అన్వేషించండి

Telanagana Assembly Sessions: నేటితో పూర్తి కానున్న అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు, ఏడు బిల్లులపై చర్చ

Telanagana Assembly Sessions: నేటితో తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ముగియబోతున్నాయి. ఈరోజు శాసనసభలో నిన్న ప్రవేశ పెట్టిన ఏడు బిల్లులపై చర్చ జరగనుంది. 

Telanagana Assembly Sessions: తెలంగాణ శాసన సభ, శాసన మండలి వర్షాల కాల సమావేశాలు ఈరోజుతో ముగియనున్నాయి. చివరి రోజు అయిన మూడో రోజు శాసనసభలో కీలకమైన బిల్లులతో పాటు కేంద్రానికి సంబంధించిన రెండు అంశాలపై చర్చింబోతున్నట్లు సమాచాం. మూడో రోజు సైతం ప్రశ్నోత్తరాలు రద్దు అయ్యాయి. ఉభయ సభల ప్రారంభం కాగానే కేంద్రం విద్యుత్ బిల్లును వ్యతిరేకిస్తూ.. కొత్త పార్లమెంటు భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టాలని కోరుతూ రెండు తీర్మానాలను ప్రవేశపెడతారు. అనంతరం వాటిపై సంపూర్ణంగా చర్చించి ఆమోదం తెలుపుతారు. ఆ తర్వాత శాసన సభలో ఏడు బిల్లులపై చర్చించి ఆమోదం తెలియజేస్తారు. అనంతరం ఎఫ్ఆర్బీఏ చట్టం అమలులో కేంద్ర ద్వంద్వ విధానం - రాష్ట్ర ప్రగతిపై ప్రభావం, ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం అమల్లో కేంద్ర ప్రభుత్వ వైఫల్యంపై ఉభయ సభల్లో రెండు స్వల్ప కాలిక చర్యలు జరుపుతారు. రాత్రి వరకు ఈ చర్చలు జరిగే అవకాశం ఉంది. 

తొలిసారిగా వైస్ ఛాన్స్‌లర్ కాబోతున్న సీఎం..! 
సిద్దిపేట జిల్లా ములుగు వద్ద ఉన్న ఫారెస్ట్ కళాశాలను వర్సిటీగా మారుస్తామని గత మార్చిలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన సందర్భంగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలోనే వర్సిటీకి ప్రత్యేక చట్టం అమలు చేసేందుకు ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టింది. తెలంగాణ అటవీ శాస్త్ర విశ్వ విద్యాలయానికి సీఎం కేసీఆర్ యే ఛాన్సలర్ గా ఉండబోతున్నారు. తొలి సారిగా సీఎం కులపతి కాబోతున్నారు. తెలంగాణ విశ్వ విద్యాలయాల ఉమ్మడి నియామక బోర్డు-2022 బిల్లు సహా మొత్తం ఏడు బిల్లులను అసెంబ్లీలో సోమవారం ప్రవేశ పెట్టారు. తెలంగాణ వస్తు సేవల పన్ను బిల్లు - 2022, ఆజామాబాద్ పారిశ్రామిక ప్రాంతం రద్దు, మున్సిపల్ చట్టాల సవరణ, బోధనాసుపత్రుల వైద్యు నిపుణుల వయోపరిమితి పెంపు, తెలంగాణ మోటారు వాహనాల పన్నుల సవరణ బిల్లును ఆయా మంత్రులు ప్రవేశ పెట్టారు. శాసన సభలో ఆమోదం అనంతరం మండలిలో బిల్లులపై చర్చించనున్నారు. 

