అన్వేషించండి

Tuni Arson Case : తుని రైలు దగ్ధం కేసుపై కూటమి ప్రభుత్వం అందుకే వెనక్కి తగ్గిందా..

Tuni Arson Case : తుని రైలు ద‌హ‌నం కేసును కూట‌మి ప్ర‌భుత్వం వెన‌క్కు కోవ‌డానికి కార‌ణం ఇద్ద‌రు ముగ్గురు వైసీపీలో ఉన్న‌ప్ప‌టికీ 37 మంది వ‌ర‌కు కూట‌మిలోనే ఉన్నార‌న్న మాట‌లు వినిపిస్తున్నాయి..

Tuni Arson Case : తుని రైలు దగ్ధం కేసును అప్పీలుకు వెళ్లాలని ఏపీ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వెనుక చాలా కారణాలే ఉన్నట్లు తెలుస్తోంది.. అసలు ప్రభుత్వానికి అప్పీలుకు వెళ్లాలన్న ఆలోచనే లేదని ఆర్పీఎఫ్‌ ప్రతిపాదన ఆధారంగా ఉత్తర్వులు వెలువడ్డాయని చెప్పుకొచ్చింది. దీని వల్ల కూటమి ప్రభుత్వానికి అండగా నిలిచిన సామాజికవర్గంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమువుతుందని పసిగట్టే యుద్ధప్రాతిపదికన ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆనాడు తుని రైలు ఘటనలో నిందితులుగా ఉన్నవారు తమ ఊళ్లల్లో సంబరాలు చేసుకున్నారు... 

నిందితుల్లో చాలా మంది ఇప్పుడు కూటమిలో...

కాపు రిజర్వేషన్లు కోరుతూ కాపు ఉద్యమ నాయకుడు, ప్రస్తుత వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా తునిలో 2016 జనవరి 30న నిర్వహించిన భారీ కాపు నాడు సభ అనంతరం అల్లర్లు చెలరేగాయి. తుని రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులతో ఆగి ఉన్న రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు నిప్పుపెట్టారు. అంతే కాకుండా రైల్వే స్టేషన్‌ను ధ్వంసం చేశారు. తునిలో పోలీస్‌ స్టేషన్లు తగులబెట్టారు. ఇలా ఆ రోజు తీవ్ర విధ్వంసాన్ని సృష్టించారు. అయితే ఈ నేపథ్యంలోనే దర్యాప్తు ప్రారంభించిన రైల్వే పోలీసులు, ఇటు ఏపీ పోలీసులు ముద్రగడ పద్మనాభం,  కామన ప్రభాకరరావు, సాయిన సుధాకర్‌ నాయుడు, ఆకుల రామకృష్ణ, కల్వకొలను తాతాజీ, నల్లా విష్ణుమూర్తి సహా మొత్తం 41 మందిపై రైల్వే పోలీసులు కేసులు నమోదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో కేసులను వైసీపీ ప్రభుత్వం ఎత్తివేయగా, 2023 మే 1న విజయవాడ రైల్వే కోర్టు తుది తీర్పుగా కేసును కొట్టివేసింది. అయితే ఇప్పుడు వైసీపీలో ముద్రగడ పద్మనాభం, దాడిశెట్టి మాత్రం మిగిలిపోగా మిగిలినవారంతా దాదాపు 38 మంది వరకు టీడీపీ, జనసేన పార్టీల్లో ఉన్నారు.. ఆ ఆ పార్టీల్లో ఆయా కీలక పదవుల్లో ఉన్నారు కూడా... 

2024 ఎన్నికల్లో కూటమి తరపునే..

2024 మేలో జరిగిన సాధారణ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా పోటీ చేసిన క్రమంలో ఏపీలో కీలక సామాజికవర్గం అయిన కాపులు కూటమి వెంటే ఉన్నారు. తుని రైలు దగ్ధం కేసులో ఉన్న ప్రధాన నిందితుల్లో చాలా మంది జనసేనలో ఉండగా మరికొందరు టీడీపీలో ఉన్నారు. అయితే జూన్‌ 3న ఈ కేసును రీ ఓపెన్‌ చేసి హైకోర్టులో అప్పీలుకు వెళ్లాలని ఏపీ ప్రభుత్వం జీవో జారీ కూడా చేసింది.. దీంతో ఒక్కసారిగా ఈ కేసు గురించి కూటమిలో ప్రకంపనలు చెలరేగాయి.. 

అప్రమత్తమైన కూటమి ప్రభుత్వం..

