అన్వేషించండి

Telangana News: ఆరోగ్యశ్రీ బకాయిలపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు! 2,408 కోట్లు చెల్లించామని వెల్లడి!

Telangana News: తెలంగాణ అసెంబ్లీ వేదికగా ఆరోగ్యశ్రీ బకాయిలపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. సీఎంఆర్‌ఎప్‌ నిధుల గోల్‌మాల్‌పై కూడా స్పందించింది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఆరోగ్యశ్రీ బిల్లుల చెల్లింపుపై ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య చర్చ జరిగింది.
  • గత ప్రభుత్వ 600 కోట్ల బకాయిలు, ప్రస్తుత ప్రభుత్వం 2408 కోట్లు చెల్లించింది.
  • ఆరోగ్యశ్రీ సేవలు ఆగకుండా, నెట్‌వర్క్ ఆసుపత్రులు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది.
  • గత ప్రభుత్వంలో సీఎంఆర్‌ఎఫ్‌ నిధుల దుర్వినియోగంపై విచారణ జరుగుతోంది.

Telangana News: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆరోగ్య శ్రీ పథకం అమలు, నిధుల విడుదలై అధికార , ప్రతిపక్షాల మధ్య వాడివేడి చర్చ జరిగింది. ప్రత్యేకించి ఆరోగ్య శ్రీ బిల్లులను గ్రీన్ ఛానల్ ద్వారా విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఆచరలో అమలు కావడం లేదని మాజీ మంత్రి హరీష్‌రావు ప్రశ్నించారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ విపక్షాలు కేవలం రాజకీయ లబ్ధి కోసమే తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. 

ముఖ్యమంత్రి తన ప్రసంగంలో గత ప్రభుత్వం వదిలి వెళ్లిన ఆర్థిక భారాన్ని, ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిన దిద్దుబాటు చర్యలను సుదీర్ఘంగా వివరించారు. నిరుపేదల ఆరోగ్యంతో ముడిపడి ఉన్న ఈ పథకం విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని పునరుద్ఘాటించారు. 

ఆరోగ్య శ్రీ పథకానికి సంబంధించిన గత ప్రభుత్వం సుమారు 600 కోట్ల బకాయిలు పేరుకుపోయేలా చేసిందని రేవంత్ విమర్శించారు. ప్రభుత్వ ఎయిడెడ్ ఆసుపత్రులకు 240 కోట్లు, ప్రైవేటు ఆసుపత్రులకు 360 కోట్లు బకాయిలు పెట్టారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ పరిస్థితిలో గణనీయమైన మార్పు వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రతి నెలా సగటున 89 కోట్లు ఖర్చు చేస్తూ, మొత్తం 2,408కోట్ల బకాయిలను విజయవంతంగా క్లియర్ చేసిందన్నారు. 

ఆరోగ్యశ్రీ సేవలు ఎక్కడా ఆగకుండా చూసేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి వివరించారు. నిధుల విడుదల ప్రక్రియను మరింత సరళతరం చేస్తామని హామీ ఇచ్చారు. 

సీంఆర్‌ఎఫ్‌ నిధుల దుర్వినియోగంపై కామెంట్స్ 

ఆరోగ్య శ్రీపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి సహాయనిధి అక్రమాల అంశం కూడా తెరపైకి వచ్చింది. గత ప్రభుత్వ హయాంలో సీఎంఆర్‌ఎఫ్‌ నిధులు భారీగా దుర్వినియోగం అయ్యాయని రేవంత్ ఆరోపించారు. ప్రత్యేకించి కొంతమంది ప్రజాప్రతినిధులు వ్యక్తిగత సహాయకులు ఈ నిధులను పక్కదారి పట్టించారని, నిరుపేదలకు అందాల్సిన సొమ్మును అక్రమంగా కాజేశారని ఆయన ఆరోపించారు. 

