అన్వేషించండి

Telangana News: ఆరోగ్యశ్రీ బకాయిలపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు! 2,408 కోట్లు చెల్లించామని వెల్లడి!

Telangana News: తెలంగాణ అసెంబ్లీ వేదికగా ఆరోగ్యశ్రీ బకాయిలపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. సీఎంఆర్‌ఎప్‌ నిధుల గోల్‌మాల్‌పై కూడా స్పందించింది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఆరోగ్యశ్రీ బిల్లుల చెల్లింపుపై ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య చర్చ జరిగింది.
  • గత ప్రభుత్వ 600 కోట్ల బకాయిలు, ప్రస్తుత ప్రభుత్వం 2408 కోట్లు చెల్లించింది.
  • ఆరోగ్యశ్రీ సేవలు ఆగకుండా, నెట్‌వర్క్ ఆసుపత్రులు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది.
  • గత ప్రభుత్వంలో సీఎంఆర్‌ఎఫ్‌ నిధుల దుర్వినియోగంపై విచారణ జరుగుతోంది.

Telangana News: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆరోగ్య శ్రీ పథకం అమలు, నిధుల విడుదలై అధికార , ప్రతిపక్షాల మధ్య వాడివేడి చర్చ జరిగింది. ప్రత్యేకించి ఆరోగ్య శ్రీ బిల్లులను గ్రీన్ ఛానల్ ద్వారా విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఆచరలో అమలు కావడం లేదని మాజీ మంత్రి హరీష్‌రావు ప్రశ్నించారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ విపక్షాలు కేవలం రాజకీయ లబ్ధి కోసమే తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. 

ముఖ్యమంత్రి తన ప్రసంగంలో గత ప్రభుత్వం వదిలి వెళ్లిన ఆర్థిక భారాన్ని, ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిన దిద్దుబాటు చర్యలను సుదీర్ఘంగా వివరించారు. నిరుపేదల ఆరోగ్యంతో ముడిపడి ఉన్న ఈ పథకం విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని పునరుద్ఘాటించారు. 

ఆరోగ్య శ్రీ పథకానికి సంబంధించిన గత ప్రభుత్వం సుమారు 600 కోట్ల బకాయిలు పేరుకుపోయేలా చేసిందని రేవంత్ విమర్శించారు. ప్రభుత్వ ఎయిడెడ్ ఆసుపత్రులకు 240 కోట్లు, ప్రైవేటు ఆసుపత్రులకు 360 కోట్లు బకాయిలు పెట్టారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ పరిస్థితిలో గణనీయమైన మార్పు వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రతి నెలా సగటున 89 కోట్లు ఖర్చు చేస్తూ, మొత్తం 2,408కోట్ల బకాయిలను విజయవంతంగా క్లియర్ చేసిందన్నారు. 

ఆరోగ్యశ్రీ సేవలు ఎక్కడా ఆగకుండా చూసేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి వివరించారు. నిధుల విడుదల ప్రక్రియను మరింత సరళతరం చేస్తామని హామీ ఇచ్చారు. 

సీంఆర్‌ఎఫ్‌ నిధుల దుర్వినియోగంపై కామెంట్స్ 

ఆరోగ్య శ్రీపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి సహాయనిధి అక్రమాల అంశం కూడా తెరపైకి వచ్చింది. గత ప్రభుత్వ హయాంలో సీఎంఆర్‌ఎఫ్‌ నిధులు భారీగా దుర్వినియోగం అయ్యాయని రేవంత్ ఆరోపించారు. ప్రత్యేకించి కొంతమంది ప్రజాప్రతినిధులు వ్యక్తిగత సహాయకులు ఈ నిధులను పక్కదారి పట్టించారని, నిరుపేదలకు అందాల్సిన సొమ్మును అక్రమంగా కాజేశారని ఆయన ఆరోపించారు. 

ఈ వ్యవహారంలో ఇప్పటికే ప్రభుత్వ సమగ్ర విచారణకు ఆదేశించిందని, ప్రస్తుతం దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. ఎవరి పీఏలు, CMRF సొమ్మును కాజేశారో తెలుసని, త్వరలోనే అన్ని విషయాలు ఆధారాలతో సహా యటకు వస్తాయని రేవంత్ హెచ్చరించారు. 

