అన్వేషించండి

Tuni Arson Case : తుని రైలు దగ్ధం కేసుపై కూటమి ప్రభుత్వం అందుకే వెనక్కి తగ్గిందా..

Tuni Arson Case : తుని రైలు ద‌హ‌నం కేసును కూట‌మి ప్ర‌భుత్వం వెన‌క్కు కోవ‌డానికి కార‌ణం ఇద్ద‌రు ముగ్గురు వైసీపీలో ఉన్న‌ప్ప‌టికీ 37 మంది వ‌ర‌కు కూట‌మిలోనే ఉన్నార‌న్న మాట‌లు వినిపిస్తున్నాయి..

Tuni Arson Case : తుని రైలు దగ్ధం కేసును అప్పీలుకు వెళ్లాలని ఏపీ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వెనుక చాలా కారణాలే ఉన్నట్లు తెలుస్తోంది.. అసలు ప్రభుత్వానికి అప్పీలుకు వెళ్లాలన్న ఆలోచనే లేదని ఆర్పీఎఫ్‌ ప్రతిపాదన ఆధారంగా ఉత్తర్వులు వెలువడ్డాయని చెప్పుకొచ్చింది. దీని వల్ల కూటమి ప్రభుత్వానికి అండగా నిలిచిన సామాజికవర్గంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమువుతుందని పసిగట్టే యుద్ధప్రాతిపదికన ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆనాడు తుని రైలు ఘటనలో నిందితులుగా ఉన్నవారు తమ ఊళ్లల్లో సంబరాలు చేసుకున్నారు... 

నిందితుల్లో చాలా మంది ఇప్పుడు కూటమిలో...

కాపు రిజర్వేషన్లు కోరుతూ కాపు ఉద్యమ నాయకుడు, ప్రస్తుత వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా తునిలో 2016 జనవరి 30న నిర్వహించిన భారీ కాపు నాడు సభ అనంతరం అల్లర్లు చెలరేగాయి. తుని రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులతో ఆగి ఉన్న రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు నిప్పుపెట్టారు. అంతే కాకుండా రైల్వే స్టేషన్‌ను ధ్వంసం చేశారు. తునిలో పోలీస్‌ స్టేషన్లు తగులబెట్టారు. ఇలా ఆ రోజు తీవ్ర విధ్వంసాన్ని సృష్టించారు. అయితే ఈ నేపథ్యంలోనే దర్యాప్తు ప్రారంభించిన రైల్వే పోలీసులు, ఇటు ఏపీ పోలీసులు ముద్రగడ పద్మనాభం,  కామన ప్రభాకరరావు, సాయిన సుధాకర్‌ నాయుడు, ఆకుల రామకృష్ణ, కల్వకొలను తాతాజీ, నల్లా విష్ణుమూర్తి సహా మొత్తం 41 మందిపై రైల్వే పోలీసులు కేసులు నమోదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో కేసులను వైసీపీ ప్రభుత్వం ఎత్తివేయగా, 2023 మే 1న విజయవాడ రైల్వే కోర్టు తుది తీర్పుగా కేసును కొట్టివేసింది. అయితే ఇప్పుడు వైసీపీలో ముద్రగడ పద్మనాభం, దాడిశెట్టి మాత్రం మిగిలిపోగా మిగిలినవారంతా దాదాపు 38 మంది వరకు టీడీపీ, జనసేన పార్టీల్లో ఉన్నారు.. ఆ ఆ పార్టీల్లో ఆయా కీలక పదవుల్లో ఉన్నారు కూడా... 

2024 ఎన్నికల్లో కూటమి తరపునే..