ఈ వ్యవహారంలో ఇప్పటికే ప్రభుత్వ సమగ్ర విచారణకు ఆదేశించిందని, ప్రస్తుతం దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. ఎవరి పీఏలు, CMRF సొమ్మును కాజేశారో తెలుసని, త్వరలోనే అన్ని విషయాలు ఆధారాలతో సహా యటకు వస్తాయని రేవంత్ హెచ్చరించారు. 

సేవల విస్తరణ నెట్‌వర్క్ ఆసుపత్రుల పెంపు 

ఆరోగ్యశ్రీ సేవల విషయంలో ప్రభుత్వం చూపిస్తున్న నిబద్ధతను వివరిస్తూ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ కీలక విషయాలు వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు సుమారు 9 లక్షల 45వేల మందికి ఆరోగ్య శ్రీ ద్వారా ఉచిత వైద్య సేవలు అందాయని తెలిపారు. గతంలో ఏడాదికి సగటున 2.5 లక్షల మందికి మాత్రమే సేవలు అందగా, ప్రస్తుతం ఆ సంఖ్య 4 లక్షలకు పెరిగిందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం హయాంలో నెలకు సగటున 52 కోట్లు మాత్రమే చెల్లిస్తే, ప్రస్తుతం తాము నెలకు 89కోట్లు రెగ్యులర్‌గా చెల్లిస్తున్నామని స్పష్టం చేశారు. గతంలో కేవలం 330గా ఉన్న ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రుల సంఖ్యను ప్రస్తుతం 537కు పెంచినట్టు ప్రభుత్వం వెల్లడించింది.             

Frequently Asked Questions

ఆరోగ్యశ్రీ బిల్లుల విడుదలపై ప్రభుత్వం ఇచ్చిన హామీ ఆచరణలో ఉందా?

గ్రీన్ ఛానల్ ద్వారా ఆరోగ్యశ్రీ బిల్లులు విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా, అది ఆచరణలో లేదని మాజీ మంత్రి హరీష్‌రావు ప్రశ్నించారు.

గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకానికి ఎంత బకాయిలు పేరుకుపోయేలా చేసింది?

గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకానికి సుమారు 600 కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయేలా చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు.

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ బకాయిలను ఎలా క్లియర్ చేసింది?

కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత, ప్రతి నెలా సగటున 89 కోట్లు ఖర్చు చేస్తూ, మొత్తం 2,408 కోట్ల బకాయిలను విజయవంతంగా క్లియర్ చేసిందని ముఖ్యమంత్రి తెలిపారు.

సీఎంఆర్‌ఎఫ్‌ నిధుల దుర్వినియోగంపై ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంది?

సీఎంఆర్‌ఎఫ్‌ నిధుల దుర్వినియోగంపై ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించింది. విచారణలో కొన్ని నిజాలు వెలుగులోకి వస్తున్నాయని, త్వరలోనే ఆధారాలతో సహా బయటపెడతామని ముఖ్యమంత్రి హెచ్చరించారు.

ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రుల సంఖ్య ఎంత పెరిగింది?

గతంలో 330గా ఉన్న ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రుల సంఖ్యను ప్రస్తుతం 537కు పెంచినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

పోలీసులు వచ్చింది నిజమే ! పవన్ వ్యాఖ్యలపై స్పందించిన ప్రొఫెసర్ నాగేశ్వర్.. ABP దేశంతో ఏమన్నారంటే
పోలీసులు వచ్చింది నిజమే ! పవన్ వ్యాఖ్యలపై స్పందించిన ప్రొఫెసర్ నాగేశ్వర్.. ABP దేశంతో ఏమన్నారంటే
Rains Alert: మరో 24 గంటలపాటు వర్షాలు.. ఎండల నుంచి ఉపశమనం- 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
మరో 24 గంటలపాటు వర్షాలు.. ఎండల నుంచి ఉపశమనం- 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
DAY NRLM Scheme: డ్వాక్రా మహిళలకు బంపర్ ఆఫర్.. పూచీకత్తు లేకుండా రూ. 10 లక్షల లోన్.. వడ్డీ రాయితీ కూడా!
డ్వాక్రా మహిళలకు బంపర్ ఆఫర్.. పూచీకత్తు లేకుండా రూ. 10 లక్షల లోన్.. వడ్డీ రాయితీ కూడా!
CM Revanth Reddy: గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రభుత్వం గుడ్‌న్యూస్.. జీతాలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రభుత్వం గుడ్‌న్యూస్.. జీతాలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Advertisement