రైల్వే పోలీసులు పంపించిన ప్రతిపాదనల ఆధారంగానే హైకోర్టులో అప్పీలుకు వెళ్లాలని జీవో జారీ అయ్యిందని, అయితే ఈ కేసును తిరగతోడాలన్న ఆలోచన  లేదని ఆ జీవోను రద్దుచేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.. దీంతో ఆ నాడు ఈ కేసులో ఉన్న నిందితులంతా ఊపిరి పీల్చుకున్నట్లయ్యింది. కాకినాడకు చెందిన రాజ్యసభ సభ్యుడు సానా సతీష్‌తోపాటు పలువురు టీడీపీ నాయకులు మంత్రి నారా లోకేష్‌ దృష్టికి తీసుకువెళ్లారు. అదేవిధంగా షూటింగ్‌లో బిజిగా ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ దృష్టికి పలువురు జనసేన నాయకులు తీసుకెళ్లారు. దీంతో జారీ చేసిన జీవోను వెనక్కు తీసుకుంటున్నల్లు అధికారులు వెల్లడిరచారు. మొత్తం మీద ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ముద్రగడ పద్మనాభం, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా వైసీపీకి చెందిన వారి గురించే ప్రభుత్వం కేసును అప్పీలు చేయాలని నిర్ణయం తీసుకుందని, కానీ ఎక్కువ మంది నిందితులు ప్రస్తుతం టీడీపీ, జనసేనలో కీలక పదవుల్లో కొనసాగతున్నవారు ఉన్నారని తెలియడంతోనే యుద్ధప్రాతిపదికన కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.  

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh RTGS: భార్య బైక్ కొట్టేసిన భర్త! పట్టించిన చంద్రబాబు టెక్నాలజీ! ఒక్క దెబ్బకు 80 కేసులు ఛేదించిన పోలీసులు!
భార్య బైక్ కొట్టేసిన భర్త! పట్టించిన చంద్రబాబు టెక్నాలజీ! ఒక్క దెబ్బకు 80 కేసులు ఛేదించిన పోలీసులు!
Breaking News: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత
YS Jagan vs Chandrababu Naidu:ఆరు హత్యల నిందితుడిలాంటిదే జగన్‌ మైండ్ సెట్! చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు- ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన!
ఆరు హత్యల నిందితుడిలాంటిదే జగన్‌ మైండ్ సెట్! చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు- ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన!
Rotator Cuff Injury: రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Corona Cases: ఆంధ్రప్రదేశ్ నుంచి యూపీ వరకు వెలుగులోకి కరోనా కేసులు! కోవిడ్-19 తిరగబెట్టిందా?
ఆంధ్రప్రదేశ్ నుంచి యూపీ వరకు వెలుగులోకి కరోనా కేసులు! కోవిడ్-19 తిరగబెట్టిందా?
Andhra Pradesh RTGS: భార్య బైక్ కొట్టేసిన భర్త! పట్టించిన చంద్రబాబు టెక్నాలజీ! ఒక్క దెబ్బకు 80 కేసులు ఛేదించిన పోలీసులు!
భార్య బైక్ కొట్టేసిన భర్త! పట్టించిన చంద్రబాబు టెక్నాలజీ! ఒక్క దెబ్బకు 80 కేసులు ఛేదించిన పోలీసులు!
Shabad Mass Murder Accused Selfie Video:
"అమ్మాయి కుటుంబం మోసం చేసింది -నన్ను అనాథలా కాల్చేయండి" షాబాద్ సైకో కిల్లర్ రాజ్‌కుమార్ సెల్ఫీ వీడియోలో సంచలన విషయాలు
Seediri Appalaraju Son Arav Arrest: పలాస హిట్ అండ్ రన్ కేసు - కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌లో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ లొంగుబాటు!
పలాస హిట్ అండ్ రన్ కేసు - కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌లో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ లొంగుబాటు!
INDW vs ENGW: లార్డ్స్‌ టెస్టులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఉమెన్ ఘన విజయం! అబ్బాయిల ఒటమికి అమ్మాయిల ప్రతీకారం!
లార్డ్స్‌ టెస్టులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఉమెన్ ఘన విజయం! అబ్బాయిల ఒటమికి అమ్మాయిల ప్రతీకారం!
Jr NTR Political Entry: జులై 18న Jr NTR పొలిటికల్ ఎంట్రీపై ప్రకటన చేస్తారా? ఇదిగో క్లారిటీ
జులై 18న Jr NTR పొలిటికల్ ఎంట్రీపై ప్రకటన చేస్తారా? ఇదిగో క్లారిటీ
One Nation One Election Bill: దేశ రాజకీయాల్లో మహా మార్పులు! వన్ నేషన్-వన్ ఎలక్షన్, 850 లోక్‌సభ సీట్లు.. మహిళా రిజర్వేషన్ల అసలు కథ!
దేశ రాజకీయాల్లో మహా మార్పులు! వన్ నేషన్-వన్ ఎలక్షన్, 850 లోక్‌సభ సీట్లు.. మహిళా రిజర్వేషన్ల అసలు కథ!
virat Kohli Records: 6 నెలల తరువాత బ్లూ జెర్సీలో విరాట్ కోహ్లీ.. రికార్డుల వేటకు కింగ్ రెడీ
6 నెలల తరువాత బ్లూ జెర్సీలో విరాట్ కోహ్లీ.. రికార్డుల వేటకు కింగ్ రెడీ
Embed widget