2024 మేలో జరిగిన సాధారణ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా పోటీ చేసిన క్రమంలో ఏపీలో కీలక సామాజికవర్గం అయిన కాపులు కూటమి వెంటే ఉన్నారు. తుని రైలు దగ్ధం కేసులో ఉన్న ప్రధాన నిందితుల్లో చాలా మంది జనసేనలో ఉండగా మరికొందరు టీడీపీలో ఉన్నారు. అయితే జూన్‌ 3న ఈ కేసును రీ ఓపెన్‌ చేసి హైకోర్టులో అప్పీలుకు వెళ్లాలని ఏపీ ప్రభుత్వం జీవో జారీ కూడా చేసింది.. దీంతో ఒక్కసారిగా ఈ కేసు గురించి కూటమిలో ప్రకంపనలు చెలరేగాయి.. 

అప్రమత్తమైన కూటమి ప్రభుత్వం..

రైల్వే పోలీసులు పంపించిన ప్రతిపాదనల ఆధారంగానే హైకోర్టులో అప్పీలుకు వెళ్లాలని జీవో జారీ అయ్యిందని, అయితే ఈ కేసును తిరగతోడాలన్న ఆలోచన  లేదని ఆ జీవోను రద్దుచేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.. దీంతో ఆ నాడు ఈ కేసులో ఉన్న నిందితులంతా ఊపిరి పీల్చుకున్నట్లయ్యింది. కాకినాడకు చెందిన రాజ్యసభ సభ్యుడు సానా సతీష్‌తోపాటు పలువురు టీడీపీ నాయకులు మంత్రి నారా లోకేష్‌ దృష్టికి తీసుకువెళ్లారు. అదేవిధంగా షూటింగ్‌లో బిజిగా ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ దృష్టికి పలువురు జనసేన నాయకులు తీసుకెళ్లారు. దీంతో జారీ చేసిన జీవోను వెనక్కు తీసుకుంటున్నల్లు అధికారులు వెల్లడిరచారు. మొత్తం మీద ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ముద్రగడ పద్మనాభం, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా వైసీపీకి చెందిన వారి గురించే ప్రభుత్వం కేసును అప్పీలు చేయాలని నిర్ణయం తీసుకుందని, కానీ ఎక్కువ మంది నిందితులు ప్రస్తుతం టీడీపీ, జనసేనలో కీలక పదవుల్లో కొనసాగతున్నవారు ఉన్నారని తెలియడంతోనే యుద్ధప్రాతిపదికన కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఏపీలో రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల! జూన్ 18న పోలింగ్!
ఏపీలో రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల! జూన్ 18న పోలింగ్!
Heatwave in Andhra Pradesh and Telangana:తెలుగు రాష్ట్రాల్లో హీట్‌వేవ్‌ దెబ్బ! పిడుగురాళ్లలో 48.1 డిగ్రీలు! పలు జిల్లాలకు రెడ్ అలర్ట్!
తెలుగు రాష్ట్రాల్లో హీట్‌వేవ్‌ దెబ్బ! పిడుగురాళ్లలో 48.1 డిగ్రీలు! పలు జిల్లాలకు రెడ్ అలర్ట్!
YS Jagan Latest News:ఎక్కువ మంది పిల్లల్ని కానాలని ముందు లోకేష్‌కు చెప్పు! చంద్రబాబు సంతానం కాన్సెప్టుపై వైఎస్ జగన్ సెటైర్లు 
ఎక్కువ మంది పిల్లల్ని కానాలని ముందు లోకేష్‌కు చెప్పు! చంద్రబాబు సంతానం కాన్సెప్టుపై వైఎస్ జగన్ సెటైర్లు 
YS Jagan Latest News:
"చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు! పెట్రోల్‌పై 8 రూపాయలు తగ్గింగాలి" జగన్ హాట్ కామెంట్స్!

