అన్వేషించండి

Tuni Arson Case : తుని రైలు దగ్ధం కేసుపై కూటమి ప్రభుత్వం అందుకే వెనక్కి తగ్గిందా..

Tuni Arson Case : తుని రైలు ద‌హ‌నం కేసును కూట‌మి ప్ర‌భుత్వం వెన‌క్కు కోవ‌డానికి కార‌ణం ఇద్ద‌రు ముగ్గురు వైసీపీలో ఉన్న‌ప్ప‌టికీ 37 మంది వ‌ర‌కు కూట‌మిలోనే ఉన్నార‌న్న మాట‌లు వినిపిస్తున్నాయి..

Tuni Arson Case : తుని రైలు దగ్ధం కేసును అప్పీలుకు వెళ్లాలని ఏపీ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వెనుక చాలా కారణాలే ఉన్నట్లు తెలుస్తోంది.. అసలు ప్రభుత్వానికి అప్పీలుకు వెళ్లాలన్న ఆలోచనే లేదని ఆర్పీఎఫ్‌ ప్రతిపాదన ఆధారంగా ఉత్తర్వులు వెలువడ్డాయని చెప్పుకొచ్చింది. దీని వల్ల కూటమి ప్రభుత్వానికి అండగా నిలిచిన సామాజికవర్గంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమువుతుందని పసిగట్టే యుద్ధప్రాతిపదికన ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆనాడు తుని రైలు ఘటనలో నిందితులుగా ఉన్నవారు తమ ఊళ్లల్లో సంబరాలు చేసుకున్నారు... 

నిందితుల్లో చాలా మంది ఇప్పుడు కూటమిలో...

కాపు రిజర్వేషన్లు కోరుతూ కాపు ఉద్యమ నాయకుడు, ప్రస్తుత వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా తునిలో 2016 జనవరి 30న నిర్వహించిన భారీ కాపు నాడు సభ అనంతరం అల్లర్లు చెలరేగాయి. తుని రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులతో ఆగి ఉన్న రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు నిప్పుపెట్టారు. అంతే కాకుండా రైల్వే స్టేషన్‌ను ధ్వంసం చేశారు. తునిలో పోలీస్‌ స్టేషన్లు తగులబెట్టారు. ఇలా ఆ రోజు తీవ్ర విధ్వంసాన్ని సృష్టించారు. అయితే ఈ నేపథ్యంలోనే దర్యాప్తు ప్రారంభించిన రైల్వే పోలీసులు, ఇటు ఏపీ పోలీసులు ముద్రగడ పద్మనాభం,  కామన ప్రభాకరరావు, సాయిన సుధాకర్‌ నాయుడు, ఆకుల రామకృష్ణ, కల్వకొలను తాతాజీ, నల్లా విష్ణుమూర్తి సహా మొత్తం 41 మందిపై రైల్వే పోలీసులు కేసులు నమోదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో కేసులను వైసీపీ ప్రభుత్వం ఎత్తివేయగా, 2023 మే 1న విజయవాడ రైల్వే కోర్టు తుది తీర్పుగా కేసును కొట్టివేసింది. అయితే ఇప్పుడు వైసీపీలో ముద్రగడ పద్మనాభం, దాడిశెట్టి మాత్రం మిగిలిపోగా మిగిలినవారంతా దాదాపు 38 మంది వరకు టీడీపీ, జనసేన పార్టీల్లో ఉన్నారు.. ఆ ఆ పార్టీల్లో ఆయా కీలక పదవుల్లో ఉన్నారు కూడా... 

2024 ఎన్నికల్లో కూటమి తరపునే..

2024 మేలో జరిగిన సాధారణ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా పోటీ చేసిన క్రమంలో ఏపీలో కీలక సామాజికవర్గం అయిన కాపులు కూటమి వెంటే ఉన్నారు. తుని రైలు దగ్ధం కేసులో ఉన్న ప్రధాన నిందితుల్లో చాలా మంది జనసేనలో ఉండగా మరికొందరు టీడీపీలో ఉన్నారు. అయితే జూన్‌ 3న ఈ కేసును రీ ఓపెన్‌ చేసి హైకోర్టులో అప్పీలుకు వెళ్లాలని ఏపీ ప్రభుత్వం జీవో జారీ కూడా చేసింది.. దీంతో ఒక్కసారిగా ఈ కేసు గురించి కూటమిలో ప్రకంపనలు చెలరేగాయి.. 

అప్రమత్తమైన కూటమి ప్రభుత్వం..

రైల్వే పోలీసులు పంపించిన ప్రతిపాదనల ఆధారంగానే హైకోర్టులో అప్పీలుకు వెళ్లాలని జీవో జారీ అయ్యిందని, అయితే ఈ కేసును తిరగతోడాలన్న ఆలోచన  లేదని ఆ జీవోను రద్దుచేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.. దీంతో ఆ నాడు ఈ కేసులో ఉన్న నిందితులంతా ఊపిరి పీల్చుకున్నట్లయ్యింది. కాకినాడకు చెందిన రాజ్యసభ సభ్యుడు సానా సతీష్‌తోపాటు పలువురు టీడీపీ నాయకులు మంత్రి నారా లోకేష్‌ దృష్టికి తీసుకువెళ్లారు. అదేవిధంగా షూటింగ్‌లో బిజిగా ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ దృష్టికి పలువురు జనసేన నాయకులు తీసుకెళ్లారు. దీంతో జారీ చేసిన జీవోను వెనక్కు తీసుకుంటున్నల్లు అధికారులు వెల్లడిరచారు. మొత్తం మీద ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ముద్రగడ పద్మనాభం, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా వైసీపీకి చెందిన వారి గురించే ప్రభుత్వం కేసును అప్పీలు చేయాలని నిర్ణయం తీసుకుందని, కానీ ఎక్కువ మంది నిందితులు ప్రస్తుతం టీడీపీ, జనసేనలో కీలక పదవుల్లో కొనసాగతున్నవారు ఉన్నారని తెలియడంతోనే యుద్ధప్రాతిపదికన కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Heatwave Alert in AP: ఏపీలో భానుడి భగభగలు.. 19 మండలాల్లో తీవ్ర వడగాల్పుల హెచ్చరిక!
ఏపీలో భానుడి భగభగలు.. 19 మండలాల్లో తీవ్ర వడగాల్పుల హెచ్చరిక!
Dwaraka Tirumala Fake Tickets: ద్వారకా తిరుమలలో ఫేక్ దర్శనం టికెట్స్ స్కామ్.. ఏడుగురు అరెస్ట్
ద్వారకా తిరుమలలో ఫేక్ దర్శనం టికెట్స్ స్కామ్.. ఏడుగురు అరెస్ట్
AP Weather Update: ఏపీ వెదర్ అలర్ట్.. మరో 2 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు! కొన్నిచోట్ల వడగాల్పులు
ఏపీ వెదర్ అలర్ట్.. మరో 2 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు! కొన్నిచోట్ల వడగాల్పులు
Child Born on Moving Train: రైలులో గర్భిణికి నొప్పులు.. పురుడు పోసి తల్లీ బిడ్డ ప్రాణాలు కాపాడిన విజయవాడ టీటీఈ జ్యోతి
రైలులో గర్భిణికి నొప్పులు.. పురుడు పోసి తల్లీ బిడ్డ ప్రాణాలు కాపాడిన విజయవాడ టీటీఈ జ్యోతి

వీడియోలు

SRH Bowling Disaster vs PBKS IPL 2026 | SRH బౌలింగ్ వైఫల్యంపై ఫ్యాన్స్ ఫైర్
Ayush Mhatre Retired Out IPL 2026 | సీఎస్కే మేనేజ్మెంట్ పై విమర్శల వర్షం
Sanju Samson Salute Celebration | కోచ్ కోసం సంజూ శాంసన్ సెల్యూట్
CSK vs DC IPL 2026 Sanju Samson Century | సంజూ శాంస‌న్ ఫాస్టెస్ట్ సెంచ‌రీ
IPL 2026 CSK vs DC Highlights | బోణీ కొట్టిన చెన్నై

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi on Women Reservations: మహిళా రిజర్వేషన్ల అమలు చారిత్రక ఘట్టం, 2029 ఎన్నికల నుంచే వర్తింపు: ప్రధాని మోదీ
మహిళా రిజర్వేషన్ల అమలు చారిత్రక ఘట్టం, 2029 ఎన్నికల నుంచే వర్తింపు: ప్రధాని మోదీ
Pocharam Srinivas Reddy: నిధుల కోసం మంత్రుల కాళ్లు మొక్కాలా? చావైనా బతుకైనా సరే తేల్చుకుంటా: పోచారం శ్రీనివాస్ రెడ్డి
నిధుల కోసం మంత్రుల కాళ్లు మొక్కాలా? చావైనా బతుకైనా సరే తేల్చుకుంటా: పోచారం శ్రీనివాస్ రెడ్డి
Donald Trump on Pope Leo: పోప్‌ లియోకు క్రైమ్స్ అంటే చాలా ఇష్టం! అణ్వాయుధాలను వ్యతిరేకించరు.. ఆయన నాకు నచ్చలేదు: డొనాల్డ్ ట్రంప్
పోప్‌ లియోకు క్రైమ్స్ అంటే చాలా ఇష్టం! అందుకే ఆయన నాకు నచ్చలేదు: డొనాల్డ్ ట్రంప్
Nashik Corporate Jihad: మహరాష్ట్రను కుదిపేస్తున్న నాసిక్ 'కార్పోరేట్ జిహాద్'- తెలంగాణకు  బీజేపీ సూచనలు
మహరాష్ట్రను కుదిపేస్తున్న నాసిక్ 'కార్పోరేట్ జిహాద్'- తెలంగాణకు  బీజేపీ సూచనలు
This Week Theatrical Releases : హాట్ సమ్మర్‌లో చిన్న సినిమాల సందడి - ఈ వారం థియేటర్లలో రిలీజయ్యే మూవీస్ ఇవే!
హాట్ సమ్మర్‌లో చిన్న సినిమాల సందడి - ఈ వారం థియేటర్లలో రిలీజయ్యే మూవీస్ ఇవే!
Tamil Nadu Explosion: బాణసంచా ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం, పేలుడు ధాటికి 10 గదులు ధ్వంసం.. శిథిలాల కింద 60 మంది !
బాణసంచా ఫ్యాక్టరీలో ప్రమాదం, పేలుడు ధాటికి 10 గదులు ధ్వంసం.. శిథిలాల కింద 60 మంది !
AP Cabinet Reshuffle: మంత్రులపై చంద్రబాబు ఆగ్రహం వెనుక కేబినెట్ మార్పు చేర్పుల సమీకరణాలు - కసరత్తు పూర్తి చేశారా?
మంత్రులపై చంద్రబాబు ఆగ్రహం వెనుక కేబినెట్ మార్పు చేర్పుల సమీకరణాలు - కసరత్తు పూర్తి చేశారా?
US Iran War: ఇరాన్‌కు ఆయుధాలిస్తే చైనాపై 50 శాతం టారిఫ్.. కోపంతో రగిలిపోతున్న డొనాల్డ్ ట్రంప్
ఇరాన్‌కు ఆయుధాలిస్తే చైనాపై 50 శాతం టారిఫ్.. కోపంతో రగిలిపోతున్న డొనాల్డ్ ట్రంప్
Embed widget