సేవల విస్తరణ నెట్‌వర్క్ ఆసుపత్రుల పెంపు 

ఆరోగ్యశ్రీ సేవల విషయంలో ప్రభుత్వం చూపిస్తున్న నిబద్ధతను వివరిస్తూ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ కీలక విషయాలు వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు సుమారు 9 లక్షల 45వేల మందికి ఆరోగ్య శ్రీ ద్వారా ఉచిత వైద్య సేవలు అందాయని తెలిపారు. గతంలో ఏడాదికి సగటున 2.5 లక్షల మందికి మాత్రమే సేవలు అందగా, ప్రస్తుతం ఆ సంఖ్య 4 లక్షలకు పెరిగిందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం హయాంలో నెలకు సగటున 52 కోట్లు మాత్రమే చెల్లిస్తే, ప్రస్తుతం తాము నెలకు 89కోట్లు రెగ్యులర్‌గా చెల్లిస్తున్నామని స్పష్టం చేశారు. గతంలో కేవలం 330గా ఉన్న ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రుల సంఖ్యను ప్రస్తుతం 537కు పెంచినట్టు ప్రభుత్వం వెల్లడించింది.             

Frequently Asked Questions

ఆరోగ్యశ్రీ బిల్లుల విడుదలపై ప్రభుత్వం ఇచ్చిన హామీ ఆచరణలో ఉందా?

గ్రీన్ ఛానల్ ద్వారా ఆరోగ్యశ్రీ బిల్లులు విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా, అది ఆచరణలో లేదని మాజీ మంత్రి హరీష్‌రావు ప్రశ్నించారు.

గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకానికి ఎంత బకాయిలు పేరుకుపోయేలా చేసింది?

గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకానికి సుమారు 600 కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయేలా చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు.

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ బకాయిలను ఎలా క్లియర్ చేసింది?

కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత, ప్రతి నెలా సగటున 89 కోట్లు ఖర్చు చేస్తూ, మొత్తం 2,408 కోట్ల బకాయిలను విజయవంతంగా క్లియర్ చేసిందని ముఖ్యమంత్రి తెలిపారు.

సీఎంఆర్‌ఎఫ్‌ నిధుల దుర్వినియోగంపై ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంది?

సీఎంఆర్‌ఎఫ్‌ నిధుల దుర్వినియోగంపై ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించింది. విచారణలో కొన్ని నిజాలు వెలుగులోకి వస్తున్నాయని, త్వరలోనే ఆధారాలతో సహా బయటపెడతామని ముఖ్యమంత్రి హెచ్చరించారు.

ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రుల సంఖ్య ఎంత పెరిగింది?

గతంలో 330గా ఉన్న ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రుల సంఖ్యను ప్రస్తుతం 537కు పెంచినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Professor Kodandaram: పవన్ కళ్యాణ్ ఇంత రాద్ధాంతం అవసరం లేదు.. ఇది తెలంగాణ అస్తిత్వంపై దెబ్బ: ప్రొఫెసర్ కోదండరాం
పవన్ కళ్యాణ్ ఇంత రాద్ధాంతం అవసరం లేదు.. ఇది తెలంగాణ అస్తిత్వంపై దెబ్బ: ప్రొఫెసర్ కోదండరాం
TGPSC Recruitment 2026: తెలంగాణ ఇంజినీరింగ్ అభ్యర్థులకు బంపర్ ఆఫర్‌! 290 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్! ఖాళీల పూర్తి వివరాలు ఇవే!
తెలంగాణ ఇంజినీరింగ్ అభ్యర్థులకు బంపర్ ఆఫర్‌! 290 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్! ఖాళీల పూర్తి వివరాలు ఇవే!
Pawan Kalyan Press Meet:రేవంత్ రెడ్డి గారూ, ఆ చెరువు పక్కన స్థలం తీసుకోండి! పవన్ కల్యాణ్ ఓపెన్ ఆఫర్!
రేవంత్ రెడ్డి గారూ, ఆ చెరువు పక్కన స్థలం తీసుకోండి! పవన్ కల్యాణ్ ఓపెన్ ఆఫర్!
Pawan Kalyan:
"గద్దర్‌కు మీరేం చేశారు? పాశం యాదగిరి కూడా విమర్శిస్తున్నారు" పవన్ కల్యాణ్‌ పంచ్‌లు 
Advertisement

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Iran War: అమెరికా స్థావరాలపై ఇరాన్ మిస్సైల్, డ్రోన్ దాడులు.. యుద్ధం మళ్లీ మొదలైందా?
అమెరికా స్థావరాలపై ఇరాన్ మిస్సైల్, డ్రోన్ దాడులు.. యుద్ధం మళ్లీ మొదలైందా?
BRS Silent On Pawan Kalyan:సెంటిమెంట్ రచ్చలో బీఆర్ఎస్ సైలెంట్ వ్యూహం - కవిత, కాంగ్రెస్ దూకుడు.. కేసీఆర్ మౌనం వెనుక గ్రేటర్ స్కెచ్ ఇదేనా!
సెంటిమెంట్ రచ్చలో బీఆర్ఎస్ సైలెంట్ వ్యూహం - కవిత, కాంగ్రెస్ దూకుడు.. కేసీఆర్ మౌనం వెనుక గ్రేటర్ స్కెచ్ ఇదేనా!
TGPSC Recruitment 2026: తెలంగాణ ఇంజినీరింగ్ అభ్యర్థులకు బంపర్ ఆఫర్‌! 290 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్! ఖాళీల పూర్తి వివరాలు ఇవే!
తెలంగాణ ఇంజినీరింగ్ అభ్యర్థులకు బంపర్ ఆఫర్‌! 290 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్! ఖాళీల పూర్తి వివరాలు ఇవే!
Peddi Vs Bollywood Movie: పెద్దితో బాక్సాఫీస్ క్లాష్... బాలీవుడ్ సినిమా టికెట్ రేట్స్‌పై డిస్కౌంట్ ఆఫర్
పెద్దితో బాక్సాఫీస్ క్లాష్... బాలీవుడ్ సినిమా టికెట్ రేట్స్‌పై డిస్కౌంట్ ఆఫర్
Rains In AP and Telangana: తెలంగాణలో పలు జిల్లాల్లో 2 రోజులపాటు వర్షాలు, ఏపీలో రెడ్ అలర్ట్.. పిడుగులు పడతాయని వార్నింగ్
తెలంగాణలో పలు జిల్లాల్లో 2 రోజులపాటు వర్షాలు, ఏపీలో రెడ్ అలర్ట్.. పిడుగుల వార్నింగ్
Best Playing 11 Of IPL : అశ్విన్స్ ఐపీఎల్ 2026 బెస్ట్ టీమ్ లో కెప్టెన్ ఎవరో తెలుసా?: రోహిత్, కోహ్లీలకు నో ఛాన్స్.. నెట్టింట వైరల్ అవుతున్న హాట్ లైనప్
అశ్విన్స్ ఐపీఎల్ 2026 బెస్ట్ టీమ్ లో కెప్టెన్ ఎవరో తెలుసా?: రోహిత్, కోహ్లీలకు నో ఛాన్స్.. నెట్టింట వైరల్ అవుతున్న హాట్ లైనప్
భూమిలో దాచిన నిధుల దగ్గర పాములు ఎందుకు కనిపిస్తాయి, అవి నిజంగా వాటిని కాపలా కాస్తాయా?
భూమిలో దాచిన నిధుల దగ్గర పాములు ఎందుకు కనిపిస్తాయి, అవి నిజంగా వాటిని కాపలా కాస్తాయా?
Peddi Nizam Bookings: 'పెద్ది'కి టెన్షన్ లేదు... తెలంగాణలోనూ టికెట్ రేట్స్ పెరిగాయ్... కాసేపటిలో బుకింగ్స్ మొదలు
'పెద్ది'కి టెన్షన్ లేదు... తెలంగాణలోనూ టికెట్ రేట్స్ పెరిగాయ్... కాసేపటిలో బుకింగ్స్ మొదలు
Embed widget