వీడియోలు

CSK vs GT IPL 2026 Highlights | గుజరాత్ చేతిలో చెన్నై ఘోర పరాజయం
Ruturaj Comments on Dhoni Retirement | ధోని రిటైర్మెంట్‌పై రుతురాజ్ కామెంట్స్
Ram Charan at Uppal Stadium IPL 2026 | ఐపీఎల్ మ్యాచ్‌లో పెద్ది టీమ్ ప్రమోషన్స్
Hardik Pandya Match Fee Fined IPL 2026 | గ్రౌండ్ లో సహనం కోల్పోయిన హార్దిక్ పాండ్యా
Sai Sudharsan Creates History in IPL 2026 | సాయి సుదర్శన్ హిస్టారికల్ రికార్డ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP Mahanadu:నెల్లూరు నుంచి మంగళగిరికి మహానాడు షిఫ్ట్‌... బాబు ప్లాన్ రివర్స్‌? టీడీపీలో వర్గపోరుకు చెక్ పడేనా!
నెల్లూరు నుంచి మంగళగిరికి మహానాడు షిఫ్ట్‌... బాబు ప్లాన్ రివర్స్‌? టీడీపీలో వర్గపోరుకు చెక్ పడేనా!
Machilipatnam Lecturer Joshua Arrested: మాయాటలతో యువతికి కామర్స్ లెక్చరర్ వల! గుట్టురట్టు చేసిన భార్య! రెడ్‌ హ్యాండెడ్‌గా పోలీసులకు అప్పగింత!
మాయాటలతో యువతికి కామర్స్ లెక్చరర్ వల! గుట్టురట్టు చేసిన భార్య! రెడ్‌ హ్యాండెడ్‌గా పోలీసులకు అప్పగింత!
Peddi Special Song : పెద్ది స్పెషల్ సాంగ్ ప్రోమో - రామ్ చరణ్, శ్రుతి హాసన్ ఎనర్జిటిక్ స్టెప్స్
పెద్ది స్పెషల్ సాంగ్ ప్రోమో - రామ్ చరణ్, శ్రుతి హాసన్ ఎనర్జిటిక్ స్టెప్స్
Cockroach Janta Party: జనతా పార్టీ గురించి చర్చ సందర్భంగా సెర్చింగ్‌లో 'బొద్దింక' ! దాని సంస్కృత నామం ఏంటో తెలుసా? డైనోసార్ కన్నా ముందే ఉనికిలో ఉన్నాయా?
జనతా పార్టీ గురించి చర్చ సందర్భంగా సెర్చింగ్‌లో 'బొద్దింక' ! దాని సంస్కృత నామం ఏంటో తెలుసా? డైనోసార్ కన్నా ముందే ఉనికిలో ఉన్నాయా?
Ugly Story Review - 'అగ్లీ స్టోరీ' రివ్యూ: సైకో మొగుడు... ఇన్నోసెంట్ వైఫ్... నందు - అవికా గోర్ సినిమా హిట్టా? ఫట్టా?
'అగ్లీ స్టోరీ' రివ్యూ: సైకో మొగుడు... ఇన్నోసెంట్ వైఫ్... నందు - అవికా గోర్ సినిమా హిట్టా? ఫట్టా?
Kangana Ranaut : కంగనా మెడలో మంగళ సూత్రం, చేతికి గాజులు - సీక్రెట్ మ్యారేజ్ చేసుకున్నారా? అంటూ...
కంగనా మెడలో మంగళ సూత్రం, చేతికి గాజులు - సీక్రెట్ మ్యారేజ్ చేసుకున్నారా? అంటూ...
Prashant Neel about NTR: ఇండియన్ సినిమా ఇంతవరకూ చూడనటువంటి క్రూరమైన విలన్- NTR: ప్రశాంత్ నీల్ 
ఇండియన్ సినిమా ఇంతవరకూ చూడనటువంటి క్రూరమైన విలన్- NTR: ప్రశాంత్ నీల్ 
Nowhera Shaik Arrested: నౌహీరా షేక్ అరెస్ట్.. ఫేక్ ఐడీతో దొరికిన హీరా గ్రూప్ ఎండీ
ఖురాన్ టీచర్ నుంచి కుబేరురాలి వరకు... హీరా గోల్డ్ కుంభకోణంలో అరెస్టైన నౌహీరా షేక్‌ బ్యాక్‌గ్రౌండ్!
Embed widget