అన్వేషించండి

KTR News: రేవంత్ రాసిచ్చిన ప్రశ్నల్నే అడిగారు- రేసు కేసు విచారణపై కేటీఆర్‌ కామెంట్స్- నాయకుల ఘన స్వాగతం

Telangana News: ఫార్ములా కార్ రేసింగ్‌ కేసులో కొత్తగా అధికారులు అడిగిందేమీ లేదని చెప్పారు కేటీఆర్. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడుతూ మరోసారి రేవంత్‌పై విమర్శలు చేశారు.

KTR Faces ACB Questions Regarding Formula E Car Race Case: ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో దాదాపు ఏడు గంటల పాటు మాజీ మంత్రి , బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. విచారణ ముగించుకొని బయటకు వచ్చిన కేటీఆర్‌ తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రాసిచ్చిన ప్రశ్నల్నే అధికారులు అడిగారని అన్నారు.

అవినీతి లేని కేసులో అధికారులు నాలుగు ప్రశ్నల్నే తిప్పి తిప్పి అడుగుతున్నారని అన్నారు కేటీఆర్. అవి కూడా రేవంత్ అడిగే ప్రశ్నల్ను నలభై రకాలుగా అడుగుతున్నారని ఆరోపించారు. ఎన్నిసార్లు విచారణకు పిలిచినా వస్తానని చెప్పారు. తనకు అవగాహన ఉన్నంత వరకు ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పాని పేర్కొన్నారు. ఎప్పుడు పిలిచినా విచారణకు వస్తానని తనకు తెలిసిందే చెబుతానని అన్నారు. 

Image

ఏసీబీ ఆఫీస్‌ ఎదుట మీడియాతో మాట్లాడుతున్న టైంలో హైడ్రామా నడిచింది. ఇలా ఏసీబీ ఆఫీస్‌ ముందు మాట్లాడేందుకు మీడియా పాయింట్ లేదని ట్రాఫిక్ జామ్ అవుతుందని అధికారులు కేటీఆర్‌కు వివరించారు. మీడియా ప్రతినిధులను పంపించేందుకు ప్రయత్నించారు. ఇంతలో కేటీఆర్ కలుగుజేసుకొని ఇక్కడ మాట్లాడితే మీకు వచ్చిన సమస్య ఏంటని ప్రశ్నించారు. మీ పార్టీ ఆఫీస్‌కు వెళ్లి మాట్లాడుకోవాలని అధికారులు సూచించారు. రోడ్డుపై మాట్లాడితే ట్రాఫిక్‌కు ఇబ్బంది తలెత్తుతుందని అన్నారు. తమ డ్యూటీ తాము చేస్తున్నామని చెప్పడంతో కేటీఆర్‌ అక్కడి నుంచి వెళ్లిపోయారు. 

Image

రేస్‌ కేసులో తొలిసారిగా కేటీఆర్‌ను విచారించిన ఏసీబీ అధికారులు మరోసారి విచారించేందుకు సిద్ధమవుతున్నారు. సంక్రాంతి తర్వాత ఆయన్ని రెండోసారి పిలిచి ప్రశ్నించే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. మొదటి రోజు విచారణలో దాదాపు ఏడు గంటలపాటు అధికారులు ప్రశ్నించారు. 

అనంతరం తెలంగాణ భవన్‌కు చేరుకున్న కేటీఆర్‌కు పార్టీ నేతలు భుజాలపై మోసుకొని కార్యాలయంలోకి తీసుకెళ్లారు. తర్వాత అక్కడే మీడియాతో మాట్లాడిన కేటీఆర్‌... ఉదయం నుంచి సంఘీభావంగా నిలిచిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. " గత 10 సంవత్సరాలుగా అత్యంత నిబద్ధతతో, అవినీతిరహితంగా మంత్రిగా బాధ్యతలు నిర్వహించనట్లు ఏసీబీకి చెప్పినాను. ప్రశ్నలు అడిగే విషయంలో వారు కూడా ఇబ్బంది పడ్డారు ఎందుకంటే కేసులో ఎలాంటి అవినీతి లేదు. ప్రపంచ దేశాలతో పోటీపడి తెచ్చిన ఫార్ములా ఈ రేసు హైదరాబాద్ నగరంలోని ఉండాలన్న ఉద్దేశంతో రేసును కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాను. కేవ

లం హైదరాబాద్ నగర ప్రతిష్ట కోసం, తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాలకు తయారీకి కేంద్రంగా మార్చాలన్న ఉద్దేశంతో నిర్ణయం చేసినట్లు చెప్పాను. 

అడిగిన ప్రశ్నలనే పదేపదే ఏసీబీ అడిగిందన్నారు కేటీఆర్. ఇక్కడి నుంచి పోయిన కాసులు ఫార్ములా ఈ సంస్థ వద్ద ఉన్నాయని చెప్పానన్నారు. మరి అలాంటప్పుడు కేసు ఎక్కడ ఉందని ప్రశ్నించినట్టు తెలిపారు. విచారణకు ఎన్నిసార్లు పిలిచినా వెళతానన్నారు కేటీఆర్. రేవంత్ రెడ్డి చెప్పిన ప్రశ్నలు పట్టుకొని మళ్లీ పిలిస్తే మళ్లీ వెళ్తాను అని స్పష్టం చేశారు. 

Image

అవినీతి లేని కేసులో అవినీతి గురించి అడిగే ప్రశ్న ఎక్కడిదన్నారు కేటీఆర్‌ "ఆ ఫైల్ ఎక్కడ పోయింది... ఈ ఫైల్ ఎక్కడ పోయింది అని అడిగారు. నేను మంత్రిగా నిర్ణయం తీసుకున్నా అని స్పష్టం చేశాను. న్యాయస్థానాలు, కోర్టులపైన నమ్మకం ఉంది... తప్పకుండా సహకరిస్తాం. ఇది ముమ్మాటికి లొట్ట పీసు కేసునే ఆయన లొట్ట పీసు ముఖ్యమంత్రినే. ప్రపంచ పటంలో హైదరాబాద్ను పెట్టాలన్న కమిట్మెంట్ మాది... మా కేసీఆర్ గారిది. 50 లక్షల రూపాయలతో నోట్ల కట్టలతో దొరికిపోయిన దొంగలం మేము కాదు మేము... మాకు భయం లేదు. సంవత్సరం తర్వాత కూడా నిన్ను ప్రజలు గుర్తు పెట్టకపోతే మేమేమి చేయాలి.  

" కనకపు సింహాసనమున శునకమును కూర్చున్న పెట్టినట్టు తెలంగాణలో పరిస్థితి ఉన్నది. ఎన్ని అక్రమ కేసులు పెట్టిన ఎన్ని నిర్బంధాలు చేసిన ప్రజల గురించి ప్రజల సంక్షేమం గురించి కెసిఆర్ సైనికుడిగా మాట్లాడుతాను. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు గురించి...  అన్ని వర్గాలకు చేసిన ఎన్నికల హామీల ప్రారంభం కోసం కాంగ్రెస్ ప్రభుత్వంపైన నిరంతరంగా మాట్లాడుతూనే ఉంటాం." అని అన్నారు. 

Image

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
Virat Kohli Century: మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Embed widget