వీడియోలు

Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
Student Jokes On MI Nita Ambani | నీతా అంబానీ ముందే ముంబై ఇండియన్స్‌పై పంచ్
RCB vs GT IPL Match 2026 Prediction | నేడు బెంగళూరుతో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్
Hardik Pandya Decoding 07:07 Insta Post | ముంబైని వీడుతున్న హార్దిక్ పాండ్యా ?
RR vs MI Match Playoffs IPL 2026 | కెప్టెన్సీపై రియాన్ పరాగ్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Byjus Founder Byju Raveendran: బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌కు 6 నెలల జైలు, భారీ జరిమానా! రోడ్డున పడ్డ బిలియనీర్
బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌కు 6 నెలల జైలు, భారీ జరిమానా! రోడ్డున పడ్డ బిలియనీర్
Chandrababu Speech At Mahanadu: జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఏకైక పార్టీ టీడీపీ, విజన్ పాలిటిక్స్‌కు నాంది: చంద్రబాబు
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఏకైక పార్టీ టీడీపీ, విజన్ పాలిటిక్స్‌కు నాంది: చంద్రబాబు
BRS Aggressive Politics: బీఆర్ఎస్ యువనేతల దూకుడు.. ఆవేశంలో మునిగిపోతున్న ఆలోచన! లాభమా..నష్టమా?
బీఆర్ఎస్ యువనేతల దూకుడు.. ఆవేశంలో మునిగిపోతున్న ఆలోచన! లాభమా..నష్టమా?
Mahesh Babu: 'వారణాసి' తర్వాత... పాన్ ఇండియా యాక్షన్ ఫిలిమ్స్ దర్శకుడితో మహేష్ సినిమా?
'వారణాసి' తర్వాత... పాన్ ఇండియా యాక్షన్ ఫిలిమ్స్ దర్శకుడితో మహేష్ సినిమా?
Mancherial Crime News: రూ.2 కోట్ల ఇన్సురెన్స్ నగదు కోసం సుపారీ ఇచ్చి భర్త హత్య.. మంచిర్యాల జిల్లాలో దారుణం
రూ.2 కోట్ల ఇన్సురెన్స్ నగదు కోసం సుపారీ ఇచ్చి భర్త హత్య.. మంచిర్యాల జిల్లాలో దారుణం
Driving Without Insurance: ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడిపితే ఏమవుతుంది? పెరుగుతున్న జరిమానాలు, ప్రమాదాలు
ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడిపితే ఏమవుతుంది? పెరుగుతున్న జరిమానాలు, ప్రమాదాలు
AIADMK MLAs resignation: ఉపఎన్నికల కొరివితో గోక్కుంటున్న విజయ్ - తేడా వస్తే నిలబడటం కష్టమే ?
ఉపఎన్నికల కొరివితో గోక్కుంటున్న విజయ్ - తేడా వస్తే నిలబడటం కష్టమే ?
AP FDC Chairman: ఏపీ ఎఫ్‌డీసీ ఛైర్మన్ భరత్ భూషణ్‌కు ఛాంబర్ సత్కారం... చదలవాడ శ్రీనివాస రావుకు కూడా
ఏపీ ఎఫ్‌డీసీ ఛైర్మన్ భరత్ భూషణ్‌కు ఛాంబర్ సత్కారం... చదలవాడ శ్రీనివాస రావుకు కూడా
Embed widget