కేంద్రంపై విరుచుకుపడ్డ సీఎం.. 
తెలంగాణ శాసనసభ రెండో రోజు చర్చల్లో భాగంగా సీఎం కేసీఆర్.. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్ సవరణ బిల్లుపై సోమవారం (సెప్టెంబరు 12) శాసనసభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. కొత్త విద్యుత్ విధానాలను పూర్తిగా వ్యతిరేకించారు. కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్ బిల్లులు రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయని, దయచేసి వాటిని వెనక్కి తీసుకోవాలని కోరారు. దేశంలోని పేద రైతులు, ఎస్సీ, ఎస్టీల కోసం ఈ నిర్ణయం తీసుకోవాలని అప్పీల్ చేశారు. విద్యుత్ సవరణ బిల్లు్ల్లోని సంస్కరణలు అమలైతే ఆ శాఖ ప్రైవేటు పరం కానుందని, బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల తరహాలో విద్యుత్ శాఖలోని ఉద్యోగులంతా రోడ్డున పడతారని హెచ్చరించారు.

విద్యుత్ సవరణ బిల్లుపై ఎమ్మెల్యే రఘునందన్ రావు.. 
సెప్టెంబర్ 15, 2020లో తెలంగాణ అసెంబ్లీ.. కేంద్రం తీసుకొస్తున్న విద్యుత్ సవరణ బిల్లుపై తమ నిర్ణయాన్ని తెలిపిందన్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. సోమవారం జరిగిన అసెంబ్లీలో విద్యుత్ సవరణ బిల్లుపై చర్చ జరిగింది. టీఆర్ఎస్ నేతలు, రాష్ట్ర మంత్రులు చెబుతున్నవి పచ్చి అబద్ధాలు అని సభలో మాట్లాడారు దుబ్బాక ఎమ్మెల్యే. సబ్సిడీలు ఎత్తివేస్తున్నారు, కేంద్రం బిల్లుతో వ్యవసాయ మోటార్లకు మీటర్లు వస్తాయని పదే పదే మంత్రులు చెబుతున్నారు. 17 ఏప్రిల్ 2020లో సెక్షన్ 65 ప్రకారం .. రాష్ట్ర ప్రభుత్వం తనకు నచ్చిన లేదా, బడుగు, బలహీన వర్గాలకు సబ్సిడీ ఎత్తివేయాలని ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు. ఉద్దేశపూర్వకంగానే బీజేపీపై, కేంద్ర ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vijayawada Temple Power Cut: విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
Taiwan Earthquake: తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
Amaravati Farmers: ఇంకా ఎంతమందిని చంపుతారు.. కేంద్రమంత్రి పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
ఇంకా ఎంతమందిని చంపుతారు.. పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
Division of Andhra Pradesh Districts: ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం

వీడియోలు

India vs Sri Lanka 3rd T20 Highlights | మూడో టి20లో టీమ్ ఇండియా ఘన విజయం
Rohit Sharma Golden Duck | రోహిత్ శర్మ గోల్డెన్ డకౌట్
Virat Kohli Half Century in Vijay Hazare Trophy | 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన కింగ్
Rinku Singh Century in Vijay Hazare Trophy | విజయ్ హజారే ట్రోఫీలీ రింకూ సింగ్ సెంచరీ
Union Minister Kishan Reddy Interview | త్వరలోనే ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పనులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayawada Temple Power Cut: విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
Taiwan Earthquake: తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
Amaravati Farmers: ఇంకా ఎంతమందిని చంపుతారు.. కేంద్రమంత్రి పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
ఇంకా ఎంతమందిని చంపుతారు.. పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
Division of Andhra Pradesh Districts: ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
YSRCP Politics: ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
Year Ender 2025: ఈ ఏడాది NPS లో 5 భారీ మార్పులు.. ఉద్యోగులకు ప్రయోజనం కలిగించే రూల్స్ ఇవే
ఈ ఏడాది NPS లో 5 భారీ మార్పులు.. ఉద్యోగులకు ప్రయోజనం కలిగించే రూల్స్ ఇవే
Hyderabad Crime Report: హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
Kerala Gen Z political Leader: జెన్‌జీ తరం మున్సిపల్ చైర్మన్ దియా బిను - వారసురాలు కాదు.. నాయకత్వంతో ఎదిగిన లీడర్ -మనకూ స్ఫూర్తే !
జెన్‌జీ తరం మున్సిపల్ చైర్మన్ దియా బిను - వారసురాలు కాదు.. నాయకత్వంతో ఎదిగిన లీడర్ -మనకూ స్ఫూర్తే !
Embed widget