిన్

‘తుఫాన్ బారి నుంచి పంటలు కాపాడుకునే విధంగా చర్యలు తీస్కుంటున్నాం. పంట కాలాన్ని ముందుకు తీసుకు వచ్చే చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు చెప్పారు. త్వరలోనే నీటి లభ్యత బులెటిన్ విడుదల చేస్తాం. పండించే పంటలకు అనుగుణంగా రైతులకు సూచనలు ఇస్తాం. మద్దతు ధరలు సైతం కల్పిస్తాం. భూగర్భ జలాలు పెంచు కోవడంపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ చేస్తుందని’ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: నేడు సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభం- అర్థరాత్రి వరకు ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి నారాయణ
నేడు సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభం- అర్థరాత్రి వరకు ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి నారాయణ
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
Breaking News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
YS Jagan: శాసన మండలిలో నిలదీద్దాం! అసెంబ్లీపై ప్రెస్‌మీట్‌లు పెడదాం! ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్!
శాసన మండలిలో నిలదీద్దాం! అసెంబ్లీపై ప్రెస్‌మీట్‌లు పెడదాం! ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget